Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Chandrababu Naidu government has incurred an additional debt of 7,000 crores1
మళ్ళీ మంగళవారం.. మరో 7 వేల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు సర్కార్‌

సాక్షి,విజయవాడ: మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చింది.దీంతో అప్పుల ప్రభుత్వంగా సరికొత్త చెత్త రికార్డ్‌లను నమోదు చేసింది. తాజాగా, చంద్రబాబు ప్రభుత్వం మరో రూ. 7 వేల కోట్లు అప్పు చేసింది. దీంతో చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ అప్పు చేసిన ప్రభుత్వంగా నిలిచింది. వారం రోజుల్లోనే రూ.14 వేల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం.. మంగళవారం (ఈరోజు) అప్పు రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చింది.రిజర్వ్‌ బ్యాంకులో సెక్యూరిటీల వేలం ద్వారా అప్పును సమీకరించింది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిలోనే రూ.లక్షా 58 వేల కోట్ల అప్పు చేసింది. సంపద సృష్టిలో తిరోగమనం.. అప్పుల సృష్టిలో రికార్డ్‌లు సృష్టించడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jagan condemns Sakshi offices attacks calls out CBN Lokesh Balakrishna past remarks2
వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?: వైఎస్‌ జగన్‌

సాక్షి, గుంటూరు: ఏడాది కూటమి పాలనలో ఏపీలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. తాజాగా.. మహిళల గౌరవం పేరిట కూటమి నేతలు సాక్షి ఆఫీసులపై చేస్తున్న దాడులను, కొమ్మినేని అరెస్ట్‌ తదితర అంశాలను ఖండిస్తూ.. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌లకు ఆయన చురకలంటించారు.పారదర్శక, అవినీతి రహిత, న్యాయబద్ధమైన, అధికారులకు స్వేచ్ఛ.. అన్నింటికి మించి సంక్షేమ పథకాలతో సమర్థవంతంగా గత వైఎస్సార్‌సీపీ పాలన కొనసాగింది. కానీ, చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే గడిచిపోయింది. ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోగా.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, జనాల దృష్టి మరలించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎలాంటి వ్యాఖ్యలు చేయని సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావుపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్‌ చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్ట్‌ కాదు.. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్ట్‌... వాస్తవాలను వక్రీకరించి ఒక పథకం ప్రకారం సాక్షి కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న నినాదం వెనుక ఈ ప్రభుత్వ లక్ష్యం ఒక్కడే.. సొంత ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదారి పట్టించడం!. అలాంటప్పుడు ఇది నిజమైన మహిళా గౌరవ రక్షణా?. ఈ ఘటనలు వారి అసలైన వైఖరిని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజల ముందు ఒక ప్రచారాన్ని నిర్మించుకుంటూ.. నిజమైన విలువలను మాత్రం పూర్తిగా విస్మరిస్తున్నారని కింద వీడియోలు వెల్లడిస్తున్నాయి..కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా?: చంద్రబాబుఅమ్మాయిల వెంటపడమంటే ఊరుకుంటారా నా ఫ్యాన్స్‌. ఏమయ్యా.. ఊరుకోరు కదా. ఎళ్లి ముద్దైనా పెట్టాలి.. లేదా కడుపైనా చేసేయాలి అంతే.. అంతే కమిట్ అయిపోవాలి. ఏదో ఒకటి: నందమూరి బాలకృష్ణవిదేశీ యువతులతో డ్యాన్సులు వేస్తూ.. ఎంజాయ్‌ చేస్తున్న చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌Previous government under YSRCP, notable for its efficiency, transparency, corruption-free administration, justice-driven approach, and groundbreaking welfare programmes, has been deceitfully replaced by @ncbn’s government which is seemingly a chaotic, authoritarian regime driven… pic.twitter.com/KpZbRPB6BW— YS Jagan Mohan Reddy (@ysjagan) June 10, 2025 ఏడాది కాలంలో 188 రేపులు, 15 హత్యాచారాలు ఇదేనా మహిళలకు రక్షణ కల్పించడం అంటే?. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిమండలం ఏడుగురాళ్లపల్లిలో బాలికపై టీడీపీ నేతలే అత్యాచారానికి పాల్పడడం.. లాంటి ఘటనలు తాజా నిదర్శనాలు. ఇదేనా వాళ్లు ప్రజలకు ఇచ్చిన హామీ?. ఇదేనా వాళ్లు కాపాడుతున్న మహిళా గౌరవం?.. వాళ్ల చేతలు, మాటలు.. పొంతన లేకుండా పోతోంది. మహిళల పట్ల వీరి వైఖరి సిగ్గుచేటు. మహిళల గౌరవాన్ని రక్షిస్తున్నామన్న వంకతో కక్షసాధింపు చర్యలు తీసుకోవడం అత్యంత దారుణమైన చర్య’’ అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Congress leadership exercise ends for Allocating portfolios to new ministers3
సీఎం శాఖలు సీనియర్లకు!

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్‌ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్‌ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారికి పాత మంత్రుల శాఖలు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. భేటీలో సీనియర్‌ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్‌ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్‌ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్‌ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరూ పార్టీ వీడకుండా చూడండి మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్‌ నేతలు సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేంసాగర్‌ రావు, మల్‌రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్‌ నేత సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్‌ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్‌ ఫోన్‌లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్‌ చర్చించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్‌ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం.

Sakshi Guest Column On India, Pakistan economy4
ప్రపంచం మన మాట వినట్లేదేం?

పాకిస్తాన్‌ ఒక విఫల రాజ్యం. పాకిస్తాన్‌ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలి. పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. పాకిస్తాన్‌ అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ప్రపంచంలో ముస్లింలు అత్యధికంగా ఉన్న దేశ మైన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబుతొ సుబియాంతో పాక్‌తో ముడిపెట్టకుండా, భారత్‌ను విడిగా సందర్శించారు. ఒక దశాబ్దం నుంచి భారత ప్రజానీకానికి ఈ రకమైన చిత్రాన్ని రూపుకట్టిస్తూ వస్తున్నారు. మరి మనం ‘అంతర్జాతీయ సమాజం’గా చెప్పుకొంటున్నది పాక్‌ను నిలదీయకుండా సంశయ స్థితిలో ఉండిపోవడానికి కారణ మేమిటి? పాక్‌ను గూడుగా చేసుకుని పనిచేస్తున్న ఉగ్ర మూకల వల్ల రెండు దేశాలూ ఘర్షణ పడి ఇంకా నెల కూడా కాకుండానే, కౌంటర్‌ – టెర్రరిజం కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఐరాస భద్రతామండలి జూన్‌ 4న పాక్‌కు కట్టబెట్టింది. గత నెల రోజులుగా పాక్‌ సాధించిన దౌత్య విజయాలకు ఇది శిఖరాగ్రం. పాక్‌ను ప్రపంచం ఎలా వీక్షిస్తోంది అనే అంశంపైన దృష్టి సారించవలసిన సమయం ఆసన్నమైంది. మద్దతుగా వచ్చిన దేశాలెన్ని?రెండు దేశాల మధ్య ఘర్షణలు మొదలై రెండు రోజులయ్యాయో లేదో మే 9న మనం దౌత్యపరమైన మొదటి దిగ్భ్రాంతిని చవిచూడ వలసి వచ్చింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) 200 కోట్ల డాలర్ల రుణాన్ని పాక్‌కు అందించడానికి అనుకూలంగా ఓటు వేసింది. ఒక్క భారత్‌ మినహా, జీ–7 దేశాలతో సహా బోర్డులోని మిగిలిన సభ్య దేశాలన్నీ పాక్‌ ఊపిరిపీల్చుకునేందుకు ఊతమి చ్చాయి. ఐఎంఎఫ్‌ బాటలో, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా పాక్‌కు అప్పులిచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దీనికి సంబంధించి ఓ డజను ప్రకటనలు చేశారు. దాడి, ప్రతిదాడులు చేసుకుంటున్న పొరుగు దేశాలతో కాల్పుల విరమణ ప్రకటింపజేసిన ఘనత తనదే నని ఆయన మొదట చాటుకున్నారు. కాల్పుల విరమణకు, అమె రికాకు ఎలాంటి సంబంధమూ లేదని భారత్‌ అధికారికంగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన ఆ రకమైన మాటలు ఆపలేదు. భారత్‌ –పాక్‌లను ఒకే గాటన కడుతూ, రెండూ అమెరికాకి మిత్ర దేశాలనీ, ఎందుకంటే, అవి అణ్వాయుధ దేశాలనీ ఆయన అన్నారు. భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తకుండా నివారించేందుకు అవి పరస్పరం వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకోవాలని, అమెరికాతో కూడా వ్యాపారం చేయాలని ట్రంప్‌ చెప్పుకొచ్చారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు మద్దతు ప్రకటించిన దేశాలు చాలా ఉన్నప్పటికీ, కేవలం రెండు –ఇజ్రాయెల్, అఫ్గానిస్తాన్‌ మాత్రమే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదిగా పాక్‌ను పేరెత్తి ప్రకటించాయి. చైనా కొద్ది రోజుల్లోనే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లతో ఒక త్రైపాక్షిక సమావేశం నిర్వహించి ఆ రెండింటి మధ్య రాజీ కుదిర్ఛింది. దాంతో, ప్రస్తుతం నిస్సహాయులపై జాతిసంహారం సాగిస్తున్నట్లు నిందపడుతున్న ఇజ్రాయెల్‌ ఒక్కటే, భారత్‌కు అండగా నిలిచి నట్లవుతోంది. రష్యా కూడా రెండు నాల్కల ధోరణితో మాట్లాడింది. పహల్‌గామ్‌ ఉగ్రదాడి జరిగిన కొద్ది రోజుల తర్వాత, భారత్‌ ‘భాగ స్వాములను కోరుకుంటోంది కానీ, బోధకులను కాదు’ అని యూరో పియన్‌ యూనియన్‌ను విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత ఎవరూ నీతులు పలికే యత్నం చేయని మాట నిజమేకానీ, భాగస్వాములవుతామన్న దేశాలు కొద్దిగానే ఉన్నాయి.మనకెందుకు మద్దతు రాలేదు?పాకిస్తాన్‌ అసలు రూపాన్ని అంగీకరించడంలో, దాన్ని నిల దీయడంలో, ‘అంతర్జాతీయ సమాజం’గా మనం భావిస్తున్నదిఎందుకు వెనకడుగు వేస్తున్నట్లు? పాకిస్తాన్‌ దుశ్చర్యలను చిత్తశుద్ధితో ఎందుకు ఖండించడం లేదు? కనీసం, భారతదేశానికి మరింత హృదయపూర్వకంగానైనా సంఘీభావం వ్యక్తపరచడం లేదు ఎందుకని? భారత రాయబారులు చేయవలసిన పనిని నిర్వర్తించేందుకు వివిధ పార్టీల పార్లమెంట్‌ సభ్యులతో ప్రతినిధి బృందాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపవలసిన అవసరం ఎందుకొచ్చింది?గతంలో ఇలాంటి స్థితి ఎన్నడూ ఉత్పన్నం కాలేదు. మఫ్టీ దుస్తు లలో వచ్చిన పాక్‌ సైనికులను కార్గిల్‌ నుంచి 1999లో తరిమి కొట్టినప్పుడు... అంతర్జాతీయ సమాజం భారత్‌ సరసన నిలిచింది. నియంత్రణ రేఖనే సరిహద్దుగా అంగీకరిస్తున్న సిమ్లా ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ తలూపిన తర్వాత, కశ్మీర్‌ హోదాపై ప్రపంచ అభిప్రాయంలోనూ మార్పు వచ్చింది. క్లింటన్‌ అప్పట్లో భారత్‌లో ఐదు రోజులు పర్యటించి పాకిస్తాన్‌లో ఐదు గంటలు మాత్రమే గడిపారు. భారత్‌ను ప్రశంసించి, పాక్‌ను మందలించారు. ముంబయిపై ఉగ్రదాడి సందర్భంలో, 2008 నవంబర్‌లో కూడా మొత్తం ప్రపంచం భారత్‌కు బాసటగా నిలిచింది. ఆ రెండు ఉదంతాలలోనూ పాక్‌ పాత్ర తేటతెల్లం కావడంతో అది తలదించు కోవలసి వచ్చింది. భారత్‌ ప్రకటనలకు ప్రపంచం సముచిత గౌరవం ఇవ్వడం కూడా దానిలో అంతే సమానమైన పాత్ర వహించింది. అటల్‌ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాల ప్రకట నలను అన్ని ప్రధాన దేశాలూ గౌరవ ప్రపత్తులతో చూశాయి. మన వైఖరి గురించి వివరణ ఇచ్చుకుంటూ, 50 మంది పార్లమెంటేరి యన్లను ప్రపంచం నలుమూలలకు పంపడం ద్వారా ప్రజాధనాన్ని ఇప్పటిలా వృథా చేయవలసిన అవసరం కూడా లేకపోయింది.వృత్తిపరమైన దౌత్యవేత్తలే ఆ బాధ్యతను నిర్వహించారు. పహల్‌గామ్‌ దాడిలో పాలుపంచుకున్న ఉగ్రవాదుల జాతీయ తను గుర్తించడంలో, పాక్‌ అపరాధాన్ని స్పష్టంగా నిరూపించడంలో కేంద్రం విఫలమైంది. అది ఈసారి భారత్‌ దౌత్య సామర్థ్యాన్ని వికలం చేసింది. సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ వాదనను బలహీన పరచడంలో భారత అంతర్గత రాజకీయాలు పాత్ర పోషించలేదు కదా అని ప్రపంచంలోని అనేక దేశాలు విస్తుపోతున్నాయి. భారత్‌ లౌకిక, ప్రజాస్వామిక దేశంగానూ, వాజ్‌పేయి, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వాలు బాధ్యతాయుతమైన ప్రభుత్వాలుగానూ పరిగణన పొందాయి. వర్తమానానికొస్తే, భారత్‌ కేసు బలహీన పడింది. అంత ర్జాతీయ అభిప్రాయంలోనూ సానుభూతి సన్న గిల్లింది. మున్ముందు జరగవలసింది!శత్రుదేశాన్ని ఆచితూచి అంచనా వేయడం జాతీయ భద్రత, విదేశీ విధాన నిర్వహణ కర్తల మొదటి లక్ష్యం కావాలి. సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి వీలయ్యే విధంగా వివిధ స్థాయులలో సంబంధాలు కొనసాగేటట్లు చూసుకోవాలి. పాకిస్తాన్‌తో అన్ని దౌత్య పరమైన, వ్యాపార, పౌర సమాజ మార్గాలను మూసివేయడ ద్వారా... పొరుగు దేశం గురించి సమ తూకంతో కూడిన మదింపు చేయడానికున్న మార్గాలను, సరిహద్దుకు ఆవల అభిప్రాయాలను ప్రభావితం చేయడానికున్న అవకాశాన్ని చేజార్చుకున్నట్లయింది. రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసం పెరిగిందనడంలో సందేహం లేదుగానీ, పాకిస్తాన్‌ను మరీ పనికిరానిదిగా చూడటం కూడా సరికాదు. దానికి చెప్పుకోతగినంత ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక, వ్యావసాయిక పునాదులున్నాయి. దానికి ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలున్నాయి. సమర్థత కలిగిన సైన్యం ఉంది. పాక్‌ తన భౌతిక శక్తితోపాటు, ఉన్నత వర్గీయుల ‘సాఫ్ట్‌ పవర్‌’ను కూడా వినియోగించుకుంటోంది. భూస్వామ్య పెత్తందారీ విధానం, అసమానతలు అధికంగా ఉన్న సమాజంలో, పాశ్చాత్య మధ్యవర్తులతో సమానమైన వర్గంగా, ఆత్మవిశ్వాసంతో మెలిగేలా పాక్‌ తన ఉన్నత వర్గాన్ని తీర్చిదిద్దుకుంటూ వస్తోంది. భారతదేశపు రాజకీయాలను, దౌత్యాన్ని ప్రభావితం చేస్తున్న మధ్య తరగతి దానికి దీటు కాదు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్‌ ఫర్‌ ఎయిర్‌ పవర్‌ స్టడీస్‌ ఫౌండర్‌–ట్రస్టీ,మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మీడియా సలహాదారు

BRS Leader KCR cross-examination today5
నేడు కేసీఆర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించనుంది. విచారణ కమిషన్‌ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌ అధికారులకు కమిషన్‌ ఇప్పటికే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్‌ అధికారులు విచారణ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్‌ ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? వాటికి మంత్రివర్గ ఆమోదం ఉందా? కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ఎందుకు ఏర్పాటు చేశారు? బరాజ్‌లలో నిరంతరం నీళ్లు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై కమిషన్‌ లోతుగా ప్రశ్నిస్తోంది. విచారణ చివరి దశకు చేరడంతో ఈ నెల 6న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కమిషన్‌ ప్రశ్నించింది. చివరగా బుధవారం కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్‌ గుర్తించిన అవకతవకతలను కేసీఆర్‌ ముందు ఉంచుతూ ఆయన నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ను ప్రశ్నించడంతో సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్‌ తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు సహా ఇంజనీర్లు, నిపుణులతో కేసీఆర్‌ మంతనాలు కాళేశ్వరం విచారణ కమిషన్‌ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్‌ సోమ, మంగళవారాల్లో పార్టీ నేత హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు రిటైర్డ్‌ ఇంజనీర్లు, సాగునీటిరంగ నిపుణులకు ఫోన్‌ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సందేహాలను కేసీఆర్‌ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కమిషన్‌ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్‌ ఎర్రవల్లి నివాసం నుంచి వస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలు కమిషన్‌ కార్యాలయం ఉన్న బీఆర్‌కే భవన్‌కు భారీగా తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రతోనే తమ అధినేతను విచారణ పేరిట ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతకు సంఘీభావంగా తరలిరావాలని కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Sakshi Editorial On US President Donald Trump Rule6
ట్రంప్‌ ‘ఫెడరల్‌’ పరీక్ష!

వలసలను అరికట్టి తీరతానని వాగ్దానం చేసి గద్దెనెక్కిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ఏంజెలెస్‌ నగరంలోని ఒక ప్రాంతంలో అక్రమ వలసదారుల ఏరివేతకు వచ్చిన ప్రతిఘటన సాకుతో ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రం అనుమతి లేకుండా ఆదివారం కేంద్ర బలగాలను పంపారు. డెమాక్రటిక్‌ ఏలుబడిలోని ఆ రాష్ట్రానికి అలా సవాలు విసిరారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన గవ ర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ను అరెస్టు చేయిస్తానని, ఆ రాష్ట్రానికి నిధులు నిలిపేస్తానని హెచ్చరించారు. అందుకు ప్రతిగా క్యాలిఫోర్నియా నుంచి పన్నుల రూపంలో ఫెడరల్‌ ప్రభుత్వానికి వెళ్లే 8,000 కోట్ల డాలర్ల నిధుల్ని ఆపేస్తామని న్యూసమ్‌ జవాబిచ్చారు. అంతేకాదు... చట్టవిరుద్ధంగా ఫెడరల్‌ బలగాలను పంపిన ట్రంప్‌ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. మొత్తానికి అమల్లో ఉన్న వలస విధానంపై కొన్నేళ్లుగా అంతర్గతంగా రాజుకుంటున్న అసంతృప్తి క్యాలిఫోర్నియాలో భళ్లున బద్దలైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో సొంతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే నాలుగో స్థానాన్ని ఆక్రమించగలిగిన క్యాలిఫోర్నియాలో అపరిమితమైన సంపద ఉన్నట్టే దాన్ని ఆశ్రయించి వలసలూ అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో నుంచి ఏటా వచ్చే వేలాదిమంది అక్కడ చిన్నాచితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు. స్థానికంగా ఉండే శ్వేత జాతి అమెరికన్లకు ఈ వలసలపై ఆగ్రహావేశాలున్నాయి. దీన్ని సకాలంలో సరిచేయటంలో డెమాక్రాట్లు విఫలమైన కారణంగానే ట్రంప్‌ వంటి దూకుడైన నేత అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించారు. వర్తమాన స్థితిని ఇలాగే కొనసాగనీయదల్చుకుంటే ట్రంప్‌ ప్రత్యేకతేముంది? దీన్ని సాకుగా తీసుకుని మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఆయన రెడీ అయ్యారు. అలబామాలో పౌర హక్కుల యాత్రకు అక్కడి ప్రభుత్వం ఆటంకం కలిగించవచ్చునన్న సంశయంతో ఆరున్నర దశాబ్దాల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్‌ జాన్సన్‌ గవర్నర్‌ అనుమతి లేకుండా ఫెడరల్‌ బలగాలను పంపారు. ఇంకా వెనక్కివెళ్తే 1860ల్లో అప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ఈ మాదిరే బలగాలను తరలించిన ఉదంతం ఉంది. ఎన్నడో 1807లో అమెరికాలో తిరుగుబాటు చట్టాన్ని రూపొందించారు. ఏ రాష్ట్రమైనా ఫెడరల్‌ ప్రభుత్వంపై తిరగబడి ఆత్యయిక స్థితి ఏర్పడితే మెరైన్‌లను రంగంలోకి దించి వాటిని అణిచేయటం దీని ఉద్దేశం. అప్పట్లో అంతర్యుద్ధాలూ, కొన్ని రాష్ట్రాలు జట్టుకట్టి ఫెడరల్‌ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధపడటం వగైరా పరిస్థితులను ఎదుర్కొనటానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ అరవయ్యేళ్లలోనూ ఫెడరల్‌ బలగాలను పంపాల్సిన సందర్భాలు రాలేదని కాదు. 1992లో రోడ్నీ కింగ్‌ అనే నల్లజాతీయుణ్ణి అత్యంత దారుణంగా హింసించిన కేసులో పోలీసులు నిర్దోషులని తీర్పు వెలువడినప్పుడు ఇదే లాస్‌ ఏంజెలెస్‌ దాదాపు వారంరోజుల పాటు అట్టుడికిపోయింది. 50 మంది మరణించటంతో పాటు వందలాది భవంతులు ధ్వంస మయ్యాయి. వేలాది కార్లకు నిప్పుపెట్టారు. ఇప్పుడలా కాదు. నగరంలోని ఒక బ్లాక్‌లో దాదాపు 200 మంది మెక్సికన్‌ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. కార్లు తగలబెట్టడం, లూటీలు, ఫెడరల్‌ భవంతులపై రాళ్లు రువ్వటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాలిఫోర్నియా పోలీ సులే చాలావరకూ అదుపులోకి తెచ్చారు. ఆ ఆందోళన పెద్దగా విస్తరించింది కూడా లేదు.కానీ ట్రంప్‌ దీన్ని వదలదల్చుకోలేదు. 2020లో తన తొలి ఏలుబడి కాలంలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ను శ్వేతజాతి పోలీసులు ఊపిరాడకుండా చేసి హతమార్చిన ఉదంతం సమయంలో తీవ్ర హింస చెలరేగినా ట్రంప్‌ ముందుకు కదల్లేకపోయారు. ఆనాటి రక్షణమంత్రి మార్క్‌ ఏస్పర్, సైనిక బలగాల చీఫ్, అటార్నీ జనరల్‌ ఫెడరల్‌ బలగాలను పంపటం ప్రమాదకరమని వారించారు. అందుకే ఈసారి అలాంటివారిని దూరంకొట్టి నిర్విచక్షణగా తనకు మద్దతునిచ్చేవారిని చేరదీశారు. ఇప్పుడు క్యాలిఫోర్నియాకు కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించగానే రక్షణమంత్రి హెగ్సెత్, అటార్నీ జనరల్‌ బోండీ మద్దతుగా నిలిచారు. ట్రంప్‌ పని సులభమైంది. రెండోసారి అధికారంలోకొచ్చాక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విధానాన్ని ట్రంప్‌ పాటిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్‌ నరమేధాన్ని నిరసిస్తూ విశ్వవిద్యాలయాల్లో చెలరేగిన ఉద్యమం విషయంలో ఆయన ఏం చేశారో ప్రపంచమంతా చూసింది. అందులో పాల్గొన్నవారిని దేశద్రోహులుగా పరిగణించి, సంకెళ్లువేసి జైళ్లకు తరలించటం, దేశం నుంచి గెంటేయటం రివాజుగా మారింది. ప్రస్తుత క్యాలిఫోర్నియా అల్లర్లపైనా ఆయన ఆ వైఖరే తీసుకున్నారు. అసలు తిరుగు బాటు చట్టం అమలును ప్రకటించకుండానే, గవర్నర్‌కు వర్తమానం పంపకుండానే 2,000 మంది బలగాలను అక్కడికి తరలించటం అమల్లోవున్న సంప్రదాయాలను ధిక్కరించటమే! ఏ పార్టీకి చెందిన దేశాధ్యక్షులైనా గతంలో ఇలాంటి దుస్సాహసానికి దిగలేదు. కానీ ఉన్న అధికారాలను మాత్రమే కాదు... ఎక్కడాలేని, ఏనాడూ ఎవరూ వినియోగించని అధికారాలను సైతం దబాయించి అమలు చేయించే నైజం ట్రంప్‌ది. లాస్‌ ఏంజెలెస్‌ అల్లర్ల వంటివి ట్రంప్‌కు చేజేతులా ఆ అవకాశాన్నిస్తున్నాయి. అక్కడ చెలరేగిన హింస, అందులో మెక్సికన్‌ జాతీయ జెండాల ప్రదర్శన స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిలించాయి. విద్వేషాన్ని పెంచాయి. హింసతో దేన్నయినా సాధించు కోవచ్చన్న మనస్తత్వం వికటిస్తుందని ఉద్యమకారులు తెలుసుకోవటం అవసరం. పరిస్థితిని అదుపు చేయటానికి క్యాలిఫోర్నియా ప్రభుత్వానికి సహకరించటమే వారికి శ్రేయస్కరం.

Listed companies paid Rs 5 lakh crore as dividends to shareholders in 2024-257
డివిడెండ్‌ ధమాకా!

లిస్టెడ్‌ కంపెనీలు దేశీయంగా వాటాదారులకు గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 5 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి. ఇది సరికొత్త రికార్డ్‌కాగా.. వార్షికంగా ఇది 11 శాతం అధికం! అయితే గత ఐదేళ్లలో లేనివిధంగా గతేడాది వాటాదారులకు చెల్లింపులు నెమ్మదించడం గమనార్హం! – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ ప్రపంచవ్యాప్త అనిశ్చితులు, మందగమన పరిస్థితుల మధ్య గతేడాది లిస్టెడ్‌ కార్పొరేట్‌ సంస్థల ఆదాయం, నికర లాభాలు మందగించాయి. అయినప్పటికీ వాటాదారులకు డివిడెండ్‌ రూపేణా లాభాల్లో వాటాను పంచడంలో సరికొత్త రికార్డ్‌ నమోదైంది. లిస్టెడ్‌ కంపెనీలు ఉమ్మడిగా గతేడాది రూ. 5 ట్రిలియన్లు డివిడెండ్‌గా చెల్లించాయి. అంతక్రితం ఏడాది (2023–24)లో వాటాదారులు అందుకున్న డివిడెండ్‌ రూ. 4.52 లక్షల కోట్లే. గతేడాది దేశీ లిస్టెడ్‌ కంపెనీల నికర లాభం(నష్టాలు, అనుకోని లాభాలను సర్దుబాటు చేశాక) 5 శాతం పైగా ఎగసి రూ. 16 లక్షల కోట్లను తాకాయి.అంతక్రితం ఏడాది రూ. 15.21 ట్రిలియన్లుగా నమోదైంది. బీఎస్‌ఈలో లిస్టయిన 1,218 ప్రధాన కంపెనీలను పరిగణనలోకి తీసుకున్న గణాంకాలివి! గతేడాది ఉమ్మడిగా నికర అమ్మకాలు (ఫైనాన్షియల్‌ సంస్థలైతే వడ్డీ ఆదాయం) 7.5% పుంజుకుని రూ.166.4 ట్రిలియన్లకు చేరాయి. అంతక్రితం ఇవి రూ.154.83 లక్షల కోట్లు. బైబ్యాక్‌ల వెనకడుగు సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)లో గతేడాది నామమాత్ర(1.2 శాతం) వృద్ధి మాత్రమే నమోదైంది. బైబ్యాక్‌లతో కలిపి వాటాదారులకు కంపెనీలు రూ. 5.08 ట్రిలియన్లు చెల్లించాయి. అంతక్రితం ఏడాదిలో ఇది రూ. 5.03 లక్షల కోట్లుకాగా.. గతేడాది షేర్ల బైబ్యాక్‌పై లిస్టెడ్‌ కంపెనీలు రూ. 8,034 కోట్లు వెచ్చించాయి. బైబ్యాక్‌లు తగ్గడంతో వార్షికంగా చెల్లింపుల నిష్పత్తి 33 శాతం నుంచి 32 శాతానికి క్షీణించింది.అయితే గత దశాబ్ద కాలాన్ని పరిగణిస్తే లిస్టెడ్‌ కంపెనీలు బైబ్యాక్‌లు, డివిడెండ్లపై వార్షిక నికర లాభాల్లో 40 శాతం వరకూ వాటాదారులకు చెల్లించాయి. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు బైబ్యాక్‌లపై నగదు వెచ్చింపును తగ్గించడం ఇటీవల ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ఇతర రంగాలలోని కంపెనీలు విస్తరణ కోసం నగదును కేటాయించడంతో ఇటీవల డివిడెండ్ల చెల్లింపులపై ప్రతికూల ప్రభావం పడినట్లు తెలియజేశారు.లాభాలు ఓకే గత రెండేళ్లలో డివిడెండ్‌ చెల్లింపులు 7 శాతానికి పరిమితమైనప్పటికీ కంపెనీల లాభాల్లో 16 శాతం పురోగతి నమోదైనట్లు విశ్లేషకులు తెలియజేశారు. గతేడాది షేర్ల బైబ్యాక్‌పై లిస్టెడ్‌ కంపెనీలు గత 9ఏళ్లలోనే కనిష్టంగా నిధులు వెచ్చించినట్లు వెల్లడించారు. 2017–18లో అత్యధికంగా 22% నగదును బైబ్యాక్‌కు కేటాయించాయి. 2024–25లో ఇది 1.6 శాతానికి పరిమితమైంది.దిగ్గజాల తీరిలా గరిష్ట డివిడెండ్లు చెల్లించే లిస్టెడ్‌ దిగ్గజాలలో టాటా గ్రూప్‌ సంస్థ టీసీఎస్‌ గతేడాది 73 శాతం అధికంగా రూ. 45,612 కోట్ల డివిడెండ్‌ చెల్లించింది. దీంతో వరుసగా రెండో ఏడాది(2024–25)లోనూ టాప్‌చెయిర్‌ను అలంకరించింది. అయితే బైబ్యాక్‌కు నో చెప్పింది. ఈ బాటలో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ రూ. 17,958 కోట్లు, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ. 17,828 కోట్లు వెచ్చించాయి. టాప్‌–10 జాబితాలో రూ. 17,009 కోట్లతో వేదాంతా, రూ.16,835 కోట్లతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రూ.16,331 కోట్లతో పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా, రూ.16,290 కోట్లతో హెచ్‌సీఎల్‌ టెక్, రూ.15,411 కోట్లతో ఓఎన్‌జీసీ, రూ.14,190 కోట్లతో ఎస్‌బీఐ, రూ.12,455 కోట్లతో హెచ్‌యూఎల్‌ నిలిచాయి. వెరసి టాప్‌–10 కంపెనీలు ఉమ్మడిగా రూ. 1.9 లక్షల కోట్లు డివిడెండ్‌గా చెల్లించాయి.

World Test Championship final from today8
రెండు జట్లకు తుది ‘టెస్టు’

టెస్టు క్రికెట్‌లో అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సాంప్రదాయ ఫార్మాట్‌లో విశ్వ విజేతను తేల్చే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పోరుకు నేడు తెర లేవనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియా తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తుండగా... గత 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి రికార్డును మార్చాలని పట్టుదలగా ఉంది. వరుసగా మూడోసారి ఇంగ్లండ్‌ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుండగా సౌతాంప్టన్, ఓవల్‌ తర్వాత ఈసారి వేదిక ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానానికి మారింది. లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) 2023–25 టైటిల్‌ వేటలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా హోరాహోరీ సమరానికి ‘సై’ అంటున్నాయి. లార్డ్స్‌ మైదానంలో నేటి నుంచి జరిగే ఫైనల్‌ పోరులో ఇరు జట్లు తలపడతాయి. 2023–25 మధ్య కాలంలో 9 జట్లు 27 సిరీస్‌లలో కలిపి మొత్తం 69 మ్యాచ్‌లలో తలపడిన అనంతరం తుది సమరానికి ఆసీస్, సఫారీ టీమ్‌ అర్హత సాధించాయి. ఇది మూడో డబ్ల్యూటీసీ ఫైనల్‌ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్‌ చేరి ఓడిన భారత్‌ ఈసారి తుది పోరుకు అర్హత పొందలేకపోయింది. ఆసీస్‌ అదే జోరుతో... ఐసీసీ ఫైనల్‌ మ్యాచ్‌లు అనగానే ఆస్ట్రేలియా ఆట ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుతుందని గతంలో చాలాసార్లు రుజువైంది. ఆఖరి సమరంలో ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి మ్యాచ్‌ను తమ సొంతం చేసుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. మూడు ఫార్మాట్‌లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్‌ ఆడిన కంగారూలు 10 టైటిల్స్‌ సాధించడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2023లో భారత్‌పై ఫైనల్‌ ఆడిన తుది జట్టులోంచి 9 మంది మళ్లీ ఇక్కడా బరిలోకి దిగడం ఖాయమైంది. వార్నర్‌ రిటైర్‌ కాగా, ఆల్‌రౌండర్‌ వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది. గాయంతో నాటి మ్యాచ్‌కు దూరమైన హాజల్‌వుడ్‌ ఇప్పుడు బోలండ్‌ స్థానంలో ఆడతాడు. ఖ్వాజాకు జోడీగా లబుõÙన్‌ ఓపెనింగ్‌ చేయనుండగా, గ్రీన్‌ మూడో స్థానంలో ఆడతాడు. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లలో ఒకడైన స్టీవ్‌ స్మిత్, గత డబ్ల్యూటీసీ ఫైనల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హెడ్‌ బ్యాటింగ్‌లో ప్రధాన బలం కాగా, కీపర్‌ అలెక్స్‌ కేరీ కూడా చెలరేగిపోగలడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్‌లతో టీమ్‌ బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. రాత మారేనా... దక్షిణాఫ్రికా వరుసగా గత 7 టెస్టుల్లో విజయాలు సాధించి ముందుగా ఫైనల్‌కు అర్హత సాధించినా సరే టీమ్‌పై విమర్శలు వచ్చాయి. టెస్టుల్లో అగ్రగామి అయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి టీమ్‌లతో లీగ్‌ దశలో ఒక్కసారి కూడా తలపడకుండానే జట్టు ఫైనల్‌ చేరింది. అయితే ఏ దారిలో వచ్చినా ఇప్పుడు తుది పోరులో విజేతగా నిలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తున్నారు. అయితే జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. మార్క్‌రమ్, కెపె్టన్‌ తెంబా బవుమాలకు మాత్రమే ప్రస్తుత ఆసీస్‌ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్‌హామ్‌ ఇంకా టెస్టు కెరీర్‌ ఆరంభ దశలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సఫారీ టాప్‌–7 బ్యాటర్లందరి టెస్టు పరుగులు కలిపినా (9,873)... ఒక్క స్మిత్‌ (10,271) పరుగులకంటే తక్కువే ఉన్నాయి! అయితే వైవిధ్యమైన బౌలింగ్‌ తో ఆసీస్‌ను కట్టడి చేయగలమని నమ్ముతోంది. ఇంగ్లండ్‌లో వాతావరణం అనుకూలిస్తే తన స్వింగ్‌తో రబాడ ప్రమాదకరమైన బౌలర్‌ కాగా, యాన్సెన్‌ లెఫ్టార్మ్‌ పేస్‌ కూడా ఇటీవల పదునెక్కింది. ఇక స్పిన్‌ కోసం మరోసారి దక్షిణాఫ్రికా మహరాజ్‌నే నమ్ముకుంది.పిచ్, వాతావరణంసాధారణ బ్యాటింగ్‌ పిచ్‌. ప్రస్తుతం ఉపఖండం తరహాలోనే వాతావరణం ఉంది. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్షంతో అంతరాయం కలగవచ్చు. అయితే ఐదు రోజులలో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకుండా ఫలితం రాకపోతే ‘రిజర్వ్‌ డే’ ఆరో రోజుకు మ్యాచ్‌ సాగుతుంది. భారత్, కివీస్‌ మధ్య 2021 ఫైనల్లో ఇదే జరిగింది.తుది జట్లు (అంచనా)ఆస్ట్రేలియా: కమిన్స్‌ (కెప్టెన్‌), ఖ్వాజా, లబుషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, కేరీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్‌. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్‌), మార్క్‌రమ్, రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్‌హామ్, వెరీన్, యాన్సెన్, కేశవ్‌ మహరాజ్, రబాడ, ఇన్‌గిడి.

Andhra Pradesh: TDP Leaders Attacked The Eluru Sakshi Office; Latest Updates Here9
ఏలూరు: సాక్షి ఆఫీస్‌కు నిప్పంటించి.. టీడీపీ నేతల పైశాచికం

సాక్షి,ఏలూరు: తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈరోజు(మంగళవారం, జూన్‌ 10) సైతం ‘సాక్షి’పై కుట్రపూరిత దాడులు కొనసాగుతున్నాయి. ఏలూరు జిల్లాలో టీడీపీ నేతల గూండాగిరి కొనసాగుతుంది. సాక్షి కార్యాలయంపై దెందులూరు నియోజకవర్గ టీడీపీ నేతలు దాడి చేశారు. పెట్రోల్ బాటిళ్ళు ,రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో కార్యాలయంలో ఉన్న సోఫా సెట్లు, ఫర్నిచర్ ఆగ్నికి ఆహుతయ్యాయి. ఆఫీసు ఉద్యోగి కారు పాక్షికంగా ధ్వంసమైంది. గత, మూడు రోజులుగా సాక్షి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు భయానక వాతావరణం సృష్టించారు. అయినప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సాక్షి కార్యాలయంపై మంగళవారం కూటమి మూకలు దాడులకు తెగబడ్డాయి. బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో దాడులకు పాల్పడ్డారు. రామకృష్ణారెడ్డి, బలరామకృష్ణ ఆధ్వర్యంలో సాక్షి కార్యాలయంపై దాడులక తెగబడ్డారు. సాక్షి కార్యాలయం బోర్డులో ధ్వంసం చేసి అరాచకం సృష్టించారు కూటమి నేతలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు ఉసిగొలిపింది.తెలుగువారి మనస్సాక్షిగా.. పేదవాడి గొంతుకై.. నాణేనికి రెండోవైపు ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.

KutamiPrabhutvam Big Conspiracy Against Kommineni10
కూటమి సర్కార్‌ భారీ కుట్ర.. కొమ్మినేనిపై మరిన్ని కేసులు!

సాక్షి, విజయవాడ: సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌(Kommineni Srinivasa Rao) పై కక్ష సాధించడం కోసం కూటమి ప్రభుత్వం అడ్డదారులను ఎంచుకుంటోంది. టీవీ డిబేట్‌లో తన జోక్యం, ప్రమేయం లేకుండా జరిగిన వ్యాఖ్యలపై ఇప్పటికే ఆయన్ని అరెస్ట్‌ చేయించి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అయినా చంద్రబాబు కక్ష చల్లారనట్లుంది!. అందుకే టీడీపీ నేతల(TDP Leaders)తో మరిన్ని కేసులు పెట్టిస్తున్నారు. తుళ్లూరు పీఎస్‌ కేసులో ఆయన సోమవారం అరెస్టు కాగా.. ఇవాళ మంగళగిరి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ని గుంటూరు జైలుకు తరలించారు. అయితే ఇప్పుడు కొమ్మినేని విషయంలో ఒకే అంశంపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అవుతున్నాయి. విజయవాడ సత్యనారాయణ పురం, పడమట పీఎస్‌, సాలూరు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ నేతల ఫిర్యాదులతో కొమ్మినేనిపై కేసులు నమోదయ్యాయి. అయితే..ఇప్పటికే కొమ్మినేనిపై దాఖలు చేసిన సెక్షన్ల విషయంలో మంగళగిరి కోర్టు(Mangalagiri Court) ఇవాళ పోలీసులపై ఆగ్రహం ‍వ్యక్తం చేసింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నిస్తూ.. ఆ సెక్షన్లను కొట్టేసింది. ఈ తరుణంలో ఆయనపై కేసు వీగిపోతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే.. ఒకవేళ ఈ కేసులో గనుక ఆయనకు బెయిల్ లభిస్తే.. మళ్లీ ఆయన్ని అరెస్ట్‌ చేసేందుకు కుట్ర జరుగుతోందన్న విషయం తాజా కేసులతో స్పష్టమవుతోంది. గతంలో పోసాని విషయంలోనూ ఇలాగే జరిగిన సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో చంద్రబాబు, లోకేష్‌, పవన్‌లపై అనుచిత పోస్టులు చేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీస్‌ స్టేషన్లలో కూటమి నేతలతో కేసులు పెట్టించారు. దీంతో ఆయన్ని పీటీ వారెంట్‌ కింద వివిధ జైళ్లకు తిప్పుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే.కొమ్మినేనిపై మరో మూడు కేసులు ఎక్కడ?.. పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది ఎవరు?.. టీడీపీ నాయకురాలు గుమ్మిడి సంధ్యా రాణిఏయే సెక్షన్లు?.. 79BNS,67A ITA-2000-2008,75(3) BNS సెక్షన్ల కింద కేఎస్సార్‌పై కేసుఎక్కడ?.. విజయవాడ సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు పెట్టింది ఎవరు?.. సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలుఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1)(a),353(1)(b),61(2), r/w 3(5)BNS, 67A ITA 2000-2008 సెక్షన్ల కింద కొమ్మినేనిపై కేసుఎక్కడ?.. విజయవాడ పడమటి పోలీస్ స్టేషన్‌లో పెట్టింది ఎవరు?.. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి ఏయే సెక్షన్లు?.. 196(1),352,353(1),353(3)b, 61(2),r/w 3(5) BNS, 67A ITA2000-2008 సెక్షన్ల కింద కేఎస్సార్‌పై కేసు నమోదు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement