శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదు! | None has right to use govt land as burial ground: Delhi HC | Sakshi
Sakshi News home page

శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదు!

Published Thu, Dec 28 2017 3:50 AM | Last Updated on Thu, Dec 28 2017 3:50 AM

None has right to use govt land as burial ground: Delhi HC  - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి చెందిన భూముల్ని శ్మశానాలకు వాడుకునే హక్కు ఎవరికీ లేదని ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ప్రభుత్వ భూమిని శ్మశానంగా వాడుకోవడంపై సబ్‌ డివిజినల్‌ మేజిస్ట్రేట్‌ ఇచ్చిన ఆదేశాలను సవాలుచేస్తూ ఖబరస్తాన్‌ ఇంత్‌జామియా అసోసియేషన్‌ అనే ఎన్జీవో దాఖలుచేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ మేరకు స్పందించింది. స్థానిక ఎమ్మెల్యే చేసిన ప్రకటనతో పాటు ఈ స్థలంపై మరెవరికీ చట్టపరమైన హక్కు లేనందున శ్మశానంగా వాడుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా వాడుకునే హక్కు ఎవరికీ లేదనీ, కోర్టు ఆదేశాలను అన్ని పక్షాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement