
నైరోబి: తెలంగాణలో జరుగుతున్న మహా బతుకమ్మ వేడుకలకు మద్దతుగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ కెన్యా వారి ఆధ్వర్యంలో బతుకమ్మ-దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కెన్యా రాజధాని నైరోబిలో తెలుగువారందరూ ఒకచోట చేరి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కెన్యా ఎంపీ డాక్టర్ స్వరూప్ రంజన్ మిశ్రా ఈ బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు ఆడపడుచులంతా సంప్రదాయ దుస్తులతో బతుకమ్మలను పేర్చారు. వారు వలయంగా మారి పాటలు పాడుతూ బతుకమ్మ ఆడటంతో అక్కడ పండుగ వాతావరణం ఉట్టిపడింది. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి తీర్థ, ప్రసాదాలు పంచుకున్నారు.




