ప్రస్తుతానికి పాత కేబిన్లే గతి | old cabin to bjp government in maharashtra | Sakshi
Sakshi News home page

ప్రస్తుతానికి పాత కేబిన్లే గతి

Published Fri, Nov 21 2014 10:30 PM | Last Updated on Tue, Oct 9 2018 3:56 PM

old cabin to bjp government in maharashtra

సాక్షి, ముంబై: తొలిసారిగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వానికి తమకు నచ్చినరీతిలో మంత్రాయల భవనం, మంత్రుల క్యాబిన్లలో మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. ఆధునీకరణ పేరిట ప్రభుత్వం ఇప్పటికే రూ.162 కోట్లకుపైగా ఖర్చు చేసింది. అంచనాకు మించి వ్యయం కావడంతో ఈ పనులను చేపట్టిన యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. మంత్రాలయ భవనంలో రెండేళ్ల క్రితం అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి విదితమే.

 ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. భవనాన్ని పునర్‌నిర్మించాల్సి ఉన ్నప్పటికీ కేవలం ఆధునీకరణ పనులకే పరిమితం కావాలని గత ప్రజాస్వామ్య కూటమి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రభుత్వం నిర్ణయిచింది. ఈ పనులకు ఎల్.అండ్ టీ, షాపూర్‌జీ పాలన్‌జీ, యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ టెండర్లు వేశాయి. ఎల్ అండ్ టీ రూ.176 కోట్లు, షాపూర్‌జీ పాలన్‌జీ రూ.166 కోట్లు, యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రూ.162 కోట్లమేర టెండర్లు వేశాయి.

అయితే ఈ సంస్థలు ప్రతిపాదించిన టెండర్ మొత్తం ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం దీన్ని రద్దు చేసి టెండర్లను మళ్లీ ఆహ్వానించాలని నిర్ణయించింది. అయితే ఇవే పనులను రూ.139 కోట్లకు చేస్తామంటూ యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ ముందుకొచ్చింది. దీంతో డీఎఫ్ ప్రభుత్వం 2012, డిసెంబర్‌లో ఈ పనుల బాధ్యతలను అప్పగించింది. ఒప్పందం ప్రకారం ఈ పనులు 10  నెలల్లోగా పూర్తిచేయాల్సి ఉంది. అయితే తరచూ జరుగుతున్న మార్పుల వల్ల సమయానికి పనులు పూర్తికాలేదని, పైగా వ్యయం కూడా రూ.162 కోట్లకు చేరుకుందని యూనిటీ కన్‌స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్ కిశోర్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement