రేపే పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగం
-32 నిమిషాల్లో ముగియనున్న ప్రయోగం
శ్రీహరికోట : భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్స్పేస్ సెంటర్ (షార్)నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగాన్ని 32 నిమిషాల్లో పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 8.42 గంటలకు ప్రారంభమైన కౌంట్డౌన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. 48.30 గంటల కౌంట్డౌన్ అనంతరం పీఎస్ఎల్వీ సీ35 రాకెట్ను నాలుగు దశల్లో 32 నిమిషాల్లో ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు సర్వం సిద్ధం చేశారు.
44.4 మీటర్లు ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ35 రాకెట్ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో నాలుగు దశలలో ప్రయోగించనున్నారు. ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువును తీసుకుని రాకెట్ భూమి నుంచి నింగికి పయనమవుతుంది. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లులో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్అలోన్ దశలో నింపిన 138. టన్నుల ఘన ఇంధనం సాయంతో 112 సెకెండ్లకు మొదటిదశను పూర్తి చేస్తారు. ఆ తరువాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264 సెకెండ్లకు రెండోదశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 587 సెకెండ్లకు మూడోదశ, 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1015 సెకెండ్లకు నాలుగోదశను పూర్తి చేసే విధంగా లాంచ్ రిహార్సల్స్లో నిర్వహించారు.