వైజాగ్‌లో ఇంగ్లండ్ టెస్టు | Bangladesh match in Hyderabad | Sakshi
Sakshi News home page

వైజాగ్‌లో ఇంగ్లండ్ టెస్టు

Published Fri, Jun 10 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

Bangladesh match in Hyderabad

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్ మ్యాచ్
సిరీస్‌లకు వేదికలు ఖరారు
 

ముంబై: ఈ సీజన్‌లో భారత్ జట్టు స్వదేశంలో ఆడబోయే సిరీస్‌లకు వేదికలు ఖరారయ్యాయి. గతేడాది నవంబరులో టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ తొలిసారిగా ఇంగ్లండ్, భారత్‌ల టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాజ్‌కోట్, పుణే, ధర్మశాల, రాంచీ, ఇండోర్‌లకు కూడా ఈ సీజన్‌లో తొలిసారి టెస్టు మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం లభించింది. అలాగే బంగ్లాదేశ్ జట్టు భారత్‌తో ఆడే ఏకైక టెస్టు మ్యాచ్‌కు హైదరాబాద్ వేదిక కానుంది.

ఈ సీజన్లో భారత్ స్వదేశంలో 13 టెస్టులు, 8 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు ఆడనుంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటిస్తాయి. అలాగే దేశంలో తొలిసారి డేనైట్‌గా ఈడెన్‌గార్డెన్స్‌లో నిర్వహించాలని భావిస్తున్న టెస్టు న్యూజిలాండ్‌తో జరిగే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement