ప్రధాన వార్తలు

ఐటీ ముసుగులో భూములు ‘లిఫ్ట్’!
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వమైనా ఓ కంపెనీకి ఉదారంగా భూములివ్వాలంటే ముందుగా దాని ట్రాక్ రికార్డు చూస్తుంది! కంపెనీ శక్తి, సామర్థ్యాలు ఏమిటి? ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది? రాష్ట్రానికి పారదర్శకంగా ఎన్ని పెట్టుబడులు వస్తాయో చూస్తుంది. అంతటా నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తుంది. కానీ ఇలాంటివి ఏవీ పట్టించుకోకుండా పప్పు బెల్లాల మాదిరిగా భూముల పందేరానికి టీడీపీ కూటమి సర్కారు సిద్ధమైంది. ఐటీ కంపెనీల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసింది. ఎన్ని ఎకరాల భూమి అయినా సరే కేవలం 99 పైసలకే ఇస్తాం...! ఐటీ పేరుతో వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసుకోండి..! ఆ తరువాత మార్కెట్ ధరకు అమ్మేసుకోండి..! అంటూ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ (లిఫ్ట్) పేరుతో విలువైన భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ఐటీ కంపెనీలను ఆకర్షిస్తున్నామంటూ పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సన్నాహాలు చేశారు. తొలుత ఒకటి రెండు ప్రముఖ కంపెనీలను తెరపైకి తీసుకొచ్చి కనీసం పాలసీ కూడా సిద్ధం కాకముందే విశాఖలో 99 పైసలకే భూములను కట్టబెట్టారు. ఈ క్రమంలో ఊరూ పేరు లేని ఉర్సాకు కారుచౌకగా భూములను కట్టబెట్టే యత్నాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ఉలిక్కిపడి ‘లిఫ్ట్’ పేరుతో ఓ పాలసీని తీసుకొచ్చారు. ఉర్సా లాంటి వందలాది సత్తాలేని కంపెనీలను సృష్టించి తమకు కావాల్సిన వారికి భూములు అప్పనంగా అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అసలు టెక్నాలజీతో సంబంధం లేని కంపెనీలకు భూములను ధారాదత్తం చేస్తున్నారు! తొలుత విశాఖలో ఐటీ కంపెనీలను ప్రోత్సహించి ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా భూములను కేటాయించనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నామినల్ రేటు అంటే 99 పైసలు..ఐటీ కంపెనీలను ఆకర్షించేందుకు ఇప్పటికే ఏపీ ఐటీ అండ్ గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ 2024–29 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు కేటాయించడం కోసం ప్రత్యేకంగా ‘లిఫ్ట్’ పాలసీని తెరపైకి తెచ్చింది. ముందుగా ఐటీ లేదా జీసీసీతో అభివృద్ధి చేసే వాణిజ్య సముదాయంలో 20 శాతం కొనుగోలు లేదా లీజుకు తీసుకునేలా ఒప్పందం చేసుకుంటే చాలు.. అడిగినంత భూమిని కేవలం 99 పైసలకే కట్టబెట్టనుంది. మిగిలిన 80 శాతంలో 30 శాతం ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు, జీసీసీలకు ఇస్తే చాలు 50 శాతం భూమిని వాటికి నచ్చినట్లుగా విక్రయించుకోవచ్చని ఆ జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. ‘‘నామినల్ రేటు అంటే 99 పైసలు..’’ అని అందులో పేర్కొనడం గమనార్హం.ప్రత్యేకంగా ‘ఫార్చూన్ 500 యూరప్’ ఎందుకు?ఐటీ, ఐటీఈఎస్, జీసీసీలకు 99 పైసలకే భూమి ఇస్తామంటూనే ‘‘ఫార్చూన్ 500 యూరోప్’’ను ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిలో నాన్ ఐటీ కంపెనీలే ఉన్నాయి. టెక్నాలజీతో ఏమాత్రం సంబంధంలేని యూరోప్ ఫార్చూన్ 500 ఇండెక్స్ను ఎంపిక చేసుకోవడంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ ఇండెక్స్లో నల్లధన రాజధాని స్విట్జర్లాండ్కు చెందిన 36కిపైగా కంపెనీలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫార్చూన్ 500 యూరోప్ తేవడంపై ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.డెవలపర్స్ ముసుగులో ‘రియల్’ వ్యాపారంఐటీ పార్కు డెవలపర్స్, జీసీసీ డెవలపర్స్కు కూడా ఈ పాలసీ కింద 99 పైసలకే భూమిని కేటాయిస్తారు. జీసీసీ డెవలపర్స్ కనీసం ఒక ఎకరా భూమిలో 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే విధంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఫార్చూన్, ఫోర్బ్స్ కంపెనీల్లో ఒక దానిని యాంకర్ కంపెనీగా ఎంపిక చేసుకొని అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం తీసుకునే విధంగా ఒప్పందం చేసుకోవాలి. ఎకరాకు కనీసం 500 మందికి ఉపాధి కల్పించాలి. ఇలా అభివృద్ధి చేసిన భూమిలో కనీసం 50 శాతం భూమిని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలు, జీసీసీలకు ఇవ్వాల్సి ఉంటుందని ఉత్తర్వులో పేర్కొన్నారు . అదే ఐటీ పార్కు డెవలపర్స్ అయితే ఎకరాకు 1,00,000 చదరపు అడుగులు చొప్పున కనీసం 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే ఐటీ డెవలపర్స్కు కనీసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తారు.

ఎత్తిపోతలు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం ప్రారంభమై రెండున్నర నెలల తర్వాత ఎట్టకేలకు ఎగువ గోదావరి వరదెత్తింది. నదీ పరీవాహకంలో కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. పరీవాహకంలోని జలాశయాలన్నీ అడుగంటిపోయి ఉండగా, ఎప్పటికప్పుడు పంపుల ద్వారా ఎత్తిపోసి నిల్వ చేసుకోకపోవడంతో వరద జలాలన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. జలాల ఎత్తిపోతలో మీనమేషాలు లెక్కిస్తున్న అధికార యంత్రాంగం.. ఎల్లంపల్లి జలాశయం నుంచి మేడారం, అక్కడి నుంచి మిడ్మానేరు జలాశయానికి పంపింగ్ను మాత్రమే ప్రారంభించడం గమనార్హం. మిడ్ మానేరుకు తరలింపులో తీవ్ర ఆలస్యం మిడ్మానేరు నుంచి ఎగువన ఉన్న అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ జలాశయాల్లోకి నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వాస్తవానికి శ్రీరామ్సాగర్కు గత మూడు రోజులుగా భారీ వరద వస్తున్నా ఫ్లడ్ ఫ్లో కెనాల్ (ఎఫ్ఎఫ్సీ) ద్వారా గ్రావిటీతో మిడ్మానేరు జలాశయానికి నీళ్లను తరలించడంలో తీవ్ర ఆలస్యం జరిగింది. ఆదివారం సాయంత్రం ఎల్ఎఫ్సీ ద్వారా 10,000 క్యూసెక్కులను విడుదల చేయగా, ఇంకా ఆ నీళ్లు మిడ్మానేరుకు చేరుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నంది పంప్హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్లోకి, అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ల ద్వారా అంతే నీళ్లను మిడ్మానేరు జలాశయంలోకి ఎత్తిపోస్తున్నారు. నంది, గాయత్రి పంప్హౌస్లలో చెరో ఏడు చొప్పున మొత్తం 14 పంపులుండగా, చెరో 4 పంపులతో నీళ్లను పంపింగ్ చేస్తున్నారు. దీంతో మిడ్మానేరు జలాశయం నిల్వ సామర్థ్యం 27.5 టీఎంసీలకు గాను 11.13 టీఎంసీలకు చేరింది. మిడ్ మానేరు నుంచి ఎప్పుడు? మిడ్మానేరు నుంచి నీళ్లను ఏకకాలంలో సమాంతరంగా అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్తో పాటు మరో లింక్ ద్వారా మలకపేట, అప్పర్ మానేరుకు ఎత్తిపోసేందుకు వీలుండగా, ఇంకా ఆ ప్రక్రియను ప్రారంభించలేదు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఈ ఆన్లైన్ రిజర్వాయర్లలో ప్రస్తుతం నిల్వలు అడుగంటిపోయి ఉన్నా పంపింగ్ ప్రారంభించకపోవడం గమనార్హం. ప్రాజెక్టులకు వరద ఇలా.. రాష్ట్రంలో మంజీరపై ఉన్న సింగూరు ప్రాజెక్టుకు శనివారం సాయంత్రం 6 గంటలకు 31,412 క్యూసెక్కుల వరద రాగా, ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి 28,357 క్యూసెక్కులకు తగ్గిపోయింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 20.37 టీఎంసీల నిల్వను కొనసాగిస్తూ 43,244 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న నిజాంసాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా, 49,000 క్యూసెక్కుల వరద వస్తుండడంతో ప్రస్తుతం నిల్వలు 12.88 టీఎంసీలకు చేరాయి. ఇక గోదావరి ప్రధాన పాయపై ఉన్న శ్రీరామ్సాగర్ గరిష్ట నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రాజెక్టుకు 1.51 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 66.23 టీఎంసీలకు పెరిగాయి. మరో రెండురోజుల్లో శ్రీరామ్సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అప్పుడే కడెం, ఎల్లంపల్లి గేట్లు కిందకి.. కడెం నదిపై ఉన్న కడెం ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం శనివారంతో పోల్చితే ఆదివారానికి 1.33 లక్షల క్యూసెక్కుల నుంచి 4,632 క్యూసెక్కులకు తగ్గిపోవడంతో గేట్లను కిందికి దించేశారు. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 4.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.17 టీఎంసీల నిల్వలను కొనసాస్తూ 299 క్యూసెక్కులను కాల్వకు విడుదల చేస్తున్నారు. శ్రీరామ్సాగర్, కడెంకి దిగువన గోదావరి ప్రధాన పాయపై ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వచ్చే వరద సైతం 2.15 లక్షల క్యూసెక్కుల నుంచి 28,460 క్యూసెక్కులకు పడిపోవడంతో గేట్లను మూసివేశారు. జలాశయం నిల్వ సామర్థ్యం 20.18 టీఎంసీలు కాగా 18.31 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 12,600 క్యూసెక్కులను మేడారం రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్ ద్వారా 9,390 క్యూసెక్కులను మిడ్మానేరు రిజర్వాయర్లోకి తరలిస్తున్నారు. మిడ్మానేరు నుంచి నీళ్లను ఎత్తిపోస్తే అనంతగిరి రిజర్వాయర్ కింద 40వేల ఎకరాలు, రంగానాయకసాగర్ కింద 1.10 లక్షల ఎకరాలు, మల్లన్నసాగర్ కింద 2.96 లక్షల ఎకరాలు, కొండపోచమ్మసాగర్ కింద 2.85 లక్షల ఎకరాలు, అప్పర్ మానేరు కింద 16,085 ఎకరాలకు ప్రస్తుత ఖరీఫ్లో సాగునీరు అందే అవకాశం ఉంది. కృష్ణా జలాశయాలు కళ కళ కృష్ణా పరీవాహకంలో రాష్ట్రంలో మొత్తం 649.53 టీఎంసీల సామర్థ్యంతో 30 రిజర్వాయర్లుండగా, 584.65 టీఎంసీల నిల్వలతో అన్నీ జలకళను సంతరించుకున్నాయి. కానీ గోదావరి పరీవాహకంలో మొత్తం 419.81 టీఎంసీల సామర్థ్యంతో 57 జలాశయాలుండగా, కేవలం 191.69 టీఎంసీల నిల్వలతో వెలవెలబోతుండటం గమనార్హం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లలో నీళ్లను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో 33.18 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని రాష్ట్రం తాత్కాలికంగా కోల్పోయింది. సింగూరు జలాశయానికి ఏ క్షణంలోనైనా గండిపడవచ్చనే హెచ్చరికలున్న నేపథ్యంలో 21 టీఎంసీలకు మించి నీళ్లను నిల్వ చేయడం లేదు. కాగా నీటి నిల్వలకు అవకాశం ఉన్న జలాశయాలూ ఖాళీగా ఉండడం గమనార్హం.

ఈ రాశి వారికి ధన, వస్తులాభాలు.. సంఘంలో పేరుప్రతిష్ఠలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.దశమి సా.6.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: రోహిణి ఉ.5.40 వరకు, తదుపరి మృగశిర రా.3.51 వరకు, వర్జ్యం: ఉ.10.26 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.7.31 నుండి 9.02 వరకు.సూర్యోదయం : 5.46సూర్యాస్తమయం : 6.21రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకుయమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు మేషం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.వృషభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.మిథునం.... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు.కర్కాటకం.... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.సింహం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.కన్య.... శ్రమ తప్పదు. పనులు కొన్ని మధ్యలో నిలిపివేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.తుల.... కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.వృశ్చికం... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.ధనుస్సు... నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.మకరం..... పనుల్లో కొంత జాప్యం. సోదరులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.కుంభం.. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.మీనం.... శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. భూవివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం.

మనమంటే మొహం మొత్తిందా?
ఇండియాపై ట్రంప్కు మొహం మొత్తిందా? ఆయన తన చేతల ద్వారా అదే విషయాన్ని తెగేసి చెబుతున్నారా? ఆయన మనపై 50% సుంకాలు విధించారు. సుంకాలపై వివాదం పరిష్కారమ య్యేంత వరకూ వాణిజ్య చర్చలను సుప్తావస్థలో పెడుతున్నట్లు ఆయన తెలి పారు. భారతదేశ మృతప్రాయ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను లెక్క చేయబోనని కరాఖండీగా చెప్పేశారు. రష్యా చమురును కొంటూ, అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు తెస్తోందని ట్రంప్కు వాణిజ్య సలహాదారైన పీటర్ నవారో ప్రకటించారు. పుతిన్తో ట్రంప్ చర్చలు విఫలమైతే భారత్పై సెకండరీ సుంకాలు పెరగ వచ్చని ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ వెల్లడించారు. యూరప్ కూడా భారత్పై సెకండరీ సుంకాలు విధించాలని ఆయన కోరారు. అమె రికా స్నేహహస్తం నుంచి భారత్ చేజారిందని ఇవన్నీ సూచిస్తున్నాయా? చైనా, రష్యాలను హెచ్చరించేందుకు భారత్ను ట్రంప్ వాడు కుంటున్నారనే అభిప్రాయమూ ఉంది. అది కూడా సంతోషపడదగ్గ అంశం కాదు. మనం ఆనుషంగిక నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. మనం ఏమైపోయినా నిజంగానే, ఆయనకు పట్టదు.మరోపక్క, ట్రంప్ పాకిస్తాన్తో ప్రేమలో పడినట్లు కనిపిస్తోంది. అదీ మనల్ని సంకటంలో పడేసే సంగతే. ఆయన పాక్పై 19% సుంకాలే విధించారు. ఆయన ప్రభుత్వం ఇస్లామాబాద్ను ఉగ్రవాదంపై పోరాటంలో ‘అసాధారణ భాగస్వామి’గా పరిగణి స్తోంది. ‘ఉగ్రవాద సంస్థలను అరికట్టడంలో విజయాలను కొనసా గిస్తున్నందుకు’ అది ఇటీవల పాకిస్తాన్ను కొనియాడింది. ట్రంప్... పాక్ ఫీల్డ్ మార్షల్ మునీర్ను విందుకు ఆహ్వానించి, చమురును వెలికితీయడంలో పాక్కు సాయపడతామని చెప్పారు. నిజం చెప్పా లంటే, ఏదో ఒక రోజున పాక్ నుంచి భారత్ కూడా చమురును కొనుగోలు చేసే రోజు రావచ్చని, ఆయన మనల్ని కవ్వించారు.అంటే, ఆయనకు పాకిస్తాన్ కొత్త ముద్దుగుమ్మగా మారినట్లా? రష్యన్ చమురు ఢిల్లీని చీకాకుపరచే అంశంగా మారడమేకాదు, అది పరిష్కారమయ్యేంత వరకూ భారత్తో వాణిజ్య చర్చలు జరి పేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు కనుక మొదట దానిపై దృష్టి కేంద్రీకరిద్దాం. పైగా, జరిమానా కింద మరిన్ని సుంకాలు విధిస్తా మని బిసెంట్ హెచ్చరించారు. సత్యం ఏమంటే, రష్యన్ చమురు కొనేటట్లుగా ఇండియాను బైడెన్ ప్రభుత్వం ప్రోత్సహించింది. ‘వాస్తవానికి, ధరపై పరిమితి ఉన్న రేటు వద్ద రష్యన్ చమురు కొనుగోలు చేయాల్సిందిగా మేము (అమెరికా) కోరబట్టే వారు (ఇండియా) కొనుగోలు చేశారు...ఎందుకంటే, చమురు ధరలు పెరగడం మాకిష్టం లేదు. వారు ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించారు’ అని ఢిల్లీలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటి 2024 మే నెలలో చెప్పారు. ట్రంప్ ఈరోజు, తనకు ముందున్న ప్రభుత్వ విధానాన్ని కావాలని ఉపేక్షిస్తూ, ఇండియాను నిందిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ ఆత్మవంచన తేటతెల్లమవుతోంది. రష్యా నుంచి అమెరికా పాలాడియం, యురేనియం హెక్సాఫ్లోరైడ్, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటూనే ఉంది. గత ఏడాదితో పోలిస్తే, గడచిన ఆరు నెలల్లో ఈ దిగుమతుల పరిమాణం గణనీయంగా పెరిగిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒక వార్తాకథనంలో పేర్కొంది. రష్యా నుంచి అమెరికా స్వేచ్ఛగా దిగుమతి చేసుకుంటున్నప్పుడు లేని అభ్యంతరం, ఇండియా పట్లనే ఎందుకు? ఇక మూడవ అంశం – ట్రంప్ అసలు ఉద్దేశాలను బయట పెడుతోంది. ఆయన ద్వంద్వ ప్రమాణాలకు ఇది మరో నిదర్శనం. రష్యా చమురును పెద్దయెత్తున దిగుమతి చేసుకుంటున్న, మూడవ పెద్ద దిగుమతిదారులుగా ఉన్న చైనా, తుర్కియేలను ట్రంప్ హెచ్చరించ లేదు. రష్యన్ చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ, స్లొవేకియా – రెండూ యూరప్ దేశాలు, ‘నాటో’లో సభ్యత్వం ఉన్నవీనూ! కానీ ట్రంప్ పల్లెత్తు మాట అనడం లేదు. ఈ ఏడాది జూన్ నుంచి జపాన్ కూడా దిగుమతి చేసుకుంటున్న సంగతిని ఆయన సమయానుకూలంగా విస్మరిస్తున్నారు. చైనాపై సుంకాల విధింపులో ఇచ్చిన విరామాన్ని ఆయన ఇటీవల మరో 90 రోజులు పొడిగించారు. ఆయన ఢిల్లీపైన మాత్రమే మూడవ కన్ను తెరిచారని స్పష్టమవుతోంది. ఈ సమస్యకు సంబంధించి మరో పార్శ్వం కూడా అంతే కలవరపరుస్తోంది. ‘క్వాడ్’ (ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, అమె రికా)లోని మిగిలిన మూడు దేశాలతో తనకు అవసరం తీరిపోయిందని ట్రంప్ భావిస్తున్నారని... ఆయన వైఖరి, నడతను బట్టి అర్థం చేసుకోవచ్చా? అదే నిజమైతే, ఇండో–పసిఫిక్ వ్యూహం విషయంలో అమెరికా వైఖరి ఏమిటి? చైనాతో మనకున్న సమస్యల దృష్ట్యా ‘క్వాడ్’ కూటమి మనకు ఊరటనిచ్చిన మాట నిజం. ‘క్వాడ్’ పట్ల ట్రంప్ నిబద్ధత చూపకపోతే, అది మనకు మరిన్ని చిక్కులు సృష్టించవచ్చు.చైనాతో ట్రంప్ ఆర్థిక ఒప్పందానికి వస్తారా? ఊహించడం కష్టం. కానీ, షీ జిన్ పింగ్తో శిఖరాగ్ర సమావేశమై ఆయన ఇప్పటికే మాట్లాడుతున్నారు కనుక, అటువంటి దానికి అవకాశం ఉందని పిస్తోంది. చైనాను రాజకీయంగా మరింత మెరుగ్గా అవగాహన చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందా అనేది ప్రశ్న. బీజింగ్ ప్రాంతీయ ఆకాంక్షలకు అమెరికా మరింత వెసులుబాటు కల్పిస్తుందా? ఒకవేళ అదే కార్యరూపం ధరిస్తే, చైనాతో సరిహద్దు వివాదంపై అమెరికా మద్దతు మనకు కొనసాగుతుందా? ఈ విషయమై మనం ఎటువంటి వైఖరిని అనుసరించాలన్నది పెద్ద ప్రశ్న? జవాబు కోసం మనం గాభరా పడాల్సిన అవసరం లేదు. మన నుంచి దిగుమతి చేసుకోకపోతే బతకలేమన్నంతగా, అమెరికా మొహం వాచి చూస్తున్నవాటిని మనం ఏమీ అమెరికాకు ఎగుమతి చేయడం లేదు. చైనా వద్ద రేర్ ఎర్త్ ఖనిజాలు, లోహాలు ఉన్నాయి. మనకి లేవు! కనుక, బేరసారాలకి మనకున్న అవకాశం తక్కువ. మనకున్న ఆశ ఒక్కటే! ఉక్రెయిన్పై పుతిన్–ట్రంప్ ఒక ఒప్పందానికి రాగలిగితే, అది మనపై విధించిన సెకండరీ ఆంక్షలను ఎత్తివేయడానికి తోడ్పడవచ్చు. అమెరికా దృష్టిలో భారత్ ఇప్పటికీ ఉందని స్కాట్ బిసెంట్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అనుకున్నట్లు జరగకపోతే ట్రంప్ తీవ్ర ఆగ్రహ జ్వాలలకు మనం గురికావాల్సిందే!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్

ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్
ఢిల్లీ: ఎన్టీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగి సీపీ రాధాకృష్ణన్ను ఎంపిక చేశారు. ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్.. స్వస్థలం తమిళనాడు. సీపీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ అనంతరం సీపీ రాధాకృష్ణన్ ఎంపికపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మీడియాకు స్పష్టం చేశారు. ఎన్డీఏ పక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థి బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ సభ్యులు భారత ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సమతుల్యత పాటించింది కేంద్రం. రాష్ట్రపతి ముర్ము ఉత్తరాది వాసి కాగా, ప్రస్తుతం ఎంపిక చేసిన ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్ దక్షిణాది వాసి. ఇదిలా ఉంచితే, ఆగస్టు 21తో నామినేషన్ల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్డీఏ తమ అభ్యర్థిని ముందుగా ప్రకటించింది. ఇక సెప్టెంబర్ 9వ తేదీ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగనుంది.కాగా, సీపీ రాధాకృష్ణన్.. బీజేపీ నాయకుడు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచారు. తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా సేవలందించారాయన. 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్గా బాద్యతలు నిర్వర్తించారు. తెలంగాణ గవర్నర్గా పనిచేసిన తమిళిసై సౌందరరాజన్.. 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సీపీ రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలును అప్పగించారు. 2024 జులై 31 వరకు తెలంగాణ గవర్నరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2024 ఆగస్టు 06 వరకు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. ఆపై మహారాష్ట్ర గవర్నర్గా ఎంపికయ్యారు.

అలీసా అదరహో
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్లో అదరగొట్టింది. గత మ్యాచ్లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్లో ఫోర్తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది

Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధానికి తెర!
న్యూయార్క్: ఉక్రెయిన్లో శాంతిస్థాపనకు అమెరికా, ఐరోపా సమాఖ్య చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్వీయ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రష్యా విషయంలో భారీ పురోగతి సాధించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్కు నాటో కూటమి తరహాలో అమెరికా, ఈయూ ‘రక్షణ హామీ’ ఇచ్చినా అభ్యంతరం లేదని పుతిన్ చెప్పారు. మొత్తం ప్రక్రియలో ఇదొక కీలక మలుపు. ఇకపై ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించబోమని హామీ ఇచ్చారు. రష్యాతో విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకోనున్నాం. నాటో కూటమికి గుండెకాయ అయిన క్లాజ్–5 తరహాలో ఉక్రెయిన్కు రక్షణ ఆఫర్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయతి్నస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఉక్రెయిన్ నాటోలో చేరొద్దనేదే పుతిన్ ప్రధాన అభ్యంతరం. కనుక ట్రంప్ ఆఫర్ సమస్య పరిష్కారం చూపుతుంది. ప్రక్రియ సజావుగా సాగడానికి సమయం పట్టొచ్చేమో గానీ కచి్చతంగా శాంతి నెలకొంటుంది. మూడున్నరేళ్ల యుద్ధానికి తెర పడుతుంది’’ అన్నారు. 5వ క్లాజ్ ప్రకారం 32 నాటో దేశాల్లో దేనిపై శత్రువు దాడి చేసినా అన్ని దేశాలపై ఉమ్మడి దాడిగా పరిగణించి ప్రతి దాడికి దిగుతాయి.నేడు ట్రంప్–జెలెన్స్కీ భేటీ ట్రంప్ సోమవారం జెలెన్స్కీతో వైట్హౌస్లో భేటీ కానున్నారు. పుతిన్తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొంటారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు.డోన్బాస్ ఇచ్చేయండి డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారొచ్చన్నది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది.

ఎయిమ్స్ను వీడుతున్న వైద్యులు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ తీవ్ర అనారోగ్యంతో ఉంది. ఒకప్పుడు ఇందులో చేరడానికి వైద్యులు పోటీపడ్డ సంస్థను ఇప్పుడు వైద్యులు వీడుతున్నారు. ఎంతో ప్రతిష్ట ఉన్న సంస్థ. ఆ సంస్థతో అంతే విడదీయలేని అనుబంధం. కొంతమంది డాక్టర్లయితే.. వారి పేరుతో కాకుండా.. ఎయిమ్స్తోనే గుర్తింపు. అలాంటి గుర్తింపును కూడా ఎందుకు వదులుకొంటున్నారు? పేగుబంధం లాంటి అనుబంధాన్ని తెంచేసుకుంటున్నారు? ఇటీవల పార్లమెంటుకు ప్రభుత్వం ఇచ్చిన నివేదిక చెప్పిన సత్యాలేంటో చూద్దాం. ఢిల్లీ ఎయిమ్స్ నుంచే ఎక్కువగా... దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ల్లో 429 మంది రాజీనామా చేశారు. 2022 నుంచి 2024 మధ్య రెండేళ్ల కాలంలోనే, రాజీనామాలు సంభవించాయి. ఢిల్లీలోని ఎయిమ్స్ నుంచి అత్యధికంగా 52 మంది వైద్యులు రాజీనామా చేసి వెళ్లిపోయారు. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితం కాలేదు. రిషికేశ్లో 38 మంది, రాయ్పూర్లో 35, బిలాస్పూర్లో 32, మంగళగిరిలో 30 మంది, భోపాల్లో 27 మంది వైద్యులు రాజీనామా చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్లో 1,000 మందికంటే ఎక్కువ మంది అధ్యాపకులు, విభాగాధిపతులు, కేంద్రాల అధిపతులు, సీనియర్ ప్రొఫెసర్లు ఉన్నారు. అయితే.. ఇక్కడ జరిగిన రాజీనామాలలో ఎక్కువ భాగం ఉన్నత స్థాయిలోనే జరిగాయి. అత్యున్నత స్థాయివారే అత్యధికం.. రాజీనామా చేసినవారిలో మాజీ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా వంటి ప్రముఖులు ఉండటం గమనార్హం. ఆయన వీఆర్ఎస్ తీసుకుని గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శివ్ చౌదరి రాజీనామా చేసి ఫోర్టీస్ ఎస్కార్ట్లో చేరారు. న్యూరోసర్జరీ విభాగాధిపతి డాక్టర్ శశాంక్ శరద్ కాలే అపోలోకు మారారు. రాజీనామా చేసిన ప్రముఖుల్లో ఈఎన్టీ విభాగం, నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్ మాజీ అధిపతి డాక్టర్ అలోక్ టక్కర్, రోటరీ కేన్సర్ హాస్పిటల్ అనస్థీషియాలజీ అధిపతి డాక్టర్ సుష్మా భటా్నగర్, న్యూరాలజీ విభాగం మాజీ అధిపతి, న్యూరోసైన్సెస్ సెంటర్ చీఫ్ డాక్టర్ పద్మ శ్రీవాస్తవ, ఆర్థోపెడిక్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ రాజేష్ మల్హోత్రా కూడా ఉన్నారు. వీరంతా ఎయిమ్స్లోనే ఎదిగి, 3 దశాబ్దాలకు పైగా ఇక్కడే సేవలందించడం గమనార్హం. అపనమ్మకం.. అసమర్థత... ఢిల్లీలోని ఎయిమ్స్ అంటే.. తక్కువ ఖర్చుతో అత్యున్నతమైన వైద్యం అందుతుందనే అపారమైన నమ్మకం ఉంటుంది. అందుకే.. ఇప్పటికీ ప్రతిరోజూ వేలాది మంది రోగులు వస్తుంటారు. అలాంటి సంస్థ చిత్రం మొత్తం మారిపోయింది. సరైన నాయకత్వం లేకపోవడం నిర్వహణ అస్తవ్యస్థంగా మారింది. అపాయింట్మెంట్ల కోసం గంటల తరబడి క్యూలు, శస్త్రచికిత్సల కోసం నెలలపాటు సుదీర్ఘ నిరీక్షణలు సర్వసాధారణం అయ్యాయి. ఇప్పుడు వ్యవస్థ మొత్తం నిత్యం ఒత్తిడిలో ఉంటోంది. గతంలో ఎయిమ్స్ డైరెక్టర్ అంటే.. గొప్ప గౌరవం. కానీ ఇప్పుడు అపనమ్మకం, అసమర్థతతో కూడిన వాతావరణాన్ని సృష్టించారు. ఇక విభాగాధిపతులైతే తమ శాఖలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. వారి ప్రతిపాదనలన్నీ కాగితాలపైనే నిలిచిపోతున్నాయి. రోజువారీ పనితీరు కూడా కష్టమవ్వడం వల్లే ఎయిమ్స్ను వీడామని పలువురు చెబుతున్నారు. రోటరీ హెడ్షిప్ విధాన అమలే లేదు.. ఇక్కడ మరో వివాదాస్పద అంశం రోటరీ హెడ్షిప్ విధానం. రోటరీ హెడ్షిప్ అనేది వైద్య కళాశాల విభాగాల అధిపతులను రొటేషన్ పద్ధతిలో నియమించే విధానం. దీని ప్రకారం, ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి, ఒక అధ్యాపకుడు ఆ విభాగానికి అధిపతిగా ఉంటారు. ఆ తర్వాత మరొకరు ఆ స్థానాన్ని తీసుకుంటారు. అధ్యాపకులందరికీ నాయకత్వ అవకాశం కల్పించడం, వారి అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా దీన్ని రూపొందించారు. ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలలో అమలు చేసే వ్యవస్థ. ఢిల్లీలోని ఎయిమ్స్, చండీగఢ్లలోని పీజీఐఎంఈఆర్లో దీనిని అమలు చేయాలని 2023లో కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 2024 జూన్ వరకు గడువు విధించింది. అయినా ఈ విధానం అమలు కాలేదు. రాజకీయాలతో విశ్వసనీయతకు మచ్చ.. ఎయిమ్స్తో 30 నుంచి 35 ఏళ్ల అనుబంధం కలిగి ఉండి కూడా.. జరుగుతున్న నష్టాన్ని చూస్తూ భరించలేక వీడామని సీనియర్లు అంటున్నారు. నిబద్ధతతో ఉన్న వైద్యులపై రాజకీయాలు చేయడం, తక్కువ అనుభవం ఉన్నవారికి సంస్థలో నిర్ణయాధికారాలు కట్టబెట్టే ధోరణి సీనియర్లకు ఇబ్బందికరంగా మారింది. తప్పని పరిస్థితుల్లోనే అంత గొప్ప సంస్థను వీడామంటున్నారు. తాము వేతనాలకోసమే అయితే ఎప్పుడో వెళ్లిపోయేవారమని, ఇన్ని దశాబ్దాల తరువాత సంస్థను వీడాల్సి రావడానికి సంస్థలో రాజకీయాలే కారణమని చెబుతున్నారు. ఈ సామూహిక వలసలతో సీనియర్ స్థాయి వైద్యుల కొరత ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువ మంది అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో నిండిపోయింది. ఇది ఎయిమ్స్ ఢిల్లీ వంటి ప్రఖ్యాత వైద్య సంస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవత్తుతోంది.సౌకర్యాల కొరతతో పోస్టులు ఖాళీ.. ఎయిమ్స్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ సరిపోను క్వార్టర్స్ ఉండటం లేదు. కనెక్టివిటీ తక్కువగా ఉంటోంది. దగ్గరలో ఉన్నతస్థాయి పాఠశాలు ఉండటం లేదు. షాపింగ్ కాంప్లెక్సులు సరికదా.. చివరకు ఇంటర్నెట్ సౌకర్యంగా కూడా సరిగా ఉంటం లేదు. ఇక వీరు ఉంటున్న ప్రాంతాలు టైర్–3 నగరాలుగా గుర్తించి హోమ్ అలవెన్స్ తక్కువగా ఇస్తున్నారు. ఈ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితం లేదు. దీంతో ఇక్కడికి రావడానికి వైద్యులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రాయ్బరేలిలో 201 ఫ్యాకల్టీ పోస్టులకు 88 భర్తీ కాలేదు. జమ్మూలోని ఎయిమ్స్లో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో 183కి గాను 68 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెండు మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయడం లేదు. గత మూడేళ్లలో ఒక్క ఢిల్లీలోని ఎయిమ్స్లోనే 1,191 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 827 భర్తీ అయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా 2023–24లో 1,207 పోస్టులు మంజూరు కాగా, 850 భర్తీ అయ్యాయి. 2024–25లో 1,235 పోస్టులు మంజూరు కాగా, 803 భర్తీ అయ్యాయి. 2025–26 సంవత్సరానికి 1,306 పోస్టులు మంజూరు కాగా, 844 భర్తీ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12 ఎయిమ్స్ల్లో సగానికి పైగా ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉండటం గమనార్హం.

కుక్క కథ
కుక్కల మీద మనిషికి ఎప్పుడూ సదభిప్రాయం ఉన్నట్టు లేదు. ‘కుక్క’ అనే మాటనే తిట్టుగా వాడగలడు. కుక్క బుద్ధి అని నిందించగలడు. కుక్కల కొట్లాట అని దూషించగలడు. కుక్క బతుకు అని బాధపడగలడు. కుక్క మూతి పిందెలు అని తూలనాడగలడు. కుక్క కాటుకు చెప్పుదెబ్బ అని దెప్పిపొడవగలడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడి అని వెక్కిరించగలడు. ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి’ అని పాడగలడు. ఆఖరికి కుక్క చావును తనకు ఇష్టంలేని మనిషి జీవితయాత్రకు భరత వాక్యంగా జోడించగలడు.కుక్కలను వాటిమానాన వాటిని అడవిలో మననీయకుండా ఇంటిదాకా తెచ్చుకున్నది మనిషే. సుమారు 15,000 సంవత్సరాల క్రితమే మనిషి దాన్ని మచ్చిక చేసుకున్నాడు. మానవులు తొట్టతొలిగా మచ్చిక చేసుకున్న జంతువు కుక్కేనంటారు. కాదు, గొర్రె అని మరో వాదన. ఏమైనా మనిషితో తొట్టతొలిగా స్నేహం చేసిన జంతువుల్లో కుక్క అగ్రభాగాన ఉందన్నది సత్యం. అప్పటినుంచీ అది మనిషికి వేటలో సాయపడింది. పంటలను కాపు కాసింది. మంచులో స్లెడ్జ్ బళ్లను లాగింది. దొంగలు, హంతకుల జాడను పసిగట్టింది. బాంబులను గుర్తించింది. ఒంటరి జీవులకు తోడుగా నిలిచింది. ‘దేవదాసు’లకు సాంత్వననిచ్చింది. తెగించి యజమానుల ప్రాణాలను కాపాడింది. మనిషి నాగరికతా ప్రస్థానంలో తనకు తెలియకుండానే విశ్వసనీయమైన పాత్రను పోషించింది. దాని తోక మాత్రమే వంకర కావొచ్చుగానీ దాని పనికి ఏ వంకా లేదు. అంతెందుకు! 1957లో రష్యన్లు ‘స్పుత్నిక్’లో తొట్టతొలిగా ఒక జీవిని అంతరిక్షంలోకి పంపాలనుకున్నప్పుడు వాళ్లు ఎంచుకున్నది కూడా ఒక కుక్కనే. అది మాస్కో వీధుల్లో తిరుగాడిన మూడేళ్ల ఆడ ఊరకుక్క. పేరు లైకా. అది ప్రాణాలతో తిరిగిరాదని దానికి తప్ప శాస్త్రవేత్తలందరికీ తెలుసు!జపాన్ లో హచికో కుక్కది మరో కథ. తన యజమాని టోక్యో యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవాడు. విధులు ముగించుకుని ఆయన సాయంత్రం షిబూయా రైల్వే స్టేషన్ లో రైలు దిగేవాడు. అప్పటికి రెండేళ్ల వయసున్న హచికో అతడి కోసం అక్కడ వేచివుండేది. ఒకరోజు ఉన్నట్టుండి ఆ ప్రొఫెసర్ విధుల్లోనే బ్రెయిన్ స్ట్రోక్తో కుప్పకూలి చనిపోయాడు. ఇదేమీ తెలియని హచికో రోజులాగే యజమాని కోసం స్టేషన్ కు వచ్చింది. తెల్లారీ వచ్చింది. మరునాడూ వచ్చింది. క్రమం తప్పకుండా వస్తూనే ఉంది, ఎదురుచూస్తూనే ఉంది. అప్పటికిగానీ స్థానికులు దాన్ని గుర్తించలేదు. తనని ప్రేమించిన యజమాని కోసం, తాను ప్రేమించిన యజమాని కోసం 1925– 1935 కాలంలో అది చనిపోయేదాకా సుమారు పదేళ్లపాటు ఆ స్టేషన్ లో ఎదురుచూసింది. జపాన్ లో ఇప్పుడు హచికో ఒక సాంస్కృతిక చిహ్నం. కుక్క అంటే విశ్వాసం అనే పేరు దానికి ఊరకే రాలేదు. వేల ఏళ్లుగా లక్షలాది కుక్కలు సమష్టిగా సముపార్జించుకున్న ఘనత అది.ప్రపంచంలో సుమారు 360 రకాల కుక్కలున్నాయి. వీటన్నింటినీ తిరిగి ఇంటికుక్క, ఊరకుక్క అని రెండు రకాలుగా విభజించవచ్చు. ఈ రెండింటికీ మధ్య ఉన్నది స్వల్ప భేదమే. ఇది జాతిపరమైనది కాదు. పెంచుకుంటే ఇంటి కుక్క. ఎవరికీ పట్టనిది ఊర కుక్క. ‘మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు, కుక్కను మనిషి కరిస్తే వార్త’ అని జర్నలిజంలో ఒక తొలి పాఠం చెబుతుంటారు. కానీ మనుషులను కుక్క కరిచినా వార్త అవుతుండటం కుక్క కాట్ల తీవ్రతను తెలియజేస్తోంది. ఇది అత్యంత ఆందోళనకరంగా పరిణమించడం వల్లే ఊరకుక్కలను ఊళ్లో ఉంచాలా వద్దా అనే చర్చ దేశమంతా నడుస్తోంది; వాటికి అనుగుణంగా, వ్యతిరేకంగా ఎన్నో వాదనలు వినబడుతున్నాయి.జాక్ లండన్ రాసిన ‘కాల్ ఆఫ్ ద వైల్డ్’ నవలలోని బక్ కుక్క ‘దుడ్డుకర్ర చేతగలవాడిది పైచేయి’ అని ఇట్టే అర్థం చేసుకుంటుంది. ఆ పాఠాన్ని జీవితంలో ఎన్నడూ మరవదు. మనిషి సాధారణంగా ద్వంద్వ జీవి. దుడ్డుకర్రతో కుక్కలకు ‘ఆటవిక శాసనాన్ని’ పరిచయం చేయగలడు; లైకా అంతరిక్షంలో విలవిల్లాడి చచ్చిపోయిందంటే జీర్ణం చేసుకోలేక దాన్ని గ్రహాంతరవాసులు కాపాడినట్టు ప్రత్యామ్నాయ సాహిత్యాన్ని సృజించుకోగలడు (ఉదా: జూలియన్ మే రాసిన ‘ఇంటర్వెన్షన్ ’). ‘పాతాళ్ లోక్’ వెబ్సిరీస్లో హథోడా త్యాగీకి తన గురువు ఒక మాట చెబుతాడు: ఒక మనిషి మంచివాడా కాదా అన్నది తెలుసుకోవడానికి అతడు కుక్కలతో ఎలా ఉంటున్నాడో చూడమంటాడు. దేశంలో సుమారు ఆరు కోట్ల ఊరకుక్కలున్నాయట. మనం వద్దనగానే అవి మాయం కావు. ఈ భూమ్మీది నుంచి ఎక్కడికీ పోవు. వాటిని మననిస్తూ, మనం ఇబ్బందిపడకుండా ఏ శాస్త్రీయ మార్గాలున్నాయో అన్వేషించడమే ఉత్తమ మార్గం. ప్రతి కుక్కకూ ఒక రోజంటూ ఉండాలిగా!

ఆందోళనకరంగా ఆత్మహత్యలు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అత్యధికంగా ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండటం గమనార్హం. దేశంలో 2018 నుంచి 2022 వరకు నమోదైన ఆత్మహత్యల వివరాలను నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో 2018లో 7,845 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2019లో 7,675, 2020లో 8,058, 2021లో ఏకంగా 10,171 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2022లో ఆ సంఖ్య 9,980గా నమోదైంది. ఐదేళ్లలో 43,729 మంది ఆత్మహత్యలు చేసుకోగా ఏటా సగటున 8,746 మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. వీరిలో ఆర్థిక, కుటుంబ సమస్యలతో పాటు వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్న విద్యార్థులు, యువత, నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సమాధానమిచ్చింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దేశంలోని తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో తెలంగాణతో పాటు కేరళ, తమిళనాడు కూడా ఉండడం గమనార్హం. కాగా 2023 నుంచి 2025 వరకు జరిగిన ఆత్మహత్యల వివరాలను ఎన్సీఆర్బీ వెల్లడించలేదు. దేశంలో ఐదేళ్లలో 7.62 లక్షల ఆత్మహత్యలు ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 1,34,516 ఆత్మహత్యలు (రేటు 10.2) నమోదు కాగా, 2022లో ఆ సంఖ్య 1,70,924 (రేటు 12.4)గా నమోదైంది. ఆందోళనకర స్థాయిలో ఈ ఐదేళ్లలో మొత్తం 7,61,648 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. అంటే దేశంలో లక్ష జనాభాకు సగటున 11.26 రేటుతో ఆత్మహత్యలు నమోదయ్యాయన్న మాట. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకొని లెక్కలేస్తే సిక్కిం రాష్ట్రంలో అత్యధికంగా ఐదేళ్లలో సగటున 37.5 రేటు నమోదైంది. 26.42 రేటుతో ఛత్తీస్గఢ్ తర్వాతి స్థానంలో ఉంది. మూడో స్థానంలో కేరళ (25.44)ఉండగా, నాలుగో స్థానంలో (23.3) తెలంగాణ, ఐదో స్థానంలో తమిళనాడు (21.8) ఉన్నాయి. నిరుద్యోగం, కుటుంబ సమస్యలూ కారణం.. నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిడి ఆత్మహత్యలకు ప్రధాన కారణాలుగా గుర్తించగా.. పంటలు సరిగా పండక పోవడం వల్ల రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. మానసిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్న వారి సంఖ్య కూడా దేశంలో ఏయేటికాయేడు పెరుగుతోంది. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడిన వారి సంఖ్య 2018లో 10,134 మంది ఉంటే 2022లో ఆ సంఖ్య 14,600గా నమోదైంది. తెలంగాణలో ఐదేళ్లలో 2,590 మంది మానసిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడినట్లు ఎన్సీఆర్బీ తెలిపింది. కాగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్లలో ఆత్మహత్యల రేటు అధికంగా ఉండగా, లక్షద్వీప్లో అతి తక్కువగా నమోదైంది. ఆత్మహత్య ఆలోచనల నుంచి మళ్లిస్తున్న టెలి మానస్ చిన్న సమస్యను సైతం పెద్దగా ఆలోచించి ఆత్మహత్య వైపు అడుగువేసే ధోరణి పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యను నివారించేందుకు వీలుగా 2022 అక్టోబర్లో ‘నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రాం (టెలి–మానస్)’ను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 53 టెలి మానస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. మొబైల్ యాప్, వీడియో కన్సల్టేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలోని ఎర్రగడ్డ మానసిక వైద్య ఆసుపత్రిలో మానస్ కేంద్రం ఏర్పాటు చేయగా, ఈ కేంద్రానికి ఇప్పటివరకు 1,61,477 ఫోన్కాల్స్ వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఫోన్ రాగానే మానసిక నిపుణులు బాధితుడికి కౌన్సెలింగ్ ఇచ్చి, ఆత్మహత్య ఆలోచనల నుంచి దూరం చేస్తున్నట్లు వివరించింది. దేశ వ్యాప్తంగా 53 టెలీ మానస్ కేంద్రాలకు ఇప్పటి వరకు 24.52 లక్షల కాల్స్ను వచ్చాయి.
21న ఓయూకు సీఎం రేవంత్రెడ్డి
రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి డ్రామాలా?
లీజుకు ఆర్టీసీ భూములు
‘స్పిన్ సవాలు ఎదుర్కోవాల్సిందే’
ఛెత్రికి తలుపులు తెరిచే వున్నాయి
గుకేశ్పైనే దృష్టి
‘మళ్లీ సత్తా చాటుతాం’
హ్యూమనాయిడ్ రోబోలు ఆటగాళ్లు.. అమ్మలు..
డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తి
అలీసా అదరహో
పల్లెవెలుగు బస్సులకూ వర్తించని ‘స్త్రీ శక్తి’
'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు
ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
ఈ రాశి వారికి భూలాభాలు.. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు
ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్లకు నో ఛాన్స్!
బంధువుల పెళ్లిలో రమేశ్ బాబు కుటుంబం (ఫొటోలు)
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మనమెందుకు భుజాలు తడుముకోవాలి.. అననివ్వండి సార్!!
అందుకే నో కిస్ నిబంధనలను వదిలేశాను: తమన్నా
సృష్టి కేసులో మరో ట్విస్ట్.. అసలు పేరు నీరజ.. 1988 బ్యాచ్తో కలిసి..
1 నుంచి నెలవారీ రేషన్ కోటా
పెళ్లయి 8 ఏళ్లు.. బుల్లితెర జంటకు పేరెంట్స్గా ప్రమోషన్
నాగార్జున, చిరంజీవితో చేసిన హీరోయిన్.. ఈమెని గుర్తుపట్టారా?
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
జీవితంలో ముందడుగు వేశా.. దీప్తి సునయన (ఫోటోలు)
నువ్విచ్చిన కాఫీలో షుగర్ తక్కువైంది! భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తా!
21న ఓయూకు సీఎం రేవంత్రెడ్డి
రాజ్యాంగ స్ఫూర్తిని ధ్వంసం చేసి డ్రామాలా?
లీజుకు ఆర్టీసీ భూములు
‘స్పిన్ సవాలు ఎదుర్కోవాల్సిందే’
ఛెత్రికి తలుపులు తెరిచే వున్నాయి
గుకేశ్పైనే దృష్టి
‘మళ్లీ సత్తా చాటుతాం’
హ్యూమనాయిడ్ రోబోలు ఆటగాళ్లు.. అమ్మలు..
డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తి
అలీసా అదరహో
పల్లెవెలుగు బస్సులకూ వర్తించని ‘స్త్రీ శక్తి’
'కూలీ'తో సక్సెస్.. కాస్ట్లీ కారు కొన్న నటుడు
ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు
ఈ రాశి వారికి ఆప్తుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం
ఈ రాశి వారికి భూలాభాలు.. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు
ఆసియా కప్-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్లకు నో ఛాన్స్!
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మనమెందుకు భుజాలు తడుముకోవాలి.. అననివ్వండి సార్!!
అందుకే నో కిస్ నిబంధనలను వదిలేశాను: తమన్నా
సృష్టి కేసులో మరో ట్విస్ట్.. అసలు పేరు నీరజ.. 1988 బ్యాచ్తో కలిసి..
1 నుంచి నెలవారీ రేషన్ కోటా
పెళ్లయి 8 ఏళ్లు.. బుల్లితెర జంటకు పేరెంట్స్గా ప్రమోషన్
నాగార్జున, చిరంజీవితో చేసిన హీరోయిన్.. ఈమెని గుర్తుపట్టారా?
అమాంతం ఎగిసిన షేర్లు.. ‘ప్లాన్’గా అమ్మేసిన సీఈవో
సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
అల్లుడితో అత్త వివాహేతర సంబంధం..!
కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో కూడా స్ట్రీమింగ్
ఇందులో తప్పేముంది సార్! పొద్దున లేచినప్పటి నుంచి మీరు చేసేది అదేగా సార్!!
నువ్విచ్చిన కాఫీలో షుగర్ తక్కువైంది! భారత్పై మరిన్ని సుంకాలు విధిస్తా!
సినిమా

ఆ సినిమా.. క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు: టాలీవుడ్ నిర్మాత
పాన్ ఇండియా స్థాయికి మన ఇండస్ట్రీ ఎదిగిపోయింది అని అనుకుంటున్నాం కానీ నిర్మాతల పరిస్థితి ఘోరంగానే ఉంది. ఒకప్పటితో పోలిస్తే సినిమాల్లో సరైన కంటెంట్ ఉండట్లేదు. దీంతో ప్రేక్షకులు కూడా థియేటర్లకు వచ్చి చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. దానికి తోడు స్టార్ హీరోలు కూడా రీమేక్స్ చేయడం, అవి డిజాస్టర్ కావడం అడపాదడపా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఓ నిర్మాత.. తను తీసిన ఓ రీమేక్ వల్ల ఎదురైన అనుభవాన్ని బయటపెట్టారు.అప్పట్లో దూకుడు, లెజెండ్, వన్ నేనొక్కడినే తదితర సినిమాలు తీసిన అనిల్ సుంకర.. గత కొన్నాళ్లలో మాత్రం ఘోరమైన నష్టాల్ని చవిచూశారు. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ తదితర చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. ఈయనకు నష్టాల్ని మిగిల్చాయి. ప్రస్తుతం నిర్మాణాన్ని పక్కనబెట్టి 'షో టైమ్' పేరుతో ఓ రియాల్టీ షో తీస్తున్నారు. దీని లాంచ్ శనివారం జరగ్గా.. ఇందులోనే మాట్లాడుతూ చిరంజీవితో తీసిన 'భోళా శంకర్' గురించి పరోక్షంగా కామెంట్ చేశారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ) 'ఏదైనా ఫ్లాప్ సినిమా రాగానే అసలు కథ వినే తీశారా? అని నన్ను అడుగుతుంటారు. కథలు వినకుండా మూవీస్ ఎందుకు చేస్తారు అని కూడా అడుగుతారు. ఓసారి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్తే.. అక్కడ పనిచేస్తున్న ఓ క్లర్క్ నన్ను చూసి జాలిపడ్డాడు. ఎందుకండీ స్టోరీ లేని సినిమాలు చేస్తున్నారు అని అన్నాడు. నేను తీసింది రీమేక్ అని చెప్పినా అతడికి అర్థం కాలేదు. రీమేక్ ఆడలేదు నేనేం చేస్తాను? అని చెప్పాను. ఈ పాటికే మీకు సినిమా ఏంటనేది అర్థమై ఉంటుంది కదా!' అని తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని బయటపెట్టారు.మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'లో చిరంజీవి హీరోగా నటించారు. అనిల్ సుంకర నిర్మించారు. తమిళంలో హిట్ అయిన 'వేదాళం' అనే మూవీ రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. అయితే రిలీజ్కి ముందే విమర్శలు ఎదుర్కొన్న 'భోళా శంకర్'.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మరిన్ని ట్రోల్స్కి గురైంది. చిరంజీవి ఇలాంటి మూవీ ఎందుకు చేశారా? అని అందరూ మాట్లాడుకున్నారు. అలాంటిది ఇప్పుడు స్వయంగా నిర్మాతనే పరోక్షంగా ఈ సినిమాని మరోసారి గుర్తుచేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: కోకాపేటలో ఇల్లు కొన్న బేబక్క.. పిల్లి కోసం స్పెషల్గా..)

ఎందుకంత ఏడుపు? కుక్కలనే పెళ్లి చేసుకోవచ్చుగా!: ఆర్జీవీ
ఢిల్లీ వీధుల్లో శునకాలు కనిపించకూడదని సుప్రీంకోర్టు ఆగస్టు 11న తీర్పు వెలువరించింది. 8 వారాల్లోగా కుక్కలన్నింటినీ షెల్టర్లకు తరలించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని ఎవరు అడ్డుకున్నా తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ తీర్పును జంతుప్రేమికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూగజీవాలపై దయ చూపించాలని కోరుతున్నారు. తీర్పు వెనక్కు తీసుకోవాలని హీరోయిన్ సదా, జాన్వీ కపూర్, సోనాక్షి సిన్హ.. ఇలా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకుంటున్నారు.కుక్క కోసం కన్నీళ్లా?సదా అయితే శునకాలను చంపేస్తారు, ఏం చేయాలో తెలియట్లేదు దేవుడా.. అంటూ బోరున ఏడ్చేసింది. ఇలాంటివారిపై దర్శకుడు రామ్గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనుషులు చనిపోతే పాపం అనట్లేదుకానీ కుక్కల కోసం కన్నీళ్లు కారుస్తున్నారా? అని మండిపడ్డాడు. అదే సమయంలో జంతుప్రేమికులకు ఇవే నా సలహాలు అంటూ సెటైరికల్ ట్వీట్ చేశాడు.🐶 పేద ప్రజలను దత్తత తీసుకుని వారిని మీ ఇంట్లో ఉంచుకోండి. అన్ని వీధులను కుక్కలకు వదిలేయండి.🐶 శునకాలు మీ కుటుంబసభ్యులైతే వాటినే పెళ్లి చేసుకోవచ్చుగా!🐶 శునకాల జనాభా నియంత్రణకు బదులు వాటిపై మీ ప్రేమను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుందిగా!🐶 మీ పిల్లల్ని వీధి కుక్కలతో ఆడుకునేందుకు పంపించండి.🐶 వీధుల్లో శునకాలు స్వేచ్ఛగా తిరగాలంటున్నారు. మరి మీ బ్రీడ్ డాగ్స్ను కూడా వీధుల్లో ఉండనివ్వండి. ఏసీ గదుల్ని వదిలేసి అవి వీధుల్లో ఎలా మనుగడ సాగిస్తాయో చూద్దాం.🐶 పిల్లలతో సమానంగా కుక్కలకూ సమానహక్కులు ఉన్నాయంటున్నారు. అలాంటప్పుడు డాగ్స్ కోసం పాఠశాలలు, పిల్లల కోసం బోన్లు నిర్మించండి.🐶 మీరెప్పుడైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్కు వెళ్లొద్దు, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోండి.🐶 మీరు ఏసీ గదుల నుంచి బయటకు వచ్చేసి వీధి కుక్కల్ని ఆ గదుల్లో నిద్రపోనివ్వండి.🐶 మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తున్నారు. కాబట్టి గుడిలో దేవుళ్ల స్థానంలో కుక్కలను పెట్టండి. మోక్షం కోసం వాటినే ప్రార్థించండి.🐶 'కుక్కలను దత్తత తీసుకోండి- పిల్లల్ని చంపండి' పేరిట ఓ ఫౌండేషన్ ప్రారంభించండి.🐶 వీధికుక్కలు నిరుపేదలపైనే దాడి చేస్తుంటే.. మురికివాడలో ఉన్నవాళ్లందరినీ మీ విల్లాలోకి పంపించండి. మీ బ్రీడ్ శునకాలను వీధుల్లో కాపలాగా పెట్టండి.🐶 పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల్ని ఎవరైనా చంపేస్తే వాటికోసం సంతాపసభ నిర్వహించండి. HERE are some FANTASIC SOLUTIONS for DOG LOVERS regarding their Mmmmuuuaahhh for STREET DOGS 1.Why don’t you adopt all the poor people and bring them into your homes and leave the streets for the dogs?2.If dogs are like your family, then why not marry your Labradors, Huskies…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025Here are my 10 points addressing the DOG LOVERS who are UPSET about the SUPREME COURT’S decision on STRAY DOGS 1. People are being bitten and killed all over by stray dogs. And dog lovers are busy tweeting about dog rights.😳https://t.co/9RLkoJdqOE can love your pets in your…— Ram Gopal Varma (@RGVzoomin) August 16, 2025చదవండి: అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున

‘నీకు కూతురు ఉందా? ‘పెద్దమనిషి’ అయిందా?’ అని అడిగేవాళ్లు.. : సౌమ్య రావు
చిత్ర పరిశ్రమ అనేది రంగుల ప్రపంచం. బయటకు మాత్రం అందంగానే కనిపిస్తుంది. కానీ లోపలకు తొంగి చూస్తే.. అక్కడ కూడా కష్టాలు, బాధలు ఉంటాయి. తెర ముందు ముఖానికి రంగు వేసుకొని జనాలకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న చాలా మంది నటీనటులు తెర వెనుక చాలా కష్టాలను అనుభవించినవాళ్లే. తినడానికి తిండిలేని పరిస్థితులను ఎదుర్కొని ఉన్నవాళ్లు చాలా మందే ఇండస్ట్రీలో ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ నటి, యాంకర్ సౌమ్యరావు(Sowmya Rao) కూడా ఒకరు. ‘జబర్దస్త్’ షో ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ కన్నడ బ్యూటీ.. రియల్ లైఫ్లో చాలా కష్టాలను అనుభవించింది. తినేందుకు తిండిలేక పస్తులు ఉన్న రోజులు కూడా చాలానే ఉన్నాయట. తాజాగా ఓ టీవీ చానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను పడిన కష్టాలను చెబుతూ సౌమ్య ఎమోషనల్ అయింది.అప్పుల బాధలు తట్టుకోలేక.. నా చిన్నప్పుడు నాన్న బాగా అప్పులు చేశాడు. ఆ డబ్బుతో ఏం చేశాడో తెలియదు కానీ అప్పు ఇచ్చిన వాళ్లంతా మా ఇంటికి వచ్చి గొడవ చేసేవాళ్లు. నాన్న చేసిన అప్పులకు అమ్మ మాటలు పడాల్సి వచ్చేంది. కొంతమంది అయితే వల్గర్గా మాట్లాడేవాళ్లు. ‘నీకు కూతురు ఉందా? పెద్దమనిషి అయిందా?’ అంటూ అసభ్యకరంగా మాట్లాడేవాళ్లు. వారి బాధలు తప్పుకోలేక ఓ రోజు రాత్రి మా అమ్మ నన్ను, బ్రదర్ని తీసుకొని తిరుపతి వచ్చింది. అప్పుడు అమ్మ చేతిలో కేవలం రూ. 100 మాత్రమే ఉన్నాయి. రాత్రంతా బస్టాండ్లో నిద్రపోయాం. ఉదయం గుడిలో పెట్టే అన్న కోసం చాలా ఎదురు చూశాం. దేవుడి దర్శనం కంటే అక్కడ పెట్టే అన్నంపైనే మా దృష్టి ఉండేది. మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే.. చుట్టు పక్కల వాళ్లు తలుపులు వేసుకునేవాళ్లు. ఎందుకంటే చుట్టాలకు టీ లేదా అన్నం పెట్టాలన్నా.. పక్కింటివాళ్లనే అడిగేవాళ్లం. అందుకే బంధువులు వస్తే.. అంతా తలుపులు మూసుకునే వాళ్లు.టైపింగ్ నేర్పిస్తానంటూ మిస్ బిహేవ్ చేశాడునేను కాలేజీలో ఉన్నప్పటి నుంచే పార్ట్ టైం జాబ్ చేసేదాన్ని. అలా ఓ సారి ఓ లాయర్ దగ్గర పని చేశాను. ఆయన ఇంట్లోనే వర్క్ ఉండేది. పని కోసం వెళ్తే..ఆయన నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. టైపింగ్ నేర్పిస్తా అంటూ నాపై చేతులు వేసేవాడు. ఆయన భార్య, తల్లి బయటకు వెళ్లగానే నాతో మిస్ బిహేవ్ చేసేవాడు. నా పరిస్థితి ఆయనకు తెలుసు. దాన్న ఆయన అలుసుగా తీసుకున్నాడు. అందుకే మన కష్టాలను, బాధలను ఇతరులతో షేర్ చేసుకోవద్దు. మనకు కష్టం ఉంది, పరిస్థితి బాలేదు అని తెలిస్తే మనతో ఆడుకుంటారు.స్టార్ హీరో ఇంటర్వ్యూకి వెళ్తుండగా ప్రమాదంన్యూస్ రీడర్గా కన్నడలో నా కెరీర్ ప్రారంభం అయింది. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టపడ్డాను. ఒకేసారి మూడు చానళ్లలో పని చేశాను. ఒక రోజు ఒక పెద్ద హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నా కాలికి తీవ్రంగా గాయం అయింది. అందరూ ఆస్పత్రికి వెళ్దాం.. అంటే నేను షూట్కి వెళ్లాను. స్టూడియోలో నన్ను చూసి అందరూ భయపడ్డారు. కాలికి తీవ్రంగా గాయం అయిందని.. ముందు ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. కానీ నాకేమో నొప్పి కంటే ఎక్కువగా ఇంటర్వ్యూ మిస్ అయితే డబ్బులు రావు కదా అనే బాధే ఎక్కువగా ఉంది. నేను జీరో నుంచి వచ్చాను .అందుకే సెలెబ్రిటీ అనే ఫీలింగ్ నాకు ఉండదు. ఇప్పటికే ఏదైనా ఈవెంట్ ఉంటే ఆటోలో కూడా వెళ్తుంటాను’ అని సౌమ్యరావు చెప్పుకొచ్చింది.

ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్బస్టర్ మూవీ... తెలుగులోనూ
సాధారణంగా స్పోర్ట్స్ డ్రామా సినిమాలంటే అంతంత మాత్రంగానే వర్కౌట్ అవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రం బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. అలా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చిన ఓ హాలీవుడ్ మూవీ.. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్ని అలరించింది. రిలీజై దాదాపు నెలన్నర కావొస్తున్న ఇప్పటికీ ప్రేక్షకుల్ని రప్పిస్తోంది. అలాంటిది ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఎందులోకి రానుంది?హాలీవుడ్ సినిమాలు అప్పుడప్పుడు చూసినా సరే నటుడు బ్రాడ్ పిట్ కాస్త పరిచయం ఉండే ఉంటాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఎఫ్ 1'. కార్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కించగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తెలుగులోనూ రిలీజ్ చేయగా.. మన ఆడియెన్స్ కూడా చూసి ప్రశంసించారు. ఇప్పుడు ఈ చిత్రం ఆగస్టు 22 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీల్లో అందుబాటులోకి రానుంది.(ఇదీ చదవండి: సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు)'ఎఫ్ 1' విషయానికొస్తే.. ఫార్ములా వన్ రేసులో డ్రైవర్గా అదరగొట్టిన సన్నీ హెయస్ (బ్రాడ్ పిట్).. కెరీర్కి రిటైర్మెంట్ ఇచ్చి, వ్యాన్ డ్రైవర్ పనిచేస్తుంటాడు. అలా వయసు పైబడిన సన్నీకి ఏపీఎక్స్జీపీ (APXGP) అనే టీమ్లో రేసర్గా పనిచేయాలని అవకాశం ఇస్తారు. అయితే రేసింగ్ నుంచి తప్పుకొని చాలారోజులు అయిపోవడంతో సన్నీకి ఇప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా తన జట్టులోని యువకుడైన జోషువా పియర్స్ (డామ్సన్ ఐడ్రీస్) దూకూడు తట్టుకోవడం, అతడి నుంచి ఎదురైన అవమానాలు భరించడం కష్టంగా ఉంటుంది.అసలు స్పానిష్ గ్రాండ్ ప్రీ రేసింగ్ తర్వాత సన్నీ.. ఎందుకు రేసింగ్ నుంచి తప్పుకొన్నాడు? మళ్లీ ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పైకి వచ్చిన సన్నీకి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరకు విజేతగా నిలిచాడా లేదా అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఫహాద్ ఫాజిల్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)
క్రీడలు

డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తి
కోల్కతా: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడా వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడ్డ 80 ఏళ్ల వేస్ గురువారం కన్నుమూయగా... ఆదివారం కోల్కతాలోని సెయింట్ థామస్ చర్చ్లో జరిగిన ఆయన అంత్యక్రియల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సహా పలు క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. భారత హాకీకి ఆయన చేసిన సేవలకు గుర్తుగా... వేస్ పార్థీవ దేహానికి యువ ఆటగాళ్లు హాకీ స్టిక్లతో వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వేస్ కుమారుడు లియాండర్ పేస్ను గంగూలీ ఓదార్చాడు. మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రియన్తో పాటు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, హాకీ బెంగాల్, కోల్కతా క్రికెట్ క్లబ్, ఫుట్బాల్ క్లబ్ల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టులో వేస్ సభ్యుడు కాగా... ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వైద్యుడిగా భారత క్రీడారంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్, అఖిల భారత ఫుట్బాల్ సంఘం, భారత ఒలింపిక్ సంఘం, భారత డేవిస్ కప్కు వేస్ వైద్య కన్సల్టెంట్గా పనిచేశారు. వేస్ సేవలు వెలకట్టలేనివి: టిర్కీ హాకీ, రగ్బీ, ఫుట్బాల్, టెన్నిస్ ఇలా అనేక క్రీడల్లో ప్రవేశం ఉన్న వేస్... ఆ తర్వాతి కాలంలో భారతీయ క్రీడా వైద్యానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచారు. ‘వేస్ పేస్ లోటు పూడ్చలేనిది. ఆటతో సంబంధం లేకుండా భారతీయ క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ప్లేయర్గా, డాక్టర్గా, మెంటార్గా, కన్సల్టెంట్గా, క్రీడా పరిపాలకుడిగా ఆయన జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. జాతీయ శిబిరాల సమయంలో ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ప్లేయర్లతో పాటే ఉండి వారి బాగోగులు చూసుకునేవారు. 2004 ఎథెన్స్ ఒలింపిక్స్ సమయంలో ఆయన సేవలను దగ్గర నుంచి చూశా. ప్రస్తుతం క్రీడా రంగంలో వైద్యుల ప్రాధన్యత పెరిగింది. అవేవీ లేని సమయంలో ఆయనే అన్నీ అయి నడిపించారు’ అని టిర్కీ గుర్తుచేసుకున్నాడు. వేస్ది పూర్తి స్పోర్ట్స్ ఫ్యామిలీ అని... ఒకే కుటుంబం నుంచి వీస్ హాకీలో ఒలింపిక్స్ పతకం నెగ్గితే ఆయన కుమారుడు లియాండర్ పేస్ టెన్నిస్లో ఆ కల తీర్చుకున్నాడని.. వేస్ భార్య జెన్నిఫర్ భారత బాస్కెట్బాల్ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించారని టిర్కీ గుర్తు చేశాడు.

అలీసా అదరహో
బ్రిస్బేన్: ఆ్రస్టేలియా గడ్డపై ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల ‘ఎ’ జట్టు చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడి 2–1తో సిరీస్ ఖాతాలో వేసుకుంది. స్టార్ బ్యాటర్ అలీసా హీలీ (85 బంతుల్లో 137 నాటౌట్; 23 ఫోర్లు, 3 సిక్స్లు) విజృంభించడంతో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు అలవోకగా విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత ‘ఎ’ జట్టు 47.4 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ షఫాలీ వర్మ (59 బంతుల్లో 52; 7 ఫోర్లు) అర్ధశతకంతో మెరవగా... వికెట్ కీపర్ యస్తిక భాటియా (54 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. నందిని కశ్యప్ (53 బంతుల్లో 28; 2 ఫోర్లు), రాఘ్వీ బిస్త్ (32 బంతుల్లో 18; 2 ఫోర్లు), తనూశ్రీ సర్కార్ (22 బంతుల్లో 17), కెప్టెన్ రాధా యదవ్ (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగైన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. తేజల్ హసబ్నిస్ (1) విఫలమైంది. ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బౌలర్లలో తహిలా మెక్గ్రాత్ 40 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. సియానా జింజర్ 50 పరుగులిచ్చి 2 వికెట్లు, ఎల్లా హేవార్డ్ 43 పరుగులిచ్చి 2 వికెట్లు, అనిక లెరాయిడ్ 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు 27.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 222 పరుగులు చేసింది. హీలీ అజేయ శతకంతో చెలరేగగా... తహీలా విల్సన్ (51 బంతుల్లో 59; 8 ఫోర్లు) అర్ధశతకం సాధించింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ ఒక వికెట్ పడగొట్టింది. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి ఇక్కడే ఏకైక అనధికారిక టెస్టు మ్యాచ్ జరగనుంది.దంచికొట్టిన హీలీ..గాయం నుంచి కోలుకొని వచ్చిన అలీసా హీలీ... భారత ‘ఎ’ జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్లను సంపూర్ణంగా వినియోగించుకుంది. మొదట టి20 సిరీస్తో లయ అందుకున్న హీలీ... వన్డే సిరీస్లో అదరగొట్టింది. గత మ్యాచ్లో త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న అలీసా... ఈ మ్యాచ్లో అజేయ శతకంతో అదరగొట్టింది. 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హీలీ ఇచ్చిన క్యాచ్ను భారత ఫీల్డర్లు నేలపాలు చేయగా... దాన్ని వినియోగించుకున్న ఆస్ట్రేలియా సీనియర్ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బౌండరీలతో చెలరేగింది. రెండో ఓవర్లో ఫోర్తో మోత ప్రారంభించిన హీలీ... భారీ సిక్స్తో లక్ష్యఛేదనను పూర్తి చేసేంతవరకు అదే జోరు కొనసాగించింది. ఆంధ్రప్రదేశ్ బౌలర్ షబ్నమ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన హీలీ... మిన్ను మణి, తనూజ కన్వర్ ఓవర్లలో రెండేసి ఫోర్లు కొట్టింది. మరో ఎండ్ నుంచి తహిలా విల్సన్ కూడా ధాటిగా ఆడటంతో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. షబ్నమ్ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టిన హీలీ 30 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. తొలి వికెట్కు 137 పరుగులు జోడించిన అనంతరం తహిలా వెనుదిరగగా... హీలీ మాత్రం అదే జోష్ కనబర్చింది. మిన్ను మణి వేసిన ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 4, 4, 6 కొట్టి 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుంది. మరో ఎండ్ నుంచి రాచెల్ (21 నాటౌట్) సహకారం లభించడంతో హీలీ జట్టును విజయతీరాలకు చేర్చింది

ఆసియా కప్ హాకీ టోర్నీ మస్కట్ ‘చాంద్’ ఆవిష్కరణ
రాజ్గిర్ (బిహార్): ఈ నెలాఖరులో భారత్ ఆతిథ్యమిచ్చే ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీకి సంబంధించి కనువిందు చేసే ‘మస్కట్’ను ఆదివారం ఆవిష్కరించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అధికారిక మస్కట్గా ‘చాంద్’ (చందమామ)ను ఆవిష్కరించారు. భారత దివంగత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ ప్రాక్టీస్ స్ఫూర్తితో పాటు బిహార్లోని ప్రఖ్యాత వాల్మీకి టైగర్ రిజర్వ్లోని పులుల శౌర్యానికి ప్రతీకగా ‘చాంద్’ను ఆవిష్కరించినట్లు హాకీ ఇండియా (హెచ్ఐ) తెలిపింది. ఫ్లడ్లైట్లు కాదు కదా... కనీసం పూర్తిస్థాయి వీధి దీపాలు లేని ఆ రోజుల్లో చందమామ పంచిన వెన్నెల వెలుగుల్లోనే ధ్యాన్చంద్ తన ప్రాక్టీస్ను పూర్తి చేసేవారు. ఆ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఆయన పుట్టిన రోజున (ఆగస్టు 29) మొదలయ్యే ఆసియా కప్ టోర్నీకి ‘చాంద్’ మస్కట్ను ఖరారు చేశారు. సెపె్టంబర్ 7 వరకు రాజ్గిర్లోని స్టేడియంలో ఈ టోర్నీ జరుగుతుంది. ఆసియా దేశాలు పాల్గొనే ఈ టోర్నీలో మొదట్లో ఆసక్తి కనబరిచిన దాయాది పాకిస్తాన్ జట్టు చివరకు వైదొలగింది. పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ టోర్నీ విజేత వచ్చే ఏడాది ఆగస్టులో బెల్జియం–నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. 16 జట్లు పోటీపడే ప్రపంచకప్ టోర్నీకి ఇప్పటికే ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ, న్యూజిలాండ్ జట్లు అర్హత సాధించాయి.

టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రత్యర్ధులకు బ్యాడ్ న్యూస్
ఆసియాకప్-2025కు ముందు టీమిండియాకు ఓ అదరిపోయే వార్త అందింది. స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆసియాకప్లో ఆడేందుకు సిద్దంగా ఉన్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే బుమ్రా తన నిర్ణయాన్ని సెలక్టర్లు తెలియజేసినట్లు ఇండియన్ ఎక్స్ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో తలపడేందుకు ఇంగ్లండ్కు వెళ్లిన బుమ్రా కేవలం మూడు మ్యాచ్ల మాత్రమే ఆడాడు. ఆ తర్వాత ఆఖరి టెస్టుకు ముందు బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. మూడు మ్యాచ్లలో బుమ్రా తన ప్రదర్శనతో ఆకట్టకున్నప్పటికి ఫిట్నెస్ పరంగా మాత్రం కాస్త ఇబ్బంది పడుతూ కన్పించాడు.దీంతో ఆక్టోబర్లో వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను దృష్టిలో పెట్టుకుని బుమ్రాకు సెలక్టర్లు విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించాయి. కానీ ఆసియాకప్కు ముందు దాదాపు ఏభై రోజులు విశ్రాంతి లభించడంతో బుమ్రా తిరిగి టీ20 ఫార్మాట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు."ఆసియా కప్ జట్టు ఎంపికకు తాను అందుబాటులో ఉంటానని బుమ్రా బుమ్రా సెలెక్టర్లకు తెలియజేశాడు. వచ్చే వారం జరిగే సమావేశంలో సెలక్షన్ కమిటీ ఈ విషయంపై చర్చించనున్నారని" ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. బుమ్రా చివరగా టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ తరపున పొట్టి క్రికెట్లో ఆడాడు. ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. ఈ స్పీడ్ స్టార్ కేవలం 18 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టాడు.ఆసియాకప్-2025కు భారత జట్టు(అంచనా)సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, జితేశ్ శర్మచదవండి: ఆసియాకప్ రేసులో గిల్ కంటే అతడే ముందున్నాడు: అశ్విన్
బిజినెస్

బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్.. మాయ అద్దం!
హ్యాపీ బాత్రూమ్ నుంచే హ్యాపీ డే మొదలవుతుంది. బాత్రూమ్లో కలిగే చిన్న చిరాకు మీ రోజంతటినీ చెడగొడుతుంది. అందుకే బాత్రూమ్ ఇబ్బందులన్నీ క్షణాల్లో తీర్చేసే స్మార్ట్ గ్యాడ్జెట్స్ గురించి ఈ కథనంలో చూసేద్దాం.బాత్రూమ్ సింగింగ్ పార్ట్నర్!స్నానం మొదలైందంటే బకెట్లో నీళ్లు మాత్రమే కాదు, కొందరి నోటి నుంచి పాటలు కూడా వెలువడుతూ ఉంటాయి. అలా బాత్రూమ్లో పాడుతూ గాన స్నానాల్లో ఓలలాడే బాత్రూమ్ రాక్స్టార్స్కు ఇప్పుడు ఓ కొత్త సింగింగ్ పార్ట్నర్ వచ్చేసింది. అదే ‘మాక్సీ షవర్హెడ్ ’. ఇది కేవలం షవర్ మాత్రమే కాదు, ఇందులో బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంటుంది. మొబైల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేస్తే చాలు.నీటి శబ్దం మధ్య కూడా మీ పాటలు స్పష్టంగా వినిపిస్తాయి. స్పీకర్ను తొలగించడమూ, వాడడమూ చాలా సులభం. యూఎస్బీ ద్వారా పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు ఏడుగంటలపాటు పనిచేస్తుంది. ఈ స్పీకర్ శబ్దం నీటి శబ్దాన్ని మించి ఉంటుంది. అందుకే, ఏ అవరోధాలు లేకుండా పాటలు, కథలు, వార్తలు అన్నీ స్పష్టంగా వినవచ్చు. ఫోన్ కాల్ వచ్చినా, స్నానం చేస్తూనే మాట్లాడుకోవచ్చు. ధర సుమారు రూ.10,000. అయితే, కొన్ని చోట్ల తగ్గింపు ధరకూ లభిస్తోంది.బబుల్ బాత్పిల్లలకు స్నానం చేయించడమంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్ లాంటిది. ఒకరు పరుగులు పెడితే, మరొకరు వెనకాలే పరుగెడుతూనే ఉండాలి. ‘నో... నో...’ అంటూ పిల్లలు అరుస్తుంటే, ‘ఐదు నిమిషాలే... ఐదు నిమిషాలే’ అంటూ అమ్మనాన్నలు వారిని పట్టుకోవడానికి తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి హడావిడితో నిండిన బాత్ టైమ్కు గుడ్బై చెప్పే పరిష్కారం వచ్చేసింది! అదే ఈ ‘బాత్ బబుల్ మేకర్’. ఇది నీటి బుడగలను తయారుచేసే పరికరం మాత్రమే కాదు, పిల్లల మొహాల్లో నవ్వులు విరబూయించే సాధనం కూడా!మ్యూజిక్, బబుల్స్, పిల్లల్ని ఆకట్టుకునేలా ఉండే రంగురంగుల డిజైన్లతో ఉండే వీటిని బాత్రూమ్ గోడకు తగిలించేశారంటే చాలు. పిల్లలు స్వయంగా ‘నాకు టబ్ టైమ్ కావాలి!’ అని తెగ కోరుకుంటారు. మార్కెట్లో ఇవి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సంగీతం, లైట్స్తో ఉన్న ఆటోమేటిక్ బబుల్ మేకర్లు రూ.2,000 నుంచి రూ.5,000 వరకు లభిస్తాయి. అధిక బబుల్ ఔట్పుట్ ఉన్న హైఎండ్ మోడల్స్కు అయితే ధర రూ.5,000 కంటే ఎక్కువే ఉంటుంది.మాయ అద్దం!ఉదయం కాఫీ చల్లారినా భరించగలమేమో కాని, షవర్ తర్వాత అద్దంలో ముఖం కనిపించకపోతే మాత్రం వేడెక్కిపోతాం! అప్పుడు చేతిలో టవల్ పట్టుకుని అద్దాన్ని తుడవక తప్పదు. ఇలా ప్రతి ఉదయం చిరాకు తెప్పించే ఈ చిన్న వర్కౌట్కి ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది. అదే ఫాగ్లెస్ మిర్రర్. దీనిని యాంటీ–ఫాగ్ పూతతో తయారు చేస్తారు.ఇలాంటి అద్దాలు కొన్నింటిలో హీటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అద్దాన్ని మెల్లగా వేడి చేసి పొగను తొలగిస్తుంది. మరికొన్నింటిలో ఎల్ఈడీ లైట్లు కూడా ఉంటాయి, ఇవి క్లియర్ విజ¯Œ కి తగిన వెలుతురును అందిస్తాయి. దీంతో షేవింగ్, మేకప్ ఏదైనా పని సులభంగా, స్పష్టంగా చేయవచ్చు. ఇవి మార్కెట్లో వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. గోడకూ అమర్చుకోచ్చు, టేబుల్పైన అయినా ఉంచవచ్చు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. సింపుల్ వెర్షన్లు రూ.799 నుంచి, హీటెడ్ అద్దాలు, లైటింగ్ ఉన్నవి రూ.2,000 వరకు లభిస్తున్నాయి.

పిల్లలు కనడానికి సిద్దమవుతున్న రోబోలు!
స్త్రీ, పురుషుల కలయికతో పిల్లలు పుట్టడం సర్వసాధారణం. ఇప్పుడు టెక్నాలజీ పెరగడంతో టెస్ట్ ట్యూబ్ బేబీలు పుడుతున్నారు. సరోగసీ ద్వారా కూడా పిల్లలను కంటున్నారు. అయితే శిశువు పుట్టడానికి మనిషి గర్భమే అవసరం లేదంటూ.. చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా 'గర్భధారణ రోబోట్'లను సృష్టిస్తున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నా.. దీనికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే, ఈ కథనం చదవాల్సిందే..ప్రపంచంలోనే మొట్టమొదటి 'గర్భధారణ రోబోట్'పై చైనా శాస్త్రవేత్తలు పని చేస్తున్నారని, ఇది సజీవ శిశువుకు జన్మనిస్తుందని ది టెలిగ్రాఫ్ నివేదించింది. ఈ టెక్నాలజీ గర్భధారణ నుంచి ప్రసవం వరకు గర్భధారణకు కావలసిన అన్ని విషయాలను అనుకరిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.పిండం అనేది గర్భధారణ రోబో.. కృత్రిమ గర్భంలోనే పెరుగుతుంది. పిండాలకు కావలసిన పోషకాలు అన్నీ కూడా ట్యూబ్స్ ద్వారా అందిస్తారు. అయితే అండం, స్పెర్మ్ ఎలా.. ఎక్కడ ఫలదీకరణం అవుతుందనే విషయాలను ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు వెల్లడించలేదు. సింగపూర్లోని నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ 'జాంగ్ కిఫెంగ్' నేతృత్వంలోని గ్వాంగ్జౌకు చెందిన కైవా టెక్నాలజీ ఈ రోబోను అభివృద్ధి చేస్తోంది.ఇదీ చదవండి: ఐదు ఏఐ కోర్సులు.. పూర్తిగా ఉచితంఈ టెక్నాలజీ విజయవంతమైతే.. సంతానం లేని జంటలకు లేదా జీవసంబంధమైన గర్భధారణ చేయించుకోవడానికి ఇష్టపడని వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరిణతి చెందిన దశలో ఉందని డాక్టర్ జాంగ్ పేర్కొన్నారు. పిండం.. రోబోట్ కృత్రిమ గర్భంలో పెరగడానికి కావలసిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ రోబోట్ నమూనా 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.మనిషి గర్భంతో పనిలేకుండా రాబోయే టెక్నాలజీ బాగానే ఉంది. కానీ ఇది ప్రతికూల ప్రభావాలకు దారి తీస్తుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. తల్లి, బిడ్డల పేగు బంధం లేకపోతే.. పిల్లల మానసిక ప్రభావం ఎలా ఉండబోతుందో అని ఆందోళన చెందుతున్నారు. అంతే కాకుండా ఇది చట్టపరంగా సాధ్యమేనా?, చట్టాలు దీనికి ఒప్పుకుంటాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

మీ పిల్లలను కోటీశ్వరులను చేయొచ్చు..
పిల్లల భవిష్యత్తు కోసం, వారి ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి తల్లిదండ్రులూ ఆలోచిస్తారు. ఇందు కోసం ఎంతో కొంత పొదుపు చేయాలని ఆరాటపడతారు. ముఖ్యంగా ఉన్నత విద్య, ప్రత్యేక శిక్షణలు, విదేశీ కోర్సులు వంటి ఖర్చులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో, ముందుగానే వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టడం ఎంతో అవసరం. ఒక క్రమ పద్ధతిలో పొదుపు చేస్తే తక్కువ కాలంలోనే వారికి దాదాపు కోటి రూపాయలు కూడబెట్టవచ్చు.పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టేందుకు అనేక సాధనాలు అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్వల్ ఫండ్స్, బంగారం, ప్రభుత్వ పొదుపు పథకాల వంటి వివిధ పెట్టుబడి సాధనాల సమ్మిళితంతో పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను సులువుగానే కూడబెట్టవచ్చు. వీటిలో మ్యూచ్వల్ ఫండ్స్ సిప్లు (SIP) అధిక వృద్ధి అవకాశాలను అందిస్తే, పీపీఎఫ్ (PPF) లాంటి పథకాలు భద్రతతో పాటు పన్ను ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. బంగారం పెట్టుబడి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే సాధనంగా పనిచేస్తుంది.15 ఏళ్లలో రూ.కోటి కూడబెట్టే ప్రణాళికమ్యూచువల్ ఫండ్స్ – సిప్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.6,000 - ప్రతి సంవత్సరం 10% పెంపు - రాబడి అంచనా: 12% - మొత్తం పెట్టుబడి: రూ.22.87 లక్షలు - అంచనా లాభం: రూ.29.22 లక్షలు - తుది మొత్తం: రూ.52.10 లక్షలు బంగారంపై..- నెలవారీ పెట్టుబడి: రూ.5,500 - రాబడి అంచనా: 10% - మొత్తం పెట్టుబడి: రూ.9.90 లక్షలు - అంచనా లాభం: రూ.13.08 లక్షలు - తుది మొత్తం: రూ.22.98 లక్షలు పీపీఎఫ్ ద్వారా- నెలవారీ పెట్టుబడి: రూ.7,500 - వడ్డీ రేటు: 7.1% - మొత్తం పెట్టుబడి: రూ.13.50 లక్షలు - వడ్డీ లాభం: రూ.10.90 లక్షలు - తుది మొత్తం: రూ.24.40 లక్షలు పై మూడు మార్గాల్లో చెప్పినట్లు ప్రతినెలా 15 ఏళ్లపాటు పొదుపు చేస్తే తల్లిదండ్రులు పిల్లల విద్య కోసం అవసరమైన కోటి రూపాయలను చేరుకోవచ్చు. ఇది కేవలం ఊహజనిత ప్రణాళిక మాత్రమే. పైన పేర్కొన్న రాబడులు అంచనా మాత్రమే. తల్లిదండ్రులు తమకు అనువైన పెట్టుబడి మార్గాలను ప్రయత్నించవచ్చు.ఘ👉 ఇదీ చదవండి: కస్టమర్లకు వింత షాకిచ్చిన ఎస్బీఐ

పాతిక వేలలో ఒప్పో నుంచి కొత్త ఫోన్
స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో ఇండియా తాజాగా కే13 టర్బో సిరీస్ ప్రో 5జీ, టర్బో 5జీ ఫోన్లను ఆవిష్కరించింది. వీటిలో అంతర్గతంగా కూలింగ్ ఫ్యాన్ ఉంటుందని, దేశీయంగా స్మార్ట్ఫోన్లలో ఈ ఫీచరును అందించడం ఇదే ప్రథమం అని సంస్థ తెలిపింది. భారీగా మల్టీ టాస్కింగ్, గేమింగ్కి అనువుగా ఇవి ఉంటాయని వివరించింది.7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ సూపర్వూక్ ఫాస్ట్ చార్జింగ్, 1.5 అమోలెడ్ డిస్ప్లే తదితర ఫీచర్లు వీటిలో ఉన్నాయి. దీని ధర రూ. 27,999 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, ఆఫర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 24,999 నుంచి లభిస్తుందని సంస్థ తెలిపింది. టర్బో ప్రో 5జీ ఫోన్ల సేల్ ఆగస్టు 15 నుంచి, టర్బో 5జీ ఫోన్ల అమ్మకాలు 18 నుంచి ప్రారంభమవుతాయి.ముఖ్యమైన ఫీచర్లుఇండియాలో మొట్టమొదటి సారిగా అంతర్గత కూలింగ్ ఫ్యాన్ ఉన్న స్మార్ట్ఫోన్గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందింది.ట్రిపుల్-లెవల్ కూలింగ్ సిస్టమ్: కూలింగ్ ఫ్యాన్, ఎయిర్ డక్ట్స్, 5000mm² వేపర్ చాంబర్.ప్రాసెసర్: స్నాప్డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ఎస్ఓసీర్యామ్ & స్టోరేజ్: 8జీబీ/12జీబీ ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్.డిస్ప్లే: 6.8 అంగుళాల ఎల్టీపీఎస్ అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 1500 నిట్స్ బ్రైట్నెస్.బ్యాటరీ: 7000mAh, 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ (15 నిమిషాల్లో 50%).కెమెరా: 50MP + 2MP రియర్, 16MP ఫ్రంట్, 4K 60fps వీడియో సపోర్ట్.సాఫ్ట్వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత కలర్ఓఎస్ 15, 2 ఓఎస్ అప్డేట్లు, 3 ఏళ్లు సెక్యూరిటీ ప్యాచ్లుధర & లభ్యతకే13 టర్బో ప్రో 5జీ ఫోన్ ప్రారంభ ధర రూ.37,999 కాగా డిస్కౌంట్లో రూ. 34,999 లకు లభిస్తుంది. అలాగే కే13 టర్బో 5జీ ఫోన్ ధర రూ. 27,999 కాగా తగ్గింపులు పోగా రూ. 24,999 లకు లభిస్తుంది. ఈ ఫోన్లు ఫ్లిప్కార్ట్, ఒప్పో ఈ-స్టోర్లు, ఇతర ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి.
ఫ్యామిలీ

కుటుంబం దూరమై... శునకాలే కుటుంబమై!
వీధికుక్కల పట్ల అమానవీయంగా ఉండే వారి కంటే మానవత్వంతో వ్యవహరించే వారు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో దిల్లీకి చెందిన దేవీజీ ఒకరు. డెబ్బై నుంచి ఎనభైవరకు వీధికుక్కల ఆలనాపాలనా చూసుకుంటుంది దేవీజీ. భర్త చనిపోయిన, పిల్లలు దూరమైన దేవికి శునకాలే పిల్లలు. స్ఫూర్తిదాయకమైన దేవీజీ గురించి కంటెంట్ క్రియేటర్ నీతూ బిషత్ రావత్ ఒక వీడియో చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తనకు ఉన్న చిన్నస్థలంలోనే వీధి కుక్కలకు ఆశ్రయం ఇస్తున్న దేవీజీ రోజూ వాటికి ఆహారం అందించడానికి నానా కష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలో దేవీజీకి తోచిన సహాయం చేయాలని నెటిజనులను కోరింది నీతు. ఆమె వీడియో షేర్ చేయడానికి ముందు దేవీజీ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. దేవీజీ గురించి తెలుసుకున్న ఎంతోమంది ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘ఇన్ని కుక్కలను పెంచుకొని ఏం చేస్తావు?’ అని ఎంతోమంది దేవీజీని వెటకారంగా అడిగేవారు. దీనికి ఆమె చిరునవ్వు మాత్రమే సమాధానం అయ్యేది. అయితే అసలుసిసలు సమాధానం తరచుగా కనిపించే ఒక దృశ్యంలో దొరుకుతుంది. ఆ దృశ్యం: తల్లి చుట్టూ పిల్లలు చేరినట్లు దేవీజీ చుట్టూ శునకాలు చేరుతాయి. తన పిల్లలతో మాట్లాడినట్లుగానే శునకాలతో ప్రేమగా మాట్లాడుతూ కనిపిస్తుంది దేవిజీ. View this post on Instagram A post shared by Neetu Bisht Rawat (@iam_neetubishtrawat) (చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’)

ఎపాక్సీ రెసిన్ ఆర్ట్
ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఇటీవల ఒక ట్రెండ్గా మారింది. ఈ కళలోని ప్రత్యేక ఆకర్షణ అనేక సృజనాత్మక ఆలోచనలకు రూపం ఇస్తోంది. మనసుకు నచ్చిన కళాఖండాలతో ఇంటి అలంకరణను మార్చుకోవడానికి ఈ ఆర్ట్ వీలు కల్పిస్తుంది. అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్, ఫంక్షనల్ డెకర్ లేదా ఫ్యాన్సీ వస్తువులైనా ఎపాక్సీ రెసిన్ కళ ఇంటికి కొత్త అందాన్ని తీసుకురాగలదు. రెసిన్ను ప్లాస్టిక్, వార్నిష్ వంటి అంటుకునే పదార్థాలు, ఇతర ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. ఎపాక్సీ రెసిన్ అనేక పొరలతో కూడి ఉంటుంది.గోడ మీద ప్రకృతి అందాలుఎపాక్సీ రెసిన్తో వాల్మీదకు ప్రకృతి దృశ్యాలను తీసుకురావచ్చు. నదీ నదాల అందాన్ని, నీటి కదలికను అనుకరించేలా, మంత్రముగ్ధులను చేసేలా ఈ ఆర్ట్ ద్వారా మన ముందుకు తీసుకువస్తున్నారు కళాకారులు. వాడిపోని పూల సొగసుసున్నితమైన పువ్వులను ఈ ఆర్ట్లో ఉపయోగించవచ్చు. పువ్వులను, కొమ్మలను ఎపాక్సీ రెసిన్తో కలిపితే అందమైన రూపం మీ ముందు ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టెక్నిక్ పువ్వుల సహజ సౌందర్యాన్ని కాపాడుతుంది. అద్భుతమైన వాల్ హ్యాంగింగ్స్ను సృష్టించడానికి ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ మెటీరియల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎపాక్సీ రెసిన్తో గోడ గడియారాలు, పెయింటింగ్స్, హ్యాంగింగ్స్ వంటి ఎన్నో రకాల అలంకరణ వస్తువులను తయారు చేయవచ్చు.డిజైనర్ ఫర్నిచర్సముద్రపు గవ్వలు, గులకరాళ్లు, పువ్వులు, లతలు వంటి సహజ వస్తువులను నిగనిగలాడే ఎపాక్సీ రెసిన్తో టేబుల్ టాప్స్, చెయిర్స్కి అద్భుతమైన అందాన్ని తీసుకురావచ్చు. ఎపాక్సీ రెసిన్ ఆర్ట్ ఐడియాలుఎపాక్సీ రెసిన్ ఆర్ట్ వాల్ ఆర్ట్, ఫర్నిచర్కు మాత్రమే పరిమితం కాదు. వేడుకలలో ప్రత్యేకంగా నిలిచే ట్రేలు, ఇతర డెకర్ ఉత్పత్తులను రెసిన్తో తయారు చేయవచ్చు. ఈ కస్టమైజ్డ్ డిజైన్స్కి మార్కెట్లో మంచి ఆదరణ లభిస్తోంది. (చదవండి: మెట్లు దిగితే సముద్రం..! కళ కోసం అక్కడకు వెళ్లాల్సిందే..)

మెట్లు దిగితే సముద్రం..!
ప్రపంచంలో కడలి తీరాలు ఎన్ని ఉన్నా పర్యాటకులు మెచ్చే బీచ్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. గ్రీస్లోని శాంటోరిని ద్వీపంలో ఉన్న అమూడీ బీచ్ అలాంటిదే. నిజానికి ఇది ఒక చిన్న నౌకాశ్రయం. ఓయా అనే గ్రామానికి ఆనుకుని ఉన్న ఈ బీచ్కి వెళ్లాలంటే 300 మెట్లు దిగితే చాలు. నడవలేని వారు మరోదారిలో వాహనాలపైన కూడా వెళ్లొచ్చు. ఇక్కడ రాక్ జంపింగ్ ఫేమస్. ఓయా కొండ మీద నుంచి ఈ బీచ్లోకి చాలామంది ఔత్సాహికులు దూకుతుంటారు. ఇక్కడ సాయంత్రం వేళల్లో సరదాగా సేదతీరే స్థానికులతో, ప్రకృతి ఆస్వాదించే పర్యాటకులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ అనేక ఫిష్ టావర్న్లు సందర్శకులను ఆకట్టుకుంటాయి. రుచుల ప్రియులకు తాజా చేపలను, సంప్రదాయ గ్రీకు రెసిపీలతో వండి వడ్డిస్తుంటారు రెస్టారెంట్లోని షెఫ్స్. ఇక్కడి నుంచి సూర్యాస్తమయం చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడికి ఒక్కసారి వెళ్తే కచ్చితంగా మరోసారి వెళ్లాలనే ఆశ పుడుతుందట! నిజానికి ఈ బీచ్కి వెళ్లిన పర్యాటకులు ఓయా గ్రామస్థుల ఆదృష్టానికి కుళ్లుకోకుండా ఉండలేరేమో!కళోత్సాహంకళాకారులు ఎప్పుడూ ‘శభాష్’ అనే ప్రశంసలను, కరతాళ ధ్వనులను కోరుకుంటారు. అలాంటి కళలను అభినందించాలన్నా, ప్రదర్శించాలన్నా ఆగస్టు నెలలో స్కాట్లండ్ వెళ్లాల్సిందే! స్కాట్లండ్ రాజధాని ఎడిన్ బర్గ్లో ఆగస్ట్ 1 నుంచి ప్రారంభమైన ఎడిన్ బర్గ్ ఫెస్టివల్ ఫ్రింజ్ వేడుకలు ఆగస్టు 25 వరకు జరగనున్నాయి.సుమారు మూడు వారాల పాటు కొనసాగుతున్న ఈ పండుగలో వేలాదిమంది కళాకారులు, నటులు, హాస్యనటులు, సంగీతకారులు, వివిధ ప్రదర్శకులు పాల్గొంటారు. ఈ ఫ్రింజ్లో నాటకాలు, కామెడీ షోలు, సంగీత ప్రదర్శనలు, నృత్యాలు, సర్కస్లు ఇలా మరెన్నో ప్రదర్శనలు ఉంటాయి. ఎడిన్ బర్గ్లోని థియేటర్లు, పబ్లు, కేఫ్లు, వీధులలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలు సహా వందలాది ప్రదేశాలలో ప్రదర్శనలు జరుగుతాయి. ఈ పండుగ నూతన ప్రతిభను వెలికితీయడానికి, ప్రయోగాత్మక కళలను ప్రోత్సహించడానికి ఒక గొప్ప అవకాశం. ప్రపంచం నలుమూలల నుంచి కళాకారులు, ప్రేక్షకులు ఈ పండుగకు తరలివస్తారు.(చదవండి: దెయ్యాల కొంపలను తలపించే నిర్జన కట్టడాలు)

బాల్యపు గాయాలే భవిష్యత్ నిర్ణేతలు!
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా తపన పడతారు. మంచి స్కూల్, ట్యూషన్, కోచింగ్... ఇలా చేయాల్సిన దానికి మించి చేస్తారు. మార్కులు, ర్యాంకులతో పిల్లల విజయాన్ని కొలుస్తారు. కాని, మీ బిడ్డ జీవితంలో అతిపెద్ద విజయం ఎగ్జామ్ హాల్లో కాదు, తన మనసులో జరుగుతుంది. ప్రతి బిడ్డ మనసులో ఒక రిపోర్ట్ కార్డ్ ఉంటుంది. అది మార్కులకు సంబంధించినది కాదు, భావాలకు, అనుభవాలకు సంబంధించినది. ఆ రిపోర్ట్ కార్డ్లో భయం, నిర్లక్ష్యం, అవమానం లాంటివి ఉంటే, అవే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వీటినే సైకాలజీలో ‘కనిపించని గాయాలు’ అని పిలుస్తారు.గత ఏడాది ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎగ్జామ్ ఫోబియాతో కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. ఆ స్టూడెంట్తో మాట్లాడాక తెలిసింది అతని భయానికి కారణం సబ్జెక్ట్ కాదు, 90 శాతం కంటే తక్కువ మార్కులు వస్తే ‘నువ్వెందుకూ పనికిరావు’ అని తండ్రి తిట్టడమని. అందుకే అతనితో పాటు తండ్రికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చాను. మూడు నెలల్లో ఫోబియా మాయమైంది. 10 జీపీఏతో పదోతరగతి పాసయ్యాడు. పరిశోధనలేం చెబుతున్నాయి?అనుభవాలను బట్టి మెదడు వైర్ అవుతుంది. సురక్షితమైన, ప్రేమతో కూడిన వాతావరణంలో ఫోకస్, డెసిషన్ మేకింగ్కు కారణమయ్యే మెదడులోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ బాగా అభివృద్ధి చెందుతుంది. నిరంతరం భయంతో ఉంటే భయాన్ని నియంత్రించే అమిగ్డాలా హైపర్ యాక్టివ్ అవుతుంది. బాల్యంలో అవమానం, నిర్లక్ష్యం, శారీరక లేదా భావోద్వేగ దౌర్జన్యం ఎదుర్కొన్న పిల్లలు నాలుగు రెట్లు ఎక్కువగా డిప్రెషన్, ఆందోళనకు గురవుతారని 17 వేల మంది పిల్లలపై జరిపిన ఒక పరిశోధనలో వెల్లడైంది. అలాంటి పిల్లలు చదువులో వెనుక బడతారు. పెరిగి పెద్దయ్యాక, కెరీర్లో స్థిరత్వం లేక ఇబ్బందులు పడతారు. సంబంధాలలో సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటారు.బాల్యంలో ఎమోషనల్ కనెక్షన్ ఉన్న పిల్లలకే జీవితంలో, కెరీర్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువని హార్వర్డ్ స్టడీలో కూడా వెల్లడైంది. ఫార్చ్యూన్ 500 సీఈఓలలో 70 శాతం మందికి సురక్షితమైన బాల్యం ఉండటమే ఇందుకు పెద్ద ఉదాహరణ. కొనసాగే గురుతులు...బాల్యంలో మనసుకైన గాయాలు కనిపించవు. కాని, వాటి ప్యాటర్న్ పెద్దయ్యాక కూడా కనిపిస్తుంది.బాల్యంలో ప్రేమ షరతులతో కూడినదైతే పెద్దయ్యాక అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తారు. ఓటమిని అంగీకరించడం నేర్పించకపోతే, టాపర్ అయినా ఎగ్జామ్ ఫెయిల్ అవుతాననే భయంతోనే బ్రతికేస్తుంటాడు. ‘నువ్వెందుకూ పనికిరావు’ అనే మాటల మధ్య పెరిగిన బిడ్డకు ఎంత టాలెంట్ ఉన్నా పెద్ద అవకాశాలను తప్పించుకునే వ్యక్తిగా మారతాడు. 7 స్టెప్స్ప్రతి పేరెంట్ తప్పులు చేస్తారు. అలాగని అపరాధభావనతో కుంగిపోకండి. ఆ ప్యాటర్న్ను బ్రేక్ చేయండి.మీ బిడ్డను ఇతరులతో పోల్చుతున్నారా? చిన్న చిన్న విషయాలకే తిడుతున్నారా? గాయం ఇక్కడే మొదలవుతుందని గుర్తించండి.∙మీరు ఈ రోజు మాట్లాడే మాటలు, మీ బిడ్డ ఇన్నర్ వాయిస్ అవుతుంది. అందుకే ఆ వాయిస్ ‘ఐ యామ్ గుడ్’ అని చెప్పేలా చూసుకోండి.∙విమర్శను కనెక్షన్తో మార్చండి. ‘నువ్వు లేజీ’ అని కాకుండా, ‘నువ్వు అలిసిపోయినట్టున్నావ్, మళ్లీ మాట్లాడదాం’ అని చెప్పండి. కనెక్షన్ = కరెక్షన్ అని గుర్తుంచుకోండి.ఇంటిని సురక్షిత ప్రదేశంగా మార్చండి. నో జడ్జ్మెంట్ జోన్ క్రియేట్ చేయండి. ఫలితాలకే కాదు, ప్రయత్నానికీ సెలబ్రేషన్ చేయండి.ఏఐ యుగంలో మార్కులు కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ గెలిపిస్తుంది. పాత గాయాలు నయం చేయకపోతే, మీ బిడ్డ భవిష్యత్తునే సాఫ్ట్వేర్ బగ్స్తో నడుస్తుందని గుర్తించండి.మీ గతం మీ ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ప్రవర్తన మీ బిడ్డ మనసుకు గాయాలు చేయవచ్చు. అందుకే మీ గాయాలు హీల్ అయ్యేందుకు థెరపీ తీసుకోండి. ఇదేమీ బలహీనత కాదు. బలం. తల్లిదండ్రుల అపోహలుపిల్లల మంచి కోసమే తిడుతున్నాం అనుకుంటారు కాని, ప్రేమంటే భయమనే ప్రోగ్రామ్ను బ్రెయిన్లో ఇన్స్టాల్ చేస్తున్నారనేది నిజం.తిట్టినా పిల్లలు మర్చిపోతారనుకుంటారు. అది తప్పు. వాళ్లు మర్చిపోరు. అవి వారి అన్కాన్షస్లో చేరి, జీవితంలో రిపీట్ అవుతాయి.భారీ ఫీజులు చెల్లించి మంచి స్కూల్లో చేర్పిస్తే సక్సెస్ గ్యారంటీ అనుకుంటారు. అది పూర్తిగా తప్పు. ఎమోషనల్ సేఫ్టీనే మొదటి పాఠశాల. అది పేరెంట్స్ నుంచే రావాలి. సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: ‘బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్’)
ఫొటోలు
అంతర్జాతీయం

పుతిన్ ఆలోచన అదే.. రష్యాపై విరుచుకుపడిన జెలెన్ స్కీ
కీవ్: అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, పుతిన్ జరిపే చర్చల సఫలం కావు అంటూ వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం పుతిన్కు లేదంటూ విమర్శలు చేశారు. అందువల్లే ఈ భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్ స్కీ అభివర్ణిస్తున్నారు.అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య భేటీ జరుగుతున్న నేపథ్యంలో జెలెన్ స్కీ స్పందించారు. ఈ సందర్బంగా జెలెన్ స్కీ ట్విట్టర్ వేదికగా వీడియోలో మాట్లాడుతూ.. ఉక్రెయిన్ లేకుండా ట్రంప్, పుతిన్ చర్చలేంటి?. ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న రోజున కూడా ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించే ఉద్దేశ్యం మాస్కోకు లేదని మరోసారి నిరూపితం అయ్యింది. యుద్ధానికి సరైన ముగింపు ఎలా సాధించాలనే దానిపై ఉక్రెయిన్.. వాషింగ్టన్, యూరోపియన్ మిత్రదేశాలతో చర్చలు జరుపుతోంది. ఆయా దేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తోంది. యుద్ధాన్ని ముగించడానికి ఉక్రెయిన్ సాధ్యమైనంత పనిచేయడానికి సిద్ధంగా ఉంది. మేము అమెరికా నుండి బలమైన స్థానాన్ని ఆశిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు.On the day of negotiations, the Russians are killing as well. And that speaks volumes. Recently, weʼve discussed with the U.S. and Europeans what can truly work. Everyone needs a just end to the war. Ukraine is ready to work as productively as possible to bring the war to an end,… pic.twitter.com/tmN8F4jDzl— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) August 15, 2025ఉక్రెయిన్ డిమాండ్స్ ఇవే?రష్యాతో ఘర్షణలో బాధిత దేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ స్కీ భాగస్వామి చేయకుండా ట్రంప్, పుతిన్ జరిపే చర్చలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈ కారణంగానే వీరి భేటీని పుతిన్ వ్యక్తిగత విజయంగా జెలెన్స్కీ అభివర్ణిస్తున్నారు.శాంతి చర్చలు జరపాలంటే రష్యా బేషరతుగా కాల్పుల విరమణను ప్రకటించాలన్నది ఉక్రెయిన్ డిమాండ్. రష్యాకు తమ భూభాగాల అప్పగింత ప్రతిపాదనను వ్యతిరేకిస్తోంది.యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని, రష్యా అపహరించుకుపోయిన తమ దేశ చిన్నారులను తిరిగి అప్పగించాలని కోరుతోంది.భవిష్యత్తులో తమ దేశంపై రష్యా దాడి చేయకుండా రక్షణలు కల్పించాలని పట్టుబడుతోంది.రష్యాపై విధించిన అంతర్జాతీయ ఆంక్షలను ఒక్కసారిగా కాకుండా క్రమంగా ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది.అవసరమైతే వాటిని మళ్లీ విధించేందుకు అవకాశం ఉండాలి. మరోవైపు.. అలాస్కా వేదికగా ట్రంప్, పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ ఎలాంటి ఫలితం తేల్చకుండానే ముగిసిపోయింది. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ట్రంప్ స్పందిస్తూ.. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు.

ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్కు చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025

ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలం
వెల్లింగ్టన్: సముద్రాల్లో తిరుగాడే తిమింగలం పరిమాణం ఎంత ఉంటుందో మనకు తెలుసు. భారీ ఆకారంతో టన్నుల కొద్దీ బరువుండే తిమింగలాలు ఉన్నాయి. కానీ, ప్రాచీన కాలంలో బుల్లి తిమింగలాలు ఉండేవని పరిశోధకులు గుర్తించారు. 2.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి తిమింగలం శిలాజం ఆస్ట్రేలియా సముద్ర తీరంలో లభించింది. దీనికి జంజూసిటస్ డులార్డి అని పేరు పెట్టారు. ఇది చాలా అరుదైన తిమింగలం అని చెబుతున్నారు. తిమింగలాల పరిణామ క్రమాన్ని తెలుసుకోవడానికి తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది ఎంత చిన్నది అంటే సింగిల్ బెడ్కు సరిగ్గా సరిపోతుంది. దాని కండ్లు టెన్నిస్ బంతుల సైజ్లో ఉన్నాయి. పదునైన దంతాలు కనిపిస్తున్నాయి. అంటే ఇవి ఆహారం కోసం సముద్రంలో ఇతర జీవులను వేటాడేవని తెలుస్తోంది. దీని ముఖం కార్టూన్ క్యారెక్టర్ ముఖాన్ని పోలి ఉంది. బుల్లి తిమింగలాలు ఎలా అంతరించిపోయాయన్నది తెలుసుకోవడానికి సైంటిస్టులు ప్రయత్నిస్తున్నారు.

అమెరికా–భారత్ కలిసి ముందుకు సాగుతాయి
వాషింగ్టన్: అమెరికా–భారత్లు ఉమ్మడి దృక్పథంతో ఐక్యంగా ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించుకుంటూ మెరుగైన భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ట్రంప్ ప్రభుత్వం భారత్పై భారీగా టారిఫ్లను విధించడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్న భారత ప్రజలకు అమెరికా తరఫున, వ్యక్తిగతంగా మార్కో రుబియో శుక్రవారం శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. శాంతియుత, సౌభాగ్యవంత, భద్రత కలిగిన ఇండో–పసిఫిక్ లక్ష్యానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జాతీయం

ముగిసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం
సాక్షి,న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికపై బీజేపీ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో ఉప రాష్ట్రపతి ఎంపికపై బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేది ఖరారు కానుంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఎన్డీయే పక్షాలు ప్రధాని మోదీ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు అప్పగించాయి.

గవర్నర్ Vs స్టాలిన్.. మరోసారి భగ్గుమన్న విభేదాలు
చెన్నై: తమిళనాడు సర్కార్కి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా గవర్నర్పై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాల కంటే గవర్నర్ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు.విభేదాలు మరోసారి బహిర్గతం అవ్వడంతో ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం కలిగిస్తోంది. ఆదివారం ఆయన ధర్మపురిలో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గవర్నర్పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.‘ప్రతిపక్షాలు చేసే విమర్శలపై తనకు ఆందోళన లేదన్న స్టాలిన్.. అవన్నీ రాజకీయాల్లో సహజమన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్ రవి.. వారి కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. రాజ్భవన్లో ఉండి అధికార డీఎంకేకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ మండిపడ్డారు. తమిళ గీతాన్ని కూడా అగౌరవ పరుస్తారంటూ గవర్నర్పై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మహిళ భద్రత, విద్యారంగంపై గవర్నర్ ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ స్టాలిన్ మండిపడ్డారు. తమిళనాడు దేశంలోనే అగ్ర రాష్ట్రమని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయని స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు.‘‘తమిళనాడు ప్రజల కోసం మా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. కానీ కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు’’ అంటూ స్టాలిన్ మండిపడ్డారు.

రాహుల్ ‘ఓట్ చోరీ’ కామెంట్స్పై ఈసీ ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ వ్యాఖ్యలపై కేంద్రం ఎన్నికల సంఘం (సీఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ కామెంట్స్ను సీఈసీ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఖండించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ చోరీకి పాల్పడిందంటూ రాహుల్ గాంధీ వరుస ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపై మీడియా సమావేశంలో ఈసీ స్పందించింది. ఓట్ చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని విమర్శించడం సరి కాదు. ఓట్ చోరీ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే. 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ ఓటు హక్కు ఉంటుంది. పౌరుల మధ్య ఈసీ వివక్ష చూపదు. చట్టాలను ఈసీ ఎప్పుడూ గౌరవిస్తుంది. ‘సర్’లో ఓట్లు తొలగిస్తే అభ్యంతరాలు చెప్పవచ్చు. బీహార్ సర్లో అన్నీ రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తాం. అబద్ధపు ప్రచారాల్ని లెక్క చేయం. ప్రతిపక్షాలు ఓటర్లను తప్పుదారి పట్టిస్తున్నాయి. మా పని మేం చేసుకుంటూ వెళతాం. ఎన్నిక ప్రక్రియలో లోపాలున్నా ప్రతిపక్షాలు అభ్యంతరం తెలపవచ్చని సూచించింది.

Mumbai: ఘనంగా గణపతి ఆగమన్.. ఊరూవాడా సంబరాలు
ముంబై: మహానగరం ముంబైలో ఈనెల 27 నుంచి జరగబోయే గణేశుని ఉత్సవాలకు జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గణేశుని మండపాలకు విగ్రహాలను తరలించే ‘గణపతి ఆగమన్’ అంత్యంత వేడుకగా జరుగుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆగస్టు 27న వినాయక చవితి జరగనుండగా, ఇప్పటికే విగ్రహాలను తీసుకువచ్చి పందిళ్లలో నెలకొల్పుతున్నారు. ఈ సందర్బంగా జరుగుతున్న ఆగమన్ వేడుకలు వీధివీధినా కనిపిస్తున్నాయి. డ్రమ్స్ దరువుల మధ్య గణపతి బప్పా మోర్యా నినాదాలు మార్మోగుతున్నాయి. ముంబైలోని ప్రముఖ గణేశ్ విగ్రహ తయారీ కేంద్రాలలో ఒకటైన పరేల్ నుండి వివిధ ప్రాంతాలకు గణపతి విగ్రహాలు తరలివెళుతున్నాయి. Ganpati Aagaman 2025Parelcha Maharaja & Govinda #GanpatiBappaMorya pic.twitter.com/HjzyAvnaoj— मुंबई Matters™🇮🇳 (@mumbaimatterz) August 10, 2025దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే గణేశ్ నవరాత్రులు ముంబై అంతటా అత్యంత వైభవంగా జరుగుతాయి. గణేష్ ఉత్సవం 2025 దగ్గర పడుతున్నందున, మండపాల కోసం తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు వస్తున్న దరఖాస్తులను బృహన్ ముంబై విద్యుత్ సరఫరా అధికారులు త్వరతిగతిన క్లియర్ చేస్తున్నారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ యువతి మృతి
హైదరాబాద్: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన విద్యార్థిని దుర్మరణం చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస వర్మ తన కుటుంబంతో కలిసి 15 ఏళ్ల కిత్రమే నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ బాలాజీ కాలనీలో నివాసముంటున్నాడు. ఇతనికి భార్య హేమలత, శ్రీజ వర్మ (23), శ్రీయ వర్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.శ్రీనివాస వర్మ బౌరంపేటలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో ట్రాన్స్పోర్ట్ ఇన్చార్జిగా హేమలత ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. శ్రీజ వర్మ మాస్టర్స్ చదివేందుకు మూడేళ్ల క్రితం అమెరికాలో వెళ్లింది. చార్లెస్టన్లోని ఈస్టర్న్ ఇల్లినోయిస్ యూనివర్సిటీలో కంప్యూటర్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన శ్రీజ వర్మ ప్రస్తుతం ఉద్యోగ అన్వేషణలో ఉంది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం తన స్నేహితురాలితో కలిసి భోజనం తెచ్చుకునేందుకు తాము నివసిస్తున్న అపార్ట్మెంట్ పక్కనే ఉన్న రెస్టారెంట్కు వెళ్తున్నారు. వెనుక నుంచి వచి్చన ట్రక్కు శ్రీజను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చదవండి: విదేశీ ప్రయాణాల కోసం కోట్లు కుమ్మరిస్తున్నారు!రోడ్డు ప్రమాదంలో కూతురు చనిపోయిందన్న విషాద వార్త విని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. బాలాజీ కాలనీలోని శ్రీజ ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు.

సింగపూర్లో కురిసిన రామాయణ ప్రవచనామృతం
"శ్రీ సాంస్కృతిక కళాసారథి" (sri smakrithika kalasarathi) సంస్థ ఆధ్వర్యంలో సింగపూర్లో, పంచ మహా సహస్రావధాని డా. మేడసాని మోహన్ ఆధ్వర్యంలో శ్రీమద్రామాయణ వైశిష్ట్యంపై మూడు రోజుల ప్రత్యేక ప్రవచన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.సింగపూర్ దేశపు నాలుగు మూలల నివసించే తెలుగువారందరికీ అందుబాటులో ఉండేలా 5 వేర్వేరు వేదికలలో 5 భాగాలుగా, 15 గంటలపాటు మొత్తం రామాయణంలోని 7 కాండలు , రామాయణ ప్రాశస్త్యంపై సోదాహరణంగా డా. మేడసాని మోహన్ ప్రవచించారు.5 వేదికలలోనూ సుమారు 250 మంది తెలుగువారు పాల్గొనగా 'సింగపూర్ తెలుగు టీవీ'వారి సాంకేతిక నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడింది, ఆన్లైన్ ద్వారా దాదాపుగా 2000 మంది పైగా వీక్షించారు. వాల్మీకి రామాయణంలోని సంస్కృత శ్లోకములు, తెలుగులో రామాయణ కల్పవృక్షము, భాస్కర రామాయణము వంటి వాటినుండి తెలుగు పద్యములు కూడా ఉదహరిస్తూ, కథను ఆసక్తికరంగా వర్ణిస్తూ, రామాయణంలో నిక్షిప్తమైన ఎన్నో అంశాలను, జీవన విధానానికి తోడ్పడే నైతిక సూత్రాలను కూడా రామాయణ గాథతో మేళవించి, పిల్లలు పెద్దలు అందరినీ ఆకట్టుకునే విధంగా మేడసానివారు తమ ప్రవచనం అందించారు.ప్రొఫెసర్ బి వి ఆర్ చౌదరి రాజ్యలక్ష్మి దంపతులు డాక్టర్ మేడసాని మోహన్ గారికి ఆతిథ్యమీయగా, మొదటి వేదిక పంగోల్ రివర్వెల్ కాండోలోను, రెండవ వేదిక బర్గండీ క్రెసెంట్ లోను, మూడవ వేదిక మెల్విల్ కాండోలోను, నాలుగవ వేదిక క్యాన్బర్రా కాండోలోను, 5వ వేదిక జూబిలీ రోడ్ లోను ఏర్పాటు చేయబడ్డాయి. ఈ వేదికలతో పాటు 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఘనంగా జరిగింది. 15వ తేదీ రామ పట్టాభిషేకంతో ఈ పారాయణం సుసంపన్నం అవుతుంది."సంస్థ సభ్యులు రాధిక మంగిపూడి, సుబ్బు పాలకుర్తి ఈ సభలకు వ్యాఖ్యానం చేయగా, ప్రొ. బి వి ఆర్ చౌదరి దంపతులు, సౌభాగ్యలక్ష్మీ రాజశేఖర్ తంగిరాల దంపతులు, సుబ్బు పాలకుర్తి మాధవి దంపతులు, సత్య జాస్తి సరిత దంపతులు, రామాంజనేయులు చామిరాజు రేణుక దంపతులు, రంగా ప్రకాష్ కాండూరి తేజశ్వని దంపతులు ఈ 5 వేదికల ఏర్పాటలో సహకరించారని, మరి ఎంతో మంది దాతలు అన్నదానానికి ఆర్థిక సహాయం అందించిని వారందరికీ సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ అయిదువేదికలలో రామనామ కీర్తనలు ఆలపించిన గాయనీమణులు కృష్ణకాంతి , స్నిగ్ద ఆకుండి, సౌభాగ్యలక్ష్మి తంగిరాల, కాండూరి శ్రీసన్వి, శ్రీధన్వి, షర్మిల చిత్రాడకు నిర్వాహుకులు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు. సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు ప్రకాశరావు దంపతులు, రంగా రవి దంపతులు, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ దంపతులు తదితరులు పాల్గొన్న ఈ సభలో, సింగపూర్ తెలుగు టీవీ నిర్వాహకులు గణేశ్న రాధాకృష్ణ కాత్యాయని దంపతులు, సత్య జాస్తి కార్యక్రమానికి సాంకేతిక సహకారం అందించారు. సంస్థ సభ్యులు పాతూరి రాంబాబు, శ్రీధర్ భారద్వాజ్, రామాంజనేయులు చామిరాజు, గుంటూరు వెంకటేష్ తదితరులు కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

వైఎస్సార్సీపీ డల్లాస్ మీట్ అండ్ గ్రీట్ విజయవంతం
అమెరికాలోని వైఎస్సార్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. రాంభూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుత్తూ.. అరాచకానికి కూడా తెరలేపిందన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. మళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్ర శేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి వీర శివా రెడ్డి, కృష్ణ కోడూరు, మణి శివ అన్నపు రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Nimisha Priya Case: ‘నిమిషకు వెంటనే శిక్ష అమలుపరచండి’
కేరళ నర్సు నిమిష ప్రియ కేసు.. వారానికో మలుపు తిరుగుతోంది. మరణ శిక్ష అమలుకు ఒక్కరోజు ముందు.. అంటే జులై 15న వాయిదా పడ్డట్లు యెమెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిమిష తల్లి విజ్ఞప్తి, మతపెద్దల జోక్యంతో శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఆ దేశ అధ్యక్షుడు రషద్ అల్ అలిమి ఉత్తర్వులు వెలువరించారు. అయితే..అప్పటి నుంచి బాధిత కుటుంబంతో నిమిష తల్లి, మధ్యవర్తులు జరుపుతున్న చర్చలు ఓ కొలిక్కి రావడం లేదు. బ్లడ్ మనీ ప్రైవేట్ వ్యవహారం కావడంతో భారత విదేశాంగ శాఖ దూరంగా ఉంటోంది. దీంతో నిమిష ప్రియ కేసులో చర్చలు ఎలా కొనసాగుతున్నాయో అనే గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 2017లో తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మెహ్దీ హతమార్చిన కేసులో నిమిష ప్రియకు మరణశిక్ష పడింది. అయితే నిమిషకు వెంటనే మరణశిక్ష అమలు చేయాలని అతని సోదరుడు అబ్దుల్ ఫతాహ్ మెహ్దీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు యెమెన్ డిప్యూటీ జనరల్ను కలిసి మరణశిక్ష తేదీ అమలుకు తేదీని ఖరారు చేయాలని కోరారు. అదే సమయంలో ఆ దేశ అటార్నీ జనరల్కు శిక్షను త్వరగతిన అమలు చేయాలంటూ శుక్రవారం ఓ లేఖ రాశాడు.‘‘మా కుటుంబం అంతా కోరుకునేది ఒక్కటే. ఆమె చేసింది క్రూరమైన నేరానికి పాల్పడింది. ఆ నేరానికి క్షమాపణ ఉండదు.. ఉండబోదు. ఆమెకు తక్షణమే శిక్ష అమలు కావాలి. ఇంక ఆలస్యం చేయకుండా న్యాయం అందించాలి’’ అని ఫేస్బుక్లోనూ ఫతాహ్ ఓ పోస్ట్ చేశాడు. అయితే ఫతాహ్ ఇలా డిమాండ్ చేయడం ఇదే తొలిసారేం కాదు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం.. వాస్తవానికి నిమిషకు మరణశిక్ష జూన్ 7వ తేదీనే అమలు కావాల్సి ఉందని, అయితే దానిని జులై 16వ తేదీకి ాయిదా వేశారు. అప్పట ఇనుంచి అమలు చేయకుండా పెండింగ్లో ఉంచారని ఫతాహ్ ఆరోపిస్తున్నాడు. నిమిషకు మరణశిక్షలో జాప్యం చేయొద్దని జులై 25న, ఆగస్టు 4వ తేదీల్లో అక్కడి అదికారులకు లేఖ రాశాడు. మరోవైపు.. కేరళ మతపెద్ద, భారత గ్రాండ్ ముఫ్తా కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ చేస్తున్న వరుస ప్రకటనలనూ అబ్దుల్ ఫతాహ్ ఖండించాడు. మధ్యవర్తిత్వం, సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతోన్న ప్రయత్నాలు కొత్తవేమీ కావు. మాకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు. అలాగే మేం ఎదుర్కొన్న ఒత్తిళ్లు మా అభిప్రాయాన్ని మార్చవు. డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేం. ఇది ఆ మత పెద్దలు అర్థం చేసుకుంటే మంచిది. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోండి. నిమిషకు శిక్ష పడితేనే మా కుటుంబానికి న్యాయం దక్కేది’’ అని అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిష ప్రియ మరణశిక్ష తన దౌత్యం వల్లే వాయిదా పడిందని కాంతాపురం ఏపీ అబూబాకర్ ముస్లియార్ తాజాగా ప్రకటించారు. అలాగే.. ఈ వ్యవహారంలో కొందరు ఆ ఘనతేనని ప్రకటించుకున్నారని, అవసరమైతే ఆ క్రెడిట్ వాళ్లకే కట్టబెట్టడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ ప్రకటించారు. మరోవైపు.. నిమిష ప్రియ వ్యవహారంలో భారత ప్రభుత్వం తాము చేయగలిగినదంతా చేశామంటూ ఇదివరకే ప్రకటించింది. అయితే శిక్ష వాయిదా ప్రకటనను అధికారికంగా ధృవీకరించిన విదేశాంగ శాఖ.. ఏదైనా పురోగతి కనిపిస్తే అధికారికంగా తామే ప్రకటిస్తామని, అప్పటిదాకా వదంతులను నమ్మొద్దంటూ స్పష్టం చేస్తూ వస్తోంది.
క్రైమ్

ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళల దాడి
మాదాపూర్ : మాదాపూర్లో ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. షేక్పేటలో ఉంటున్న తల్లిదండ్రులు తన కూతురిని నీట్ ఎగ్జామ్ కౌచింగ్ కోసం జులై 13 నుంచి హస్టల్లో ఉంచారు. 10 రోజుల క్రితం నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలపడంతో బంధువులు, తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకుడిపై దాడి చేశారు. మాదాపూర్ ఇమేజ్గార్డెన్ రోడ్డులో ఉన్న అర్ణవ్ ప్లాజాలో ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హస్టల్లో 16 సంవత్సరాల బాలిక ఉంటుంది. బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పూలకుండీలను ధ్వంసం చేసి దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.అనంతరం సత్యప్రకాశ్ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

‘ఖజానా’ దోచింది బిహార్ గ్యాంగే!
చందానగర్: సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో బిహార్కు చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు. శనివారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో డీసీపీ వినీత్ ఈమేరకు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 12న చందానగర్లోని ఖజానా షోరూంలో ఆరుగురు దొంగలు ముసుగులు ధరించి దొరికినకాడికి వెండి వస్తువులను అపహరించారు. దీన్ని చాలెంజ్గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి 48 గంటల్లోనే ఇద్దరిని పట్టుకున్నారు. వీరి టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే...బిహార్కు చెందిన ఆశిష్ (22)తోపాటు మరో ఐదుమంది జీడిమెట్లలోని ఆస్టెస్టస్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకొని కూలి పనులు చేసుకుంటున్నారు. వీరిని బిహార్లోని శరణ్, శివాణ్ జిల్లాలకు చెందిన వారీగా గుర్తించారు. జగద్గిరిగుట్టలో ఉంటున్న ఆశిష్ స్నేహితుడు దీపక్ కుమార్ (22) వీరికి కావలసిన సౌకర్యాలు చూసుకుంటున్నాడు. వీరు ఏ1 మోటార్స్ వద్ద రెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆరుగురు మూడు జ్యువెలరీ దుకాణాలపై రెక్కీ నిర్వహించారు. అయితే ఖజానా జ్యువెలరీ వద్ద భద్రత తక్కువ ఉండటంతో దీన్ని లక్ష్యంగా ఎంచుకున్నారు.బిహార్లోని శరణ్ జిల్లాకు చెందిన ఆశిష్ గ్యాంగ్ టార్గెట్ పెద్ద బంగారు దుకాణాలే. ఒకసారి ఒక నగరంలో దొంగతనం చేస్తే మళ్లీ ఆ నగరానికి రాకపోవడం వీరి ప్రత్యేకత. ఇప్పటివరకు బిహార్, రాజస్తాన్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్లో దొంగతనాలు చేశారు. ఈ గ్యాంగ్ తెలుగు రాష్ట్రాల్లో దోపిడీ చేయడం ఇదే మొదటిసారి. వీరు దోచుకున్న ఆభరణాలను బిహార్, ఢిల్లీలో విక్రయిస్తుంటారు. వేర్వేరు రాష్ట్రాల్లో గ్యాంగ్ ముఖ్యనాయకుడిపై రెండు హత్య కేసులు సహా మొత్తం 10 కేసులుండగా, ఆశిష్పై 4 కేసులున్నాయి.దొంగ చిక్కాడు ఇలా....ఖజానాలో చోరీ అనంతరం ఆరుగురు నిందితులు రెండు బైకులపై బీదర్ వైపు వెళ్లారు. ప్రధాన రోడ్లపై కాకుండా గ్రామాల వైపు నుంచి రాష్ట్రాన్ని దాటారు. బైకులను రాష్ట్ర సరిహద్దు వద్ద వదిలేసి ప్రజా రవాణాలో వెళ్లారు. పోలీసు లు చాకచక్యంగా వ్యవహరించి నిందితులు వాడిన సెల్ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించి బీదర్ నుంచి వారిని వెంబడించారు. వారు బీదర్ వద్ద త్రుటిలో పోలీసుల నుంచి తప్పించుకున్నారు.దీంతో రెండు పోలీసు బృందాలు కర్ణాటక, మహారాష్ట్ర వెళ్లాయి. ఈ క్రమంలో పుణేలో ఆశిష్ను పట్టుకున్నారు. తర్వాత వీరికి సహకరించిన దీపక్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే మిగతా వారందరినీ పట్టుకుంటామని డీసీపీ వినీత్ తెలిపారు. ‘జ్యువెలరీ షోరూంల నిర్వాహకులు దుకాణంలో చొరబాటు హెచ్చరిక అలారమ్ను బిగించుకోవాలి. ఆ అలారమ్ స్థానిక పోలీస్ స్టేషన్కు అనుసంధానమై ఉండాలి’ అని చెప్పారు.

రూ.12 కోట్ల విలువైన బంగారందోపిడీ కేసులో దొంగ అరెస్ట్
హిందూపురం/చిలమత్తూరు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం తూమకుంట ఎస్బీఐ బ్రాంచ్లో గత నెల 27వ తేదీన జరిగిన భారీ దోపిడీ కేసులో అనిల్కుమార్ పన్వార్ అనే ప్రధాన నిందితుడిని పోలీసులు హరియాణలో అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని హిందూçపురం డీఎస్పీ కేవీ మహేష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. విచారణ అనంతరం పన్వార్ను కోర్టులో హాజరుపరిచామని పేర్కొన్నారు. పన్వార్పై 16 కేసులు ఉన్నట్లు సమాచారం. బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్ను గ్యాస్ కట్టర్తో తొలగించి లోపలికి చొరబడిన దొంగలు ఐరన్ లాకర్ డోర్ను గ్యాస్కట్టర్తో కత్తిరించి.. అందులోని సుమారు రూ.12 కోట్ల విలువైన 11,400 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.37.92 లక్షల నగదు అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ కోసం నియమించిన ప్రత్యేక పోలీసు బృందాలు పలు రాష్ట్రాల్లో పర్యటించి, పాత నేరస్తులను విచారించి, అత్యాధునిక సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించాయి. చోరీకి గురైన సొత్తు ఆచూకీ ఇంకా తెలియరాలేదని, కోర్టు అనుమతితో పన్వార్ను కస్టడీకి తీసుకుని విచారణ కొనసాగిస్తామని డీఎస్పీ తెలిపారు.

‘యుపిక్స్’ చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలని కొందరు వ్యక్తులు గ్రూప్గా ఏర్పడి 183 మంది నుంచి దాదాపు రూ.353 కోట్లు దండుకుని మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టుచేసినట్లు విజయవాడ పోలీసు కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. వీరు యుపిక్స్ క్రియేషన్ అనే యానిమేషన్ సంస్థను చూపి, హాలీవుడ్ సినిమాలకు వర్క్చేసే ఈ సంస్థలో పెట్టుబడి పెడితే ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు పొందొచ్చని అమాయకులకు ఆశ చూపి క్రమేణా రూ.కోట్లలో పెట్టుబడులు రాబట్టారని ఆయన చెప్పారు. మోసం చేసిందిలా.. నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ అనే వ్యక్తి విజయవాడ సత్యనారాయణపురం పోలీస్స్టేషన్ పరిధిలోని ఆదిశేషయ్య వీధిలో యుపిక్స్ అనే యానిమేషన్ కంపెనీని 2014లో ఏర్పాటుచేశారు. అనంతరం.. లక్ష్మీకిరణ్కు పేరం మాల్యాద్రి, అతని కొడుకు పేరం మహేశ్వరరెడ్డి, కొత్తూరి వేణుగోపాలరావు, మిట్టపల్లి రాజేంద్రబాబు అతని కొడుకు మిట్టపల్లి రాజీవ్కృష్ణ తోడయ్యారు. వీరంతా 2018లో ఒక గ్రూప్గా ఏర్పడి అమాయకులకు వల వేశారు. తొలుత లాభాలు వచ్చినట్లు చూపించి వారి బంధువులు, స్నేహితులకు సక్రమంగా కమీషన్లు చెల్లిస్తూ మరిన్ని డిపాజిట్లు చేయించేలా వారిని ప్రోత్సహించారు. అలా వచ్చిన మొత్తాలను వారి సొంత ఖాతాల్లోకి మళ్లించేవారు. ఇలా దాదాపు 183 మంది నుంచి రూ.353 కోట్లు సేకరించారు. ఇందులో రూ.194 కోట్ల వరకూ వారి సొంత ఖాతాలకు మళ్లించారు.వెలుగు చూసిందిలా.. ఈ సంస్థలో రూ.20 కోట్లు పెట్టుబడి పెడితే మోసం చేశారంటూ ఈ ఏడాది ఏప్రిల్ 14న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన త్రిపురమల్లు శ్రీనివాసరావు, కలవకొల్లు దిలీప్కుమార్ సత్యనారాయణపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో.. డీసీపీ కె. తిరుమలేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విచారణ అధికారిగా ఏసీపీ డాక్టర్ స్రవంతి రాయ్తో పాటు మరో నలుగురు ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో కమిషనర్ రాజశేఖరబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు. దర్యాప్తులో ముఠా మోసాలు బయటపడ్డాయి. అనంతరం.. పక్కా సమాచారంతో ప్రధాన నిందితులు నిడుమోలు వెంకట సత్యలక్ష్మీకిరణ్ (33)ను విజయవాడలో, మిట్టపల్లి రాజేంద్రబాబు (63), మిట్టపల్లి రాజీవ్కృష్ణ (30)ను నరసరావుపేటలో పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన 354 గ్రాముల బంగారు ఆభరణాలు, 21 కేజీల వెండి ఆభరణాలు, ఒక కారు, బీఎండబ్ల్యూ బైక్, కంప్యూటర్లు స్వాదీనం చేసుకున్నారు. వారి బ్యాంకు ఖాతాలనూ ఫ్రీజ్ చేశారు. నిందితులకు సంబంధించిన సుమారు రూ.23 కోట్ల విలువైన ఆస్తుల అటాచ్మెంట్కు పెట్టినట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన దర్యాప్తు అధికారులు, సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు నగదు రివార్డులతో సత్కరించి అభినందించారు.