మోదీ ఛాయ్‌ అమ్మి పార్టీకి నిధులు సేకరించారా..? | HD Kumaraswamy Says No Blast In Kashmir When Deve Gowda Was PM | Sakshi
Sakshi News home page

మోదీ ఛాయ్‌ అమ్మి పార్టీకి నిధులు సేకరించారా..?

Published Fri, Apr 19 2019 3:58 PM | Last Updated on Fri, Apr 19 2019 3:58 PM

HD Kumaraswamy Says No Blast In Kashmir When Deve Gowda Was PM - Sakshi

హుబ్లీ : కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమి ఓటు బ్యాంక్‌ పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో ఉందా అంటూ ప్రధాని నరేంద్ర మోదీ వేసిన సెటైర్లపై కర్నాటక సీఎం, జేడీఎస్‌ నేత హెచ్‌డీ కుమారస్వామి స్పందించారు. తాను దేశభక్తుడిని కాదని ప్రధాని మోదీ చెబుతున్నారని, దేశభక్తి గురించి తాను మోదీ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. దేవెగౌడ ప్రధానిగా ఉండగా కశ్మీర్‌లో ఒక్క పేలుడు ఘటన చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. అది తమ వారసత్వమని, తనపై ముద్ర వేసే హక్కు ప్రధాని మోదీకి లేదని కుమారస్వామి పేర్కొన్నారు.

బీజేపీ తన మేనిఫెస్టోలో అవినీతిరహిత పాలన అందిస్తామని పేర్కొందని మరి మోదీ దేశమం‍తటా తిరిగి టీ అమ్మి బీజేపీని సంపన్న పార్టీగా చేశారా అని ఎద్దేవా చేశారు. అవినీతి రహిత సర్కార్‌ అని ఆయన చెప్పుకోవడం బూటకమని వ్యాఖ్యానించారు. కర్వార్‌లో ఓ బీజేపీ నేత నుంచి పట్టుబడ్డ రూ 78 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement