కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌ : ఇద్దరు ఉగ్రవాదుల మృతి | Two Terrorists Killed As Gunfight Resumes In Bandipora | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌ : ఇద్దరు ఉగ్రవాదుల మృతి

Nov 11 2019 11:55 AM | Updated on Nov 11 2019 11:55 AM

Two Terrorists Killed As Gunfight Resumes In Bandipora   - Sakshi

జమ్ము కశ్మీర్‌లోని బండిపర జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.

సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌లోని బండిపర జిల్లాలో సోమవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరోవైపు ఇదే ప్రాంతంలో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు తలదాచుకుని ఉంటారన్న సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఉగ్ర కదలికలపై సమాచారం అందుకున్న భద్రతా దళాలు బండిపర జిల్లాలోని లదౌర ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించి కాల్పులకు తెరపడ్డాయి. భద్రతా దళాలను చూసి ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడగా, భద్రతా దశాలు ఎదురుకాల్పులకు దిగాయి. భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మూడువారాల కిందట అవంతిపురలో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement