
ఐదేళ్ల పాటు నిషేధం విధించాలని ఏఐసీటీఈ ఆలోచనలు
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కొత్త ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల అనుమతులపై నిషేధం విధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దేశంలో అత్యధికంగా కాలేజీలు సీట్లు ఉన్నందున, ఉన్న సీట్లలో సగం వరకు మిగిలిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికే 30 శాతం లోపు ప్రవేశాలు ఉన్న బ్రాంచీలను, కాలేజీలను రద్దు చేసేందుకు చర్యలు చేపట్టింది.
వివిధ రాష్ట్రాల్లో యాజమాన్యాలు కొత్త కాలేజీల కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నందునా 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల ఢిల్లీలో ఏఐసీటీఈ ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల యాజమాన్యాలతో వేర్వేరుగా నిర్వహించిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్–2018పై నిర్వహించిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం.