రాజ్నాథ్తో గవర్నర్ భేటీ | narasimhan meets rajnath singh | Sakshi
Sakshi News home page

రాజ్నాథ్తో గవర్నర్ భేటీ

Published Fri, Jun 26 2015 11:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM

రాజ్నాథ్తో గవర్నర్ భేటీ

రాజ్నాథ్తో గవర్నర్ భేటీ

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. శుక్రవారం నిర్ణీత సమయం కంటే అరగంటే ముందే నార్త్ బ్లాక్ చేరుకున్న గవర్నర్ తొలుత కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర హోం మంత్రిని కలిశారు.

ఉభయ రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై గవర్నర్ కేంద్ర హోం మంత్రికి నివేదిక సమర్పించనున్నారు. ఓటుకు కోట్లు కేసు, ఫోన్ ట్యాపింగ్,  సెక్షన్ 8 అంశాలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోయల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement