ఢిల్లీ: తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైన్ ప్రజల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ సూటిగా ప్రశ్నించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర షరతులకు తలొగ్గి ఒప్పందాలు చేసుకున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని కె.లక్ష్మణ్ చెప్పారు.