Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu govt Singayya death incident distorted1
సింగయ్య మృతి ప్రమాదం వక్రీకరణ

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్ర పతాక స్థాయికి చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదుకు తెగబడింది. ఓ వైపు తమ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో కట్టలు తెంచుకుంటున్న వ్యతిరేకత.. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పట్ల వెల్లువెత్తుతున్న ప్రజాదరణతో టీడీపీ కూటమి ప్రభుత్వం బెంబేలెత్తుతోంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీసింది. వైఎస్‌ జగన్‌ ఇటీవలి సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాలకు వక్రభాష్యం చెబుతూ అక్రమ కేసుల నమోదుకు బరితెగించింది. సింగయ్య అనే వ్యక్తి ఓ అనుమతిలేని ప్రైవేట్‌ వాహనం ఢీకొని మృతి చెందినట్టు స్వయంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌ అధికారికంగా ప్రకటించిన తరువాత.. మూడు రోజుల కుట్రపూరిత తర్జనభర్జనల అనంతరం ఆ రోడ్డు ప్రమాదాన్ని వక్రీకరించి ప్రభుత్వం తన నక్కజిత్తులను ప్రదర్శించింది. అందుకోసం యావత్‌ పోలీసు శాఖను కుట్రలో భాగస్వామిగా చేసుకుంది. ఏకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైనే అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ కుట్రకు పరాకాష్ట. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాహన డ్రైవర్‌గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) కానిస్టేబుల్‌ రమణారెడ్డిని ఏ1గా.. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం ప్రభుత్వ కుట్రకు తాజా తార్కాణం. ఈ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు భిన్నంగా తాజాగా బీఎన్‌ఎస్‌ 105(1), 49 కింద కేసు నమోదు చేస్తామని గుంటూరు ఎస్పీ సతీశ్‌ ఆదివారం చేసిన ప్రకటనే నిదర్శనం. ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచి పక్కాగా పన్నాగాన్ని అమలు చేసింది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో భద్రతా ఏర్పాట్లలో కుట్ర పూరిత నిర్లక్ష్యం నుంచి ... తాజాగా అక్రమ కేసు నమోదు వరకు శకుని మాయోపాయాన్ని తలపించేట్టుగా చంద్రబాబు కుతంత్రం ఇలా సాగింది.అడుగడుగునా భద్రతా వైఫల్యంమాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం కింద సింగయ్య పడి మృతి చెందడం వాస్తవమే అయితే ఆ కేసులో మొదటి ముద్దాయి రాష్ట్ర ప్రభుత్వమే అవుతుంది. ఎందుకంటే జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కలిగిన ఆయన పర్యటనలో ప్రభుత్వం, పోలీసులు ఉద్దేశ పూర్వకంగా తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదన్నది స్పష్టమైంది. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో అడుగడుగునా భద్రతా వైఫల్యం బయట పడింది. వైఎస్‌ జగన్‌ తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చారు. రూట్‌ మ్యాప్‌తో పాటు ఇతర వివరాలు అందించారు. ఆ మేరకు పటిష్ట భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీసులదే. జడ్‌ ప్లస్‌ భద్రత ప్రకారం వైఎస్‌ జగన్‌ వాహనం ముందు ఎస్కార్టు వాహనాలు ఉండాలి. ఆయన వాహనానికి ఇరువైపులా రోప్‌ పార్టీ పోలీసులు విధులు నిర్వహించాలి. ఆ రోప్‌ పార్టీ భద్రతా వలయాన్ని దాటుకుని ఎవరూ వాహనం సమీపానికి రాకుండా కట్టడి చేయాలి. కానీ వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో పోలీసులు ఈ భద్రతా ప్రమాణాలు ఏవీ పాటించనే లేదు. ఆయన వాహనానికి ముందున సమీపంలో ఎస్కార్టు వాహనం లేదు. ఇరువైపులా రోప్‌ పార్టీ పోలీసులు లేనే లేరు. దాంతో వైఎస్సార్‌సీపీ అభిమానులే కాదు... అభిమానుల ముసుగులో గుర్తుతెలియని వ్యక్తులు, ఆగంతకులు కూడా వైఎస్‌ జగన్‌ వాహనంపైకి ఎగబడ్డారు. ఓ యువకుడు ఏకంగా వాహనం బానెట్‌పైకి ఎక్కి మరీ హల్‌ చల్‌ చేశాడు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం బానెట్‌పైకి ఓ యువకుడు ఎక్కినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగించింది. అదేదో కాకతాళీయంగా జరిగింది కాదు. పోలీసులు ఉద్దేశ పూర్వకంగానే వైఎస్‌ జగన్‌ భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారన్నది సుస్పష్టం. అందువల్లే అక్కడ ప్రమాదం జరిగింది. అందుకు బాధ్యత పోలీసులదీ.. రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే ఆ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే ఏ1గా అంటే ప్రధాన ముద్దాయిగా చేర్చాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ వాహనం డ్రైవర్‌ రమణారెడ్డి (ఏఆర్‌ కానిస్టేబుల్‌)తోపాటు ఆ వాహనంలో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వరరెడ్డిలను నిందితులుగా పేర్కొనడం విస్మయ పరుస్తోంది. అంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పూరితంగానే ఆ ప్రమాదాన్ని వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదుకు తెగబడిందన్నది స్పష్టం అవుతోంది.అది జగన్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబు కుట్రేమాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను భూస్థాపితం చేస్తానని చంద్రబాబు ఇటీవల మీడియా చానళ్ల ఇంటర్వ్యూల్లోనే తన కుట్ర లక్ష్యాన్ని ప్రకటించారు. ఆయన తన కుట్ర కార్యాచరణను చేపట్టారన్నది కూడా తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనల సందర్భంగా ఆయన భద్రత పట్ల పోలీసులు ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరు ఆయన కుట్రను బట్టబయలు చేస్తోంది. అసలు పోలీసులు ఆయన పర్యటనలో భద్రతా ఏర్పాట్ల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల వైఎస్‌ జగన్‌ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన హెలికాఫ్టర్‌ ల్యాండ్‌ అయ్యే హెలీప్యాడ్‌ వద్ద కనీస భద్రతా ఏర్పాట్లు చేయడం లేదు. తద్వారా భారీ సంఖ్యలో అభిమానులతోపాటు ఆ ముసుగులో విద్రోహ శక్తులు హెలికాఫ్టర్‌ వద్దకు చొచ్చుకు వచ్చేందుకు ఉద్దేశ పూర్వకంగా అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవల అనంతపురంలో ఇటువంటి పరిస్థితే తలెత్తి హెలికాఫ్టర్‌కు సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో వైఎస్‌ జగన్‌ అనంతపురం జిల్లా నుంచి బెంగళూరుకు రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. తాజాగా ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా సత్తెనపల్లికి రోడ్డు మార్గంలో వెళ్లినా సరే పోలీసులు కనీస భద్రతా ఏర్పాట్లు కల్పించ లేదు. నిబంధనల ప్రకారం మాజీ ముఖ్యమంత్రికి సరైన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం సమకూర్చాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా డొక్కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని గతంలో సమకూర్చింది. ఆ వాహనం కొద్ది దూరం వెళ్లే సరికే మొరాయించింది. ప్రభుత్వ కుట్రను అర్థం చేసుకున్న వైఎస్సార్‌సీపీ హైకోర్టును ఆశ్రయించించింది. హైకోర్టు అనుమతితో వైఎస్సార్‌సీపీ సొంత నిధులతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం కొనుగోలు చేసింది. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా తన కుట్రలకు పదును పెడుతూనే ఉంది.జగన్‌కు జనాదరణతో బెంబేలెత్తే అక్రమ కేసులువైఎస్‌ జగన్‌ జిల్లా పర్యటనలకు అన్ని వర్గాల ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటం చంద్రబాబు ప్రభుత్వం గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రాష్ట్రంలో ఏ జిల్లా వెళ్లినా దారిపొడవునా వేలాది మంది జనం తండోప తండాలుగా తరలి రావడంతో ప్రభుత్వ పెద్దలను కలవర పరుస్తోంది. దాంతోనే జగన్‌ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతోంది. ఆ కుట్రలను ఛేదిస్తూ మరీ భారీ సంఖ్యలో జనం ప్రభంజనంగా పోటెత్తుతుండటంతో చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దాంతో వైఎస్‌ జగన్‌ పర్యటనలకు వచ్చే వారిపై, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు. కనీసం అక్రమ కేసుల భయంతోనైనా ఆయన పర్యటనలకు జనం రాకుండా అడ్డుకోవచ్చన్నది ప్రభుత్వ కుతంత్రం. అందుకు ఇటీవల వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటన అనంతరం పెట్టిన అక్రమ కేసులే తాజా తార్కాణం. పుష్ప సినిమాలో ‘రప్పా రప్పా’ అనే డైలాగ్‌తో కూడిన ఫ్లెక్సీని ఓ టీడీపీ కార్యకర్త వైఎస్‌ జగన్‌ పర్యటనలో ప్రదర్శించారు. ఆయన టీడీపీకి చెందిన వాడని.. టీడీపీ గుర్తింపు కార్డు కూడా ఆయన వద్ద ఉందన్నది ఫొటోలు, ఇతర ఆధారాలతో బయట పడింది. అయితే టీడీపీ నేతలే ఆ యువకుడిని వైఎస్‌ జగన్‌ పర్యటనలోకి పంపించి తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్ని ఉండాలి. లేదా టీడీపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అమలు చేయడం లేదన్న ఆగ్రహంతో ఆ యువకుడే ఆ ఫ్లెక్సీని ప్రదర్శించి ఉండాలి. అంతేగానీ ఆ ఫ్లెక్సీ వ్యవహారంతో వైఎస్సార్‌సీపీకి ఏమాత్రం సంబంధం లేదన్నది తేలిపోయింది. అయినా సరే ఆ టీడీపీ కార్యకర్త ప్రదర్శించిన ఫ్లెక్సీకి వక్రభాష్యం చెబుతూ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు. ఆ యువకుడితోపాటు సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌ భార్గవ్‌ రెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం ప్రభుత్వ పన్నాగానికి నిదర్శనం. తాజాగా వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనం కింద పడి ఒకరు మరణించారని.. అదీ మూడు రోజుల తర్వాత చెబుతూ కేసు నమోదు చేస్తున్నట్టు గుంటూరు జిల్లా ఎస్పీ ప్రకటించారు. అంటే వైఎస్‌ జగన్‌ పర్యటనల్లో వెల్లువెత్తుతున్న ప్రజాదరణను తట్టుకోలేక ఈర్షా్యద్వేషాలతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేసిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి లొంగిన ఎస్పీ సతీశ్‌!ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి గుంటూరు ఎస్పీ సతీశ్‌ తలొగ్గినట్టు స్పష్టమవుతోంది. బాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న ఆయన సరైన నిర్ధారణ లేకుండా అధికారిక ప్రకటన చేయరు. గుర్తు తెలియని ప్రైవేటు వాహనం ఢీకొనే సింగయ్య మృతి చెందారని ఆయన ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ప్రకటించారు. ఏపీ 26 సీఈ 0001 టాటా సఫారీ వాహనం ఢీకొనడంతో సింగయ్య మృతి చెందారని చెప్పారు. ఆ సమయంలో ఐజీ సర్వశ్రేష్ట్ర త్రిపాఠి కూడా ఆయన పక్కనే ఉన్నారు. దీంతో ప్రభుత్వం నమోదు చేయాలని భావిస్తున్న అక్రమ కేసుకు ఎస్పీ ప్రకటన అడ్డంకిగా మారింది. అందుకే ఎస్పీ సతీశ్‌ ప్రకటనపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దాంతో 18 రాత్రికే గుంటూరు పోలీసుల వైఖరిలో మార్పు కనిపించింది. కానీ ఆ ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఎస్పీ ఆదివారం మాట్లాడారు. వైఎస్‌ జగన్‌ ప్రయా ణిస్తున్న వాహనం ఢీ కొనడంతో సింగయ్య మృతి చెందార న్నారు. అంటే ప్రభుత్వ పెద్దలు ఎస్పీపై ఏ స్థాయిలో ఒత్తిడి తెచ్చారో అన్నది తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు.ప్రభుత్వ వైఫల్యంతోనే చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయలేక టీడీపీ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ప్రజలు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల చంద్రబాబు నిర్వహించిన సర్వేలో కూడా అదే విషయం వెల్లడై­నట్టు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్‌ జగన్‌ ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారు? ఏడాదిలోనే పదేళ్లకు సరిపడా అప్పులు చేసి రాష్ట్రాన్ని తిరోగమనపథంలోకి తీసుకుపోయారు.. ఇక అభివృద్ధి ఎలా సాధ్యం? రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా వైఫల్యానికి బాధ్యత చంద్రబాబుదే.. విద్య, వైద్య, మౌలిక సదుపాయాల రంగాలు పూర్తిగా కుదేలైనా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదు? ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బరితెగించి సాగిస్తున్న అవినీతి, అక్రమాలతో రాష్ట్రం కుదేలైందని వైఎస్‌ జగన్‌ కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. మరోవైపు విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా డే పేరిట ఈవెంట్‌ మేనేజ్మెంట్‌ ఎత్తుగడ బెడిసికొట్టింది. లక్షలాది మంది విద్యార్థులు, ఇతరులను బలవంతంగా రప్పించి సరైన వసతులు కల్పించలేకపోవడంతో వారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ పరిణామాలతో బెంబేలెత్తిన చంద్రబాబు అత్యవసరంగా ఏదో డైవర్షన్‌ రాజకీయం అవసరమని గుర్తించారు. అందుకే వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనను వక్రీకరిస్తూ అక్రమ కేసు నమోదు చేసేలా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు.గుంటూరు ఎస్పీ ప్రకటనలు నాడు–నేడుబాధ్యతాయుతమైన ఎస్పీ స్థానంలో ఉన్న అధికారి చేసే ప్రకటనకు అత్యంత విశ్వసనీయత ఉంటుంది. ఉండాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఐపీఎస్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎలా తమ కుట్రలో భాగస్వాములను చేస్తోందనడానికి గుంటూరు ఎస్పీ సతీశ్‌ చేసిన పరస్పర విరుద్ధ ప్రకటనలే తార్కాణం. జూన్‌ 18 : వైఎస్‌ జగన్‌ పర్యటనలో అనుమతి లేని ఓ ప్రైవేటు వాహనం ఢీ కొని సింగయ్య మృతి చెందారు. అది కాన్వాయ్‌లోని వాహనం కాదు. ప్రైవేట్‌ వాహనం (ఏపీ 26 సీఈ 0001) ఢీకొని సింగయ్య మృతి చెందినట్లు కేసు నమోదు చేశాం. ఆ మేరకు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 106(1) కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాం. (ఆ వాహనం వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాశ్‌ అనుచరుడు గొట్టిపాటి హరీశ్‌కు చెందినదిగా పోలీసులు గుర్తించినట్లు టీడీపీ అనుకూల పత్రికలు కూడా ప్రచురించాయి).జూన్‌ 22 : వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొనడంతోనే సింగయ్య మృతి చెందారు. ఆ వాహన డ్రైవర్‌ రమణారెడ్డితోపాటు అందులో ప్రయాణిస్తున్న వైఎస్‌ జగన్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్నినాని, విడదల రజినీ, వైఎస్‌ జగన్‌ పీఏ కె.నాగేశ్వర రెడ్డిలపై కేసు నమోదు చేశాం. ఆ మేరకు గతంలో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని సెక్షన్లను సవరిస్తూ బీఎన్‌ఎస్‌ 105(1), 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం.అబద్ధపు వాంగ్మూలం కోసం డ్రైవర్‌పై ఒత్తిడి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసు నమోదు కోసం చంద్రబాబు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఆయన వాహనం డ్రైవర్‌గా వ్యవహరించిన రమణారెడ్డిని అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తోంది. ఆ డ్రైవర్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ (ఏఆర్‌) విభాగంలో కానిస్టేబుల్‌గా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వాహనానికి డ్రైవర్‌గా ఆయన్ను ప్రభుత్వమే కేటాయించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రమణారెడ్డిపై పోలీసు ఉన్నతాధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో ఉదంతాన్ని వక్రీకరిస్తూ తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని వేధిస్తున్నట్టుగా సమాచారం. తాము చెప్పిన­ట్టుగా అబద్ధపు వాంగ్మూలం ఇస్తే ఆయన్ను ఈ కేసు నుంచి తప్పిస్తామని.. అంతేకాకుండా పదోన్నతి, ఇంక్రిమెంట్లు ఇస్తామని ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు తెలిసింది.

YSRCP Yuvatha Poru Protest against Chandrababu Govt Updates2
వైఎస్సార్‌సీపీ ‘యువతపోరు’.. విశాఖలో ఉద్రికత్త

వైఎస్సార్‌సీపీ ‘యువతపోరు’ అప్‌డేట్స్‌.. విశాఖలో ఉద్రికత్త..వైఎస్సార్‌సీపీ యువత పోరుబాట ధర్నాను కలెక్టరేట్ వద్దకు రాకుండా అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం.నాలుగు చోట్ల భారీ కేట్లు పెట్టిన పోలీసులు..వైఎస్సార్‌సీపీ శ్రేణులను నియంత్రించ లేకపోయినా పోలీసులు..పోలీసులకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట.పోలీసులను దాటుకొని కలెక్టరేట్‌కు వచ్చిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు..చంద్రబాబు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు..విజయవాడ..ధర్నాచౌక్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో యువత పోరు నిరసననిరసనల్లో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైఎస్పార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్,వైఎస్సార్‌సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మొండితోక జగన్మోహన్ రావు,జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావు,పార్టీ విద్యార్ధి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర,వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా స్టేట్ కోఆర్డినేటర్ దొడ్డా అంజిరెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్లు, యువతవైఎస్సార్ జిల్లా..వైఎస్సార్‌సీపీ పిలుపు మేరకు కడపలో భారీ ర్యాలీవైఎస్సార్‌సీపీ యువజన విభాగం ర్యాలీని ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిపార్టీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీజిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పాల్గొన్న యువతకూటమి ప్రభుత్వం అన్ని విధాలా యువతను మోసం చేసిందని నినాదాలుకలెక్టర్ కార్యాలయంలో యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వినతిపత్రంవిశాఖ..ప్రారంభమైన యువత పోరు కార్యక్రమం..జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ..ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత విద్యార్థులు నిరుద్యోగులు..చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు..ఏడాదికాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు..నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదు..ఇంటికొక ఉద్యోగం అన్నారు..ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి.నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించాలి..విశాఖ వైఎస్సార్‌సీపీ పార్లమెంటు పరిశీలకుడు కదిరి బాబురావు.అనంతపురం..యువత సమస్యలపై వైఎస్సార్‌సీపీ పోరుబాటఅనంతపురం కలెక్టరేట్ వద్ద యువత పోరుభారీగా తరలివచ్చిన యువకులు, విద్యార్థులుముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలుఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహంటీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారుఒక్కో నిరుద్యోగికి మూడు వేల రూపాయల భృతి ఇస్తామన్న హామీ ఏమైందిఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7200 కోట్లుచంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నలు. యువత పోరు ప్రారంభం..ఏపీవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ యువత పోరు కార్యక్రమం ప్రారంభం. కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు, నిరుద్యోగులు, యువత నిరసనల్లో పాల్గొంటున్నారు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌­సీపీ ఒత్తిడి పెంచుతోంది. వివిధ అంశాలపై ఇప్పటికే నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టిన వైఎస్సార్‌సీపీ ఈసారి యువత కోసం ఆందోళనలు చేపడుతోంది. మాట తప్పి.. వెన్ను­పోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు రాష్ట్రవ్యాప్తంగా యువ­తకు బాసటగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఆందోళనలకు వైఎస్సార్‌­సీపీ యువజన విభాగం పిలుపునిచ్చింది. అనంతరం యువతకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌లకు యువతీయువకులతో కలిసి వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నేతలు వినతిపత్రాలు అందించనున్నారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలుఅనంతరం కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయంఅధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ చంద్రబాబు హామీఉద్యోగాలు కల్పించకపోతే నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి అంటూ హామీఇప్పటికి ఏడాదైనా కనీసం జాబ్ కేలండర్ కూడా ప్రకటించని చంద్రబాబు సర్కార్నిరుద్యోగ భృతి ఊసే ఎత్తని కూటమి ప్రభుత్వంనిరుద్యోగ భృతి రూపంలో ఇప్పటికే రూ.7,200 కోట్ల బకాయి2025-26 బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతికి పైసా కేటాయించని చంద్రబాబుచంద్రబాబు మోసాన్ని నిరసిస్తూ నేడు వైఎస్సార్ సీపీ ఆందోళనలుకలెక్టరేట్ల ఎదుట భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపుకృతి లేదు.. భృతి లేదు 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం లేదా ఉద్యోగం వచ్చే వరకూ యువతీ యువకులకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతిగా ఇస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హామీ ఇచ్చారు. చేయడానికి పని (కృతి) కల్పించకపోగా.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ అదే హామీని చంద్రబాబు ఇచ్చారు. సూపర్‌ సిక్స్‌ పథకాల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు.. ఉద్యోగాలు వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.నో జాబ్స్‌..ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి.. ఉద్యోగాలను భర్తీ చేస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇప్పటివరకూ ని­రు­ద్యోగ భృతిని ఏ ఒక్కరికీ అందించలేదు. ఒక్కొక్కరికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.36 వేలను నిరుద్యోగ భృతిగా చెల్లించాలి. కానీ.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నిరుద్యోగ భృతి చెల్లించలేదు. అంటే.. ఇప్పటికే నిరుద్యోగ భృతి రూపంలో 2 లక్షల మందికి రూ.7,200 కోట్లను ప్రభుత్వం బకాయిపడింది. 2025–26 సంవత్సరంలోనూ నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. అంటే.. ఈ ఏడాదికి కూడా ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వరనే విషయం స్పష్టమవుతోంది. అమలు చేసేశామంటూ అబద్ధాలు నిరుద్యోగ భృతిని స్కిల్‌ డెవలప్‌మెంట్‌తో అనుసంధానం చేశామని.. అందువల్ల ఆ హామీని అమలు చేసేశామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఆ హామీ అమలుపై ప్రశ్నిస్తే వారికి తోలు మందం తప్ప మరొకటి కాదని వ్యా­ఖ్యానించారు. మరో­వైపు కాలేజీలకే ఫీజు రీయిం­బర్స్‌­మెంట్‌ రుసుము చెల్లించి విద్యార్థులకు చిక్కులు లేకుండా చూస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రుసుం చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా­రు.తమ పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అధి­క వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. 6 త్రైమాసికాలకు రూ.­4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద విద్యార్థులకు ఇవ్వాలి. వసతి దీవెన కింద రూ.2,200 కోట్లు ఇవ్వాలి. అంటే ఈ రెండు పథకాల కింద రూ.6,400 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.750 కోట్లు మాత్రమే ఇచ్చి విద్యార్థులను నట్టేట ముంచేశారు. ఇక అంబేడ్కర్‌ విదేశీ విద్యా పథకం కింద ఏ ఒక్కరికీ ఇప్పటిదాకా సాయం అందించలేదు.

Four States Bypoll 5 Assembly seats Results Updates3
ఉప ఎన్నికల ఫలితాలు.. ఆప్‌, కాంగ్రెస్‌, బీజేపీ ముందంజ..

Four States Bypoll Results Updates..👉నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు. గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆప్‌, బీజేపీ, తృణముల్‌, కాంగ్రెస్‌ ఆధిక్యం ఇలా.. బెంగాల్‌లో తృణముల్‌ అభ్యర్థి భారీ ఆధిక్యం..Kaliganj (West Bengal) Assembly by-election | As per latest official trends by Election Commission, TMC's Alifa Ahmed continues her lead over Congress' Kabil Uddin Shaikh; currently leading by 14,462 votes in the fifth round of counting. BJP's Ashish Ghosh is trailing in the… pic.twitter.com/WxOhxqN2UN— ANI (@ANI) June 23, 2025పంజాజ్‌లో దూసుకెళ్తున్న ఆప్‌ అభ్యర్థి.Ludhiana West (Punjab) Assembly by-election | As per latest official trends by Election Commission, AAP's Sanjeev Arora continues his lead over Congress' Bharat Bhushan Ashu; currently leading by 2504 in the 5th round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/nWIe91KZhO— ANI (@ANI) June 23, 2025కేరళలో​ కాంగ్రెస్‌ అభ్యర్థ ముందంజ. Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath continues his lead over LDF candidate - CPI(M)'s M. Swaraj; currently leading by 6931 in the 11th round of counting. pic.twitter.com/oUcbPlrGA8— ANI (@ANI) June 23, 2025గుజరాత్‌లో పోటాపోటీ.. Visavadar (Gujarat) Assembly by-election | After initially leading, AAP's Gopal Italia now trailing behind BJP's Kirit Patel by 985 votes in the 7th round of counting, as per the latest official EC trends. Congress' Nitin Ranpariya trailing in the third position. pic.twitter.com/hZ0Q9WqigP— ANI (@ANI) June 23, 2025 లీడ్‌లో ఆప్‌, కాంగ్రెస్‌ గుజరాత్‌లో రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ..పంజాబ్‌లో ఆప్‌ లీడింగ్‌కేరళలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజబెంగాల్‌ తృణముల్‌ అభ్యర్థికి లీడ్‌. Kadi (Gujarat) Assembly by-election | As per latest official trends by Election Commission, BJP's Rajendra Chavda continues his lead over Congress' Ramesh Chavda; currently leading by 13,195 votes in the 7th round of counting. AAP's Jagdish Chavda trailing in the third position. pic.twitter.com/vxLel9szbp— ANI (@ANI) June 23, 2025గుజరాత్‌లో ఆప్‌ అభ్యర్థి ముందంజ..విసావదర్ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియాకు లీడింగ్‌.రెండో స్థానంలో బీజేపీ Visavadar (Gujarat) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Gopal Italia leading over BJP's Kirit Patel by 391 votes in the second round of counting. Congress' Nitin Ranpariya trailing in the third position. pic.twitter.com/NH3kyEN520— ANI (@ANI) June 23, 2025 👉పంజాబ్‌లో ఆప్‌ అభ్యర్ధి లీడింగ్‌..Ludhiana West (Punjab) Assembly by-election | As per official trends by Election Commission, AAP's Sanjeev Arora leading over Congress' Bharat Bhushan Ashu by 1269 votes in the first round of counting. BJP's Jiwan Gupta trailing in third position. pic.twitter.com/X1j2JQCuRe— ANI (@ANI) June 23, 2025 👉కేరళలో కాంగ్రెస్‌ అభ్యర్థి ముందంజ..Nilambur (Kerala) Assembly by-election | As per official trends by Election Commission, UDF candidate - Congress' Aryadan Shoukath leading over LDF candidate - CPI(M)'s M. Swaraj by 419 votes in the first round of counting. pic.twitter.com/K7ro5uQ10w— ANI (@ANI) June 23, 2025👉జూన్ 19న ఎన్నికలు జరగ్గా నేడు ఫలితాలు వెలువడనున్నాయి. గుజరాత్‌లోని రెండు స్థానాలు విసావదర్, కాడి, పంజాబ్ (లూథియానా వెస్ట్), బెంగాల్ (కాలిగంజ్), కేరళ (నిలంబూర్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి.గుజరాత్‌లో ఇలా.. గుజరాత్‌లోని కాదీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి రాజేంద్రకుమార్‌ దానేశ్వర్‌ చవడా, కాంగ్రెస్‌ అభ్యర్థి రమేష్‌భాయ్‌ చావడ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కర్సన్ సోలంకి మరణం కారణంగా ఉప ఎన్నికల జరగుతోంది. అలాగే, మరో స్థానం విసావదార్‌లో బీజేపీ అభ్యర్థి కిరీట్‌ పటేల్‌, ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా మధ్య హోరాహోరీ ఉండే అవకాశం ఉంది.#WATCH | Gujarat: Counting of votes for Kadi Assembly by-elections begins. Postal ballots are being counted first. Voting was held on 19th June. Visuals from a counting centre in Mahesana. BJP's Rajendra Chavda, Congress' Ramesh Chavda and AAP's Jagdish Chavda are among the… pic.twitter.com/rwLXA5WJvk— ANI (@ANI) June 23, 2025 కేరళలో.. కేరళలోని నీలంబర్ సీటు కాంగ్రెస్ అభ్యర్థి విజయం.. ప్రియాంక గాంధీ వాద్రాకు ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఈ స్థానం ఆమె వయనాడ్ నియోజకవర్గంలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ఆమె ఈ ప్రాంతంలో రోడ్‌షో నిర్వహించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఓవి అన్వర్ గెలుస్తారా లేదా? అనేది తేలనుంది.VIDEO | Ludhiana West bypoll: Counting of votes to begin at 8 AM at Khalsa College; visuals of security arrangements from the counting centre.(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/6WJb9VmNuE— Press Trust of India (@PTI_News) June 23, 2025బెంగాల్ బైపోల్నాడియా జిల్లా పరిధిలోకి వచ్చే బెంగాల్‌లోని కలిగంజ్ నియోజకవర్గంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగింది. ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ అధికార పార్టీ అభ్యర్థిగా ఆ స్థానాన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నారు. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్‌ను నిలబెట్టగా, కాంగ్రెస్ CPI(M) మద్దతుతో కబిల్ ఉద్దీన్ షేక్‌ పోటీలో ఉన్నారుఉ. కలిగంజ్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తృణమూల్, బీజేపీ మధ్య కీలకంగా మారనుంది.పంజాబ్‌లో త్రిముఖ పోరు.. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్ స్థానంలో ఆప్‌కు చెందిన సంజీవ్ అరోరా, బీజేపీ జీవన్ గుప్తా, కాంగ్రెస్‌ భరత్ భూషణ్ అషు మధ్య త్రిముఖ పోటీ జరగనుంది. శిరోమణి అకాలీదళ్ ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా పరూప్కర్ సింగ్ ఘుమాన్‌ను నిలబెట్టింది.#WATCH | Punjab: Security has been tightened outside Ludhiana's Khalsa College for Women, the counting centre for the Ludhiana West bypoll; counting of votes will begin at 8 am.The AAP fielded Rajya Sabha MP Sanjeev Arora from the seat. The BJP fielded its leader Jiwan Gupta… pic.twitter.com/Lr9mZawi1o— ANI (@ANI) June 23, 2025

LPU Student Secures Record Breaking Rs 2 5 Crore Placement Offer4
ఐఐటీలకు ధీటుగా ఎల్‌పీయూ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

భారతదేశంలో ఇంజినీరింగ్ ప్లేస్‌మెంట్ల విషయానికి వస్తే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఎప్పటి నుంచో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది. అందుకు ఏమాత్రం తీసిపోకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్శిటీ (ఎల్‌పీయూ)లో ఇటీవలి ఫ్లేస్‌మెంట్‌ ఫలితాలు కీలకంగా మారుతున్నాయి. ఎల్‌పీయూ విద్యార్థులు దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థల కంటే ప్రత్యర్థి సంస్థలు, కొన్ని సందర్భాల్లో వారి కంటే అధిక ఆఫర్లతో ఉద్యోగం సాధిస్తున్నారు.ఎల్‌పీయూలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీవిష్ణు ప్రముఖ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీ నుంచి ఏడాదికి రూ.2.5 కోట్ల డొమెస్టిక్ ప్యాకేజీని పొందారు. ఈ ఏడాది భారతదేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఇంజినీరింగ్ విద్యార్థికి అందించే అత్యధిక ప్యాకేజీల్లో ఇది ఒకటి.ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ జోరు అక్కడితో ఆగిపోలేదు. ఈసీఈ విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్న బేతిరెడ్డి నాగవంశీరెడ్డికి ప్రముఖ ఏఐ రోబోటిక్స్ సంస్థ నుంచి రూ.1.03 కోట్ల అంతర్జాతీయ ఆఫర్ లభించింది. ఈ విజయాలు అధిక నైపుణ్యం కలిగిన ఇంజినీరింగ్ ప్రతిభను కోరుకునే టాప్ రిక్రూటర్లకు గమ్యస్థానంగా నిలుస్తున్నాయి. ఇవి ఎల్‌పీయూకు పెరుగుతున్న ఖ్యాతిని నొక్కిచెబుతున్నాయి.‘ఈ విజయాలు అత్యున్నత స్థాయిలో పరిశ్రమ పోటీని తట్టుకొని సిద్ధంగా ఉండే గ్రాడ్యుయేట్లను అందించడంలో ఎల్‌పీయూ కట్టబడి ఉంది’ అని ఎల్‌పీయూ కెరీర్ సర్వీసెస్ విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌తో ఆకర్షణీయ వేతనాలుఆకట్టుకునే పేస్కేల్‌తో భారీ ఎల్‌పీయూ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్ ఆకర్షిస్తోంది. ఎల్‌పీయూ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో ఉన్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తూ వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో విద్యార్థులకు మొత్తం 7,204 జాబ్ ఆఫర్లు అందాయి. 1,602 మంది విద్యార్థులకు బహుళ ఉద్యోగ ఆఫర్లు లభించడం వారి ఉద్యోగ సామర్థ్యాన్ని మరింత పెంచింది. టాప్ 25% విద్యార్థుల సగటు వేతన ప్యాకేజీ ఏడాదికి రూ.10.23 లక్షలుగా ఉంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌, మైక్రోసాఫ్ట్, అమెజాన్, సర్వీస్ నౌ వంటి ప్రతిష్ఠాత్మక కంపెనీలు క్యాంపస్‌ను సందర్శించిన టాప్ రిక్రూటర్లలో ఉన్నాయి. బీటెక్ ఈసీఈ విద్యార్థి ఆదిరెడ్డి వాసు ఏడు ఉద్యోగావకాశాలు సాధించి సంస్థాగత రికార్డు నెలకొల్పాడు.గ్లోబల్‌గా అధిక ప్యాకేజీ ఆకర్షిస్తున్న నైపుణ్యాలుసైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇంజినీరింగ్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌ వంటి అత్యాధునిక రంగాల్లో అసాధారణ సాంకేతిక, విశ్లేషణాత్మక నైపుణ్యం అవసరమయ్యే డొమైన్లలో విద్యార్థులు అత్యంత డిమాండ్ ఉన్న ఉద్యోగాలు పొందుతున్నారని ఎల్‌పీయూ తాజా ప్లేస్‌మెంట్‌ డేటా పేర్కొంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు అద్భుతమైన ఆఫర్లు ఇచ్చాయి. మైక్రోసాఫ్ట్ అత్యధిక ప్యాకేజీ ఏటా రూ.52.20 లక్షలు, అమెజాన్ రూ.46.94 లక్షలు అందించాయి. ఇది విశ్వవిద్యాలయంలోని ప్రతిభను ప్రతిబింబిస్తుంది.పరిశ్రమ దిగ్గజాల నుంచి భారీగా నియామకాలుఎల్‌పీయూ పరిశ్రమ భాగస్వామ్యాలు గ్లోబల్‌గా విస్తరించాయి. అన్ని విభాగాల్లో విద్యార్థుల ఉపాధి పట్ల లోతైన నిబద్ధతను ప్రదర్శిస్తున్నాయి. క్యాప్ జెమినీ, మైండ్ ట్రీ, కాగ్నిజెంట్, యాక్సెంచర్, టీసీఎస్ వంటి టాప్ టైర్ రిక్రూటర్లు ఎల్‌పీయూ విద్యార్థులకు వందలాది ఉద్యోగాలను ఆఫర్ చేయగా, క్యాప్ జెమినీ 700 మందికి పైగా, మైండ్ ట్రీ 420+, కాగ్నిజెంట్ 400+, యాక్సెంచర్, టీసీఎస్ రెండూ 250+ విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ ఆకట్టుకునే ప్లేస్‌మెంట్‌ పనితీరు వ్యక్తిగత విజయగాథల కంటే కూడా పరిశ్రమ నిమగ్నతకు, విద్యార్థుల సంసిద్ధతకు ఎల్‌పీయూ క్రమబద్ధమైన విధానాన్ని హైలైట్ చేస్తుంది.టెక్ టాలెంట్‌కు ప్రపంచ ఖ్యాతిఎల్‌పీయూ క్రమంగా ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకుంది. యూనివర్సిటీ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఏడాదికి రూ.1 కోటికి మించిన ప్యాకేజీలతో పని చేస్తున్నారు. రోబోటిక్స్, ఆటోమేషన్, ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్ ఇంజినీరింగ్ వంటి కోర్ స్ట్రీమ్స్ దేశీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ రోస్టర్లలో ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి.ఐఐటీలు మాత్రమే కాదు.. ఎల్‌పీయూ ఎందుకంటే?ఎల్‌పీయూ అనుసరిస్తున్న స్కిల్-ఫస్ట్ విధానంలో ప్లేస్‌మెంట్‌ రహస్యం దాగి ఉంది. దీనికి యూనివర్సిటీ అమలు చేస్తోన్న ఎడ్యుకేషన్‌ రివల్యూషన్ ఫ్రేమ్ వర్క్ ఉదాహరణ. విద్యార్థులు రెండో సంవత్సరం నుంచి రియల్-వరల్డ్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ సర్టిఫికేషన్లు, డెడికేటెడ్‌ ప్లేస్‌మెంట్‌ ట్రెయినింగ్‌ పొందుతారు.‘ఎల్‌పీయూలో మేము విద్యార్థులను ఉద్యోగాల కోసం సిద్ధం చేయడమే కాదు.. నాయకత్వం వహించడానికి, సృజనాత్మకతకు అద్దపట్టేలా, పరిశ్రమలో ముందువరుసలో ఉండేలా సిద్ధం చేస్తాం’ అని ఎల్‌పీయూ వ్యవస్థాపక ఛాన్సలర్, రాజ్యసభ ఎంపీ డాక్టర్ అశోక్ కుమార్ మిట్టల్ తెలిపారు. యూనివర్సిటీ పనితీరు దేశ ఇంజినీరింగ్ విద్య, ప్లేస్‌మెంట్‌ ల్యాండ్ స్కేప్‌లో బలమైన పోటీదారుగా ఉంచుతుంది.త్వరలో ముగియనున్న ప్రవేశాలుఎల్‌పీయూలో 2025 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు త్వరలో ముగియనున్నాయి. దరఖాస్తుదారులు గ్లోబల్ కెరీర్ను ప్రారంభించడానికి, భారతదేశం అత్యంత డైనమిక్, పరిశ్రమ ఆధారిత విశ్వవిద్యాలయంలో భాగం కావడానికి సిద్ధంగా ఉంటే ఇదే మంచి సమయం. సీట్లు పరిమితంగా ఉండడంతో డెడ్ లైన్లు దగ్గరపడుతున్నాయి. దరఖాస్తుదారులు వెంటనే https://bit.ly/43340ai సందర్శించండి.

Why Russia is not Helping Iran Putin Reply5
ఇరాన్‌కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్‌ ఆగ్రహం

మాస్కో: ఇరాన్‌- రష్యాల మధ్య కొన్ని దశాబ్ధాలుగా సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌- ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో అమెరికా జోక్యంతో ఇరాన్‌ మరిన్ని చిక్కుల్లో పడింది. ఇదే సమయంలో ఇరాన్‌కు ఎందుకు సహాయం అందించడం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను విలేకరులు అడిగినప్పుడు ఆయన ఘాటైన సమాధానం ఇచ్చారు.ఇరాన్ అణు కేంద్రాలను అమెరికా లక్ష్యంగా చేసుకున్న తర్వాత కూడా, టెహ్రాన్‌ను రక్షించేందుకు మాస్కో(రష్యా) ఎందుకు ముందుకు రాలేదో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మీడియాకు వివరించారు. రష్యా- ఇరాన్‌ల మధ్య దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలున్నప్పటికీ.. ఇజ్రాయెల్‌లో రష్యన్ మాట్లాడే ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నందున ఈ వివాదంలో తటస్థంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు పుతిన్ తెలిపారు.సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై పుతిన్ మాట్లాడుతూ.. పూర్వ సోవియట్ యూనియన్, రష్యన్ ఫెడరేషన్‌లకు చెందిన దాదాపు 20 లక్షల మంది ప్రజలు ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. ఇది నేడు దాదాపు రష్యన్ మాట్లాడే దేశంగా ఉంది. రష్యా సమకాలీన చరిత్రలో భాగంగా ఆ దేశాన్ని తాము పరిగణనలోకి తీసుకుంటామన్నారు. రష్యా తన మిత్రదేశాల విషయంలో ప్రదర్శిస్తున్న విధేయతను ప్రశ్నించేవారి విమర్శకులను కూడా పుతిన్ తిప్పికొట్టారు. అటువంటి వారిని రెచ్చగొట్టేవారుగా పేర్కొన్నారు. ఇస్లామిక్ దేశాలతో రష్యా సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని, రష్యా జనాభాలో 15 శాతం మంది ముస్లింలున్నారని పుతిన్‌ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నిపుణులకు షాకిచ్చిన అమెరికా దాడుల వ్యూహం

Jasprit Bumrah Hits Back At Critics After 5-Wicket Haul Against England6
ఎప్పుడో నా కెరీర్ ముగిసింద‌న్నారు.. కానీ ప‌దేళ్లు పూర్తి చేసుకున్నాను: బుమ్రా

లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌల‌ర్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్‌తో మెరిశాడు. రెండో రోజు ఆట‌లో మూడు వికెట్లు ప‌డ‌గొట్టిన బుమ్రా.. రెండో రోజు ఆట‌లో మ‌రో రెండు వికెట్లను సాధించాడు.దీంతో విదేశీగ‌డ్డ‌పై టెస్టుల్లో అత్య‌ధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భార‌త బౌల‌ర్‌గా క‌పిల్‌దేవ్ స‌ర‌స‌న బుమ్రా(12) నిలిచాడు. అయితే మూడో రోజు ఆట‌ అనంత‌రం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన బుమ్రా.. త‌న ఫిట్‌నెస్‌పై విమ‌ర్శ‌లు చేసే వారికి గ‌ట్టి కౌంటరిచ్చాడు. త‌న శ‌రీరం స‌హ‌క‌రించేంత‌వ‌ర‌కు భార‌త్ త‌ర‌పున క్రికెట్ ఆడాల‌ని అనుకుంటున్నాన‌ని అత‌డు తెలిపాడు.కాగా గ‌త క్యాలెండర్ ఈయ‌ర్‌లో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన బౌల‌ర్‌గా నిలిచిన బుమ్రా.. ఆస్ట్రేలియాతో జరిగిన 5వ టెస్ట్ సందర్భంగా వెన్ను గాయం బారిన ప‌డ్డాడు. ఈ గాయం కారణంగా బుమ్రా దాదాపు నాలుగు నెలలు ఆటకు దూరమ‌య్యాడు. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లోనూ జ‌స్ప్రీత్ భాగం కాలేదు. ఐపీఎల్‌-2025తో తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత ఇంగ్లండ్ టూర్‌కు వ‌చ్చిన‌ప్ప‌టికి వ‌ర్క్‌లోడ్‌, ఫిట్‌నెస్ కారణంగా మొత్తం అన్ని మ్యాచ్‌లు ఆడుతాడ‌న్న గ్యారెంటీ లేదు.రిపోర్టర్‌: గాయం బారిన ప్రతీసారీ మీపై వచ్చే విమర్శలకు బాధపడతారా?బమ్రా: "నా ఫిట్‌నెస్‌పై వచ్చే నెగిటివ్ కామెం‍ట్లను పట్టించుకోను. అరంగేట్రం నుంచి నా ఫిట్‌నెస్‌పై ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. మొదటిలో కొంతమంది నేను ఎనిమిదినెలలు మాత్రమే ఆడగలనని అన్నారు. మరికొంతమంది 10 నెలల మాత్రమే అన్నారు. కానీ ఇప్పుడు నేను అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నాను. 12-13 సంవత్సరాలపాటు ఐపీఎల్ ఆడాను.ప్రతీ గాయం తర్వాత నా కెరీర్ ముగిసిపోయిందని, అతడు మరి తిరిగి రాడని కామెంట్స్ చేస్తుంటారు. వారి అలానే అనుకోనివ్వండి. నా పని నేను చేసుకుపోతాను. ప్రతి నాలుగు నెలలకు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాము. నేను దాని గురించి ఎక్కువగా ఆలోచించను.దేవుడు రాసిపెట్టినంత కాలం భారత తరపున క్రికెట్ ఆడుతాను. అందుకు తగ్గట్టు నా శరీరాన్ని కూడా సిద్దం చేసుకుంటాను. నేను అలిసి పోయాను అనుకున్నప్పుడు క్రికెట్‌ను వదిలేస్తాను. భారత క్రికెట్ జట్టును మరింత ముందుకు తీసుకువెళ్లడమే నా లక్ష్యమంటూ" సమాధనమిచ్చాడు

Great Insult To Krishna District TDP Women President Details Here7
రోడ్డెక్కిన కృష్ణా జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు

సాక్షి, కృష్ణా జిల్లా: జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత( రోడ్డెక్కారు. ఆమెకు తీవ్ర అవమానం జరగడమే అందుకు కారణంగా తెలుస్తోంది. నాగాయలంక మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమావేశంలో గ్రామపార్టీ అధ్యక్షుడు ఉప్పల ప్రసాద్‌ ఏమైందో తెలియదుగానీ ఒక్కసారిగా స్వర్ణలతతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఆమెపైకి వాటర్‌ బాటిల్‌ విసిరేశారు. ఆ దురుసు ప్రవర్తనతో ఆమె షాక్‌ తిన్నారు. అవమాన భారంతో కంటతడి పెట్టిన ఆమె రోడ్డు పై భైఠాయించి నిరసన తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలైన తనకే అలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై ఆమె తన మాటల్లో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళలకు పార్టీలో ఇచ్చే గౌరవం ఇదేనా?. ఉప్పల ప్రసాద్ పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ నినాదాలు చేశారామె. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు పీఎస్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పీఎస్‌కు వెళ్లగా.. విషయం తెలిసిన పార్టీ నేతలు కొందరు ఆమెకు సర్దిచెప్పి ఫిర్యాదు చేయించకుండానే బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని అధిష్టానం వద్ద తేల్చుకునేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Anupama Parameswaran Janaki Vs State Of Kerala Censor Issue8
పేరు తీసేయాల్సిందే.. అనుపమ సినిమాకు కష్టాలు

టాలీవుడ్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ చేసిన లేటెస్ట్ మలయాళ మూవీ 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ'. సీనియర్ నటుడు, ప్రస్తుత కేంద్రమంత్రి సురేశ్ గోపీ కీలక పాత్రలో నటించారు. జూన్ 27న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు ఇప్పుడు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. సెన్సార్ కోసం బోర్డ్ ముందుకు వెళ్లగా.. సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అందుకు గల కారణాలు కూడా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగింది?(ఇదీ చదవండి: దేవి శ్రీ ప్రసాద్‌కి డబ్బులు ఎగ్గొట్టిన నిర్మాత ఎవరు?)జానకి అనే మహిళ.. కోర్టులో చేసే న్యాయపోరాటం అనే స్టోరీతో 'జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ' సినిమాని డైరెక్టర్ ప్రవీణ్‌ నారాయణ్‌ తీశారు. అయితే జానకి అనే పేరు సీతాదేవికి మర పేరు అని, అలాంటి పాత్రకు ఈ పేరు పెడితే స్క్రీనింగ్ చేయడం కుదరదని సెన్సార్ బోర్డ్ పేర్కొంది. ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్‌ కూడా ఈ వివాదం గురించి మాట్లాడారు.సినిమాలో జానకి అనే పేరుని ఉపయోగించొద్దని సెన్సార్‌ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు క్లారిటీ ఇచ్చింది. టైటిల్‌, పాత్ర పేరుని మార్చాలని చిత్రబృందానికి బోర్డ్ సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరు పెట్టలేమని బోర్డు చెప్పింది. ఇటీవల మరో మలయాళ చిత్ర నిర్మాత తన సినిమాలో జానకి అనే పాత్ర పేరు విషయంలో ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు అని ఉన్నికృష్ణన్ గుర్తుచేశారు. మరి ఈ విషయంలో చిత్రబృందం ఏం చేస్తుందో చూడాలి? (ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి అంజలి పవన్ సీమంతం వేడుక)

Devotional story about how to lead happy and healthy life9
ఇలా అయితే వేదన తప్పదు : అదే నీవు... అదే దైవం!

దైవం ఈ క్షణంలోనే ఉంది. ఈ క్షణంలో నీవు ఎక్కడ ఉన్నా సరే, ఏమి చేస్తున్నాసరే ఆత్మస్థితిలోకి వెళ్ళగలవు. అదే దివ్యచైతన్యం. అదే నీవు, అదే దైవం. ఆ సమాధి స్థితి దైనందిన జీవితంలో నిరంతరం ఉండాలి. ఎల్లప్పుడూ ఆత్మదర్శనంలోనే ఉండాలి. చూసేవాడివే నీవు, శరీరానికి, మనస్సుకు ఏమి జరుగుతున్నా సరే సంపూర్ణంగా స్వీకరించు, వాటికి అంటకుండా దూరంనుంచి గమనిస్తూ ఉండు. విషయాలను తర్కించి, జరుగుతున్నది మంచేనా లేక చెడా అని రకరకాలుగా అలోచిస్తూ సంస్కారాలను పెంచుకోవద్దు. జరుగుతున్నది ఏదైనా సరే నీవు సాక్షిగా చూస్తున్నావా లేదా అన్నదే ముఖ్యం. అదే నిన్ను మనస్సుకు అతీతంగా తీసుకెళ్తుంది. శరీరము–మనస్సులకు జరుగుతున్న వాటితో కలిసిపోయావంటే వేదనలను అనుభవిస్తావు. జరుగుతున్న వాటిని సాక్షిగా గమనిస్తే ఆత్మలోని అనందమే నీవు అవుతావు. దుఃఖించేవాడివి నీవు కాదు, దుఃఖించేవాడిని గమనించేవాడివే నీవు. ఇలాంటి జీవనశైలిని అలవర్చుకుంటే నిత్యం సచ్చిదానందంలో ఉంటావు. అది నొప్పిఐనా, అవమానమైనా, సంతోషమైనా, విజయమైనా, ప్రశంసైనా.... ఏదైనాసరే నీకు అంటకూడదు. సమభావంతో స్వీకరించు, సాక్షిగా గమనించు. సత్యం నీలో ఉంది. దేన్ని వెంబడించినా ఆనందం రాదు గుర్తుంచుకో. అన్నింటిలోనూ జీవించు కానీ వేటితోనూ కలిసిపోవద్దు. ఆధ్యాత్మికంగా ఉండడమంటే కోరికల్ని అణిచివేయడమని, కొన్ని పనుల్ని చేయకూడదని, సంసారాన్ని త్యజించడమని, హిమాలయాలకు వెళ్ళడమని కొందరు చెప్పే అజ్ఞానపు పోకడలను అనుసరించవద్దు. అసలు జరుగుతున్నదేదీ సత్యం కానపుడు దాన్ని వదిలేయడం ఏమిటి? నీవే దైవమైనప్పుడు దేన్ని వదిలేయాలి? మనస్సుతో మాత్రం ఎప్పుడూ ఏకమవ్వద్దు. మనకున్న నమ్మకాలు, భయాలు, అ΄ోహలు అన్నీ మనస్సు వల్లనే. సత్యాన్ని తెలుసుకోనీయకుండా చేసేది మనస్సే. నీవు సాక్షివైనప్పుడే మనస్సు అంతమవుతుంది. అలోచనలు లేని శుద్ధ చైతన్యం అనుభవమౌతుంది.చదవండి: రాత్రికి రాత్రే మిలియనీర్‌గా..జాలరి దశ మార్చిన చేపలుబుద్ధుడు, మహా వీరుడు మొదలైన యోగులు కూడా దేవుడు భౌతికమని ఎన్నడూ చెప్పలేదు. సత్యమే దైవం. అదే నీ నిజస్థితి. దేవుడు అనేది నీచివరి మజిలీ. దైవాన్ని నమ్మడం అనేది దైవాన్ని నీవు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఏమాత్రం సహకరించదు. పైగా నమ్మకమే దైవాన్ని తెలుసుకోవడానికి అడ్డుపడుతుంది. నమ్మకాలనేవి నీ మనస్సులోని ఊహలే. సత్యాలు మాత్రం కావు. దైవాన్ని తెలుసుకోవడానికి ఏ క్రతువులు, భాషలు అవసరమే లేదు. కానీ ఈ రోజు ప్రతి మతంలోనూ మనస్సు తాలూకు నమ్మకాలు, అలవాట్లు అనేవే ఉన్నాయి కానీ నిన్ను నీవు తెలుసుకోవడం, సాక్షీభావనతో ఉండడం అనే అంశాలే ఉండటం లేదు. ఎన్ని శాస్త్రాలు చదివినా, గ్రంథాలు చదివినా అది మన అహంకారాన్ని పోషించి మనస్సును ఇంకా బలపరచి సత్యానికి అడ్డుగోడలు కడుతుందే కానీ సత్యాన్ని తెలుసుకోనివ్వదు. నిన్ను నీవు తెలుసుకోనివ్వకుండా అడ్డుపడేది మనస్సే. రోజాపువ్వు గురించి తెలుసుకున్నంత మాత్రాన నీవు ఆ రోజాపువ్వుని ఆస్వాదించలేవు. ఒక విషయం గురించిన జ్ఞానం ఆ విషయానుభవానికే అడ్డమవుతుంది. మనస్సు నిన్ను సత్యాన్ని తెలుసుకోనివ్వదు. ఆనందాన్ని అనుభవించ నీయదు. ఏదో ఒక కొత్త సమస్యను, కోరికను సృష్టిస్తూ, ప్రశ్నిస్తూ, ఈ క్షణాన్ని తిరస్కరిస్తూ ఉంటుంది. ఆనందం మనస్సుకు అతీతమైన స్థితి కనుక అక్కడికి నిన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూనే ఉంటుంది. దీని ఉచ్చునుండి బయటపడడానికి అనుక్షణం నీవు సాక్షీభావనతో నిన్ను నీవు గమనిస్తూ ఉండాలి. చేతనలో ఉండాలి. చేతన అనేది మనస్సుకాదు కానీ మనస్సు ద్వారా ప్రవహిస్తుంది. ఇది అనుభవపూర్వకంగా మాత్రమే తెలుసుకోగలవు. నిత్యజీవితంలో ఈ సాక్షీభావన అనేది సాధన చేయటం చాలా ముఖ్యం. ఇదీ చదవండి: Today tips పండంటి కాపురానికి పక్కా లెక్కలు, చిట్కాలు – స్వామి మైత్రేయ, ఆధ్యాత్మిక బోధకులు

Israel-Iran Conflict: How Much Chances For Nuke War?10
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?

ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్‌ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్‌ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్‌ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్‌ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్‌ అటామిక్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్‌ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్‌కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్‌, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్‌సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్‌ అణు స్థావరాలపై బంకర్‌ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్‌-ఇజ్రాయెల్‌ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్‌, ఇస్‌ఫహాన్‌లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ‍ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్‌ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్‌ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్‌ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్‌ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్‌, ఇరాన్‌, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement