Eden Gardens
-
సంచలన విజయం.. ఐపీఎల్లో రాజస్తాన్ ఆల్టైమ్ రికార్డు
#KKRvRR: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ పైచేయి సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్పై రెండు వికెట్ల తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. ఓపెనర్ జోస్ బట్లర్ అజేయ శతకం(107) కారణంగా ఐపీఎల్-2024లో ఆరో విజయాన్ని అందుకుంది. సొంతమైదానం ఈడెన్ గార్డెన్స్లో మంగళవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేసింది. సునిల్ నరైన్ విధ్వంసకర ఇన్నింగ్స్(56 బంతుల్లో 109) కారణంగా భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 223 పరుగులు సాధించింది కేకేఆర్. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్ చివరి బంతి వరకు పట్టుదలగా పోరాడింది. నిజానికి 14 ఓవర్ల తర్వాత రాజస్తాన్ స్కోరు 128/6. గెలవాలంటే చివరి ఆరు ఓవర్లలో 96 పరుగులు కావాలి.. రోవ్మన్ పావెల్తో కలిసి బట్లర్ ఈ క్లిష్టతర పరిస్థితి నుంచి రాజస్తాన్ను గట్టెక్కించాడు. An Impactful Innings 😍 🔝 class effort from a 🔝 player ft. Jos Buttler Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvRR | @rajasthanroyals pic.twitter.com/5vz2qLIC7Z — IndianPremierLeague (@IPL) April 16, 2024 గెలుపు సమీకరణం 1 బాల్.. 1 రన్ ఉన్న తరుణంలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ బట్లర్ ఏమాత్రం తడబడకుండా ఆవేశ్ ఖాన్ కలిసి సింగిల్ తీసి విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఆద్యంతం ఆసక్తి కలిగించిన ఈ మ్యాచ్లో ఆఖరికి ఇలా రాజస్తాన్ విజయ దరహాసం చేయగా.. కేకేఆర్ నైరాశ్యంలో మునిగిపోయింది. ఇక ఈ అద్భుతమైన గెలుపుతో రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. పదిహేడేళ్లుగా ఏ జట్టుకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించింది. రన్ ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన తొలి జట్టుగా ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అదే విధంగా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగానూ అవతరించింది. ఛేజింగ్లో ఆరో వికెట్ పడిన తర్వాత అత్యధిక పరుగులు జోడించిన జట్లు 1. రాజస్తాన్ రాయల్స్- కేకేఆర్ మీద- 103 రన్స్- 2024, కోల్కతా. 2. ఆర్సీబీ- గుజరాత్ లయన్స్ మీద- 91 రన్స్- 2016, బెంగళూరు 3. చెన్నై- ముంబై మీద- 85 రన్స్- 2018, వాంఖడే, ముంబై 4. చెన్నై- సన్రైజర్స్ మీద- 78 రన్స్- 2018, వాంఖడే 5. ఢిల్లీ- గుజరాత్ లయన్స్ మీద- 76- 2017, కాన్పూర్. Another Last Over Thriller 🤩 A Jos Buttler special guides @rajasthanroyals over the line and further extends their lead at the 🔝 🙌 🙌 Scorecard ▶️ https://t.co/13s3GZLlAZ #TATAIPL | #KKRvRR pic.twitter.com/d3FECR81X1 — IndianPremierLeague (@IPL) April 16, 2024 కేకేఆర్ వర్సెస్ రాజస్తాన్ స్కోర్లు: ►టాస్: రాజస్తాన్.. బౌలింగ్ ►కేకేఆర్ స్కోరు: 223/6 (20) ►రాజస్తాన్ స్కోరు: 224/8 (20) ►ఫలితం: రెండు వికెట్ల తేడాతో కేకేఆర్పై రాజస్తాన్ గెలుపు. ఇవి కూడా చదవండి: #Pat Cummins: శెభాష్.. ఇది సరైన నిర్ణయం! కమిన్స్ అన్నతో అట్లుంటది మరి.. #T20WorldCup2024: రోహిత్తో ద్రవిడ్, అగార్కర్ చర్చలు.. హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2024: బట్లర్ విరోచిత సెంచరీ.. కేకేఆర్పై రాజస్తాన్ సంచలన విజయం
IPL 2024 KKR vs RR Live Updates: బట్లర్ విరోచిత సెంచరీ.. కేకేఆర్పై రాజస్తాన్ సంచలన విజయం ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. రాజస్తాన్ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. బట్లర్ విరోచిత సెంచరీతో చెలరేగాడు. 60 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచి తన జట్టుకు అద్బుతమైన విజయాన్ని అందించాడు. ఈ సీజన్లో బట్లర్కు ఇది రెండో సెంచరీ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్లో బట్లర్తో పాటు రియాన్ పరాగ్(34), పావెల్(26) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఇక కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రానా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 109 బంతులు ఎదుర్కొన్న నరైన్.. 13 ఫోర్లు, 6 సిక్స్లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు. ఏడో వికెట్ కోల్పోయిన రాజస్తాన్.. పావెల్ ఔట్ రావ్మెన్ పావెల్ రూపంలో రాజస్తాన్ ఏడో వికెట్ కోల్పోయింది. 17 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(67) పరుగలుతో ఉన్నారు. రాజస్తాన్ విజయానికి 18 బంతుల్లో 46 పరుగులు కావాలి. వరుణ్ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కేకేఆర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి దెబ్బకు రాజస్తాన్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. రాజస్తాన్ ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన చక్రవర్తి బౌలింగ్లో తొలుత అశ్విన్ ఔట్ కాగా.. ఆ తర్వాత హెట్మైర్ పెవిలియన్కు చేరాడు. 13 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(40), పావెల్(1) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ నాలుగో వికెట్ డౌన్.. జురెల్ ఔట్ రాజస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయింది. 2 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్.. సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. 9 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 4 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(24), రవిచంద్రన్ అశ్విన్(0) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ మూడో వికెట్ డౌన్.. రియాన్ పరాగ్ రూపంలో రాజస్తాన్ మూడో వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన పరాగ్.. హర్షిత్ రానా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి ధ్రువ్ జురెల్ వచ్చాడు. 8 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. క్రీజులో జోస్ బట్లర్(24) పరుగులతో ఉన్నారు. దంచి కొడుతున్న పరాగ్.. 7 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో రియాన్ పరాగ్(23),జోస్ బట్లర్(23) పరుగులతో ఉన్నారు. రాజస్తాన్ రెండో వికెట్ డౌన్.. శాంసన్ ఔట్ 47 పరుగుల వద్ద రాజస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సంజూ శాంసన్.. హర్షిత్ రానా బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి పరాగ్ వచ్చాడు. 5 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 53/2 రాజస్తాన్ తొలి వికెట్ డౌన్.. జైశ్వాల్ ఔట్ 224 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్.. వైభవ్ ఆరోరా బౌలింగ్లో ఔటయ్యాడు. 3 ఓవర్లకు రాజస్తాన్ స్కోర్: 36/1. క్రీజులో జోస్ బట్లర్(11), సంజూ శాంసన్(3) పరుగులతో ఉన్నారు. నరైన్ సూపర్ సెంచరీ.. రాజస్తాన్ టార్గెట్ 224 పరుగులు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్రైడర్స్ అదరగొట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోర్ సాధించింది.కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ సునీల్ నరైన్(109) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 109 బంతులు ఎదుర్కొన్న నరైన్.. 13 ఫోర్లు, 6 సిక్స్లతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు రఘువంశీ(30), రింకూ సింగ్(20) పరుగులతో రాణించారు. రాజస్తాన్ బౌలర్లలో అవేష్ఖాన్, కుల్దీప్ సేన్ తలా రెండు వికెట్లు సాధించగా.. చాహల్, బౌల్ట్ తలా వికెట్ పడగొట్టారు. కేకేఆర్ ఐదో వికెట్ డౌన్..నరైన్ ఔట్ సునీల్ నరైన్ రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది. 109 పరుగులు చేసిన నరైన్.. బౌల్ట్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 198/5 కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్.. రస్సెల్ ఔట్ రస్సెల్ రూపంలో కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రస్సెల్ అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. సునీల్ నరైన్ సెంచరీ సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. నరైన్కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. 16 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 184/3. క్రీజులో సునీల్ నరైన్(100), రస్సెల్(13) పరుగులతో ఉన్నారు. కేకేఆర్ మూడో వికెట్ డౌన్.. శ్రేయస్ అయ్యర్ ఔట్ 133 పరుగుల వద్ద కోల్కతా నైట్రైడర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. యజువేంద్ర చాహల్ బౌలింగ్లో ఔటయ్యాడు. రెండో వికెట్ డౌన్.. 106 పరుగుల వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 30 పరుగులు చేసిన రఘువంశీ.. కుల్దీప్ సేన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు. 12 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి కేకేఆర్ 125 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(70), శ్రేయస్ అయ్యర్(4) పరుగులతో ఉన్నారు. సునీల్ నరైన్ ఫిప్టీ.. 29 బంతుల్లోనే సునీల్ నరైన్ తన హాఫ్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 29 బంతుల్లో నరైన్ తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. క్రీజులో సునీల్ నరైన్(51), రఘువంశీ(30) పరుగులతో ఉన్నారు 7 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 64/1 7 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(24), రఘు వంశీ(21) ఉన్నారు. కేకేఆర్ తొలి వికెట్ డౌన్.. సాల్ట్ ఔట్ 21 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 10 పరుగులు చేసిన ఫిల్ సాల్ట్.. అవేష్ ఖాన్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి రఘువంశీ వచ్చాడు. 3 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్: 20/0 3 ఓవర్లు ముగిసే సరికి కోల్కతా నైట్రైడర్స్ వికెట్ నష్టపోకుండా 20 పరుగులు చేసింది. క్రీజులో సునీల్ నరైన్(6),ఫిల్ సాల్ట్(10) పరుగులతో ఉన్నారు. ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో రాజస్తాన్ రెండు మార్పులతో బరిలోకి దిగగా.. కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. ఆర్ఆర్ జట్టులోకి జోస్ బట్లర్, అశ్విన్ వచ్చారు. తుది జట్లు రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్ కోల్కతా నైట్ రైడర్స్: ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా -
KKR Vs RR: ఐపీఎల్లో ఇవాళ మరో బిగ్ ఫైట్.. పరుగుల వరద ఖాయం..!
ఐపీఎల్ 2024 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 16) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్, కేకేఆర్ జట్లు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్లో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలించనుండటంతో నేటి మ్యాచ్లో బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉందని అంచనా. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లో ఐదింట గెలిచిన రాజస్థాన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదింట నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన కేకేఆర్ రెండో స్థానంలో ఉంది. హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు గతంలో 27 సార్లు ఎదురెదురుపడగా కేకేఆర్ 14, రాయల్స్ 13 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది. ఈడెన్ గార్డెన్స్ విషయానికొస్తే.. ఈ మైదానంలో రాయల్స్పై కేకేఆర్దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు 9 మ్యాచ్ల్లో తలపడగా.. కేకేఆర్ 6, రాయల్స్ 3 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. ప్రస్తుత సీజన్లో ఇరు జట్ల బలాబలాలపై లుక్కేస్తే.. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంచనా వేయడానికి వీల్లేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇరు జట్లు. కేకేఆర్ బ్యాటింగ్లో ఫిలిప్ సాల్ట్, సునీల్ నరైన్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రసెల్ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. రాయల్స్ బ్యాటింగ్ లైనప్లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, రియాన్ పరాగ్, హెట్మైర్, రోవ్మన్ పావెల్ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. కేకేఆర్లో స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా లాంటి స్టార్ పేసర్లు ఉండగా.. రాయల్స్లో ట్రెంట్ బౌల్ట్, చహల్, అశ్విన్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్లో పైచేయి ఎవరిదని చెప్పడం చాలా కష్టం. -
దక్షిణాఫ్రికాతో టీమిండియా పోరు.. ఈ మ్యాచ్పై మీ అంచనాలు ఏంటి?
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్కతా వేదికగా అద్బుత ఫామ్లో ఉన్న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు టీమిండియా ఆడిన 7 మ్యాచ్ల్లో విజయం సాధించగా.. సఫారీలు ఆడిన 7 మ్యాచ్ల్లో ఆరింట గెలుపొందారు. ఈ క్రమంలో ఈ రెండు జట్ల మధ్య పోటీ మాత్రం అభిమానులకు మంచి మజా అందించనుంది. అయితే ఈ రెండు వరల్డ్ క్లాస్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్లో ఎవరు బాగా రాణిస్తారని మీరు భావిస్తున్నారు? Loading… -
దక్షిణాఫ్రికాతో రసవత్తరపోరు.. కోల్కతాకు చేరుకున్న టీమిండియా! వీడియో వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో వరుస విజయాలతో దూసుకు పోతున్న టీమిండియా.. మరో రసవత్తరపోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టు శుక్రవారం కోల్కతాకు చేరుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది. బెంగాల్ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా శనివారం ప్రాక్టీస్ సెషన్ పాల్గోనుంది. కాగా ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో ఆడిన 7 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు.. సెమీఫైనల్లో అడుగుపెట్టింది. కాగా భారత్ తమ చివరి మ్యాచ్లో 302 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. 357 పరుగుల లక్ష్య ఛేదనలో లంక.. భారత బౌలర్ల ధాటికి కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. మహ్మద్ సిరాజ్ 3వికెట్లతో సత్తాచాటాడు. చదవండి: ఐపీఎల్-2024 వేలానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే? VIDEO | Indian cricket team arrives in Kolkata ahead of their World Cup match against South Africa scheduled to be played at the Eden Gardens on Sunday, November 5. #ICCWorldCup #INDvsSA #ICCWorldCup2023 pic.twitter.com/5UItfivP2h — Press Trust of India (@PTI_News) November 3, 2023 -
ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఎలా ఉన్నాయంటే?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఈ మెగా ఈవెంట్కు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ఖారారు చేయడంతో.. ఈ టోర్నీలో పాల్గొనే జట్లు తమ వ్యహాలను రచించడం మొదలుపెట్టేశాయి. ఈ మెగా టోర్నీ భారత్లోని పది వేదికల్లో అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా ఆక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి మ్యాచ్తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ విషయానికి వస్తే... అక్టోబర్ 8న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం క్రికెట్ అభిమానుల ఎంతో ఆతృతగా ఎదురు చూసే దాయాదుల పోరు అక్టోబర్ 15న అహ్మదాబాద్లో జరగనుంది. ప్రపంచ కప్ టికెట్ల ధరలు వచ్చేశాయోచ్.. ఇక ఈ మెగా ఈవెంట్కు అతిథ్యం ఇవ్వనున్న వేదికలలో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఐదు లీగ్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్-2 కూడా జరగనుంది. ఈ క్రమంలో ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) వెల్లడించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా షెడ్యూల్ చేయబడిన అన్ని మ్యాచ్ల ధరలు రూ. 650 నుండి రూ. 3000 వరకు ఉంటాయి. బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ.650. D మరియు H బ్లాక్లకు రూ.1000. B, C, K, L బ్లాక్లకు రూ.1500. ఇంగ్లండ్ vs పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ.800. డి, హెచ్ బ్లాక్లు రూ.1200 సి, కె, బ్లాక్లు రూ.2000 BL బ్లాక్లు రూ.2200 బంగ్లాదేశ్ vs పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ.800 డి, హెచ్ బ్లాక్లు రూ.1200 సి, కె, బ్లాక్లు రూ.2000 BL బ్లాక్లు రూ.2200 ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్ టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ. 900. డి, హెచ్ బ్లాక్లు రూ.1500 సి, కె, బ్లాక్లు రూ.2500 BL బ్లాక్లు రూ.3000 సెమీ-ఫైనల్ మ్యాచ్ల టిక్కెట్ ధరలు అప్పర్ టైర్స్ రూ. 900. డి, హెచ్ బ్లాక్లు రూ.1500. సి, కె, బ్లాక్లు రూ.2500. BL బ్లాక్లు రూ.3000. చదవండి: TNPL 2023 DD Vs NRK: మరో 'రింకూ సింగ్'.. తమిళనాడు ప్రీమియర్ లీగ్లో సంచలనం -
బర్త్డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్లైన్స్తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్తో జరిగిన వన్డేలో ఓపెనర్గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్మన్గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
IPL 2023 PBKS Vs KKR: ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం
ఉత్కంఠ పోరులో కేకేఆర్ విజయం పంజాబ్ కింగ్స్తో జరిగిన ఉత్కంఠపోరులో 5 వికెట్ల తేడాతో కోల్కతా నైట్రైడర్స్ విజయం సాధించింది. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి రింకూ సింగ్ కేకేఆర్ను విజయతీరాలకు చేర్చాడు. 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ నితీష్ రాణా 51 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. రస్సెల్ (42), రింకూ సింగ్(21) పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్(8 బంతుల్లో 21 పరుగులు), హర్ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు. నాలుగో వికెట్ డౌన్ 124 పరుగుల వద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 51 పరుగులు చేసిన కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా.. రాహుల్ చాహర్ బౌలింగ్లో లివింగ్స్టోన్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్ వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్.. రాహుల్ చాహర్ బౌలింగ్లో ఔటయ్యాడు. 14 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 116/3 11 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 92/2 11 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ రెండు వికెట్లు నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజులో నితీష్ రాణా(30), వెంకటేశ్ అయ్యర్(7) పరుగులతో ఉన్నారు. రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్ 64 పరుగులు వద్ద కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 38 పరుగులు చేసిన జాసన్ రాయ్.. హర్ప్రీత్ బార్ బౌలింగ్లో ఔటయ్యాడు. క్రీజులోకి వెంకటేశ్ అయ్యర్ వచ్చాడు. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్ 38 పరుగుల వద్ద కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన గుర్బాజ్.. నాథన్ ఎల్లీస్ బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. 2 ఓవర్లకు కేకేఆర్ స్కోర్: 10/1 180 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో రాయ్, గర్భాజ్ ఉన్నారు. అదరగొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. కేకేఆర్ టార్గెట్ 180 పరుగులు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్(57) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఆఖరిలో షారుక్ ఖాన్(8 బంతుల్లో 21 పరుగులు), హర్ప్రీత్ బ్రార్( 9 బంతుల్లో 17) పరుగులతో రాణించారు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్ రాణా రెండు, సుయాష్ శర్మ, నితీష్ రాణా తలా ఒక్క వికెట్ సాధించారు. 17 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 139/6 17 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రీజులో షారుక్ ఖాన్, సామ్ కర్రాన్ ఉన్నారు. 11 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 93/3 11 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(37), జితేష్ శర్మ(20) పరుగులతో ఉన్నారు. 8 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 70/3 8 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజులో శిఖర్ ధావన్(31), జితేష్ శర్మ(4) పరుగులతో ఉన్నారు. మూడో వికెట్ కోల్పోయిన పంజాబ్ కింగ్స్ లైమ్ లివింగ్ స్టోన్ రూపంలో పంజాబ్ కింగ్స్ మూడో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన లివింగ్ స్టోన్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. రెండో వికెట్ డౌన్ 29 పరుగుల వద్ద పంజాబ్ కింగ్స్ రెండో వికెట్ కోల్పోయింది. హర్షిత్ రాణా బౌలింగ్లో రాజపాక్స డకౌటయ్యాడు. క్రీజులోకి లివింగ్ స్టోన్ వచ్చాడు. 4 ఓవర్లకు పంజాబ్ స్కోర్: 32/2 తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన ప్రభ్సిమ్రాన్ సింగ్.. హర్షిత్ రాణా బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. తొలుత బ్యాటింగ్ చేయనున్న పంజాబ్ ఐపీఎల్-2023లో భాగంగా ఈడెన్ గార్డన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్లో ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. షార్ట్ స్థానంలో రాజపాక్స తుది జట్టులోకి వచ్చాడు. కేకేఆర్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా ఆడనుంది. తుది జట్లు పంజాబ్ కింగ్స్: ప్రభ్సిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (కెప్టెన్), భానుక రాజపక్స, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కర్రాన్, షారుక్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, రిషి ధావన్, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్ కోల్కతా: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చక్రవర్తి -
కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా?
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ తొలి విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి(48 బంతుల్లో 74 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఇవాళ(శుక్రవారం) ఈడెన్ గార్డెన్స్ వేదివగా కేకేఆర్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. అయితే ఇదే రాహుల్ త్రిపాఠి 2020 మెగావేలంలో కేకేఆర్ రూ.60 లక్షల కనీస ధరకే కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు కేకేఆర్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2022లో మెగావేలానికి ముందు రాహుల్ త్రిపాఠిని వదిలేసింది. దీంతో వేలంలో ఎస్ఆర్హెచ్ రూ. 8.5 కోట్లు పెట్టి మరీ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో రాహుల్ త్రిపాఠి అంతంత మాత్రంగానే ఆడాడు. అయితే తనపై నమ్మకముంచిన ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. తాజాగా తనను వద్దనుకున్న కేకేఆర్తో ఇవాళ రాహుల్ త్రిపాఠి మ్యాచ్ ఆడబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ను గెలిపించి ఫామ్ మీదున్న రాహుల్ త్రిపాఠి తన ప్రతీకారం తీర్చుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారంది. ఇక రాహుల్ త్రిపాఠి ఇప్పటివరకు ఐపీఎల్లో 79 మ్యాచ్లాడి 1906 పరుగులు చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 93గా ఉంది. ఇక టీమిండియా తరపున 5 అంతర్జాతీయ టి20 మ్యాచ్లు ఆడిన రాహుల్ త్రిపాఠి 97 పరుగులు చేశాడు. -
ODI WC 2023: బీసీసీఐ కీలక నిర్ణయం.. హైదరాబాద్ స్టేడియానికి మహర్దశ
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగనున్న వన్డే ప్రపంచకప్కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్కప్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే టోర్నీ నిర్వహించేందుకు 12 స్టేడియాలను షార్ట్లిస్ట్ కూడా చేసింది. అహ్మదాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువాహటి, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, హైదరాబాద్, ముంబైలు ఈ లిస్టులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని స్టేడియాలలో కనీస సౌకర్యాలు కూడా ఉండటం లేదని అభిమానులు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందే దేశంలోని స్టేడియాలను పూర్తిగా కొత్త లుక్ లో కనిపించేలా చేసేలా కసరత్తులు చేస్తోంది.దీని కోసం రూ.500 కోట్ల ఖర్చుతో ఐదు స్టేడియాలను రెనోవేట్ చేయనుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి పేరున్నా దేశంలోని క్రికెట్ స్టేడియాలు మాత్రం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వరల్డ్ కప్ కూడా ఇలాంటి స్టేడియాలలో జరిగితే పోయేది బోర్డు పరువే. అందుకే భారీగా ఖర్చు చేసైనా సరే అర్జెంట్ స్టేడియాల రూపురేఖలు మార్చాలని బీసీసీఐ భావించింది. ఆ ఐదు స్టేడియాలకు నిధులు.. ఈసారి వరల్డ్ కప్ కోసం దేశవ్యాప్తంగా 12 వేదికలను ఎంపిక చేసిన బీసీసీఐ అందులో ఐదు స్టేడియాల రూపురేఖలు మార్చేందుకు నిధులు కేటాయించింది. ఢిల్లీతోపాటు హైదరాబాద్, కోల్కతా, మొహాలి, ముంబై స్టేడియాల్లో వసతులను మెరుగుపరచనున్నారు. హైదరాబాద్ రాజీవ్గాంధీ స్టేడియానికి రూ.117 కోట్లు వన్డే వరల్డ్కప్ వేదికల్లో ఈసారి హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియానికి బీసీసీఐ చోటు కల్పించింది. అయితే స్టేడియంలో వసతులు, సౌకర్యాలు మరి నాసిరకంగా ఉన్నాయని అభిమానుల నుంచి ఫిర్యాదులు అందాయి. తాజాగా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల నుంచి ఈ ఫిర్యాదులు మరింత ఎక్కువయ్యాయి. దీంతో బీసీసీఐ ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కొత్త రూపు తీసుకురావడానికి బడ్డెట్లో నిధులు కేటాయించింది. స్టేడియంలో వసతులు మెరుగుపరచడానికి రూ.117.17 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. సీటింగ్ సౌకర్యంతో పాటు ఇతర సౌకర్యాలను మెరుగుపరచనున్నారు. ఇక హైదరాబాద్తో పాటు ఢిల్లీ స్టేడియానికి రూ.100 కోట్లు, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ కోసం రూ.127.47 కోట్లు, మొహాలీలోని పీసీఏ స్టేడియానికి రూ.79.46 కోట్లు, వాంఖడే కోసం రూ.78.82 కోట్లు ఖర్చు కానుంది. ఒకవేళ ఈ స్టేడియాల్లో రూఫ్ పనులు కూడా చేస్తే ఈ ఖర్చు మరింత పెరగనుంది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ కు వేదికైన ముంబైలోని వాంఖెడే స్టేడియంలో కనీస వసతులు లేవని ఓ అభిమాని ఫిర్యాదు చేయడంతో ఈ మధ్యే ఇండియా, ఆస్ట్రేలియా వన్డేకు ముందు ఆ స్టేడియాన్ని రెనోవేట్ చేశారు. వరల్డ్ కప్ లో భాగంగా మొత్తం 48 మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్కు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యమిచ్చే అవకాశం ఉందని బీసీసీఐ తెలిపింది. ఇక 2011లో భారత్లో జరిగిన వన్డే వరల్డ్కప్ను ధోని సేన ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంకను ఓడించి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించి రెండోసారి వన్డే ప్రపంచకప్ విజేతగా ఆవిర్భవించింది. చదవండి: నాన్ స్ట్రయికర్ ముందుగా క్రీజ్ వదిలితే 6 పరుగులు పెనాల్టి..! -
శార్దుల్ ధనాధన్...కేకేఆర్ ఘన విజయం
కోల్కతా: సొంతగడ్డపై కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) సమష్టి ప్రదర్శనతో గర్జించింది. ఐపీఎల్ టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో ఈడెన్ గార్డెన్స్లో గురువారం జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (29 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్తో అదరగొట్టాడు. గుర్బాజ్ (44 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్లు), రింకూ సింగ్ (33 బంతుల్లో 46; 2 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా దూకుడుగా ఆడారు. ఈ ముగ్గురి బ్యాటింగ్ కారణంగా కోల్కతా స్కోరు 200 పరుగులు దాటింది. బెంగళూరు బౌలర్లలో డేవిడ్ విల్లీ, కరణ్ శర్మ రెండు వికెట్ల చొప్పున తీశారు. అనంతరం 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. వరుణ్ చక్రవర్తి (4/15), సునీల్ నరైన్ (2/16), తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ సుయశ్ శర్మ (3/30) తమ స్పిన్ మాయాజాలంతో బెంగళూరు జట్టును దెబ్బతీశారు. ఆ ఇద్దరి దూకుడుతో... తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతాకు శుభారంభం లభించలేదు. డేవిడ్ విల్లీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వరుస బంతుల్లో వెంకటేశ్ అయ్యర్, మన్దీప్ బౌల్డ్ అయ్యారు. ఒకవైపు గుర్బాజ్ జోరు కొనసాగించడంతో కోల్కతా పవర్ప్లేలో రెండు వికెట్లకు 47 పరుగులు చేసింది. ఏడో ఓవర్ తొలి బంతికి కోల్కతా కెపె్టన్ నితీశ్ రాణా అవుటయ్యాడు. ఆ తర్వాత రింకూ సింగ్తో జత కలిసి గుర్బాజ్ కోల్కతా ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. 11 ఓవర్లు ముగిసేసరికి కోల్కతా 87/3తో నిలిచింది. కరణ్ శర్మ వేసిన 12వ ఓవర్లో కోల్కతాకు దెబ్బ పడింది. వరుస బంతుల్లో గుర్బాజ్, రసెల్ పెవిలియన్ చేరడంతో కోల్కతా 89/5తో ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చి న శార్దుల్ ఠాకూర్ చెలరేగిపోయాడు. బెంగళూరు బౌలర్లపై ఫోర్లు, సిక్స్లతో విరుచుకుపడ్డాడు. 20 బంతుల్లోనే 6 ఫోర్లు, 3 సిక్స్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రింకూ, శార్దుల్ 102 పరుగుల భాగస్వామ్యానికి 19వ ఓవర్ చివరి బంతికి హర్షల్ పటేల్ తెరదించాడు. ఆఖరి ఓవర్లో శార్దుల్ను సిరాజ్ అవుట్ చేయగా... చివరి రెండు బంతుల్లో ఉమేశ్ ఆరు పరుగులు స్కోరు చేయడంతో కోల్కతా స్కోరు 200 పరుగులు దాటింది. తడబాటు... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు ఓపెనర్లు కోహ్లి (18 బంతుల్లో 21; 3 ఫోర్లు), డు ప్లెసిస్ (12 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) శుభారంభం ఇచ్చారు. అయితే ఐదో ఓవర్లో నరైన్ బౌలింగ్లో కోహ్లి, ఆరో ఓవర్లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డు ప్లెసిస్ బౌల్డయ్యారు. దాంతో బెంగళూరు ఇన్నింగ్స్ తడబడింది. హిట్టర్లు బ్రేస్వెల్, మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. తక్కువ స్కోర్లకే పెవిలియన్ బాట పట్టడంతో బెంగళూరు ఓటమి ఖాయమైంది. కోల్కతా జట్టులో వెంకటేశ్ అయ్యర్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన లెగ్ స్పిన్నర్, 19 ఏళ్ల సుయశ్ శర్మ మూడు వికెట్లతో ప్రభావం చూపించాడు. మరోవైపు బెంగళూరు ఇన్నింగ్స్లో సిరాజ్ స్థానంలో ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఐపీఎల్లో నేడు లక్నోVs హైదరాబాద్ (రాత్రి గం. 7:30 నుంచి ) స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం స్కోరు వివరాలు కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: రహా్మనుల్లా గుర్బాజ్ (సి) ఆకాశ్దీప్ (బి) కరణ్ శర్మ 57; వెంకటేశ్ అయ్యర్ (బి) విల్లీ 3; మన్దీప్ సింగ్ (బి) విల్లీ 0; నితీశ్ రాణా (సి) దినేశ్ కార్తీక్ (బి) బ్రేస్వెల్ 1; రింకూ సింగ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హర్షల్ పటేల్ 46; రసెల్ (సి) కోహ్లి (బి) కరణ్ శర్మ 0; శార్దుల్ ఠాకూర్ (సి) మ్యాక్స్వెల్ (బి) సిరాజ్ 68; నరైన్ (నాటౌట్) 0; ఉమేశ్ యాదవ్ (నాటౌట్) 6; ఎక్స్ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–26, 2–26, 3–47, 4–89, 5–89, 6–192, 7–198. బౌలింగ్: సిరాజ్ 4–0–44–1, డేవిడ్ విల్లీ 4–1–16–2, ఆకాశ్దీప్ 2–0–30–0, బ్రేస్వెల్ 3–0–34–1, షహబాజ్ అహ్మద్ 1–0–6–0, కరణ్ శర్మ 3–0–26–2, హర్షల్ పటేల్ 3–0–38–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (బి) నరైన్ 21; డు ప్లెసిస్ (బి) వరుణ్ చక్రవర్తి 23; బ్రేస్వెల్ (సి) నితీశ్ రాణా (బి) శార్దుల్ ఠాకూర్ 19, మ్యాక్స్వెల్ (బి) వరుణ్ చక్రవర్తి 5; హర్షల్ పటేల్ (బి) వరుణ్ చక్రవర్తి 0; షహబాజ్ అహ్మద్ (సి) శార్దుల్ (బి) నరైన్ 1; దినేశ్ కార్తీక్ (సి) వరుణ్ (బి) సుయశ్ శర్మ 9; అనూజ్ రావత్ (సి) నరైన్ (బి) సుయశ్ శర్మ 1; విల్లీ (నాటౌట్) 20, కరణ్ శర్మ (సి) నితీశ్ రాణా (బి) సుయశ్ శర్మ 1, ఆకాశ్దీప్ (సి అండ్ బి) వరుణ్ చక్రవర్తి 17; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో ఆలౌట్) 123. వికెట్ల పతనం: 1–44, 2–46, 3–54, 4–54, 5–61, 6–61, 7–84, 8–86, 9–96, 10–123. బౌలింగ్: ఉమేశ్ యాదవ్ 2–0–17–0, టిమ్ సౌతీ 2–0–25–0, సునీల్ నరైన్ 4–0–16–2, వరుణ్ చక్రవర్తి 3.4–0–15–4, సుయశ్ శర్మ 4–0–30–3, శార్దుల్ ఠాకూర్ 2–0–15–1. -
ఈడెన్ గార్డెన్స్ స్టాండ్కు ఝులన్ గోస్వామి పేరు!
భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్కు క్లీన్ స్వీప్ చేసి జూలన్కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా ఝులన్ తన కెరీర్ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్కు చెందిన జులన్ 2002లో ఇంగ్లండ్పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్ జట్టుపై తన కెరీర్ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక స్టాండ్కు ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. "మేము ఈడెన్ గార్డెన్స్లో ఒక స్టాండ్కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్. కాబట్టి దిగ్గజ క్రికెటర్లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నారు. చదవండి: Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా -
చెమటోడుస్తున్న యువీ.. ఇదంతా ఆ మ్యాచ్ కోసమేనా?
టీమిండియా మాజీ డాషింగ్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్కరౌండర్ నెట్స్లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు. ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్లో ఇంగ్లండ్తో మ్యాచ్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు. కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు. Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ — Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022 Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv — Legends League Cricket (@llct20) August 12, 2022 ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్హర్ట్జాన్ అఫ్ట్సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్దిన్ చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం! LLC 2022: ఇండియా మహరాజాస్తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్ -
Sourav Ganguly: ఇండియా మహరాజాస్ కెప్టెన్గా దాదా.. పోటీకి సై!
Sourav Ganguly- September 15th in Legends League Cricket Match: లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 తాజా సీజన్ ఓ ప్రత్యేక మ్యాచ్తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం)లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో సెప్టెంబరు 15న జరిగే ఈ మ్యాచ్లో సుమారు 10 దేశాలకు చెందిన ఆటగాళ్లు భాగం కానున్నారు. కాగా టీమిండియా మాజీ సారథి, భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ మ్యాచ్లో ఆడనున్నాడనే సంగతి తెలిసిందే. అయితే, ఫండ్ రైజింగ్ మ్యాచ్లో ఇండియా మహరాజాస్కు దాదా కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు నిర్వాహకులు తాజాగా వెల్లడించారు. ఇక వరల్డ్ జెయింట్స్కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు. దాదా జట్టులో వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ సహా మొత్తం 17 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఇక వరల్డ్ జెయింట్స్లో వెస్టిండీస్ దిగ్గజం లెండిల్ సిమన్స్, ప్రొటిస్ మాజీ ప్లేయర్ హర్షల్ గిబ్స్, శ్రీలంక లెజెండ్ సనత్ జయసూర్య వంటి 17 మంది మాజీ క్రికెటర్లకు చోటు దక్కింది. ఇండియా మహరాజాస్ జట్టు: సౌరవ్ గంగూలీ(కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్,యూసఫ్ పఠాన్, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్(వికెట్ కీపర్), స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా(వికెట్ కీపర్), అక్షశ్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ జడేజా, ఆర్పీ సింగ్, జోగీందర్ శర్మ, రితేందర్ సింగ్ సోధి. వరల్డ్ జెయింట్స్ జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), లెండిల్ సిమన్స్, హర్షల్ గిబ్స్, జాక్వస్ కలిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్(వికెట్ కీపర్), నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హోమిల్టన్ మసకజ్ద, మష్రాఫ్ మోర్తజా, అస్గర్ అఫ్గన్, మిచెల్ జాన్సన్, బ్రెట్ లీ, కెవిన్ ఒ బ్రెయిన్, దినేశ్ రామ్దిన్(వికెట్ కీపర్). 6 పట్టణాల్లో 22 రోజులు.. 15 మ్యాచ్లు ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య మ్యాచ్ తర్వాత సెప్టెంబరు 17 నుంచి అసలు పోటీ ఆరంభం కానుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ సీజన్-2లో టైటిల్ కోసం నాలుగు జట్లు తలపడబోతున్నాయి. ఈ సీజన్లో మొత్తం 15 మ్యాచ్లు ఉంటాయి. ఆరు పట్టణాల్లో 22 రోజుల పాటు అక్టోబరు 8 వరకు లీగ్ సాగనుంది. జట్ల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ఇక భారత 75వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ఈ ఎడిషన్ను అంకితమిస్తున్నట్లు లీగ్ కమిషనర్ రవిశాస్త్రి తెలిపాడు.కాగా మొదటి సీజన్ను వరల్డ్ జెయింట్స్ గెలిచిన విషయం తెలిసిందే. చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్కు భారీ షాక్! ఇక కష్టమే! View this post on Instagram A post shared by Legends League Cricket (@llct20) -
IND Vs WI: టీ20 సిరీస్కు ముందు అభిమానులకు బ్యాడ్న్యూస్..
IND VS WI T20 Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య కోల్కతా వేదికగా రేపటి(ఫిబ్రవరి 16) నుంచి ప్రారంభంకానున్నటీ20 సిరీస్కు ముందు భారత అభిమానులకు ఓ చేదు వార్త వినిపించింది. కరోనా కారణంగా రేపు జరగబోయే తొలి టీ20 మ్యాచ్కు ప్రేక్షకులను అనమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కనీసం 50 శాతం ప్రేక్షకులనైనా అనుమతిస్తారని అభిమానులు భావించినప్పటికీ.. బీసీసీఐ అందుకు విముఖత వ్యక్తం చేసింది. దీంతో ఖాళీ స్టేడియంలోనే తొలి టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. కనీసం ఇదే వేదికగా జరగబోయే రెండు, మూడు మ్యాచ్లకైనా ప్రేక్షకులను అనుమతించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) కోరగా.. త్వరలోనే తుది నిర్ణయం వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ ప్రారంభ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి రిస్క్లు అవసరం లేదని భావిస్తున్న బీసీసీఐ.. అవకాశం ఉన్నా ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు నిర్వహించేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, అహ్మదాబాద్ వేదికగా విండీస్తో జరిగిన వన్డే సిరీస్ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అవేష్ ఖాన్, యజ్వేంద్ర చహల్, దీపక్ చాహర్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, శార్దూల్ ఠాకూర్, జయంత్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్. వెస్టిండీస్ జట్టు: కీరన్ పొలార్డ్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, బ్రాండన్ కింగ్, రోవ్మన్ పావెల్ షెపర్డ్, ఓడియన్ స్మిత్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్ జూనియర్. చదవండి: Ind Vs Wi T20 Series: పంత్కు బంపర్ ఆఫర్.. వైస్ కెప్టెన్గా ఛాన్స్ -
'గుర్తుపెట్టుకోండి నా కూతురు పేరు'.. 2016 టి20 వరల్డ్కప్ హీరో
2016లో భారత గడ్డపై జరిగిన టి20 ప్రపంచకప్ను వెస్టిండీస్ గెలుచుకుంది. ఎవరు ఊహించని రీతిలో ఒకే ఒక్క ఓవర్లో ఆట మొత్తం మారిపోయింది. దానికి కారణం విండీస్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్వైట్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. బెన్స్టోక్స్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా నాలుగు సిక్స్లు కొట్టి బ్రాత్వైట్ తన జట్టుకు టి20 ప్రపంచకప్ అందించాడు. అప్పటివరకు ప్రపంచానికి పెద్దగా పరిచయం లేని బ్రాత్వైట్ పేరు మోర్మోగిపోయింది. ఆ మ్యాచ్లో బ్రాత్వైట్ 10 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 34 పరుగులు చేశాడు. గుర్తుంచుకోండి నా పేరు కార్లోస్ బ్రాత్వైట్.. అని గర్వంగా చెప్పుకున్నాడు. అంతలా ఇంపాక్ట్ చూపించిన బ్రాత్వైట్ తమ దేశానికి ప్రపంచకప్ అందించిన భారత గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నాడు. ముఖ్యంగా ఈడెన్ గార్డెన్స్ అంటే తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో బ్రాత్వైట్ వివరించాడు. చదవండి:అదే ఆఖరు... 19 ఏళ్లకు పైగానే అయింది గెలిచి.. ఈసారి కూడా! తాజాగా ఈడెన్పై తనకున్న అభిమానానికి గుర్తుగా పుట్టిన బిడ్డకు 'ఈడెన్' వచ్చేలా పేరు పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 6న కార్లోస్ బ్రాత్వైట్ దంపతులకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. కాగా తన బిడ్డకు ఈడెన్ అని వచ్చేలా పేరు పెట్టినట్లు బ్రాత్వైట్ ఇన్స్టాగ్రామ్లో చెప్పుకొచ్చాడు. '' గుర్తుపెట్టుకోండి నా బిడ్డ పేరు.. ఈడెన్ రోస్ బ్రాత్వైట్. పుట్టిన తేదీ 2/6/22.ఈడెన్ గార్డెన్స్తో నాకు ప్రత్యేకమైన అనుబంధం. ఇక నా చిట్టితల్లికి ఒక మాట ఇస్తున్నా.. డాడీగా నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటా. థాంక్యూ జెస్సీపర్పుల్.. నా జీవితంలోకి నువ్వు రావడం అదృష్టం. కచ్చితంగా ఈడెన్ రోస్ బ్రాత్వైట్కు మంచి తల్లిగా ఉంటావని భావిస్తున్నా. అంటూ పోస్ట్ చేశాడు. ఇక కార్లోస్ బ్రాత్వైట్ ఒక్కడే కాదు.. ఇంతకముందు పలువురు విదేశీ క్రికెటర్లు తమ బిడ్డలకు భారతీయ పేరు వచ్చేలా పెట్టుకున్నారు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ తన కూతురుకు ఇండియా జియాన్నే రోడ్స్ అని పేరు పెట్టాడు. భారతదేశం అన్ని మతాలతో కూడిన దేశం. ఇక్కడి ఆచారాలు, సంస్కృతి, వారసత్వం అంటే చాలా ఇష్టం. ప్రత్యేకమైన అభిమానంతోనే తన కూతురుకు ఇండియా జియన్నే పేరు పెట్టినట్లు రోడ్స్ గతంలో ఒక ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. మరో దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ కూడా తన కూతురుకు ''తాజ్'' అని పేరు పెట్టాడు. ఇండియాలోని తాజ్మహల్ అంటే ఏబీకి చాలా ఇష్టం. ఇంకో విషయమేంటంటే.. ఏబీ తన గర్ల్ఫ్రెండ్.. ప్రస్తుత భార్యకు తాజ్మహల్ వేదికగానే లవ్ప్రపోజ్ చేశాడు. ఇక భారత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్ తన చిన్న కూతురుకు ''ఇండీ'' అని పేరు పెట్టాడు. చదవండి: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు.. సచిన్, ధోని సరసన..! -
వెస్టిండీస్తో టీ20 సిరీస్.. భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్!
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు ముందు భారత అభిమానులకు బ్యాడ్ న్యూస్. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్తో మూడు టీ20 ల సిరీస్ను టీమిండియా ఆడనుంది. అయితే ఈ మ్యాచ్లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. కాగా ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇండోర్ అండ్ అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం 75 శాతం ప్రేక్షకులను అనుమతి ఇస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో స్టేడియంకు వెళ్లి మ్యాచ్లను వీక్షించవచ్చు అని భావించిన ఫ్యాన్స్కు మరోసారి నిరాశే ఎదురైంది. అయితే దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ తీవ్రత దృష్ట్యా బీసీసీఐ ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేనుట్లు తెలుస్తోంది. మేము ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్దంగా లేము. అహ్మదాబాద్లో వన్డే మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండానే జరుగుతున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో జరిగే టీ20లకు కూడా వర్తింపజేయాలి అని భావిస్తున్నాం అని బీసీసీఐ అధికారి టెలిగ్రాఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఫిబ్రవరి 16న జరగనుంది. మరో వైపు విండీస్తో తొలి వన్డే ముందు ముగ్గురు ఆటగాళ్లతో పాటు నాలుగురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇక విండీస్- భారత్ తొలి వన్డే అహ్మదాబాద్ వేదికగా ఫిబ్రవరి 6న జరగనుంది. చదవండి: 5 వికెట్లతో చెలరేగాడు.. జట్టును గెలిపించాడు -
మార్పులతో మూడో మ్యాచ్కు...
కోల్కతా: న్యూజిలాండ్తో టి20 సిరీస్ను వరుస విజయాలతో గెలుచుకున్న భారత జట్టు క్లీన్స్వీప్ లక్ష్యంగా నేడు ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే చివరి మ్యాచ్ ఆడనుంది. వరల్డ్కప్లో కనీసం సెమీస్ కూడా చేరని నిరాశను కొంత వరకు తగ్గిస్తూ గత రెండు మ్యాచ్లలో చెలరేగిన భారత బృందం అదే జోరు కొనసాగిస్తే గెలుపు అసాధ్యం కాదు. మరోవైపు ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ మాత్రం పూర్తిగా తేలిపోయింది. కనీసం ఇక్కడైనా గెలిచి పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. కోల్కతా పిచ్లో చక్కటి పేస్, బౌన్స్ ఉండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. అవేశ్ ఖాన్కు చాన్స్! ఈ సిరీస్ ద్వారా ఇద్దరు భారత ఆటగాళ్లు వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టారు. మిగిలిన వారిలో ఒక్క పేసర్ అవేశ్ ఖాన్కు మాత్రమే ఇంకా అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ లేదా దీపక్ చహర్లలో ఒకరిని తప్పించి మధ్యప్రదేశ్కు చెందిన అవేశ్ను ఆడించవచ్చు. గత కొన్నేళ్లుగా నిలకడగా రాణిస్తూ ఐపీఎల్తో ఆకట్టుకున్న అవేశ్... భారత టెస్టు జట్టు రిజర్వ్ బౌలర్లలో ఒకడిగా ఇటీవల ఇంగ్లండ్ కూడా వెళ్లాడు. శ్రీలంక పర్యటనలో రెండు టి20లు ఆడిన రుతురాజ్ గైక్వాడ్ను కూడా సూర్యకుమార్ స్థానంలో బరిలోకి దించే అవకాశం ఉంది. అదే తరహాలో లెగ్స్పిన్నర్ యజువేంద్ర చహల్ కూడా తన చాన్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. టీమ్లోని ఇతర సభ్యులందరూ ఫామ్లో ఉన్నారు. మార్పుల్లేకుండానే... కివీస్ పరిస్థితి మాత్రం అంత గొప్పగా లేదు. రెండుసార్లు అద్భుత ఆరంభాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్లు అవుట్ కాగానే జట్టు కుప్పకూలిపోతోంది. ఐదుగురు రెగ్యులర్ బ్యాట్స్మెన్, ఆల్రౌండర్ నీషమ్తో బరిలోకి దిగుతున్నప్పటికీ న్యూజిలాండ్ భారీ స్కోరు చేయలేకపోతోంది. బౌలింగ్లో ఇద్దరు స్పిన్నర్లు సాన్ట్నర్, సోధి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. పేసర్ బౌల్ట్ కూడా నిరాశపరిచాడు. మొత్తంగా భారత్ను ఓడించి ఒక విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవా లంటే కివీస్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. -
ఇంగ్లండ్పై అక్షరాస్త్రం
ఇన్నాళ్లూ ‘పింక్ టెస్టు’లను సీమర్లు శాసించారు. ఇప్పటిదాకా డే–నైట్ టెస్టులను గెలిచిన జట్లన్నీ పేసర్ల బలంతో నెగ్గాయి. భారత గడ్డపై జరిగిన ఏకైక పింక్బాల్ టెస్టు (ఈడెన్ గార్డెన్స్)లో కూడా టీమిండియా పేస్ దళంతోనే గెలిచింది. కానీ తాజా ‘పింక్’ ఆట స్పిన్నర్ల చేతుల్లోకి వెళ్లింది. తొలి టెస్టులో భారీ తేడాతో జయభేరి మోగించిన పర్యాటక ఇంగ్లండ్ జట్టు మూడో టెస్టులో అక్షర్ పటేల్, అశ్విన్ స్పిన్కు తలవంచింది. దీంతో రెండు సెషన్లను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. అయితే భారత్ కూడా స్పిన్ వలలో పడి కీలకమైన మూడు వికెట్లను కోల్పోయింది. అహ్మదాబాద్: డే–నైట్ టెస్టును తిప్పేసిన ఘనత కచ్చితంగా మన స్పిన్నర్లదే! ఫాస్ట్ బౌలర్లు చెలరేగే పింక్ బాల్ మ్యాచ్ ఇప్పుడు తిరగబడింది. స్పిన్నర్ల చేతుల్లోకి వచ్చేసింది. మొత్తానికి కొత్త స్టేడియంలో పాత ఆట సాగలేదు. ప్రధాన బౌలర్ కాకపోయినా... అక్షర్ పటేల్ (6/38) ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ పాలిట ప్రమాదకర బౌలరయ్యాడు. దీంతో బుధవారం మొదలైన మూడో టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 50 ఓవర్లయినా ఆడలేకపోయింది. 48.4 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ జాక్ క్రాలీ (53; 10 ఫోర్లు) ఒక్కడే భారత్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మరో స్పిన్నర్ అశ్విన్కు 3 వికెట్లు దక్కాయి. 100వ టెస్టు ఆడుతున్న ఇషాంత్కు ఒక వికెట్ లభించింది. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ఆట నిలిచే సమయానికి 33 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (82 బంతుల్లో 57 బ్యాటింగ్; 9 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ 2 వికెట్లు తీశాడు. తిప్పేసి... పడగొట్టేశాడు... వందో టెస్టు ఆడుతున్న ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ పతనానికి బీజం వేశాడు. మూడో ఓవర్లోనే సిబ్లీ (0)ని డకౌట్ చేశాడు. స్లిప్లో ఉన్న రోహిత్ అతని క్యాచ్ను అందుకోగా.... జట్టు స్కోరు 27 పరుగుల వద్ద రెండో వికెట్ పడింది. బెయిర్స్టో (0)కూడా ఖాతా తెరవలేదు. ఈ వికెట్తోనే అక్షర్ పటేల్ ప్రతాపం మెల్లిగా మొదలైంది. ఓపెనర్ క్రాలే... కెప్టెన్ రూట్ (17) పోరాడేందుకు ప్రయతించాడు. కానీ తొలి సెషన్కు ముందే రూట్ను అశ్విన్, అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న క్రాలేని అక్షర్ ఔట్ చేశారు. 81/4 వద్ద ఇంగ్లండ్ విరామానికెళ్లింది. రెండో సెషన్ మొదలవగానే అశ్విన్, అక్షర్ చెరో వికెట్ పడగొట్టడంతో అదేస్కోరు (81/6) వద్ద ఇంకో రెండు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా స్పిన్నర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కేవలం 38 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. రోహిత్ ఫిఫ్టీ తర్వాత భారత్ ఇన్నింగ్స్ మొదలైనా... స్పిన్కు టాప్ ఆర్డర్ కుదేలైంది. 15వ ఓవర్లో గిల్ (11)ను ఆర్చర్ ఔట్ చేస్తే, పుజారాను పరుగైనా చేయకముందే లీచ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లి అండతో ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇద్దరు మూడో వికెట్కు 64 పరుగులు జోడించాక కోహ్లిని చక్కని డెలివరీతో లీచ్ బోల్తా కొట్టించాడు. ► భారత్ తరఫున 100 టెస్టులు ఆడిన 11వ క్రికెటర్గా ఇషాంత్ శర్మ గుర్తింపు పొందాడు. కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో పేస్ బౌలర్గా ఇషాంత్ నిలిచాడు. ► అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్ (597 వికెట్లు)ను ఐదో స్థానానికి నెట్టి అశ్విన్ (598 వికెట్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. అనిల్ కుంబ్లే (953), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687) తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 53; సిబ్లీ (సి) రోహిత్ శర్మ (బి) ఇషాంత్ శర్మ 0; బెయిర్స్టో (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 0; రూట్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 17; స్టోక్స్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అశ్విన్ 6; పోప్ (బి) అశ్విన్ 1; ఫోక్స్ (బి) అక్షర్ పటేల్ 12; ఆర్చర్ (బి) అక్షర్ పటేల్ 11; లీచ్ (సి) పుజారా (బి) అశ్విన్ 3; బ్రాడ్ (సి) బుమ్రా (బి) అక్షర్ పటేల్ 3; అండర్సన్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (48.4 ఓవర్లలో ఆలౌట్) 112. వికెట్ల పతనం: 1–2, 2–27, 3–74, 4–80, 5–81, 6–81, 7–93, 8–98, 9–105, 10–112. బౌలింగ్: ఇషాంత్ శర్మ 5–1–26–1; బుమ్రా 6–3–19–0; అక్షర్ పటేల్ 21.4–6–38–6; అశ్విన్ 16–6–26–3. భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (బ్యాటింగ్) 57; గిల్ (సి) క్రాలే (బి) ఆర్చర్ 11; పుజారా (ఎల్బీడబ్ల్యూ) (బి) లీచ్ 0; కోహ్లి (బి) లీచ్ 27; రహానే (బ్యాటింగ్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (33 ఓవర్లలో మూడు వికెట్లకు) 99. వికెట్ల పతనం: 1–33, 2–34, 3–98. బౌలింగ్: అండర్సన్ 9–6–11–0; బ్రాడ్ 6–1–16–0; ఆర్చర్ 5–2–24–1; లీచ్ 10–1–27–2; స్టోక్స్ 3–0–19–0. -
క్యాబ్ హెడ్ క్వార్టర్స్ మూసివేత
కోల్కతా: నగరంలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఉన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) హెడ్ క్వార్టర్ వారం రోజుల పాటు మూతబడనుంది. ఈడెన్ గార్డెన్లోని సిబ్బందిలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో క్యాబ్ ఆఫీస్ను ఆదివారం మూసేశారు. సుమారు వారం రోజుల పాటు క్యాబ్ హెడ్ క్వార్టర్కు తాళాలు వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈడెన్ గార్డెన్లో కరోనా సోకిన వ్యక్తి తాత్కాలిక ఉద్యోగిగా తేలింది. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చందదాస్ అనే అతను తాత్కాలిక సర్వీస్పై పని చేయడానికి రాగా కరోనా బారిన పడినట్లు క్యాబ్ ప్రెసిడెంట్ అవిషేక్ దాల్మియా తెలిపారు. (‘గంగూలీ అంటే అసహ్యం పుట్టేది’) అతన్ని చార్నోక్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతనితో సాన్నిహిత్యంగా మెలిగిన వారిని సైతం కరోనా పరీక్షలు చేయిస్తున్నారు. ముందు వీరంతా హోమ్ క్వారంటైన్కు వెళ్లగా కరోనా టెస్టులు చేయనున్నారు. మొత్తం ఆఫీస్ను శానిటైజ్ చేయనున్నట్లు అవిషేక్ దాల్మియా తెలిపారు. పశ్చిమ బెంగాల్లో శనివారం రికార్డు స్థాయిలో 743 కేసులు నమోదు కాగా, కోల్కతాలో నగరంలో 242లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ దాదాపు ఏడువేల కేసులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నమోదయ్యాయి. (నీ బుగ్గలు ఇష్టం.. వాటిని పట్టుకోనా?) -
ఉంపన్: ‘పెద్ద నష్టమేమి జరగలేదు’
కోల్కతా: కరోనా వైరస్తో దేశమంతా అల్లాడిపోతున్న ఆపత్కాలంలో పులి మీద పుట్రలా ప్రళయ భీకర ఉంపన్ తుపాను పశ్చిమబెంగాల్ను అతలాకుతలం చేసింది. ఈ తుపాను దాటికి పదుల సంఖ్యలో ప్రాణాలు, వేల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్థి నష్టం జరిగింది. అతి తీవ్ర తుపాను ఉంపన్ దాటికి మహానగరం కోల్కతా చిగురుటాకులా వణికిపోయింది. అయితే దేశంలోనే ప్రఖ్యాత మైదానంగా పేరుగాంచిన ఈడెన్ గార్డెన్స్ పరిస్థితిపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఈడెన్ గార్డెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. ‘ఉంపన్ తుపాన్ ఎలాంటి భీభత్సం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ భీకర తుపానుతో పిచ్, ఔట్ ఫీల్డ్ పూర్తిగా దెబ్బతినడం మినహా పెద్ద నష్టమేమి జరగలేదు. జరగకూడదనే కోరుకుంటున్నాం. వేగంగా వీచిన గాలులకు కొన్ని చోట్ల అద్దాలు పలిగాయి, కొన్ని బ్లాక్లు దెబ్బతిన్నాయి. పరిస్థితి చక్కబడ్డాక ఇంజనీర్ వచ్చి ఈడెన్ గార్డెన్స్ మైదానాన్ని పూర్తిగా పరిశీలించి మాకు రిపోర్టు అందిస్తారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. భవిష్యత్లో ఎలాంటి తుపానుల వచ్చినా తట్టుకొనే విధంగా పలు నిర్మాణాలను చేపట్టాలనుకుంటున్నాం’ అంటూ అవిషేక్ దాల్మియా పేర్కొన్నాడు. ఉంపన్ తుపాను సృష్టించిన ప్రళయ భీభత్సం చదవండి: ఉంపన్ విపత్తు; కేంద్రంపై బెంగాల్ ఆగ్రహం ‘ఇక్కడ తప్పెవరిదో మీరే చెప్పండి’ -
'ఆ మ్యాచ్తోనే హర్భజన్కు ఫిదా అయ్యా'
భారత టెస్టు క్రికెట్లో 2001 సంవత్సరం మరిచిపోలేనిది. ఎందుకంటే ఆ సంవత్సరమే భారత టెస్టు క్రికెట్లో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పటికే 16 వరుస విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టును ఈడెన్గార్డెన్స్లో భారత్ ఓడించిన తీరు క్రికెట్ ప్రేమికులకు ఎప్పుడు గుర్తుండిపోతుంది. అయితే తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరోసారి ఆ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు. ఆ మ్యాచ్లో వివిఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్తో పాటు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ను అందరూ గుర్తు పెట్టుకునే ఉంటారు. కాగా, ఆ మ్యాచ్లో మేము గెలవడానికి బ్యాట్సమెన్ సహకారం ఎంత ఉందో బౌలర్ల కృషి కూడా అంతే ఉందని గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఆ మ్యాచ్కు సంబంధించి సౌరవ్ గంగూలీ కొన్ని విషయాలు ప్రస్తావిస్తూ..' ఈడెన్ టెస్టు మ్యాచ్లో నా సూచనలతో బౌలింగ్కు దిగి హర్భజన్ హ్యాట్రిక్తో మెరవడం, అదే మ్యాచ్లో మొత్తం 13 వికెట్లు పడగొట్టడం చకచకా జరిగిపోయాయి. ఆ మ్యాచ్ తర్వాత హర్భజన్ ప్రదర్శనను చూసి నేను అతని ఆటకు ఫిదా అయిపోయా. ఎందుకంటే అప్పటకే ఆస్ట్రేలియా 15 వరుస విజయాలు సాధించి అప్రతిహాతంగా దూసుకుపోతుంది. స్టీవా నేతృత్వంలో మా గడ్డపై అడుగుపెట్టిన ఆస్ట్రేలియా మొదటి టెస్టును గెలిచి 16వ విజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ఈడెన్లో జరిగిన రెండో టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు ఆ తర్వాత సిరీస్ను గెలుచుకోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి హర్భజన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో 700 పైగా వికెట్లు సాధించి ఈ దశాబ్దపు అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. సమకాలీన భారత క్రికెట్లో అనిల్ కుంబ్లే, హర్భజన్లు మా జట్టులో ఉండడం మేం చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఈ ఇద్దరు కలిసి ఎన్నో టెస్టు మ్యాచ్లో భారత జట్టుకు అపూర్వమైన విజయాలు అందించారని' దాదా చెప్పుకొచ్చాడు.అయితే 2001లో కీలకమైన ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లేతో పాటు ఫాస్ట్ బౌలర్ జగవల్ శ్రీనాథ్లు గాయంతో దూరమయ్యారని గంగూలీ పేర్కొన్నాడు. 'ఇదే సిరీస్లో నా కెప్టెన్సీలో హర్భజన్కు జోడిగా మూడు టెస్టుల్లో ముగ్గురు వేర్వేరు స్పిన్నర్లతో బరిలోకి దిగాము. మొదటి మ్యాచ్లో రాహుల్ సింగ్వీ, రెండో మ్యాచ్లో వెంకటపతి రాజు, మూడో మ్యాచ్లో నీలేశ్ కులకర్ణిలను ఆడించామని' గంగూలీ గుర్తు చేశాడు. అయితే కుంబ్లే లేని లోటును తెలియకుండా హర్భజన్ ఆ సిరీస్లో ఒక చాంపియన్లాగా బౌలింగ్ చేశాడని దాదా ప్రశంసించాడు. ఈడెన్ గార్డెన్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 441 పరుగులు చేయగా, భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 171 పరుగులకు ఆలౌటైంది. అనంతరం పాలోఆన్ ఆడిన భారత జట్టు వివిఎస్ లక్ష్మణ్ చారిత్రాత్మక ఇన్నింగ్స్(281 పరుగులు), రాహుల్ ద్రావిడ్ అజేయ శతకంతో తమ రెండో ఇన్నింగ్స్లో 657 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాను 212 పరుగులకు ఆలౌట్ చేసి 171 పరుగులతో మ్యాచ్ను గెలుచుకొని ఆపై సిరీస్ను సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లోనే మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్తో మెరవడం, రెండు ఇన్నింగ్స్లో కలిపి 13 వికెట్లు తీసుకున్నాడు. మొత్తం ఆ సిరీస్లో హర్భజన్ మూడు టెస్టుల్లో కలిపి 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. -
కోల్కతా టెస్టును గుర్తు చేసిన జార్ఖండ్
అగర్తలా : భారత టెస్టు క్రికెట్ తలరాతను మార్చింది 2001లో కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కాగా, 85 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అగర్తలా వేదికగా సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన మ్యాచ్ జార్ఖండ్-త్రిపుర జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో జార్ఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఫాలో ఆన్ ఆడి ప్రత్యర్థిని ఓడించిన తొలి జట్టుగా జార్ఖండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు రంజీ ట్రోఫీలో ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్టు లేకపోవడం గమనార్హం. 153 పరుగుల వెనుకంజలో ఉండి ఫాలో ఆన్ ఆడిన జార్ఖండ్ ఎవ్వరూ ఊహించని రీతిలో పుంజుకొని 54 పరుగుల తేడాతో త్రిపురపై ఘన విజయం సాధించింది. (చదవండి: ‘ఔట్ కాదు.. నేను వెళ్లను’) ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 289 పరుగులకు ఆలౌటైంది. సారథి మిలింద్(59), హర్మీత్ సింగ్(56) ఫర్వాలేదనిపించారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన జార్ఖండ్.. త్రిపుర బౌలర్లు రానా(4/42), అభిజిత్ (3/43) ధాటికి 136 పరుగులకే ఆలౌటైంది. విరాట్ సింగ్(47) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో 153 పరుగుల వెనుకంజలో ఉన్న జార్ఖండ్ను త్రిపుర సారథి మిలింద్ ఫాలో ఆన్ ఆడించాడు. దీంతో రెండో ఇన్నింగ్స్ను చేపట్టిన జార్ఖండ్కు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. త్రిపుర బౌలర్లు రాణించడంతో 138 పరుగులకే ఐదు ప్రధాన వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో సారథి సౌరబ్ తివారీ(122 బ్యాటింగ్), ఇషాంక్ జగ్గీ(107 బ్యాటింగ్) రాణించడంతో జార్ఖండ్ రెండో ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్లో జార్ఖండ్ జట్టుకు 255 పరుగుల ఆధిక్యం లభించింది. దీంతో 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన త్రిపుర అనూహ్యంగా 211 పరుగులకే కుప్పకూలింది. ఆశీష్ కుమార్(5/67), అజయ్ యాదవ్(2/31) చెలరేగడంతో త్రిపుర ప్రధాన బ్యాట్స్మన్ చేతులెత్తేశారు. అయితే మణిశంకర్(103) సెంచరీతో పరుగుల పరంగా ఓటమి అంతరాన్ని తగ్గించాడు కానీ త్రిపురను గట్టెక్కించలేకపోయాడు. 2001లో ప్రపంచ చాంపియన్గా హవా కొనసాగుతున్న ఆసీస్పై ఫాలో ఆన్ ఆడిన టీమిండియా అనూహ్యంగా ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా టెస్టు క్రికెట్ సమూలంగా మారిపోయింది. ఈ మ్యాచ్లో ఏకంగా 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్న ఆసీస్ టీమిండియాను ఫాలో ఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లో వీవీఎస్ లక్ష్మణ్(281), రాహుల్ ద్రవిడ్(180) అద్వితీయమైన ఇన్నింగ్స్తో ఆసీస్ ముందు 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో 384 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ను హర్భజన్ సింగ్(6/73), సచిన్(3/31) బెంబేలెత్తించారు. దీంతో 212 పరుగులకే కంగారు జట్టు ఆలౌటైంది. దీంతో టీమిండియా 171 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాతనే మనం ఎవరినైనా ఓడించగలమనే విశ్వాసం భారత జట్టుకు, క్రికెటర్లకు ఏర్పడింది. -
పింక్బాల్.. అడిలైడ్ టూ కోల్కతా
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం టీమిండియా- బంగ్లాదేశ్ల మధ్య జరిగే రెండో టెస్టుపైనే దృష్టిని కేంద్రీకరించింది.ఎందుకంటే ఈ మ్యాచ్లో టీమిండియా మొదటిసారి పింక్బాల్తో ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు అభిమానులతో పాటు ఇరుదేశాల క్రికెటర్లు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 22న ప్రారంభం కానున్న డే- నైట్ టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్జెన్స్ ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే.పింక్ బాల్కు సంబంధించి మొదటి డై నైట్ టెస్టు మ్యాచ్ 2015లో ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ మధ్య అడిలైడ్లో జరిగింది. దీంతో అడిలైడ్లో మొదలైన పింక్ బాల్ కథ ఇప్పుడు కోల్కతాకి చేరింది. అయితే ఇది ఇండియాలోకి అడుగుపెట్టడానికి మాత్రం నాలుగేళ్లు పట్టింది. అయితే ఐసీసీ 2015లోనే డై నైట్ టెస్టులకు అనుమతినిచ్చినా బీసీసీఐ, టీమిండియా వ్యతిరేకించడంతో ఉపఖండంలో పింక్ బాల్ కల నెరవేరలేదు. తాజాగా సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కావడంతో మరోసారి డే నైట్ టెస్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. కాగా కోహ్లి- గంగూలీ కలిసిన మొదటి భేటీలోనే గంగూలీ డే నైట్ టెస్టును ప్రతిపాదించడం, కోహ్లి అందుకు ఒప్పుకోవడం చకచకా జరిగిపోయింది. అడిలైడ్ టు కోల్కతా ఇప్పటివరకు టెస్టు చరిత్రలో 11 డే నైట్ టెస్టులు జరగగా ఆస్ట్రేలియా అత్యధికంగా 5 డే నైట్ టెస్టులు ఆడింది. తర్వాతి స్థానాల్లో శ్రీలంక(3), వెస్టిండీస్(3), శ్రీలంక (3), ఇంగ్లండ్ (3), పాకిస్తాన్(2), దక్షిణాఫ్రికా ( 2), జింబాబ్వే(1)ఘాడాయి. తాజాగా ఇప్పుడు 12వ డే పైట్ టెస్టు టీమిండియా, బంగ్లాదేశ్ల మధ్య జరగనుంది. కాగా, 11 డే నైట్ టెస్టులు జరిగిన వేదికలను ఒకసారి చూస్తే.. అడిలైడ్ , దుబాయ్, అడిలైడ్ , బ్రిస్బేన్, బర్మింగ్ హమ్,దుబాయ్, అడిలైడ్, పోర్ట్ ఎలిజెబెత్(సెంట్ జార్జ్ పార్క్), ఆక్లాండ్, బ్రిడ్జ్టౌన్, బ్రిస్బేన్ నగరాలు ఆతిథ్యమిచ్చాయి. ఇప్పుడు 12వ డే నైట్ టెస్టుకు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా మ్యాచ్కు సంబంధించి పలు విశేషాలు ఉన్నాయి. మ్యాచ్లో టాస్కు ముందు ఆర్మీ బలగాలు పారాట్రూపర్స్లో వచ్చి ఇరు కెప్టెన్లకు రెండు పింక్ బాల్స్ను అందజేయనున్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాతో కలిసి ఈడెన్గార్డెన్లోని సంప్రదాయ బెల్ను మోగించి మ్యాచ్ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మ్యాచ్కు తరలిరానున్న సచిన్ టెండూల్కర్, ఒలింపియన్ అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మిర్జా, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, 6 సార్లు మహిళల బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్లను ఘనంగా సత్కరించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) సెక్రటరీ అవిషేక్ దాల్మియా తెలిపారు. -
దాదా మరో నిర్ణయం: మోదీ, షేక్ హసీనాలకు ఆహ్వానం!
కోల్కతా: అన్నీ కుదిరితే భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉంది. వచ్చే నెలలో బంగ్లాదేశ్ రెండు టెస్టుల సిరీస్లో భాగంగా భారత్లో పర్యటించనుంది. దీనిలో భాగంగా నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో ఆతిథ్యమివ్వనుంది. అయితే చారిత్రాత్మక మైదానమైన ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్కు ఇది తొలి టెస్టు. దీంతో ఈ టెస్టుకు ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తున్న ఈ టెస్టును వీక్షించాల్సిందింగా ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాని షేక్ హసీనాలకు ఆహ్వానం పంపాలని క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నిర్ణయించాడు. దీనిలో భాగంగా క్యాబ్ తరుపున ఇరు దేశాల ప్రధానులను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక సౌరవ్ గంగూలీ క్యాబ్ అధ్యక్షుడయ్యాక వినూత్న ఆలోచనలతో ఈడెన్ గార్డెన్స్ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు. లార్డ్స్ మాదిరిగా ఈడెన్లోను గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించే ఆనవాయితీని గంగూలీ ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా 2016లో టీ20 ప్రపంచకప్లో భాగంగా టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్కు బిగ్బీ అమితాబ్ బచ్చన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన క్యాబ్ ఆయన చేత జాతీయ గీతం పాడించింది. ప్రస్తుత పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా క్యాబ్ ఆహ్వానం మేరకు మ్యాచ్కు హాజరయ్యాడు. చివరగా మొహాలీ వేదికగా ప్రపంచకప్-2011 సెమీఫైనల్లో భాగంగా భారత్-పాక్ల మధ్య జరిగిన మ్యాచ్ను అప్పటి ఇరు దేశాల ప్రధానులు మన్మోహన్ సింగ్, యూసఫ్ రజా గిలానీలు ప్రత్యక్షంగా తిలకించారు. -
అక్కడ ఇంకా ఇమ్రాన్ ఖాన్ ఫొటోలు!
కోల్కతా : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో యావత్ భారత్ దాయాది పాకిస్తాన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా ఆ దేశంతో ఉన్న అన్ని సంబంధాలు తెంచేసుకుంటోంది. ఘటన జరిగిన మరుసటి రోజే మోస్ట్ ఫేవర్డ్ స్టేటస్ను ఉపసంహరించుకున్న భారత్.. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 200% పెంచింది. అంతేకాకుండా ఆదేశ సినీ నటులపై, క్రికెట్ ప్రసారాలపై నిషేధం విధించింది. మరోవైపు ఈ ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను అన్ని స్టేడియాలు తొలిగించాయి. ఒక్క ఇమ్రానే కాదు.. ఆదేశ క్రికెటర్లందరీ ఫొటోలను తీసేశాయి. ఈ తరుణంలో పశ్చిమబెంగాల్లోని ఈడెన్ గార్డెన్లో మాత్రం ఇమ్రాన్ ఖాన్ ఫొటో ఇంకా అలానే ఉంది. అక్కడ ఇంకా ఇమ్రాన్ ఫొటో తీసేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై భారత నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల స్టేడియాల్లో ఫొటోలు తొలిగించిన బీసీసీఐ.. పశ్చిమ బెంగాల్లో ఎందుకు తొలిగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంటే భయమా? అని నిలదీస్తున్నారు. ముంబై క్రికెట్ క్లబ్ తొలుత ఇమ్రాన్ ఫొటోలు తీసేయగా.. మిగతా క్రికెట్ సంఘాలు కూడా అనుసరించాయి. ఇక భారత్ ప్రపంచకప్లో పాకిస్తాన్ ఆడే అంశంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుకుంటామని బీసీసీఐ పేర్కొనగా.. అభిమానులు మాత్రం రెండు పాయింట్లు పోయినా పర్వాలేదు.. కానీ పాక్తో ఆడవద్దని డిమాండ్ చేస్తున్నారు. -
అజహర్ బెల్ కొట్టడంపై గంభీర్ గుస్సా!
కోల్కతా : భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ ఆదివారం తొలి టీ20 మ్యాచ్కు ముందు ఈడెన్ గార్డెన్స్లో గంట మోగించడంపై సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయంలో బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (సీఏబీ), సీఓఏలను ట్విటర్ వేదికగా తప్పుబట్టాడు. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదం కారణంగా నిషేదం ఎదుర్కొన్న క్రికెటర్తో ఎలా బెల్ కొట్టిస్తారని పరోక్షంగా ప్రశ్నించాడు. ‘ఈడెన్లో భారత్ ఈ రోజు మ్యాచ్ గెలువచ్చు కానీ బీసీసీఐ, సీఓఏ, సీఏబీలు గౌరవాన్ని కోల్పోయాయి. ఆదివారమని అవినీతికి వ్యతిరేకంగా పనిచేయకుండా సెలవుతీసుకున్నట్లు కనబడుతోంది. అతన్ని హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతినిచ్చిన విషయం నాకు తెలుసు. కానీ అతను బెల్కొట్టడమే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.’అని గంభీర్ ట్వీట్ చేశాడు. భారత్ తరపున 99 టెస్ట్లు, 334 వన్డేలాడిన అజహరుద్దీన్ 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో బీసీసీఐ నిషేదం విధించిన విషయం తెలిసిందే. ఈ నిషేదాన్ని 2012లో హైదరాబాద్ హైకోర్టు ఎత్తేసింది. అప్పటి నుంచి అజహర్ క్రికెట్లో అధికారిక కార్యకలపాల్లో పాలుపంచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. తొలి ప్రయత్నంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసాడు. నిషేదంపై స్పష్టత లేదని తొలుత నిరాకరించిన బీసీసీఐ ఆ తరువాత అనుమతినించింది. అలాగే బీసీసీఐ, ఐసీసీల్లో ఎలాంటి బాధ్యతలు చేపట్టకుండా అతనిపై నిషేధం విధించలేమని కూడా స్పష్టం చేసింది. India may have won today at Eden but I am sorry @bcci, CoA &CAB lost. Looks like the No Tolerance Policy against Corrupt takes a leave on Sundays! I know he was allowed to contest HCA polls but then this is shocking....The bell is ringing, hope the powers that be are listening. pic.twitter.com/0HKbp2Bs9r — Gautam Gambhir (@GautamGambhir) 4 November 2018 హైదరాబాదీ అజహర్కు ఈడెన్తో ప్రత్యేక అనుబంధం ఉండటంతో అతను భారత్-వెస్టిండీస్ తొటి టీ20కు ముందు గంట మోగించారు. తన తొలి టెస్టు మ్యాచ్ను ఇక్కడే ఆడి సెంచరీ చేసిన అజహర్ ఆ తర్వాత ఆడిన మరో 6 టెస్టుల్లో 4 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీని (74 బంతుల్లో) అజహర్ 1996లో దక్షిణాఫ్రికాపై ఈడెన్లోనే నమోదు చేశాడు. 1993లో ఇదే వేదికపై అతని కెప్టెన్సీలో భారత్ వన్డే టోర్నీ ‘హీరో కప్’ నెగ్గింది. -
ఐపీఎల్: ప్లే ఆఫ్ మ్యాచ్ల వేదికలు మార్పు
కోల్కతా : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్ షెడ్యూల్ వేదికల్లో స్పల్ప మార్పు చోటుచేసుకుంది. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్లకు పుణే మైదానం (మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం) ఆతిథ్యమివ్వాల్సి ఉంది. అయితే రెండు మ్యాచ్ల వేదికలను కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు తరలిస్తూ శుక్రవారం ఐపీఎల్ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మే 23, 25 తేదీల్లో ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్లు కోల్కతాలో జరుగుతాయని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపారు. పుణే స్టేడియం కన్నా చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ సామర్థ్యం ఎక్కువగా ఉండటంతో ఐపీఎల్ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈడెన్లో 67వేల మంది అభిమానులు మ్యాచ్ను వీక్షించేందుకు అవకాశం ఉంది. క్వాలిఫయర్ 1 యథావిధిగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనే మే 22న జరగనుంది. మే 27న టోర్నీ ఫైనల్ మ్యాచ్కు కూడా ఈ మైదానమే ఆతిథ్యమివ్వనుంది. తొలుత ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2 మ్యాచ్లకు చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ చపాక్ స్టేడియం ఆతిథ్యమివ్వాల్సిండగా.. కావేరీ వివాదంతో ఆ జట్టు సొంతమైదానంగా పుణెలో ఆడుతున్న విషయం తెలిసిందే. -
వర్షం కారణంగా టాస్ ఆలస్యం
కోల్కతా : ముందుగా అనుకున్నట్లుగానే భారత్, శ్రీలంక మధ్య జరగనున్న తొలి టెస్ట్కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. వర్షం కారణంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే టెస్ట్ మ్యాచ్ టాస్ వేయలేదు. మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. మరోవైపు మ్యాచ్కు ముందు రోజు భారీ వర్షం కారణంగా భారత జట్టు ప్రాక్టీస్ చేయలేకపోయిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా సాగకుండా బంతికి, బ్యాట్కు ఆసక్తికర సమరం జరగవచ్చు. వాతావరణ శాఖ ప్రకారం మూడు రోజుల పాటు వరుసగా వర్షసూచన ఉంది. విరాట్ కోహ్లి నాయకత్వంలో గత రెండేళ్లలో సొంతగడ్డపై ప్రతీ జట్టును చిత్తుగా ఓడిం చిన బృందానికి లంకపై సత్తా చాటడం కష్టం కాబోదు. కాగా, ఇటీవల టెస్టుల్లో పాకిస్తాన్పై సాధించిన విజయం లంక జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గతంలో భారతగడ్డపై విజయం అనే పదానికి దూరంగా ఉన్న లంక.. ఎలాగైనా ఈ సిరీస్లోనైనా ఆ అపవాదు తొలగించుకోవాలని భావిస్తోంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, రోహిత్/కుల్దీప్, సాహా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, ఉమేశ్. శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), కరుణరత్నే, సమరవిక్రమ, ధనంజయ డి సిల్వా, మాథ్యూస్, డిక్వెలా, తిరిమన్నె/షనక, దిల్రువాన్ పెరీరా, లక్మల్, హెరాత్, గమగే/విశ్వ ఫెర్నాండో. -
ఫ్యాన్స్ చర్యతో డేవిడ్ వార్నర్ పరేశాన్!
కోల్కతా: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రపంచంలో ఎంతోమంది మేటి బౌలర్లను ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా శనివారమిక్కడ ఈడెన్ గార్డెన్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ సారథి చిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ ఛేజింగ్ సందర్భంగా ఎనిమిదో ఓవర్లో ఫ్లాష్లైట్లతో వార్నర్ ఒక్కసారిగా చికాకు పడ్డాడు. అభిమానుల చర్య అతన్ని ఇబ్బందిపడేలా చేసింది. తమ అభిమాన జట్లకు మద్దతు తెలిపేందుకు మైదానంలో అభిమానులు ఈ మధ్య తమ ఫోన్లలోని ఫ్లాష్లైట్లను వెలిగించి.. ఆ ప్రకాశవంతమైన వెలుగుతో క్రికెటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కోల్కతాతో మ్యాచ్ సందర్భంగా అభిమానులు ఇదేవిధంగా ప్రవర్తించారు. కానీ ఈ చర్య వార్నర్ను సంతోషపెట్టలేదు. కోల్కతా చైనామన్ కుల్దీప్ యాదవ్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొంటుండగా అతన్ని ఇది చికాకు పెట్టింది. బౌలింగ్ దృష్టి పెట్టకుండా చేసి ఇబ్బందికి గురిచేసింది. ఈ ఓవర్లో మొదటి ఐదు బంతులకు పరుగులు రాలేదు. ఓసారి స్టంపౌట్ అవకాశం తృటిలో చేజారింది. ఈ నేపథ్యంలో వార్నర్ నేరుగా వెళ్లి ఎంపైర్కు మొరపెట్టుకున్నాడు. అభిమానుల ఫ్లాష్లైట్ల వల్ల తన ఏకాగ్రత దెబ్బతిని సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నానని, ఆ లైట్లు ఆఫ్ చేసేలా చూడాలని వేడుకున్నాడు. ప్రకాశవంతమైన తెల్లని ఫ్లాష్లైట్ వెలుగువల్ల కుల్దీప్ మణికట్టును తాను చూడలేకపోతున్నానని, దానివల్ల అతని బౌలింగ్ అంచనా వేయడం కుదరడం లేదని చెప్పాడు. కుల్దీప్ బౌలింగ్లో చాలా చికాకు పడ్డ వార్నర్ ఆ తర్వాత కొద్దిసేపటికే 26 పరుగులకు ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సన్రైజర్స్ బ్యాట్స్మన్ పెద్దగా రాణించలేదు. దీంతో 17 పరుగుల తేడాతో కోల్కతా చేతిలో హైదరాబాద్ ఓడిపోయింది -
ఈడెన్ గార్డెన్స్ లో గంగూలీ పేరిట స్టాండ్
కోల్కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని ఓ స్టాండ్కు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరు పెట్టనున్నారు. స్టేడియం ఉన్న ప్రాంతం ఆర్మీ ఆధీనంలో ఉండడంతో ఇన్నాళ్లూ వారి అనుమతి కోసం బెంగాల్ క్రికెట్ సంఘం ఎదురు చూడాల్సి వచ్చింది. తాజాగా లైన్ క్లియర్ కావడంతో మొత్తం ఆరు స్టాండ్లకు దాదాతో పాటు దాల్మియా, పంకజ్ రాయ్, బీఎన్ దత్, ఎఎన్ ఘోష్, స్నేహాన్షు ఆచార్య పేర్లు పెట్టనున్నారు. కెరీర్లో 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన సౌరవ్ గంగూలీ, భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశారు. -
స్వచ్ఛభారత్లో టీమిండియా
-
పాక్ నుంచి లాగేసుకుందాం!
న్యూజిలాండ్తో సిరీస్ జరుగుతుంటే... పాక్ నుంచి లాక్కోవడం ఏమిటి? అనుకుంటున్నారా..! ఆశ్చర్యపోకండి. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రికెట్లోనూ ఓ ఘనత సాధించడం ద్వారా భారతదేశాన్ని సంతోషంలో నింపే అవకాశం కోహ్లి సేనకు దక్కింది. న్యూజిలాండ్తో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో గెలిస్తే భారత్ ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ర్యాంక్ పాకిస్తాన్ దగ్గర ఉంది. గత నెలలో వెస్టిండీస్ పర్యటనలో ఉన్నప్పుడు భారత్ నంబర్వన్గా అవతరించింది. అయితే కరీబియన్ పర్యటనలో ఆఖరి టెస్టు రద్దుకావడం... అటు పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్తో సిరీస్ను డ్రా చేసుకోవడంతో... హోదా వాళ్లకు వెళ్లి మిస్బా ‘గద’ అందుకున్నాడు. పాక్ చరిత్రలో తొలిసారి నంబర్వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు న్యూజిలాండ్పై గెలిచి ఆ ర్యాంక్ను లాగేసుకుంటే ఓ పనైపోతుంది. తొలి టెస్టులో అద్భుత విజయం తర్వాత భారత్ ఆత్మవిశ్వాసం ఆకాశంలో ఉండగా... సిరీస్లో కోలుకునే ప్రయత్నంలో న్యూజిలాండ్ మరో పోరాటానికి సిద్ధమవుతోంది. భారత క్రికెట్ మక్కాగా ఖ్యాతిగాంచిన ఈడెన్ గార్డెన్స మైదానంలో జరిగే ఈ టెస్టు మన జట్టుకు మరో మైలురాయిగా చరిత్రలో నిలిచిపోనుంది. సొంతగడ్డపై మన జట్టుకు ఇది 250వ టెస్టు కావడం విశేషం. మరి ఈ మ్యాచ్లోనూ ‘టాప్’ లేపే ప్రదర్శనతో విజయ ‘గంట’ మోగిస్తుందా చూడాలి. నంబర్వన్పై భారత్ గురి నేటి నుంచి న్యూజిలాండ్తో రెండో టెస్టు గెలిస్తే అగ్రస్థానానికి కోహ్లిసేన రాహుల్ స్థానంలో ధావన్! కోల్కతా: భారత గడ్డపై తొలి టెస్టులో ఓడిన తర్వాత సిరీస్లో ప్రత్యర్థి జట్లు కోలుకోవడం చాలా అరుదు. స్వదేశంలో శుభారంభం చేస్తే ఆ పట్టును సిరీస్ మొత్తం నిలబెట్టుకోవడంలో మన జట్టుకు మంచి రికార్డు ఉంది. కాబట్టి ఈ సిరీస్లో కూడా కోహ్లి సేన అదే ఆశిస్తోంది. తొలి టెస్టు విజయానంతరం ఇప్పుడు అదే జోరులో రెండో మ్యాచ్ కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పనిలో పనిగా నంబర్వన్ ర్యాంక్ కూడా చెంతకు చేరుతుంది. ఈ నేపథ్యంలో నేటినుంచి ఇక్కడి ఈడెన్ గార్డెన్సలో న్యూజిలాండ్తో జరిగే రెండో టెస్టుకు భారత్ సన్నద్ధమైంది. మరో వైపు గత మ్యాచ్లో పోరాడిన స్ఫూర్తితో ఈ సారైనా ఓటమి నుంచి తప్పించుకోవాలని కివీస్ భావిస్తోంది. ధావన్కే అవకాశం! గాయపడిన రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్ను ఎంపిక చేయడంతో అతని పునరాగమనంపై ఆసక్తి రేగింది. అరుుతే మ్యాచ్లో గంభీర్తో పోలిస్తే శిఖర్ ధావన్కే తుది జట్టులో చోటు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. మ్యాచ్కు ముందు రోజు గంభీర్తో పోలిస్తే ధావన్ సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశాడు. ఇటీవల ధావన్ ప్రదర్శనలో నిలకడ లేకపోయినా మరీ ఘోరంగా ఏమీ విఫలం కాలేదు కాబట్టి అతనిని పక్కన పెట్టకపోవచ్చు. అశ్విన్ వేలి గాయంతో బాధపడుతున్నా మ్యాచ్ సమయానికి ఫిట్ కాగలడని సమాచారం. అతను గురువారం ప్రాక్టీస్ చేయకపోయినా అది పెద్ద విషయం కాదని కోహ్లి కొట్టి పారేశాడు. కాన్పూర్ టెస్టుతో పోలిస్తే ఈ సారి ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని భారత్ భావిస్తోంది. అదే జరిగితే రోహిత్ను తప్పించి కొత్త బౌలర్ జయంత్ యాదవ్ను ఎంపిక చేస్తారు. కివీస్ జట్టులో ఎక్కువ మంది ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ ఉండటంతో మరో ఆఫ్ స్పిన్నర్ అవసరాన్ని కెప్టెన్ గుర్తు చేశాడు. ఇతర ఆటగాళ్ల విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే స్వదేశంలో ఆడుతూ కూడా గత టెస్టు తొలి ఇన్నింగ్స మన జట్టు భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. సరిగ్గా చెప్పాలంటే మనోళ్లు కూడా స్పిన్ను తగిన విధంగా ఎదుర్కోలేకపోయారు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్ బలహీనతలపై దాడి చేసి భారీ స్కోరు సాధిస్తే ఈ టెస్టులోనూ జట్టుకు తిరుగుండదు. విలియమ్సన్కు అనారోగ్యం ఇప్పటికే గాయాల కారణంగా కీలక ఆటగాళ్లను కోల్పోయిన న్యూజిలాండ్కు రెండో టెస్టుకు ముందు మరో సమస్య వచ్చి పడింది. టీమ్ కెప్టెన్, టాప్ బ్యాట్స్మన్ విలియమ్సన్ గురువారం అనారోగ్యానికి గురయ్యాడు. అతను నిజంగా మ్యాచ్కు దూరమైతే కివీస్ కుప్పకూలిపోతుంది. అయితే తగిన విశ్రాంతితో కెప్టెన్ మ్యాచ్ సమయానికి కోలుకుంటాడని టీమ్ మేనేజ్మెంట్ విశ్వాసంతో ఉంది. విలియమ్సన్ ఆడకపోతే నికోల్స్కు అవకాశం లభిస్తుంది. తొలి టెస్టులో ఘోరంగా విఫలమైనా... ఇతర ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేకపోవడంతో గప్టిల్కు మరో అవకాశం లభించనుంది. క్రెయిగ్ స్థానంలో జట్టుతో చేరిన జీతన్ పటేల్ కూడా మూడేళ్ల తర్వాత మ్యాచ్ ఆడటం ఖాయమైంది. గత మ్యాచ్లో ఆ జట్టు కొంత పోరాట పటిమ కనబర్చింది. కానీ కీలక క్షణాల్లో ఆధిక్యాన్ని అందుకోవడంలో విఫలమైంది. ఆ అనుభవంతో ఈ సారి స్పిన్ను మరింత సమర్థంగా ఎదుర్కోవాలని, మెరుగ్గా ఆడాలని జట్టు పట్టుదలగా ఉంది. సీనియర్ రాస్ టేలర్ కూడా రాణించడం ఎంతో అవసరం. మిషెల్ సాన్ట్నర్, రోంచీ గత ప్రదర్శనను ఇక్కడా కొనసాగించాలని భావిస్తున్నారు. కానీ భారత స్పిన్నర్లను ఎదుర్కోవడం వారికి అంత సులువు కాదు. గతంలో ఈడెన్లో ఆడిన రెండు టెస్టులనూ కివీస్ డ్రాగా ముగించగలిగింది. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, విజయ్, పుజారా, రహానే, రోహిత్/జయంత్, అశ్విన్, సాహా, జడేజా, షమీ, ఉమేశ్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్)/నికోల్స్, గప్టిల్, లాథమ్, టేలర్, సాన్ట్నర్, రోంచీ, వాట్లింగ్, జీతన్, వాగ్నర్, సోధి, బౌల్ట్ ఉ.గం. 9.30 నుంచి స్టార్ స్పోర్ట్స 1లో ప్రత్యక్ష ప్రసారం పిచ్, వాతావరణం ఈడెన్గార్డెన్సలో ఇటీవల తయారు చేసిన కొత్త పిచ్పై తొలిసారి జరుగుతున్న మ్యాచ్ ఇది. ఆరంభంలో బ్యాటింగ్కు అనుకూలించి మూడో రోజునుంచి స్పిన్కు సహకరించే అవకాశం ఉంది. టాస్తో పాటు తొలి ఇన్నింగ్సలో చేసే పరుగులు కీలకం కానున్నాయి. కోల్కతాలో సెప్టెంబర్ నెలలో టెస్టు మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. నగరంలో వర్షాలు కురుస్తున్నాయి. టెస్టుకు కూడా ఏదో ఒక దశలో వాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ‘నంబర్వన్, రికార్డుల గురించి నేను పట్టించుకోను. రెండేళ్ల క్రితంతో పోలిస్తే మేం ఎంత బాగా ఆడుతున్నామో చూస్తున్నారు. నాకు అదే ముఖ్యం. మేం అన్ని రకాలుగా సిద్ధమయ్యాం కాబట్టి పిచ్ గురించి అసలు ఆలోచనే లేదు. అయితే బ్యాటింగ్కు మాత్రం అనుకూలంగా కనిపిస్తోంది. భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడం ముఖ్యం. నా ఫామ్ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ప్రతీ సారి పరుగులు చేయడం సాధ్యం కాదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. డీఆర్ఎస్ వాడకుండా అంపైర్లు తప్పులు చేస్తున్నారని విమర్శించడం సరి కాదు. భవిష్యత్తులో డీఆర్ఎస్ అవసరం ఉంటుందనే.. నా అభిప్రాయం. అయితే ఇప్పుడే దీనిపై నిర్ణయం తీసుకోలేం’. - విరాట్ కోహ్లి ‘మొదటి టెస్టులో కూడా మేం బాగా ఆడాం. ఒకట్రెండు సార్లు వెనుకబడి మ్యాచ్ను కోల్పోయాం. ఈ సారి ఆరంభం బాగుండటంతో పాటు సుదీర్ఘ సమయం పాటు క్రీజ్లో నిలవడమే ముఖ్యం. అప్పుడు మాకూ ఈ టెస్టులో మంచి అవకాశం ఉంటుంది. విలియమ్సన్కు కాస్త నలతగా ఉండి ప్రాక్టీస్ చేయలేదు. అంతే తప్ప పెద్ద సమస్య కాదు. విశ్రాంతి తర్వాత మ్యాచ్ కు సిద్ధంగా ఉంటాడు’. - టామ్ లాథమ్, కివీస్ బ్యాట్స్మన్ కోల్కతా కబుర్లు కివీస్కు గంగూలీ ‘క్లాస్’ ఈడెన్ గార్డెన్సలో ప్రాక్టీస్ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ న్యూజిలాండ్ ఆటగాళ్లతో ముచ్చటించారు. కివీస్ బ్యాటింగ్ కోచ్ మెక్మిలన్, ఇతర సభ్యులకు ఈ సందర్భంగా ఆటకు సంబంధించి గంగూలీ పలు సూచనలు చేశారు. స్పిన్ను ఎదుర్కోవడం, ఇక్కడి పిచ్లపై బంతిని డ్రైవ్ చేయడం తదితర అంశాలపై బ్యాట్తో ఆడి చూపించి కొన్ని కిటుకులు చెప్పారు. న్యూజిలాండ్ ఆటగాళ్లంతా ఆయన సూచనలను శ్రద్ధగా విన్నారు. దాదా టిప్స్ కివీస్కు ఏమైనా ఉపయోగపడతాయా చూడాలి. మరో వైపు తన సొంత మైదానంలోనే ’క్యాబ్’ అధ్యక్షుడు గంగూలీకి చేదు అనుభవం ఎదురైంది. తన కార్యాలయానికి వెళ్లబోయి ఆయన లిఫ్ట్లో చిక్కుకున్నారు. చివరకు దానిని తెరిచి స్టూల్ సహాయంతో గంగూలీని బయటికి తీసుకు రావాల్సి వచ్చింది. 2011లో స్టేడియంను ఆధునీకరించినా 29 ఏళ్లుగా ఉన్న ఈ లిఫ్ట్ను మాత్రం ఇప్పటి వరకు మార్చలేదు. చల్ మేరే భాయ్... దేశవాళీ క్రికెట్లో ఒకే జట్టుకు, భారత జట్టుకు, చివరకు ఉద్యోగం చేసే సంస్థ తరఫున కూడా కలిసి ఆడిన కోహ్లి, గంభీర్లకు చాలా కాలంగా పడదనే విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం ఐపీఎల్లో దాదాపు కొట్టుకున్నంత పని చేసిన తర్వాత మరో రెండు సార్లు కూడా వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు దానిని దూరంగా పెట్టాలని వారు భావించినట్లున్నారు. గంభీర్ కూడా ప్రస్తుత కెప్టెన్తో మంచి సంబంధాలు కొనసాగించాలని అనుకున్నట్లున్నాడు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా వీరిద్దరు సుదీర్ఘ సమయం పాటు ముచ్చటించుకున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకోవడం కూడా అందరినీ ఆకర్షించింది. గంట మోగిస్తారు... లార్డ్స్ మైదానంలో టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు దిగ్గజ క్రికెటర్ ఒకరు అక్కడి పెద్ద గంటను మోగించడం ఆనవాయితీ. తాను కెప్టెన్గా ఉన్ననాటినుంచి ఇది సౌరవ్ గంగూలీని ఆకర్షించింది. అతను తొలి టెస్టు ఆడింది కూడా అక్కడే కావడం విశేషం. అప్పటినుంచి అతను ఆ మైదానంతో పాటు ఆ బెల్పై కూడా ఆకర్షణ పెంచుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ‘క్యాబ్’ అధ్యక్షుడిగా తమ స్టేడియంలో దానిని ఏర్పాటు చేయాలని గంగూలీ భావించాడు. ఫలితంగా ఇప్పుడు అదే తరహాలో పెద్ద గంట ఇక్కడ రెడీ అయింది. భారత్లో మరే మైదానంలోనూ ఇలాంటిది లేదు. చండీగఢ్లో తయారు చేసిన ఈ భారీ గంటకు వెండి తాపడం చేయించారు. మైదానంలోని బీసీ రాయ్ క్లబ్ హౌస్ ఎండ్ వైపు సైట్ స్క్రీన్ పైన ఉంచారు. శుక్రవారం రెండో టెస్టుకు ముందు భారత మాజీ కెప్టెన్ కపిల్దేవ్ దీనిని మోగిస్తారు. -
ఈడెన్లో నెగ్గితే టాప్ ర్యాంక్కు..
దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తిరిగి నంబర్వన్ స్థానం దక్కించుకునే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి న్యూజిలాండ్తో ఈడెన్ గార్డెన్లో జరిగే రెండో టెస్టులో భారత్ నెగ్గితే అగ్రస్థానానికి చేరుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ తమ చరిత్రలో తొలిసారిగా టాప్ ర్యాంకులో ఉంది. కేవలం ఒక్క పాయింట్ తక్కువతో భారత జట్టు తమ సిరీస్ను ప్రారంభించింది. ఇక బౌలర్ల జాబితాలో పది వికెట్లతో రాణించిన స్పిన్నర్ అశ్విన్ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో ర్యాంకుకు చేరాడు. ఆల్రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలోనే ఉన్నాడు. -
ఈడెన్లోనూ భారీ ఏర్పాట్లు
స్వదేశంలో 250వ టెస్టు కోల్కత్తా: భారత క్రికెట్ చరిత్రలో ప్రస్తుతం 500 టెస్టును ఆడుతున్న కోహ్లి సేన కోసం రెండో టెస్టు వేదికై న ఈడెన్ ఈడెన్ గార్డెన్స్ లోనూ భారీ ఏర్పాట్లే చేస్తున్నారు. కోల్కతాలో జరిగే ఈ మ్యాచ్ సొంతగడ్డపై భారత్కు 250వ టెస్టు కావడంతో ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అభిషేక్ దాల్మియా తెలిపారు. -
ఇక ఈడెన్లో 'గంట' మోగనుంది!
కోల్కతా: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంట కొట్టిన తరువాత టెస్టు మ్యాచ్ను ప్రారంభించడం ఆనవాయితీ. ఈ మైదానంలో టెస్టు మ్యాచ్ జరిగనన్నీ రోజులూ రెండు దేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ గంట కొట్టి మ్యాచ్ను ఆరంభిస్తారు. ఇందుకు పెవిలియన్ కు వెలుపల ఉండే బౌలర్ల బార్లో గంట వేలాడదీసి ఉంటుంది. అయితే ఈ తరహా పద్ధతిపై భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మనసు పడ్డాడు. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో ఉన్న గంగూలీ.. త్వరలో నగరంలోని ఈడెన్ గార్డెన్లో లార్డ్స్ తరహా బెల్ ను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టాడు. వచ్చే సెప్టెంబర్లో ఈడెన్ గార్డెన్ గంటను ఏర్పాటు చేయబోతున్నట్లు శనివారం స్పష్టం చేశాడు. 'అవును.. లార్డ్స్ తరహా గంటను ఈడెన్లో ప్రవేశపెట్టబోతున్నాం. మ్యాచ్ జరిగే ప్రతీ రోజూ ఇరు జట్లలోని మాజీ ఆటగాళ్లు గంటతో మ్యాచ్ ను ఆరంభిస్తారు. ఇప్పటికే గంటను కొనుగోలు చేశాం. సెప్టెంబర్లో అమర్చడానికి యత్నిస్తున్నాం' అని గంగూలీ తెలిపాడు. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. 2014వ సంవత్సరంలో లార్డ్స్ లో గంట కొట్టే అరుదైన అవకాశం గంగూలీకి దక్కిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా లార్డ్స్లో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో గంగూలీ గంట కొట్టి మ్యాచ్ను ప్రారంభించాడు. -
‘గులాబీ’ గుబాళిస్తుంది!
పింక్ బంతిపై గంగూలీ నమ్మకం కోల్కతా: క్రికెట్లో గులాబీ బంతుల వినియోగాన్ని కొత్త ఆకర్షణగా భావించాలని, ఈ ప్రయోగం మన దేశంలో కూడా విజయవంతమవుతుందని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయ పడ్డారు. భారత్లో పింక్ బంతిని ఉపయోగిస్తూ తొలి డే అండ్ నైట్ మ్యాచ్ రేపటినుంచి ఈడెన్గార్డెన్స్లో నాలుగు రోజుల పాటు జరగనుంది. భవానీపూర్ క్లబ్, మోహన్ బగాన్ జట్ల మధ్య ఈ ‘క్యాబ్’ సూపర్ లీగ్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు. మ్యాచ్ కోసం పింక్ కూకాబుర్రా బంతిని వాడనున్నారు. మరో వైపు భారత టాప్ స్పిన్నర్ అశ్విన్కు ఈ బంతినిచ్చి అది ఎలా టర్న్ అవుతుందో పరీక్షించాలని వీవీఎస్ లక్ష్మణ్ సూచించారు. ఈ నాలుగు రోజుల మ్యాచ్ మధ్యాహ్నం 2.30నుంచి రాత్రి 9 వరకు స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కూడా కానుంది. -
వైజాగ్లో ఇంగ్లండ్ టెస్టు
► హైదరాబాద్లో బంగ్లాదేశ్ మ్యాచ్ ► సిరీస్లకు వేదికలు ఖరారు ముంబై: ఈ సీజన్లో భారత్ జట్టు స్వదేశంలో ఆడబోయే సిరీస్లకు వేదికలు ఖరారయ్యాయి. గతేడాది నవంబరులో టెస్టు హోదా సంపాదించిన వైజాగ్ తొలిసారిగా ఇంగ్లండ్, భారత్ల టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాజ్కోట్, పుణే, ధర్మశాల, రాంచీ, ఇండోర్లకు కూడా ఈ సీజన్లో తొలిసారి టెస్టు మ్యాచ్లు నిర్వహించే అవకాశం లభించింది. అలాగే బంగ్లాదేశ్ జట్టు భారత్తో ఆడే ఏకైక టెస్టు మ్యాచ్కు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ సీజన్లో భారత్ స్వదేశంలో 13 టెస్టులు, 8 వన్డేలు, 3 టి20 మ్యాచ్లు ఆడనుంది. తొలుత న్యూజిలాండ్, ఆ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు భారత్లో పర్యటిస్తాయి. అలాగే దేశంలో తొలిసారి డేనైట్గా ఈడెన్గార్డెన్స్లో నిర్వహించాలని భావిస్తున్న టెస్టు న్యూజిలాండ్తో జరిగే అవకాశం ఉంది. -
ఈడెన్లో తొలి డే అండ్ నైట్ టెస్టు!
కోల్కతా: భారత్ తొలిసారి జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ వేదిక ఖరారైంది. కోల్కతా నగరంలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం భారత్లో జరిగే తొలి డే అండ్ నైట్ టెస్టుకు వేదిక కానుంది. సూపర్ లీగ్ లో భాగంగా ఫైనల్ మ్యాచ్ ను ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహించనున్నారు. దీనిపై క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్లను విజయవంతంగా నిర్వర్తించడానికి సాధ్యమైనన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఇందులో భాగంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దేశవాళీ లీగ్ లో భాగమైన సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ను ఇక్కడ డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 17వ తేదీ నుంచి 20 వరకూ ఈ జరిగే సూపర్ లీగ్ డే అండ్ నైట్ టెస్టు ఫైనల్ ను భారత్లో ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య డే అండ్ నైట్ టెస్టు జరుగనున్న సంగతి తెలిసిందే. అయితే డే అండ్ నైట్ టెస్టు కోసం మొదటిసారిగా ‘కూకాబుర్రా’ పింక్ బంతులను ఉపయోగించనున్నారు. -
పఠాన్... ఫటాఫట్
► ప్లే ఆఫ్కు చేరువైన కోల్కతా ► పుణేపై 8 వికెట్లతో నైట్రైడర్స్ విజయం కోల్కతా: బౌలర్ల సమష్టి కృషికి యూసుఫ్ పఠాన్ (18 బంతుల్లో 37 నాటౌట్; 4 ఫోర్లు; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ప్లే ఆఫ్కు మరింత చేరువైంది. శనివారం ఈడెన్ గార్డెన్స్లో రైజింగ్ పుణే సూపర్జెయింట్స్తో జరిగిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 8 వికెట్లతోనెగ్గింది. ఈ విజయంతో కోల్కతా 14 పాయింట్లకు చేరింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్లో 17.4 ఓవర్లలో ఆరు వికెట్లకు 103 పరుగులు చేశాక భారీ వర్షం పడింది. దీంతో కోల్కతాకు డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయానికి 9 ఓవర్లలో 66 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. కోల్కతా 5 ఓవర్లలోనే రెండు వికెట్లకు 66 పరుగులు చేసి గెలిచింది. పుణేను ఏ దశలోనూ కోల్కతా బౌలర్లు కుదురుకోనీయలేదు. జార్జి బెయిలీ (27 బంతుల్లో 33; 3 ఫోర్లు; 1 సిక్స్) టాప్ స్కోరర్గా నిలవగా ఖవాజా (17 బంతుల్లో 21; 3 ఫోర్లు) ఓమాదిరిగా ఆడాడు. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓపెనర్ రహానే (2) విఫలం కావడం జట్టును ఇబ్బంది పెట్టింది. బెయిలీ, సౌరభ్ తివారీ (12 బంతుల్లో 13; 1 ఫోర్) మూడో వికెట్కు జోడించిన 41 పరుగులే ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం. బెయిలీ అవుటయ్యే సమయానికి 10.3 ఓవర్లలో 74 పరుగులతో పుణే కాస్త పటిష్టంగానే కనిపించినా ఆ తర్వాత లయ తప్పింది. బంతి విపరీతంగా టర్న్ అవుతుండడంతో కెప్టెన్ ధోని కూడా భారీ షాట్లకు వెళ్లే సాహసం చేయలేదు. దీంతో 22 బంతులాడిన తను ఒక్క బౌండరీ కూడా లేకుండా కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా... షకీబ్, రాజ్పుత్, రస్సెల్లకు తలా ఓ వికెట్ దక్కింది. లక్ష్య ఛేదనలో కోల్కతా తొలి ఓవర్లోనే అశ్విన్ బౌలింగ్లో ఓపెనర్లు ఉతప్ప (4), గంభీర్ (0)ల వికెట్లు కోల్పోయింది. అయితే యూసుఫ్ పఠాన్, మనీష్ పాండే (10 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) క్రీజులో నిలదొక్కుకుని పరుగులు రాబట్టారు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో యూసుఫ్ వరుసగా 6,4,4 బాది... అదే జోరుతో చెలరేగిపోవడంతో మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే కోల్కతా గెలిచింది. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్జెయింట్స్ ఇన్నింగ్స్: రహానే (బి) రస్సెల్ 2; ఖవాజా (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) షకీబ్ 21; బెయిలీ (స్టంప్డ్) ఉతప్ప (బి) పీయూష్ చావ్లా 33; సౌరభ్ తివారీ (సి) ఉతప్ప (బి) రాజ్పుత్ 13; ఇర్ఫాన్ (రనౌట్) 7; ధోని నాటౌట్ 8; పెరీరా (సి) పాండే (బి) పీయూష్ చావ్లా 13; అశ్విన్ నాటౌట్ 0; ఎక్స్ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో 6 వికెట్లకు) 103. వికెట్ల పతనం: 1-19, 2-26, 3-67, 4-74, 5-87, 6-102. బౌలింగ్: రస్సెల్ 2-0-11-1; మోర్కెల్ 3-0-22-0; షకీబ్ 3-0-21-1; రాజ్పుత్ 2-0-14-1; పీయూష్ చావ్లా 4-0-21-2; నరైన్ 3.4-0-10-0. కోల్కతా నైట్రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 4; గంభీర్ ఎల్బీడబ్ల్యు (బి) అశ్విన్ 0; మనీష్ పాండే నాటౌట్ 15; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 37; ఎక్స్ట్రాలు 10; మొత్తం (5 ఓవర్లలో 2 వికెట్లకు) 66. వికెట్ల పతనం: 1-5, 2-8. బౌలింగ్: అశ్విన్ 2-0-30-2; దిండా 1-0-13-0; ఎం.అశ్విన్ 1-0-13-0; జంపా 1-0-8-0. -
ఆ ఫీలింగ్స్ చెప్పలేకపోతున్నాను: కోహ్లీ
కోల్కతా: 'ఎదురుగా దాదా అన్నయ్య ఉన్నాడు. స్టాండ్స్లో సచిన్ ఉన్నారు. ఇండియా కోసం సచిన్ ఏం చేశారో.. సచిన్ కోసం అభిమానులు ఎంతగా కేకలు పెడతారో నా చిన్నతనం నుంచి చూస్తూ వచ్చాను' అని భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. చాలాకాలం తర్వాత తనకు సచిన్ ముందు ఆడే గొప్ప అవకాశం వచ్చిందని, నా ఆటను చూస్తూ ఆయన ఉత్సాహంగా గడపడం చూశానని అన్నాడు. సచిన్ నే ఆదర్శంగా తీసుకొని క్రికెట్ లో అడుగుపెట్టిన నాలాంటి యువ క్రీడాకారుడికి సచిన్ ముందే ఆడుతున్న క్షణంలో ఆ ఫీలింగ్స్ వర్ణించడం సాధ్యం కాదని అన్నాడు. సచిన్ ముందే ఆడుతూ, ఆయనకు గొప్పసంతోషాన్నివ్వగలగడం గొప్ప అనుభూతి అని, భావోద్వేగంతో నిండిన సందర్భం అని చెప్పారు. పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ మైదానంలో అర్ధ సెంచరీ సాధించి భారత్ కు కీలక విజయాన్ని కోహ్లీ అందించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మైదానంలో బ్యాట్ తో గౌరవ వందనం కూడా చేశాడు. -
మ్యాచ్ తర్వాత చాలా బాధపడ్డాను: కోహ్లీ
కోల్ కతా: తాను చాలా బాధపడ్డానని భారత స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ అంటున్నాడు. అదేంటీ దాయాది జట్టు పాక్ ను మట్టికరిపించినందుకు విరాట్ భాద పడటం ఏంటని కంగారు పడకండీ. టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఈ నెల 15న జరిగిన తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైనందుకు చాలా ఫీలయ్యానని చెప్పాడు. ఆ మ్యాచ్ లో తాను 23 పరుగులు మాత్రమే చేసి ఔటయినందుకు చాలా బాధపడ్డానని విరాట్ వెల్లడించాడు. అయితే 40-45 పరుగులు చేసినట్లయితే మ్యాచ్ భారత్ గెలుస్తుందని భావించానని తన మనసులో మాటను బయటపెట్టాడు. గత మ్యాచ్ ఓటమి వల్ల పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చాలా ఓపికగా, చాలా కూల్ గా ఇన్నింగ్స్ ఆడినట్లుగా కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడల్లా తన బ్యాట్ నుంచి ఓ మంచి ఇన్నింగ్స్ వస్తుందన్నాడు. పాకిస్తాన్ తో ఈడెన్ గార్డెన్ మైదానంలో అర్ధ సెంచరీ సాధించినప్పుడు భారత బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి ఎప్పటిలాగానే బ్యాట్ పైకెత్తి చూపించడంతో ఆగిపోలేదు. స్టేడియంలోని ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది. అది తాను ఎంతో అభిమానించే క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పిన విషయం తెలిసిందే. -
ప్రపంచంలో ఎప్పుడైనా...ఎక్కడైనా...
► ఈడెన్లోనూ పాకిస్తాన్పై భారత్ విజయం ► చెలరేగిన విరాట్ కోహ్లి భారత్ మళ్లీ గర్జించింది... విశ్వ వేదికపై మనల్ని ఓడించడం పక్కవాడి, పగవాడి తరం కాదని మరో సారి నిరూపించింది. చరిత్ర మార్చడం అంత సులువు కాదని, అదిప్పుడు శిలాక్షరంగా మారిపోయిందని ప్రత్యర్థికి గట్టిగా గుర్తు చేసింది. ఈడెన్లో శత సహస్ర సంఖ్యలో ‘హిందుస్తాన్ జిందాబాద్’ అని వినిపిస్తుండగా, సగర్వంగా మరో విజయాన్ని అందుకుంది. ఈ మైదానం మాకు అచ్చి వచ్చిందని చెప్పుకుంటూ ఆటకు ముందే సంబరపడిన పాకిస్తాన్ను ధోని సేన దుమ్ము దులిపింది. ఇక్కడే కాదు ప్రపంచంలో భారత్తో ఎక్కడ ప్రపంచకప్ మ్యాచ్ జరిగినా విజయం వారి వాకిలి వైపు కూడా తిరిగి చూడదని ఆ జట్టుకు అర్థమయ్యేలా గట్టి దెబ్బ కొట్టిన మన జట్టు పనిలో పనిగా సొంతగడ్డపై ప్రపంచకప్లో మనమేంటో చూపిస్తూ రేసులో నిలబడింది. కొలంబో, ఢాకా, సిడ్నీ, కోల్కతా... మైదానం ఏదైనా ‘పాకిస్తాన్తో మ్యాచ్ అంటే నేనే గెలిపిస్తాను’ అని విరాట్ కోహ్లి మరోసారి ఢంకా బజాయించి చెప్పాడు. దాయాదిపై తన ఘన రికార్డును నిలబెట్టుకున్నాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి ఆందోళనతో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కుచిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోల్కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి టి20 ప్రపంచకప్లో భారత్ మళ్లీ రేస్లోకి వచ్చేసింది. గత మ్యాచ్ ఓటమి నుంచి తొందరగానే కోలుకున్న ధోనిసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ని చిత్తు చేసి వరల్డ్కప్లలో తమ రికార్డును నిలబెట్టుకుంది. శనివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన పాక్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. మాలిక్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్మల్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కీలక భాగస్వామ్యంతో ఆ జట్టు ఈ మాత్రం పరుగులైనా చేయగలిగింది. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (37 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్ ) అర్ధ సెంచరీతో చెలరేగగా, యువరాజ్ (23 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగోవికెట్కు 44 బంతుల్లోనే 61 పరుగులు జోడించడం విశేషం. భారత్ తమ తర్వాతి మ్యాచ్లో ఈ నెల 23న బంగ్లాదేశ్తో తలపడుతుంది. కీలక భాగస్వామ్యం గింగిరాలు తిరుగుతున్న అశ్విన్ బంతి, అనూహ్య బౌన్స్... చూస్తే ఈడెన్ గార్డెన్ కూడా నాగ్పూర్ పిచ్లాగే అనిపించింది. పాక్ జట్టు కూడా తడబడుతూనే తమ ఇన్నింగ్స్ను నెమ్మదిగా ప్రారంభించింది. మూడో ఓవర్ చివరి బంతికి గానీ ఆ జట్టు తొలి బౌండరీని కొట్టలేకపోయింది. భారత బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన ఓపెనర్లు షర్జీల్ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు), షహజాద్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. గత మ్యాచ్లో బంగ్లాపై చెలరేగిన ఆఫ్రిది (8) ఒక్కో బంతిని ఆడేందుకు శ్రమించి చివరకు పాండ్యా బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ దశలో మాలిక్, అక్మల్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పాండ్యా వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రావడంతో పాక్ పరిస్థితి కాస్త మెరుగైంది. వీరిద్దరు నాలుగో వికెట్కు 4 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. చివర్లో మళ్లీ వేగం తగ్గిన పాక్ ఆఖరి 3 ఓవర్లలో 23 పరుగులతోనే సరిపెట్టుకుంది. పిచ్పై తేమను ఉపయోగించుకోవడంతో పాటు వర్షం పడితే లక్ష్య ఛేదనపై స్పష్టత ఉంటుందని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోగా... పాక్ మాత్రం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ స్థానంలో అనూహ్యంగా నాలుగో పేసర్గా సమీని ఎంచుకుంది. సూపర్ కోహ్లి: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో మళ్లీ న్యూజిలాండ్ మ్యాచ్ అనుభవాన్నే గుర్తుకు తెచ్చింది. ఇర్ఫాన్ ఓవర్లో 2 ఫోర్లు బాదిన తర్వాత రోహిత్ (10) ఆమిర్ చక్కటి బంతికి వెనుదిరగ్గా, ఆ వెంటనే సమీ వరుస బంతుల్లో ధావన్ (6), రైనా (0)లను క్లీన్బౌల్డ్ చేసి ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ ఎప్పటిలాగే కోహ్లి ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో జాగ్రత్తగా ఆరంభం చేసి నిలదొక్కుకున్న తర్వాత దూకుడు కనబర్చాడు. పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా కోహ్లిని కనీసం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరో వైపు యువరాజ్నుంచి కోహ్లికి చక్కటి సహకారం లభించింది. చాలా కాలం తర్వాత యువరాజ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ప్రతీ బౌలర్ను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. చివర్లో అనవసర షాట్తో యువీ వెనుదిరిగినా... కోహ్లి, ధోని (13 నాటౌట్) మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) పాండ్యా (బి) రైనా 17; షహజాద్ (సి) జడేజా (బి) బుమ్రా 25; ఆఫ్రిది (సి) కోహ్లి (బి) పాండ్యా 8; అక్మల్ (సి) ధోని (బి) జడేజా 22; మాలిక్ (సి) అశ్విన్ (బి) నెహ్రా 26; సర్ఫరాజ్ (నాటౌట్) 8; హఫీజ్ (నాటౌట్) 5; ఎక్స్ట్రాలు 7; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-38; 2-46; 3-60; 4-101; 5-105. బౌలింగ్: నెహ్రా 4-0-20-1; అశ్విన్ 3-0-12-0; బుమ్రా 4-0-32-1; జడేజా 4-0-20-1; రైనా 1-0-4-1; పాండ్యా 2-0-25-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మాలిక్ (బి) ఆమిర్ 10; ధావన్ (బి) సమీ 6; కోహ్లి (నాటౌట్) 55; రైనా (బి) సమీ 0; యువరాజ్ (సి) సమీ (బి) రియాజ్ 24; ధోని (నాటౌట్) 13; ఎక్స్ట్రాలు 11; మొత్తం (15.5 ఓవర్లలో 4 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-14; 2-23; 3-23; 4-84. బౌలింగ్: ఆమిర్ 3-1-11-1; ఇర్ఫాన్ 2.5-0-25-0; సమీ 2-0-17-2; ఆఫ్రిది 4-0-25-0; మాలిక్ 2-0-22-0; రియాజ్ 2-0-16-1. సచిన్కు వందనం అర్ధ సెంచరీ సాధించినప్పుడు విరాట్ కోహ్లి ఏదో బ్యాట్ చూపించడంతో ఆగిపోకుండా ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది. అప్పటికే జట్టు విజయం దాదాపు ఖాయమైన స్థితిలో హాఫ్ సెంచరీకి ఈ రకంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే అది తాను ఎంతో అభిమానించే దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పాడు. సచిన్ ఎన్నో గొప్ప చారిత్రాత్మక ఇన్నింగ్స్లు ఆడి జట్టును గెలిపించారని, ఆయన సమక్షంలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఎంతో కాలంగా కోరుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఇప్పుడు ఇది సరైన సందర్భంగా తాను భావించానని, అందుకే సచిన్కు ఈ తరహాలో వందనం చేసినట్లు అతను వెల్లడించాడు. ప్రతిగా సచిన్ కూడా చిరునవ్వుతో విరాట్కు బదులిచ్చారు. 11 ప్రపంచకప్లలో (వన్డేలు, టీ20లు కలిపి) పాకిస్తాన్పై భారత్ గెలవడం ఇది 11వ సారి. -
ముచ్చట్లు పెట్టిన రైనా, షోయబ్..
కోల్కతా : ఈసారి టీ20 ప్రపంచ కప్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్ లోనే మాకు ఫ్యాన్స్ ఎక్కువ అంటూ ఇటీవల పాక్ కెప్టెన్ అఫ్రిది వ్యాఖ్యలు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. కాగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఇరు టీమ్లు బుధవారం సాయంత్రమే కోల్కతాకు చేరుకున్నాయి. అయితే అక్కడి పరిస్థితులు మాత్రం మునుపటి కంటే భిన్నంగా కనిపించాయి. భారత్, పాక్ క్రికెటర్లు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. భారత స్టార్ ప్లేయర్ సురేష్ రైనా, పాక్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ చాలాసేపు ముచ్చట్లు పెట్టారు. కనిపించగానే ఆలింగనం చేసుకున్న ఈ ఇద్దరూ ఒకరినొకరు అభినందించుకుంటూ గడిపారు. భారత జట్టు గురువారం దాదాపుగా హోటల్కే పరిమితమయింది. ప్రాక్టీస్ ఆప్షనల్ కావడంతో కేవలం రైనా, రహానే, నేగి మాత్రమే స్టేడియానికి వెళ్లారు. కోచ్ సంజయ్ బంగర్ సాయంతో రైనా ఫుల్ షాట్లు ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు పాకిస్తాన్ జట్టులో కూడా కేవలం ఐదుగురు మాత్రమే ప్రాక్టీస్కు వచ్చారు. -
'మూడు ఈడెన్లూ సరిపోవు'
కోల్కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి : బాబోయ్.. ఏంటీ ఫోన్లు.. మూడు ఈడెన్గార్డెన్స్ ఉన్నా ఈ తాకిడికి తట్టుకోలేం, టిక్కెట్లు ఇవ్వడం మా వల్ల కాదు.. బెంగాల్ క్రికెట్ సంఘంలోని ఓ సీనియర్ అధికారి గురువారం వ్యక్తం చేసిన మాటలు ఇవి. మామూలుగానే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే టిక్కెట్ల కోసం క్యూలు కడతారు. ఇక ప్రపంచకప్లో ఈ రెండు జట్ల మధ్య పోరు అంటే ఊరుకుంటారా..! కానీ ఈసారి ఐసీసీ భారత మ్యాచ్ల టిక్కెట్లను ఆన్లైన్లో లాటరీ ద్వారా అమ్మింది. దీంతో స్థానికంగా క్రికెట్ అభిమానులు టిక్కెట్ల కోసం నానాపాట్లు పడుతున్నారు. ప్రస్తుతం నగరాన్ని క్రికెట్ వేడి బలంగా తాకింది. ఎలాగైనా పాకిస్తాన్తో మ్యాచ్ను చూడాలని ఎంత డబ్బైనా పెట్టి టిక్కెట్లు కొనాలని అభిమానులు తిరుగుతున్నారు. వీరావేశపరులు కోల్కతా అభిమానులకు ఆవేశం ఎక్కువ. 1966లో వెస్టిండీస్తో టెస్టు సందర్భంగలా మొదలైన రగడ ఇప్పటికీ అడపాదడపా సాగుతూనే ఉంది. 1996లో ప్రపంచకప్ సెమీఫైనల్ సందర్భంగా ఈడెన్లో అభిమానులు చేసిన రచ్చ ఐసీసీ ఇప్పటికీ మరచిపోలేదు. 1999లో ఇక్కడ పాకిస్తాన్తో జరిగిన టెస్టు మ్యాచ్లో సచిన్ అవుటయ్యాక మైదానంలో సీసాలు విసిరి అంతా ఆగం చేశారు. దీంతో స్వయంగా సచిన్ వెళ్లి అభిమానులకు సర్దిచెప్పాల్సి వచ్చింది. ఇలాంటి వేదికలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే సహజంగానే భారత క్రికెటర్లపై ఒత్తిడి పెరగడం సహజం. పాక్కు కలిసొచ్చిన వేదిక ప్రపంచకప్ల చరిత్రలో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ చేతిలో ఓడిపోలేదు. అదే సమయంలో ఈడెన్ గార్డెన్స్లో భారత్ ఎప్పుడూ పాకిస్తాన్పై గెలవలేదు. ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ టి20లు జరగలేదు. కానీ నాలుగు వన్డేలు ఆడితే అన్నీ పాకిస్తాన్ గెలిచింది. ఇక తాజాగా ఈసారి ప్రపంచకప్ తొలి మ్యాచ్లో పాకిస్తాన్ ఇదే వేదికలో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. తమ దేశం నుంచి నేరుగా ఇక్కడికే వచ్చిన పాక్ జట్టు దాదాపుగా ఈ పరిస్థితులకు అలవాటు పడిపోయింది. అటు భారత్ కూడా టోర్నీలో తొలి ప్రాక్టీస్ మ్యాచ్ ఇక్కడే ఆడింది. బలమైన వెస్టిండీస్ను ఆ మ్యాచ్లో ధోనిసేన చిత్తు చేసింది. ఈ వేదిక మీద అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ చెలరేగి ఆడతాడు. తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమి తరువాత భారత జట్టు ఇక ప్రతి మ్యాచ్లోనూ కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో కోల్కతా వచ్చింది. -
మళ్లీ ‘తమాషా’ మొదలు!
భద్రతపై రాతపూర్వక హామీ కోరుతున్న పాక్ ప్రభుత్వం జట్టు రాక మరింత ఆలస్యం ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: అసలు ఆడలేమన్నారు... గట్టి భద్రత కల్పిస్తామంటూ భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫలానా చోట ఆడలేమని, వేదిక మార్చమన్నారు... దానికీ సరేనంటూ వారి విజ్ఞప్తిని ఐసీసీ అంగీకరించింది. ప్రపంచకప్లో పాక్ పాల్గొనేందుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నా, ఇప్పుడు ఆ దేశం మరో కొత్త పాట అందుకుంది. భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలట! అప్పుడే తాము దేశంలో అడుగు పెడతామని, అప్పటి దాకా ఆటగాళ్లు పాకిస్తాన్నుంచి కదలరని ఆ దేశ ప్రభుత్వం చెప్పేసింది. ‘ఇప్పుడే జట్టును పంపే పరిస్థితిలో మేం లేము. పాకిస్తాన్కు కొన్ని భయాలు ఉన్నాయి. ఆటగాళ్లు అక్కడ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదనే మా ఉద్దేశం. భారత ప్రభుత్వంనుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు మా జట్టు భారత్కు బయల్దేరదు’ అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి అన్నారు. బెదిరింపుల మధ్య క్రికెట్ ఎలా ఆడగలమని, లక్ష మంది సామర్థ్యం గల ఈడెన్గార్డెన్స్లోకి ఎవరైనా అవాంఛిత వ్యక్తులు వస్తే ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ వాదనను భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి వికాస్ స్వరూప్ కొట్టి పారేశారు. ‘ఒక అంతర్జాతీయ ఈవెంట్కు ఎలాంటి భద్రత అవసరమో అలాంటి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఇటీవల పాక్ కూడా పాల్గొన్న ‘శాఫ్’ క్రీడలు ఎంత బాగా జరిగాయో అందరికీ తెలుసు. వరల్డ్ కప్నూ అలాగే సమర్థంగా నిర్వహిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. జట్టు ఎప్పుడు బయల్దేరాలో స్పష్టత వచ్చే వరకు పాకిస్తాన్ జట్టు సభ్యులు లాహోర్లోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉంటారని పీసీబీ ప్రకటించింది. -
‘కథ’ కోల్కతాకు చేరింది
► ఈడెన్ గార్డెన్స్లో భారత్, పాక్ మ్యాచ్ ► భద్రతా కారణాలతో వేదిక మార్పు ► తప్పలేదని ప్రకటించిన ఐసీసీ న్యూఢిల్లీ: మైదానంలో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే అందరిలో ఉండే ఉత్కంఠ, ఆసక్తి వేరు. కానీ ఆ మ్యాచ్ ఎక్కడ ఆడాలనేదానిపై కూడా అదే స్థాయిలో డ్రామా కొనసాగింది. దాదాపు పది రోజుల పాటు అనేక మలుపులు తిరిగిన ఈ వివాదానికి ఎట్టకేలకు బుధవారం తెర పడింది. టి20 ప్రపంచకప్లో భాగంగా ఈ నెల 19న ఇరు జట్ల మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక మారింది. ధర్మశాలలో ఆడలేమంటూ పాక్ బోర్డు చేసిన విజ్ఞప్తికి స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ మ్యాచ్ను కోల్కతాలో నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం 19నే ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. ‘భద్రతా కారణాలతో ఈ మ్యాచ్ వేదికను మార్చాలని నిర్ణయించాం. దీని వల్ల చాలా మందికి ఇబ్బంది కలుగుతుందని ఐసీసీ, బీసీసీఐకి తెలుసు. అయితే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రతపై సందేహం పెంచేలా చేసిన వ్యాఖ్యలతో సమస్య మొదలైంది. మరికొంత మంది మ్యాచ్కు అడ్డంకులు సృష్టిస్తామని కూడా బెదిరించారు. అన్ని వర్గాల రక్షణ బాధ్యత మాపై ఉంది. ఐసీసీ భద్రతా అధికారులతో పాటు పీసీబీ సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. వేదిక మార్చడం తప్ప మాకు మరో ప్రత్యామ్నాయం లేకపోయింది’ అని ఐసీసీ సీఈ డేవ్ రిచర్డ్సన్ వ్యాఖ్యానించారు. భారత్లాంటి పెద్ద దేశంలో పరిస్థితుల గురించి తమకు తెలుసని, ఐసీసీ ఈవెంట్ల నిర్వహణ సమయంలో అనేక సవాళ్లు ఎదురు కావడం సహజమేనన్న రిచర్డ్సన్... బీసీసీఐపై ఎలాంటి చర్య తీసుకునే అవకాశం లేదన్నారు. ఐసీసీ నిర్ణయాన్ని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్వాగతించారు. మరోవైపు ఇప్పటికే ధర్మశాల మ్యాచ్కు టికెట్లు పొందినవారికి ఆసక్తి ఉంటే కోల్కతాకు అవే టికెట్లను అనుమతిస్తామని, లేదంటే పూర్తి మొత్తం వెనక్కి ఇస్తామని కూడా రిచర్డ్సన్ చెప్పారు. ‘తమాషా’ ముగిసింది! భారత్, పాక్ మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని, అందులో మార్పు లేదని స్వయంగా టోర్నమెంట్ డెరైక్టర్ ఎంవీ శ్రీధర్ ప్రకటించిన మరుసటి రోజే సీన్ మారిపోయింది. సోమవారం ధర్మశాల స్టేడియాన్ని సందర్శించిన పాక్ ప్రత్యేక బృందం ఇక్కడ తగిన భద్రతా ఏర్పాట్లు లేవంటూ నివేదిక ఇవ్వడంతో బుధవారం భారత్ బయల్దేరాల్సిన తమ జట్టును పీసీబీ నిలిపివేసింది. మొహాలీ, కోల్కతాలలో ఏదో ఒక చోటుకు మార్చాలంటూ విజ్ఞప్తి చేయగా... చివరికి వారి మాటకే ఐసీసీ తలొగ్గాల్సి వచ్చింది. అన్నింటికంటే ముందుగా తాము మ్యాచ్కు తగిన భద్రత కల్పించలేమని, మాజీ సైనికులు అభ్యంతరం చెబుతున్నారంటూ ఈ నెల 1న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కేంద్రానికి రాసిన లేఖతో వివాదం రాజుకుంది. ఈ వ్యాఖ్యలను చూపిస్తూ పాక్ బోర్డు తమ భద్రతపై గట్టి హామీ ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరింది. ధర్మశాలలోనే మ్యాచ్ జరిపేందుకు ఐసీసీ, బీసీసీఐ చివరి వరకు పట్టుదల కనబర్చినా లాభం లేకపోయింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందంటూ స్వయంగా హోంశాఖ ప్రకటించినా... అది సరిపోలేదు. పాపం ఠాకూర్... బీసీసీఐ కార్యదర్శి హోదాలో ప్రతిష్టాత్మక మ్యాచ్ను తన సొంత మైదానంలో నిర్వహించే అవకాశం దక్కించుకున్న అనురాగ్ ఠాకూర్ అత్యుత్సాహం చివరకు ఆయనకు నిరాశనే మిగిల్చింది. డిసెంబర్ 11న ఈ మ్యాచ్ ప్రకటించినప్పుడే కేవలం 20 వేల సామర్థ్యం మాత్రమే ఉన్న ధర్శశాలకు కేటాయించడంపై విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఠాకూర్ ప్రపంచకప్కు సిద్ధమయ్యారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రినుంచి వ్యతిరేకత వచ్చింది. బీజేపీ ఎంపీ, యువమోర్చా అధ్యక్షుడిగా కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి మ్యాచ్ జరిపేందుకు ఆయన చివరి వరకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే కేవలం ఠాకూర్ కోసం సమస్యను మరింత జటిలం చేసుకోవడం ఇష్టం లేని ఐసీసీ వేదిక మార్చింది. భారత్లో పెద్ద మైదానమైన ఈడెన్లో ‘పెద్ద’ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఫైనల్కు కూడా ఇదే వేదిక అయినా... లీగ్ షెడ్యూల్లో భారత్ ఆడే ఒక్క మ్యాచ్ కూడా ఇక్కడ లేకపోవడంతో ఈడెన్ను వేదికను చేశారు. భారత్, పాక్ మ్యాచ్ ధర్మశాలనుంచి తరలిపోవడం పట్ల అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆవేదనకు, అసహనానికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో అందరి పరువు పోయిందని ఆయన అన్నారు. ‘హిమాచల్ రాష్ట్రం, దేశం పేరు ప్రతిష్టలు చెడగొట్టడంలో ముఖ్యమంత్రి సఫలమయ్యారు. అధికార పార్టీ ఇక్కడి వాతావరణాన్ని చెడగొట్టడం అందరినీ ఇబ్బంది పెట్టింది. ఒక సీఎం ఇలా చేయడం దురదృష్టకరం. వారి దృష్టిలో దేశంకంటే సొంత కుటుంబం, పార్టీకే ప్రాధాన్యత. ప్రపంచకప్ మ్యాచ్ నిర్వహణ కోసం ప్రతీ రాష్ట్రం పోటీ పడుతుంది. మనకు ఈ అవకాశం దక్కితే భద్రత లేదంటూ కాలదన్నుకోవడం ఘోరం’ అని ఠాకూర్ తీవ్ర నిరాశతో వ్యాఖ్యానించారు. -
భారత్, పాక్ మ్యాచ్ వేదిక మారింది..
న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్తాన్ల మధ్య ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మార్పుచేసింది. ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ వేదికను కోల్ కతా కు మార్చుతున్నట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ మైదానం దాయదుల పోరుకు సిద్ధం చేయనున్నారు. పాక్తో మ్యాచ్కు సరైన భద్రత ఇవ్వలేమని హిమాచల్ ప్రదేశ్ సీఎం తేల్చి చెప్పిన విషయం విదితమే. టీ20 ప్రపంచ కప్లో పాల్గొనేందుకు గాను భారత్కు వచ్చేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు లైన్ క్లియరైంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఈ మేరకు అనుమతి మంజూరు చేయడం ఇరుజట్లకు కలిసొచ్చే అంశం. -
ఫ్రెంచ్ పతాకం రంగుల్లో ఈడెన్ గార్డెన్స్
కోల్కతా: ఉగ్రవాదుల దాడులతో నష్టపోయిన ఫ్రాన్స్కు సంఘీభావంగా ఈడెన్ గార్డెన్స్ ఆ దేశ త్రివర్ణ పతాక రంగులద్దుకుంది. నీలం, తెలుపు, ఎరుపు రంగులతో కూడిన లైట్స్ను ఈడెన్ ముఖద్వారంపై ప్రదర్శించారు. ఇది ఈ నెలంతా కొనసాగుతుందని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా తెలిపారు. ‘దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి తెలిపేందుకు మా ప్రయత్నమిది. ప్రతీ రోజు రాత్రి 10 గంటల వరకు మూడు రంగుల విద్యుత్ వెలుగులు ప్రకాశిస్తాయి’ అని దాల్మియా చెప్పారు. -
'చివరి టెస్టు 'ఈడెన్'లో ఆడాలని ఉంది'
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్లో చివరి టెస్టు ఆడిన తర్వాతే తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని కోరుకుంటున్నట్టు వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్సింగ్ తన మనసులోని మాట బయటపెట్టారు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ 'టర్బోనేటర్' భజ్జీకి కలిసొచ్చిన మైదానం. 2001లో జరిగిన ఓ టెస్టులో 13 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియాను చిత్తుచేశాడు అతను. అంతేకాకుండా హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. భజ్జీ బుధవారం కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ '(రిటైర్మెంట్ గురించి) ఇంకా నేనేమీ నిర్ణయించుకోలేదు. కానీ నేనెప్పుడు చివరి మ్యాచ్ ఆడాలనుకున్నా నా మదిలో ఈడెన్ గార్డెన్స్ మెదులుతుంది. ఇక్కడ చివరి మ్యాచ్ ఆడిన తర్వాతే రిటైర్ కావాలని నేను కోరుకుంటున్నాను' అని అన్నారు. 2010లో ఈడెన్ లో జరిగిన టెస్టు మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఇన్నింగ్స్ 40 పరుగులతో ఓడించడంలోనూ భజ్జీ కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో అప్పట్లో భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో టాప్ స్థానాన్ని సాధించింది. -
ఈడెన్ గార్డెన్స్లో ఫైనల్
- చెన్నైలోనూ మ్యాచ్లు - టి20 ప్రపంచకప్ వేదికలు ఖరారు న్యూఢిల్లీ: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కోల్కతాలోని ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ తుదిపోరుకు వేదిక కానుంది. వచ్చే ఏడాది భారత్లో జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ (ఏప్రిల్ 3న)ను ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. 1987 వన్డే ప్రపంచకప్ ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చిన ఈ చారిత్రాత్మక మైదానంలో 2011 వన్డే ప్రపంచకప్లో మూడు అప్రాధాన్య మ్యాచ్లు జరిగాయి. వరల్డ్ కప్ నిర్వహించే ఎనిమిది వేదికలను బోర్డు మంగళవారం ప్రకటించింది. కోల్కతా, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, మొహాలీ, ధర్మశాల, నాగపూర్ ఈ జాబితాలో ఉన్నాయి. గత ఐదు టి20 ప్రపంచకప్లతో పోలిస్తే మూడుకంటే ఎక్కువ వేదికల్లో ఈ టోర్నమెంట్ జరుగుతుండటం ఇదే తొలిసారి. ఢిల్లీ, ముంబైలలో ఒక్కో సెమీ ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది. ఒక వేళ ఏదైనా కారణంతో ఢిల్లీలో సెమీస్కు అవకాశం లేకపోతే అక్కడ భారత్-పాకిస్తాన్లాంటి కీలక మ్యాచ్ నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్లకు సంబంధించి ఇంకా వివాదం కొనసాగుతూనే ఉన్నా... దానికీ మ్యాచ్లు కేటాయించారు. అయితే తగిన సమయంలో సమస్యను పరిష్కరించుకొని ఐసీసీ నిబంధనల ప్రకారం స్టేడియాన్ని సిద్ధం చేయాలని లేదంటే మ్యాచ్లు కోల్పోతారని బీసీసీఐ, తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కు సమాచారం అందించినట్లు తెలిసింది. మరో వైపు ఎనిమిది మంది సభ్యులతో కూడిన టి20 ప్రపంచకప్ మేనేజింగ్ కమిటీని కూడా బీసీసీఐ ఏర్పాటు చేసింది. బోర్డు ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఇందులో సభ్యులుగా ఉన్నారు. -
ఈడెన్ లో వరల్డ్ కప్ టి20 ఫైనల్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న 2016 వరల్డ్ కప్ టి20 మ్యాచ్ లకు వేదికలు ఖరారయ్యాయి. 8 నగరాల్లో మ్యాచ్ లు జరుగుతాయని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. బెంగళూరు, చెన్నై, ధర్మశాల, మొహాలి, కోల్ కతా, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ నగరాల్లో మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఫైనల్ మ్యాచ్ కు ఈడెన్ గార్డెన్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ టి20 టోర్నమెంట్ జరగనుంది. నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వేదికలు ఎంపిక చేసినట్టు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. -
8 వేదికల్లో టి20 ప్రపంచకప్
* మార్చి 11 నుంచి టోర్నీ * ఈడెన్లో ఫైనల్ ముంబై: భారత్లో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్కు వేదికలు ఖరారయ్యాయి. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు జరిగే ఈ మెగా టోర్నీకి ఎనిమిది స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. తుది పోరు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరుగబోతుండగా మిగతా మ్యాచ్లు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, మొహాలీ, నాగ్పూర్, ఇండోర్, ధర్మశాల స్టేడియాల్లో నిర్వహిస్తారు. ఈడెన్లో ఇప్పటిదాకా కేవలం ఒక్క అంతర్జాతీయ టి20 మ్యాచ్ మాత్రమే జరిగింది. మరోవైపు చెన్నైలోని చిదంబరం స్టేడియం టోర్నీకి దూరమైంది. అక్కడి మూడు స్టాండ్లు కార్పొరేషన్తో విభేదాల కారణంగా సీజ్ కావడంతో ఖాళీగా ఉంటున్నాయి. దీంతో టోర్నీ నుంచి ఐసీసీ ఈ నగరాన్ని తప్పించింది. బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్... హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు కూడా కావడంతో ధర్మశాలకు ఆతిథ్యం దక్కింది. -
రో'హిట్'... శ్రీలంక ఫట్
కోల్కతా: రోహిత్ శర్మ రికార్డ్ డబుల్ సెంచరీ తోడు, బౌలర్లు విజృంభించడంతో నాలుగో వన్డేలో శ్రీలంకపై భారత్ 153 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 405 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన లంక 43.1 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఐదు వన్డేల సిరీస్ భారత్ కు 4-0 ఆధిక్యం దక్కింది. శ్రీలంక ఆటగాళ్లలో మాథ్యూస్(75) తిరిమానె( 59) అర్థ సెంచరీలు సాధించారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి 4 వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, స్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ చెలరేగి ఆడి డబుల్ సెంచరీ చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. కోహ్లి అర్థ సెంచరీ(66) సాధించాడు. సరికొత్త వరల్డ్ రికార్డ్ సృష్టించిన రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' దక్కింది. -
మరచిపోలేని ఘట్టాలు
ఈడెన్ గార్డెన్స్కు 150 ఏళ్లు ప్రపంచ క్రికెట్లో గొప్ప చరిత్ర కలిగిన మైదానాల్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఒకటి. 1864లో స్థాపించిన ఈ స్టేడియానికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. శతాబ్దంన్నర కాలంలో ఈ మైదానం ఎన్నో అద్వితీయ ఘట్టాలకు, అపురూప క్షణాలకు, విషాదకర సంఘటనలకు సాక్షిగా నిలిచింది. అందులో కొన్ని... - సాక్షి క్రీడా విభాగం ముస్తాక్ లేకపోతే... మ్యాచ్ లేదు... కోల్కతా ప్రేక్షకులకు క్రీడాభిమానం ఎక్కువే. తమకు నచ్చినవారిని అక్కునే చేర్చుకుంటారు. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇలాంటి సంఘటనే 1946లో జరిగింది. ఆస్ట్రేలియా సర్వీసెస్ ఎలెవన్ జట్టుతో అనధికారిక టెస్టు కోసం ఎంపిక చేసిన జట్టులో అద్భుత ఫామ్లో ఉన్న భారత బ్యాట్స్మన్ ముస్తాక్ అలీకి చోటు లభించలేదు. దాంతో ఆగ్రహించిన ఈడెన్ గార్డెన్స్లోని అభిమానులు ‘నో ముస్తాక్... నో టెస్ట్’ అంటూ తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. దాంతో సెలక్టర్లు చేసేదేమీలేక ముస్తాక్ అలీని మ్యాచ్ ఆడేందుకు రప్పించారు. తొక్కిసలాట కోల్కతాలో క్రికెట్తోపాటు ఫుట్బాల్కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. మరీ ముఖ్యంగా కోల్కతా ఫుట్బాల్ లీగ్ జరుగుతోందంటే అక్కడ పండగ వాతావరణం నెలకొంటుంది. శతాబ్దంకంటే ఎక్కువ చరిత్ర కలిగిన ఈ లీగ్లో హేమాహేమీలైన ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఇప్పటికీ మై దానాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. అయితే 1980 ఆగస్టు 16న ఈడెన్ గార్డెన్స్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిశాక జరిగిన తొక్కిసలాటలో 16 మంది అభిమానులు మృతి చెందారు. హద్దు మీరిన అభిమానం సొంతగడ్డపై ప్రతిష్టాత్మక 1996 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్. మార్చి 13న జరిగిన ఈ సెమీఫైనల్లో శ్రీలంక జట్టును కట్టడి చేసిన భారత జట్టు నుంచి అభిమానులు విజయాన్ని ఆశించారు. కానీ లక్ష్య ఛేదనలో భారత్ తడబడింది. సచిన్ టెండూల్కర్ అవుటయ్యాక మిగతా బ్యాట్స్మెన్ పెవిలియన్కు వరుస కట్టారు. చూస్తుండగానే భారత్ ఓటమి అంచుల్లోకి వెళ్లింది. అంతే అభిమానులు రెచ్చిపోయారు. భారత క్రికెటర్ల పేలవ ప్రదర్శనకు ఆగ్రహించారు. మైదానంలో చెప్పులు, బాటిళ్లు విసిరారు. అభిమానుల వీరంగం తగ్గకపోవడంతో రిఫరీ ఆటను రద్దు చేసి శ్రీలంకను విజేతగా ప్రకటించారు. వీవీఎస్ స్పెషల్... బజ్జీ భళా... ఫిక్సింగ్ వివాదంతో భారత క్రికెట్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న దశలో... 2001 మార్చిలో భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్టు మ్యాచ్లో చిరస్మరణీయ ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ‘ఫాలోఆన్’ ఎదుర్కొని ఓటమి బాటలో పయనిస్తున్న భారత జట్టు వీవీఎస్ లక్ష్మణ్ (281), రాహుల్ ద్రవిడ్ (180)ల అద్వితీయ బ్యాటింగ్తో నమ్మశక్యంకానీరీతిలో కోలుకుంది. ఆస్ట్రేలియాకు 384 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చివరిరోజు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (6/73) ‘హ్యాట్రిక్’ మాయాజాలంతో ఆస్ట్రేలియా 212 పరుగులకే కుదేలై ఓటమిని చవిచూసింది. ఖాళీ స్టేడియంలో మ్యాచ్ 1999లో భారత్, పా కిస్థాన్ల మధ్య ఆసియా చాంపియన్షిప్ టెస్టు మ్యాచ్. భారత్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా పాక్ పేసర్ షోయబ్ అక్తర్ అడ్డు వచ్చినందుకే సచిన్ టెండూల్కర్ రనౌటయ్యాడని భావించిన ప్రేక్షకులు రెచ్చిపోయారు. మైదానంలో బాటిళ్లు విసిరారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సచిన్, దాల్మియా విజ్ఞప్తి మేరకు ప్రేక్షకులు శాంతించారు. ఆ తర్వాత ప్రేక్షకులందరినీ బయటకు పంపించారు. ఖాళీ స్టేడియంతో మ్యాచ్ను కొనసాగించారు. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 232 పరుగులకు ఆలౌటై ఓడింది. ఈడెన్పై స్టాంప్ విడుదల ప్రతిష్టాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం స్థాపించి 150 ఏళ్లు అవుతున్న సందర్భంగా మంగళవారం ఈడెన్పై పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో క్యాబ్ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా, బిషన్ సింగ్ బేడీ, దిలీప్ వెంగ్సర్కార్, ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, విండీస్ పేసర్ మైకేల్ హోల్డింగ్లు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన మైదానంతో పాటు అత్యుత్తమ క్రికెట్ సెంటర్ ఈడెన్ అని బేడీ కితాబిచ్చారు. ప్రపంచంలో రెండో అత్యుత్తమ మైదానం ఈడెన్ గార్డెన్స్ అని వెంగ్సర్కార్ అన్నారు. భారత్కు నంబర్వన్ అర్హత ఉంది: గంగూలీ వరుసగా మూడు సిరీస్లు గెలిచిన భారత జట్టుకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో నంబర్వన్కు చేరుకునే అర్హత ఉందని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఇంగ్లండ్, విండీస్లతో పాటు లంకపై సిరీస్ గెలిచింది కాబట్టి ఇది సాధ్యమవుతుందన్నాడు. క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా పని చేస్తున్న దాదా, గురువారం జరిగే వన్డేకు వ్యాఖ్యాతగా కూడా పని చేస్తాడు. లంకతో సిరీస్ను 4-1 లేదా మెరుగ్గా గెలిస్తే టీమిండియాకు టాప్ ర్యాంక్ దక్కుతుంది. -
ప్రతి జ్ఞాపకం మదిలో పదిలం!
సొంత మైదానం అంటే సొంత ఊరు, ఆట నేర్చుకున్న చోటే కాదు... శిఖరానికి చేరి తమదైన ముద్ర వేసిన చోట జనం మనల్ని సొంతం చేసుకోవటం కూడా. అలా చూస్తే ఈడెన్ గార్డెన్స్..... హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్కు సొంత గడ్డలాంటిదే. బెంగాలీలు కూడా పదమూడేళ్ల క్రితమే లక్ష్మణ్ను తమవాడిగా చేసుకున్నారు. ఆ మైదానంలో లక్ష్మణ్ పరుగుల వరద పారించాడు. ఎన్నో రికార్డులు తిరగరాశాడు. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్కు 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. వీవీఎస్ కూడా తన అద్భుత ఆటతో ఇన్నేళ్ల ఈ స్టేడియం చరిత్రలో భాగమయ్యాడు. ఈ నేపథ్యంలో కోల్కతా ఈడెన్ మైదానంతో తనకు ఉన్న అనుబంధాన్ని లక్ష్మణ్ ‘సాక్షి'తో పంచుకున్నాడు. విశేషాలు అతని మాటల్లోనే... తొలి మ్యాచ్ ఇంకా గుర్తుంది: కోల్కతా ఈడెన్ గార్డెన్స్తో నా అనుబంధం ప్రత్యేకం. మొదటినుంచి ఆ మైదానం గొప్పతనం గురించి చాలా సార్లు విన్నాను. అక్కడ నేను ఆడిన తొలి మ్యాచ్ ఇంకా బాగా గుర్తుంది. 1994లో ఏదో ప్రత్యేక వేడుకల్లో భాగంగా పి.సేన్ ట్రోఫీ పేరుతో ఒక ప్రత్యేక టోర్నమెంట్ నిర్వహించారు. అండర్-19 స్థాయిలో ఆ టోర్నీ జరిగింది. నేను భారత జట్టు తరఫున బరిలోకి దిగాను. పలువురు భారత క్రికెటర్లతో కలిపి అప్పుడు కంబైన్డ్ ఎలెవన్ టీమ్ను కూడా తయారు చేశారు. నేను ఆ మ్యాచ్లో 22 పరుగులు చేశాను. ఈడెన్లో ఆ సమయంలో లక్ష మంది ప్రేక్షకులు ఉన్నారు. అంత మంది ముందు ఆడటం చాలా గొప్పగా అనిపించింది. ఆ అభిమానం మరువలేం: ఈడెన్లో ప్రేక్షకుల స్పందన అద్భుతంగా ఉంటుంది. అక్కడి ప్రేక్షకులకు క్రికెట్ అంటే, ఇంకా చెప్పాలంటే క్రీడలంటేనే ఎంతో అభిమానం చూపిస్తారు. ఆటగాళ్లపై కూడా వారు అంతే స్థాయిలో అభిమానం కురిపిస్తారు. వారి ఆతిథ్యం, మనల్ని ఆహ్వనించే తీరు... ఇలా అన్నింటిలో దానిని ప్రదర్శిస్తారు. ప్రత్యేక అనుభూతి: కోల్కతా నగరం కూడా ఎంతో బాగుంటుంది. ఎయిర్పోర్ట్లో దిగి నగరంలోకి వస్తున్నప్పుడే నాకు కోల్కతా గురించి ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఆనాటినుంచి ఎప్పుడు కోల్కతాలో క్రికెట్ ఆడినా అదో రకమైన ఆనందం అనిపిస్తుంది. ఈడెన్లో ప్రతిసారీ బాగా ఎంజాయ్ చేశాను. ఎంత చెప్పినా తక్కువే: ఆటపరంగా చూస్తే ‘281’ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అదొక్కటే కాదు ఆ తర్వాత కూడా ఎన్నో మంచి ఇన్నింగ్స్ ఈడెన్లో ఆడాను. బెంగాల్ బ్యాటింగ్ కన్సల్టెంట్గా వెళ్లనుండటానికి కోల్కతాతో అనుబంధం ఒక్కటే కారణం కాదు గానీ... ఇకపై కూడా నేను ఈడెన్తో జత కలవనుండటం సంతోషకరం. నా ఫేవరెట్ గ్రౌండ్ ఇప్పుడు 150 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుండటం సంతోషకరమైన సందర్భం. -
ఈడెన్కు పండగ
సాక్షి క్రీడావిభాగం మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులతో అపరిమిత జోష్... ఆటంటే ప్రాణమివ్వడంతో పాటు కొన్ని సార్లు అదుపు తప్పే అభిమానం...రికార్డులు, బ్రేక్లు, సంచలనాలు, విజయాలు, వివాదాలు...చారిత్రక ఘట్టాలకు, అనేక మైలురాళ్లకు సాక్షి... ఆటగాళ్లపై బెంగాలీ రసగుల్లాలాంటి ఆప్యాయత, ఆదరణ... ఇవన్నీ కోల్కతా ఈడెన్ గార్డెన్స్తో విడదీయలేని విశేషాలు. ఆ మైదానంలో కనీసం ఒక మ్యాచ్ అయినా ఆడాలని అనేక మంది యువ ఆటగాళ్లు కలలు కంటారు. ఒక్కసారైనా ఆ మైదానంలో ప్రేక్షకుల జోరును ఆస్వాదించాలని చాలా మంది అనుకుంటారు. అలాంటి చరిత్ర ఉన్న ఈడెన్ గార్డెన్స్ ఇప్పుడు 150 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఉత్సవాలని ఘనంగా నిర్వహించాలని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) నిర్ణయించింది. ఎన్నో విశేషాలు... 1864లో నిర్మించిన ఈ మైదానంలో ఆరంభంలో క్రికెట్తో పాటు ఫుట్బాల్ తదితర క్రీడలన్నీ నిర్వహించేవారు. అయితే ఆ తర్వాత ఇది పూర్తిగా క్రికెట్ స్టేడియంగా మారిపోయింది. 1987 ప్రపంచ కప్ నుంచి 2011 ప్రపంచ కప్ మధ్య కాలంలో చాలా సందర్భాల్లో స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు హాజరు కావడం చెప్పుకోదగ్గ విశేషం. ముఖ్యంగా తొలి సారి ఫ్లడ్లైట్లతో నిర్వహించిన 1993 హీరో కప్లోనైతే ప్రేక్షకులు రికార్డు స్థాయిలో పోటెత్తారు. అయితే వరల్డ్ కప్ కోసం పునరుద్ధరణ పనులతో స్టేడియం సామర్ధ్యం దాదాపు 67 వేలకు తగ్గింది. ఇక్కడే 2001లో ఆస్ట్రేలియాతో టెస్టులో 281 పరుగులు చేసి వీవీఎస్ లక్ష్మణ్ మ్యాచ్ గెలిపించడం మైదానాన్ని చిరస్మరణీయం చేసింది. అయితే 1966, 69, 96, 99లలో ప్రేక్షకులు మ్యాచ్లకు అంతరాయం కలిగించడం కోల్కతాకు చెడ్డ పేరు తెచ్చి పెట్టింది కూడా. అయితే ఇదంతా కూడా ఆటపై వారి అపరిమిత అభిమానానికే ఉదాహరణ అంటూ చాలా మంది ఈడెన్ గురించి గొప్పగా చెప్పుకుంటారు. రోమ్లోని కలోసియం తరహా శైలితో ఈ స్టేడియాన్ని నిర్మించారు. పలు కార్యక్రమాలు... ఈ గురువారం ఈడెన్లో భారత్, శ్రీలంక మధ్య నాలుగో వన్డే జరగనుంది. ఈ సందర్భంగా 150 సంవత్సరాల వేడుకలు ‘క్యాబ్’ ఘనంగా నిర్వహిస్తోంది. ఇక్కడ భారత్కు తొలి విజయం అందించిన బోర్డే, దురానీలను ఇప్పటికే సన్మానించారు. ఈడెన్ గార్డెన్స్ - లెజెండ్స్ ఆఫ్ రొమాన్స్ పేరుతో రూపొందించిన పుస్తకం కూడా విడుదలైంది. మైదానంపై 12 నిమిషాల ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా తయారు చేశారు. వన్డే రోజున పలువురు మాజీ ఆటగాళ్లను కూడా ఘనంగా సత్కరించడంతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల చేసే అవకాశం ఉంది. మరో వైపు మంగళవారం ఎంఏకే పటౌడీ స్మారకోపన్యాసానికి కూడా కోల్కతా వేదిక కానుంది. ఈడెన్కు ప్రియమైన వీవీఎస్ లక్ష్మణ్ ఈ సారి ప్రసంగించనుండటం విశేషం. -
గంభీర్ సేనకు బ్రహ్మరథం
ఈడెన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో షారుఖ్ అభిమానులను ఉత్తేజపరిచాడు. ట్రోఫీని చేతపట్టిన కెప్టెన్ గంభీర్తో పాటు జట్టు ఆటగాళ్లు ఎనిమిది వాహనాల్లో స్టేడియం చుట్టూ విజయయాత్ర చేస్తూ అక్కడికి వచ్చిన వారిని విష్ చేశారు. షారుఖ్, జూహీ చావ్లా, జయ్ మెహతాతో పాటు మమత కేక్ కట్ చేశారు. ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి 10గ్రాముల బంగారు రింగులను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు దాల్మియా ప్రదానం చేశారు. ప్రపంచంలో ఏ దేశం, రాష్ట్రం కానీ ఈస్థాయిలో ఓ జట్టుపై ఆదరణ చూపించదని కొనియాడాడు. -
కోల్కతా వీధుల్లో చిందేస్తాం: షారుఖ్
నేడు ఈడెన్లో జట్టుకు ఘన సన్మానం కోల్కతా: బెంగాల్ రాజధాని కోల్కతా మరోసారి వేడుకలకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ ఏడో సీజన్ టైటిల్ను గెలుచుకున్న కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు నేడు ఈడెన్ గార్డెన్స్లో ఘన సన్మానం జరుగనుంది. ముఖ్య అతిథిగా సీఎం మమతా బెనర్జీ హాజరుకానున్నారు. విజయయాత్రలో జట్టు యజమాని షారుఖ్ ఖాన్ తన నృత్యాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కోల్కతా వీధులను సందడిగా మారుస్తామని చెబుతున్నాడు. ఈ విజయాన్ని తన చిన్న కుమారుడు అబ్రామ్కు అంకితమిస్తున్నట్టు చెప్పాడు. ‘ఈసారి హుగ్లీ నది ఒడ్డున డ్యాన్సులతో ఉర్రూతలూగిస్తాం. అలాగే వీధులను కూడా వదలం. మమతాజీ... ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మేం మరోసారి వస్తున్నాం. మేం ఇప్పుడు చాంపియన్లం. పార్టీ ఇప్పటికే ప్రారంభమైంది’ అని షారుఖ్ తెలిపాడు. ఫైనల్లో పంజాబ్ను ఓడించిన అనంతరం తమ టీమ్ హోటళ్లో తెల్లవారు జాము దాకా ఆటగాళ్లు పార్టీలో మునిగితేలారు. మరోవైపు ఫైనల్లో తమ జట్టుపై సెంచరీ చేసిన పంజాబ్ ఆటగాడు సాహాను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు. కోల్కతాకు చేరిన గంభీర్ సేన ఐపీఎల్ గెలిచిన నైట్రైడర్స్కు కోల్కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బెంగాల్ మంత్రి మదన్ మిత్రా, క్యాబ్ అధికారులు, వేలాది మంది అభిమానులు స్వాగతం పలికారు. -
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
-
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి
కోల్ కతా: ఐపీఎల్ 7 లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఈ రోజు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ - కోల్ కతా నైట్ రైడర్స్ ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడటంతో మ్యాచ్ ను రేపటికి వాయిదా వేశారు. ఈడెన్ గార్డెన్ నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. ఈ రోజు ఆట సాధ్యం కాకపోవడంతో ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ సుబీర్ గంగూలీ తెలిపాడు. రేపు సాయంత్రం నాలుగు గంటలకు మ్యాచ్ నిర్వహిస్తామన్నారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. -
కోల్కతాలో ‘కింగ్స్’ నిలిచేనా!
ఐపీఎల్-7 ఆరంభం నుంచి ఒకే తరహా దూకుడుతో అద్భుత ఫలితాలు సాధించిన జట్టు ఒకవైపు...తడబడుతూ ప్రయాణం సాగించినా, పట్టుదలతో పోరాడి దూసుకొచ్చిన జట్టు మరోవైపు... ఒకరికి బ్యాటింగ్ అపార బలమైతే, మరొకరి బౌలింగ్ ప్రత్యర్థులను కట్టి పడేసింది. లీగ్ దశలోనూ సమఉజ్జీలుగా నిలిచిన ఈ రెండు జట్లు మరో కీలక సమరానికి సై అంటున్నాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తొలి ఫైనల్పై కన్నేయగా... కోల్కతా నైట్రైడర్స్ గతంలో ఒకసారి ఫైనల్ చేరి విజేతగా నిలిచింది. నేడు తొలి క్వాలిఫయర్ - నైట్రైడర్స్తో పంజాబ్ పోరు - అద్భుత ఫామ్లో ఇరు జట్లు - గంభీర్ సేనకు ఈడెన్ అనుకూలత కోల్కతా: అనూహ్య మలుపులు తిరుగుతూ, అద్భుత ప్రదర్శనలతో అభిమానులకు ఆకట్టుకున్న ఐపీఎల్-7 తుది దశకు చేరుకుంది. లీగ్ మ్యాచ్ల అనంతరం కీలకమైన తొలి క్వాలిఫయర్కు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, కోల్కతా జట్లు మంగళవారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో తలపడనున్నాయి. అద్భుతమైన తమ బ్యాటింగ్ లైనప్పై కింగ్స్ ఎలెవన్ ఆధార పడుతుండగా... బౌలింగ్తోపాటు సొంతగడ్డ బలాన్ని నైట్రైడర్స్ నమ్ముకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిన జట్టు మాత్రం టోర్నీ నుంచి నిష్ర్కమించదు. శుక్రవారం జరిగే రెండో క్వాలిఫయర్లో ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈ జట్టు మరోసారి పోటీ పడుతుంది. సూపర్ సీజన్... - ఈ ఏడాది ఐపీఎల్లో పంజాబ్ అందరికంటే వేగంగా పరుగులు చేసింది. టోర్నీలో ఆ జట్టు రన్రేట్ 9.03 కావడం విశేషం. - పంజాబ్ ఆరుసార్లు 190కి పైగా పరుగులు చేసింది. అందులో మూడు సార్లు లక్ష్యఛేదనలోనే కావడం విశేషం. ముందుగా బ్యాటింగ్ చేస్తూ కింగ్స్ ఎలెవన్ రెండు సార్లు మాత్రం 150కంటే తక్కువ స్కోరు నమోదు చేయగా... ఛేజింగ్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. - వరుసగా నాలుగు అద్భుత ప్రదర్శనతో టోర్నీలో సంచలనం రేపిన మ్యాక్స్వెల్ జోరు గత కొన్ని మ్యాచ్లుగా తగ్గడం పంజాబ్కు ఆందోళన కలిగించే అంశం. కోల్కతాలో ఆడిన రెండు మ్యాచుల్లో అతను 15, 14 పరుగులే చేశాడు. అయితే మిల్లర్, సెహ్వాగ్, బెయిలీ, మానన్ వోహ్రా, వృద్ధిమాన్ సాహాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగానే ఉంది. - బౌలింగ్లో పేసర్ సందీప్ శర్మ కీలకం కానున్నాడు. అతను తీసిన 17 వికెట్లలో 12 పవర్ ప్లేలో రావడం చూస్తే జట్టుకు శుభారంభం ఇస్తున్నాడని అర్థమవుతోంది. మరో వైపు మిచెల్ జాన్సన్ తన పదునైన బౌలింగ్ను ప్రదర్శిస్తే కోల్కతాకు కష్టాలు తప్పవు. మ్యాచ్ మ్యాచ్కూ మెరుగు... - లీగ్లో తొలి 7 మ్యాచుల్లో 2 మాత్రమే గెలిచి ఒక దశలో పేలవంగా కనిపించిన నైట్రైడర్స్ ఆ తర్వాత వరుసగా 7 మ్యాచ్లు గెలవడం జట్టు ఫామ్ను సూచిస్తోంది. - అద్భుత ఫామ్తో ‘ఆరెంజ్ క్యాప్’ను అట్టి పెట్టుకున్న రాబిన్ ఉతప్ప వరుసగా 9 ఇన్నింగ్స్లలో 40కు పైగా స్కోర్లు చేయడం విశేషం. ఇక గత మ్యాచ్లో 22 బంతుల్లో 72 పరుగులు చేసిన యూసుఫ్ పఠాన్పైనే ఇప్పుడు అందరి దృష్టీ ఉంది. అతను మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడితే రైడర్స్ పని సులువవుతుంది. బ్యాటింగ్లో గంభీర్తో పాటు మనీశ్ పాండే, డస్కటే, షకీబ్, సూర్యకుమార్లపై జట్టు ఆధారపడింది. - రెండేళ్ల క్రితం అద్భుత బౌలింగ్తో కోల్కతాను విజేతగా నిలిపిన సునీల్ నరైన్ ఇప్పుడు మరోసారి జట్టు భారాన్ని మోస్తున్నాడు. అత్యధిక వికెట్లతో అగ్రస్థానంలో ఉన్న అతను పంజాబ్ బ్యాట్స్మెన్ను కట్టడి చేయగలడు. మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్ పేస్ భారాన్ని మోస్తుండగా, పిచ్ స్లో బౌలర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో షకీబ్, పీయూష్ చావ్లా పాత్ర కూడా కీలకం కానుంది. - ఇక ఈడెన్ గార్డెన్స్లో భారీ సంఖ్యలో జట్టుకు అభిమానుల అండ ఉండటం ఇలాంటి కీలక మ్యాచ్లో అదనపు బలం కానుంది. - జట్ల వివరాలు (అంచనా): పంజాబ్: బెయిలీ (కెప్టెన్), సెహ్వాగ్, వోహ్రా, మ్యాక్స్వెల్, మిల్లర్, సాహా, అక్షర్ పటేల్, రిషి ధావన్, శివమ్ శర్మ, సందీప్ శర్మ, మిచెల్ జాన్సన్. - కోల్కతా: గంభీర్ (కెప్టెన్), ఉతప్ప, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్, డస్కటే, షకీబ్, సూర్య కుమార్, మోర్నీ మోర్కెల్, ఉమేశ్ యాదవ్, నరైన్, వినయ్ కుమార్/చావ్లా. మ్యాచ్కు వర్షం గండం! క్వాలిఫయర్ మ్యాచ్ జరిగే కోల్కతాలో ఆదివారం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మైదానం నీటితో నిండిపోవడంతో సోమవారం ఇరు జట్లూ ప్రాక్టీస్ చేయలేదు. వర్షం వస్తూ, పోతూ అవాంతరం కలిగిస్తే కనీసం ఐదేసి ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. పూర్తిగా సాధ్యం కాకపోతే ‘రిజర్వ్ డే’ అయిన బుధవారం నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజూ మ్యాచ్ సాధ్యం కాకపోతే నిబంధనల ప్రకారం లీగ్ దశలో మెరుగైన రన్రేట్ ఉన్న కింగ్స్ ఎలెవన్ ఫైనల్ చేరుకుంటుంది. ‘తుది జట్టును ఎంపిక చేసుకోవడంలో మేం తీసుకుంటున్న జాగ్రత్తలే ఈ విజయాలు అందించాయి. స్థానం దక్కకపోయినా షాన్ మార్ష్లాంటి ఆటగాళ్లు మద్దతుగా నిలిచారు. వ్యూహాల్లో పాలుపంచుకొని పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు’ - సంజయ్ బంగర్ (పంజాబ్ కోచ్) ‘తొలి దశతో పోలిస్తే కుదురుకోవడానికి సమయం తీసుకున్నాం. అయితే యువ ఆటగాళ్లతో పాటు అనుభవం ఉండటంతో మేము సాధించగలమనే నమ్మకం కలిగింది. ఫలితమే ఈ వరుస విజయాలు దక్కాయి’ - యూసుఫ్ పఠాన్, కోల్కతా ఆటగాడు -
మాస్టర్తో కలిసి ఆడతా: లారా
కోల్కతా: ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్లో టెస్టు మ్యాచ్ ఆడకపోవడం తన కెరీర్లో లోటు అని వెస్టిండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. అయితే భవిష్యత్లో సచిన్, గంగూలీతో కలిసి వెటరన్ మ్యాచ్ నిర్వహిస్తే ఇక్కడ ఆడేందుకు సిద్ధమని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధికారులకు తెలిపాడు. సచిన్ వీడ్కోలు సిరీస్ను తిలకించేందుకు క్యాబ్ ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చిన లారా ఆదివారం తన స్నేహితుడితో కలిసి 15 నిమిషాల పాటు ఈడెన్ను సందర్శించాడు. పిచ్, డ్రెస్సింగ్ రూమ్లను పరిశీలించి అక్కడే ఉన్న మైదానం సిబ్బందితో కలిసి ఫొటోలు దిగాడు. టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు చేసిన సచిన్ మైనపు బొమ్మ పక్కన నిలబడి ఫొటోలకు ఫొజిచ్చాడు. తర్వాత ఏజేసీ బోస్ రోడ్లో ఉన్న మదర్ థెరిస్సా హౌస్ను సందర్శించి నివాళులు ఆర్పించాడు. -
‘సూపర్ ఫాస్ట్’ షమీ
స్పిన్నర్లకు అనుకూలించే భారత పిచ్లపై ఒక పేసర్ మ్యాచ్ గెలిపించడం పెద్ద సంచలనం. అదీ ఒక భారత్ పేసర్ ఒంటిచేత్తో టెస్టు మ్యాచ్ గెలిపించగలడనేది ఇన్నాళ్లూ ఓ ఊహ, ఓ ఆశ మాత్రమే. దీనిని నిజం చేశాడు మహ్మద్ షమీ. వెస్టిండీస్తో తొలి టెస్టులో సంచలన రివర్స్ స్వింగ్ బౌలింగ్తో తన కెరీర్కు అద్భుతమైన ఫ్లాట్ఫామ్ సిద్ధం చేసుకున్నాడు. సాక్షి క్రీడా విభాగం: సచిన్ టెండూల్కర్ చివరి సిరీస్లో ఆడే అవకాశం రావడం... అది కూడా సొంత ప్రేక్షకుల మధ్య ఈడెన్గార్డెన్స్లాంటి ప్రతిష్టాత్మక మైదానంలో టెస్టు అరంగేట్రం చేయడం... టెస్టులు చూడటానికి ప్రేక్షకులు కరువైన రోజుల్లో వేలాది మంది మధ్య బౌలింగ్ చేసే అవకాశం రావడం.... మహ్మద్ షమీకి అంతా కలలా ఉండి ఉంటుంది. మొత్తం ప్రపంచం అంతా సచిన్ కోసం చూస్తున్న మ్యాచ్లో 23 ఏళ్ల షమీ హీరోలా మారాడు. భారత్కు పేస్ బౌలర్ అవసరం బాగా ఎక్కువగా ఉన్న సమయంలో ఆశాకిరణంలా కినిపించాడు. 140కి.మీ.ల వేగంతో స్థిరంగా బంతులు విసురుతూ మన దగ్గరా ఓ పేసర్ ఉన్నాడని చూపించాడు. వేగంతో పాటు రివర్స్ స్వింగ్ ను రాబట్టడం షమీ ప్రత్యేకత. తన బౌలింగ్తో తొలి రోజే భారత్ వైపు మ్యాచ్ను తిప్పా డు. తన పేస్తో మూడో రోజే ‘కథ’ ముగించాడు. స్వింగే కలిసొచ్చింది జట్టులో ఇప్పుడు ప్రధాన పేసర్గా భువనేశ్వర్కు చోటు ఖాయంగా ఉంది. ఇషాంత్ శర్మ ఇటీవలి ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో దారుణంగా చతికిల పడడంతో రెండో పేసర్ కోసం ఉమేశ్ యాదవ్, షమీ మధ్య పోటీ నెలకొంది. ఓకవేళ పేస్ ప్రధానాంశంగా తీసుకుంటే ఆ స్థానం కచ్చితంగా ఉమేశ్ యాదవ్కే వెళుతుంది. కానీ షమీ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. అంతేకాకుండా విండీస్ ఆటగాళ్లు షమీ బౌలింగ్ను ఎప్పుడూ ఎదుర్కొంది లేదు. ఇదే అతడికి కలిసొచ్చింది. తొలి టెస్టుకు రెండు రోజుల ముందు భువనేశ్వర్తో కలిసి తన పేస్తో నెట్స్లో బ్యాట్స్మెన్ను ఇబ్బందిపెట్టాడు. తుది జట్టులో చోటు దక్కడంతో ఇదే ఊపును ప్రత్యర్థి ఆటగాళ్లపై ప్రదర్శించాడు. అదీగాకుండా సొంత మైదానంలో కెరీర్ తొలి మ్యాచ్ ఆడుతున్నప్పుడు సహజంగానే ఒత్తిడి ఉంటుంది. అయితే సచిన్ ఫేర్వెల్ టెస్టు కావడంతో అందరి ఆలోచనలు అటువైపే కొనసాగడంతో షమీ ఎలాంటి ఆందోళన లేకుండా తన పని తాను కానిచ్చాడు. ఇక ఇప్పుడు తనపై ఏర్పడిన అంచనాలను అందుకుంటూ జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం షమీ భుజస్కంధాలపై ఉంది. పాత బంతితో ప్రమాదకారి వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో షమీ తీసిన తొమ్మిది వికెట్లలో ఏకంగా ఏడు వికెట్లు రివర్స్ స్వింగ్ ద్వారా తీసినవే. అయితే ఈ సామర్థ్యాన్ని షమీ 16 ఏళ్లప్పుడే సాధించాడు. అండర్-16 విభాగంలో ఆడుతూ స్వింగ్తో ప్రత్యర్థి ఆటగాళ్లను బెంబేలెత్తించేవాడు. రివర్స్ డెలివరీ కోసం చాలా సాధన చేసేవాడు. ఈ నైపుణ్యాన్ని అతడు సొంత ఊరు మొరాదాబాద్లోనే నేర్చుకున్నాడు. కోచ్లను అడిగి వాడిన బంతులను ఇంటికి తీసుకెళ్లి వాటితో సాధన చేసేవాడు. చిన్న పట్టణం నుంచి అంతర్జాతీయ స్థాయికి.. షమీది పూర్తిగా గ్రామీణ నేపథ్యం. ఉత్తర ప్రదేశ్లోని మొరాదాబాద్కు సమీపంలోని సహస్పూర్ గ్రామం లో షమీ జన్మించాడు. తండ్రి రైతు. క్రికెటర్గా మారేందుకు ఎలాంటి కనీస సౌకర్యాలు కూడా లేని ప్రాంతం నుంచి షమీ పట్టుదలగా పైకి వచ్చాడు. పేస్ బౌలింగ్ తనకు కుటుంబ వారసత్వంగా వచ్చిందని షమీ చెబుతుంటాడు. తండ్రి, మామయ్య, అన్నయ్య అందరూ పేస్ బౌలర్లేనని కానీ వారెప్పుడూ ఏ స్థాయి క్రికెట్ కూడా ఆడలేదంటాడు. యూపీ అండర్-19 జట్టులో చోటు దక్కకపోవడంతో 2006 కోల్కతాకు మకాం మార్చాడు. అక్కడ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ అకాడమీలో చేరి రాటుదేలి క్లబ్ స్థాయి క్రికెట్ ఆడాడు. బెంగాల్ అండర్ -22 జట్టు సభ్యుడయ్యాడు. అలాగే బెంగాల్ రంజీ జట్టుకి, ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడుతున్నాడు. 18 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లోనే 71 వికెట్లు తీసుకోవడంతో సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఈ ఏడాది జనవరిలో పాక్పై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఇటీవల ఆసీస్తో చివరి మూడు వన్డేలు ఆడి ఏడు వికెట్లు తీశాడు. ఓ తలనొప్పి తగ్గినట్లే! డిసెంబరులో దక్షిణాఫ్రికా పర్యటన భారత జట్టుకు పెద్ద సవాల్. పేస్ బౌలింగ్ వికెట్లపై ఈ లైనప్తో వెళ్లి ఏం చేయాలనేది ఇన్నాళ్లూ ధోనికి ఉన్న పెద్ద తలనొప్పి. ఇప్పుడు షమీ రూపంలో జట్టుకు కాస్త ఊరట లభించినట్లే. వేగంలో చూపిస్తున్న నిలకడ... బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడం... ముఖ్యంగా పాత బంతితో రివర్స్ స్వింగ్ రాబట్టడం... ఇవన్నీ ఒకే బౌలర్ స్థిరంగా చేయడంతో పేస్ విభాగంలో కాస్త కష్టాలు తీరినట్లే. అయితే ఇక ప్రత్యర్థులంతా షమీని జాగ్రత్తగా పరిశీలించి మ్యాచ్కు వస్తారు. దీనికి తగ్గట్లే ఈ యువ బౌలర్ కూడా నిరంతరం మెరుగుపడుతూ ఉండాలి. లేకపోతే వన్ మ్యాచ్ వండర్గా మిగిలే ప్రమాదం ఉంది. -
సచిన్ కు పశ్చిమ బెంగాల్ ఘన సన్మానం
ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్కు ఘన సన్మానం జరిగింది. -
ఈడెన్లో 'టెన్'డూల్కర్ వీడ్కోలు
కోల్కతా: ఈడెన్ మైదానంలో చివరి టెస్టు ఆడిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను పశ్చిమ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వెస్టిండీస్తో తొలి టెస్టు ముగిసిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్కు ఘన సన్మానం జరిగింది. సచిన్ శాలువా కప్పి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సన్మానించారు. ప్రత్యేక జ్ఞాపిక బహూకరించారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ.. సచిన్కు టోపీ అలంకరించాడు. జగన్మోహన్ దాల్మియా కూడా సచిన్కు జ్ఞాపిక బహూకరించారు. కోల్కతా పోలీసుల తరపున ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు. అనంతరం సచిన్ ఈడెన్ మైదానంలో తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో సచిన్ కేవలం 10 పరుగులకే అవుటవడంతో నిరాశ చెందిన అభిమానులు రెండో ఇన్నింగ్స్లో మళ్లీ మాస్టర్ బ్యాటింగ్ చూడాలనుకున్నారు. అయితే విండీస్ ఇన్నింగ్స్ 51 తేడాతో ఓడిపోవడంతో రెండో ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. ఈనెల 14 నుంచి జరగనున్న ముంబై టెస్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 200 టెస్టులో సచిన్ అలరిస్తాడని ఆశిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్తో మాస్టర్ ముగిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. -
విండీస్పై భారత్ ఇన్నింగ్స్ విజయం
-
విండీస్పై భారత్ ఇన్నింగ్స్ విజయం
కోల్కతా: తొలి టెస్టులో వెస్టిండీస్ ను భారత్ చిత్తు చేసింది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, బౌలింగ్లో మహ్మద్ షమీ సత్తా చాటడంతో వెస్టిండీస్పై భారత్ ఇన్నింగ్స్ 51 పరుగులతో విజయం సాధించింది. అరంగ్రేట టెస్టులో రోహిత్, షమీ అదరగొట్టడంతో టీమిండియా మరో రెండు రోజులు మిగులుండగానే విజయాన్ని అందుకుంది. 219 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 168 పరుగులకే కుప్పకూలింది. సొంత మైదానంలో టెస్టు అరంగ్రేటం చేసిన షమీ సత్తా చాటాడు. భారత్ తరపున రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. షమీ ధాటికి విండీస్ వికెట్లు పేక మేడలా కూలిపోయాయి. 118 పరుగులిచ్చి ఏకంగా 9 వికెట్లు నేలకూల్చాడు. రెండో ఇన్నింగ్స్ లో 13.1 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చిన షమీ ఏకంగా 5 వికెట్లు నేలకూల్చాడు. అశ్విన్ 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో షమీ 4 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 453 పరుగులకు ఆలౌటయింది. రోహిత్ శర్మ 177, అశ్విన్ 124 పరుగులు చేశారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
నిశ్శబ్దం..!
...ఎంత భయంకరంగా ఉంటుందో రెండోరోజు ఆటలో ఈడెన్ గార్డెన్స్లో అభిమానులకు తెలిసి ఉంటుంది. సచిన్ టెండూల్కర్ అవుట్ కాగానే స్టేడియం అంతా షాక్. అయితే అది కొన్ని సెకన్ల పాటే. ఆ వెంటనే స్టేడియంలో అందరూ నిలబడి మాస్టర్కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. సచిన్ బ్యాటింగ్ కోసం రెండో రోజు ఉదయం అభిమానులు ఆత్రంగా స్టేడియానికి వచ్చారు. ఆటలో 39 నిమిషాలు గడిచాక విజయ్ అవుట్ కాగానే... సచిన్... సచిన్... అంటూ అభిమానులు హోరెత్తించారు. మొత్తం 41 నిమిషాల పాటు క్రీజులో గడిపిన మాస్టర్ రెండు క్లాసికల్ బౌండరీలతో అలరించాడు. ఆ తర్వాత షిల్లింగ్ఫోర్డ్ దూస్రాకు మాస్టర్ అవుట్ కాగానే స్టేడియంలో సూదిపడ్డా వినిపించేంత నిశ్శబ్దం ఆవరించింది. ఎంత పని చేశావు లాంగ్! అంపైర్లు పొరపాట్లు చేయడం సహజం. వాళ్లు కూడా మనుషులే. కానీ ఒక్కోసారి అంపైర్ పొరపాటు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. తొలిటెస్టులో ఇంగ్లండ్ అంపైర్ నైజిల్ లాంగ్ చేసింది కూడా అలాంటిదే. తన ఒక్క తప్పుడు నిర్ణయంతో కోట్లాది మంది హృదయాల్ని బాధపెట్టాడు. షిల్లింగ్ఫోర్డ్ వేసిన బంతి సచిన్ వెనక కాలికి పైభాగంలో తగిలింది. ఇది వికెట్ల కంటే కనీసం నాలుగు నుంచి ఆరు అంగుళాలు పైకి వెళుతుందని రీప్లేల్లో తేలింది. లాంగ్ తప్పుడు నిర్ణయంతో సచిన్ను అవుట్గా ప్రకటించాడు. దీంతో భారత అభిమానులంతా తీవ్రంగా నిరాశ చెందారు. మళ్లీ భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడి, సచిన్కు బ్యాటింగ్ అవకాశం వస్తే తప్ప... ఈడెన్లో ఇక ఇంతే..! ‘ఓయ్’ బెస్ట్..! భారత్లో పాపులారిటీ రావాలంటే మైదానంలో ఏదో ఒకటి చేయాలి... చాలామంది విదేశీ క్రికెటర్లకు తెలిసిన విషయం ఇది. వెస్టిండీస్ బౌలర్ బెస్ట్ కూడా తన ‘అతి’ వేషాలతో కాస్త పాపులారిటీ తెచ్చుకోవాలనుకున్నాడు. ఇన్నింగ్స్ 56వ ఓవర్లో రోహిత్ శర్మపై స్లెడ్జింగ్కు దిగాడు. అయితే భారత స్టార్ మాత్రం మౌనంగానే ఉన్నాడు. ప్రతి బంతికీ రోహిత్ దగ్గరకి వెళ్లి బెస్ట్ కవ్వించాడు. దీంతో ప్రేక్షకులు బౌలర్పై గోలకు లేచారు. రోహిత్ దగ్గరకు బెస్ట్ వెళ్లినప్పుడల్లా ‘ఓయ్’ అంటూ కేకలు పెట్టారు. భారత ప్రేక్షకుల ధాటి తెలుసుకున్న బెస్ట్ ఆ తర్వాత మళ్లీ రోహిత్ జోలికి రాలేదు. కాకపోతే ప్రేక్షకులకు నమస్కారం, ఫ్లయింగ్ కిస్లతో సందడి చేశాడు. -
నిరాశ పరిచిన సచిన్
కోల్ కతా క్రికెట్ అభిమానులతోపాటు, ప్రపంచ క్రికెట్ అభిమానులను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. 57 పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో సచిన్ ఆటను చూడవచ్చన్న ఆనందంలో క్రికెట్ అభిమానులు మునిగిపోయారు. అయితే భారీ స్కోరుతో సచిన్ ఆలరిస్తారని ఊహించిన అభిమానులు.. సచిన్ తక్కువ స్కోరుకే అవుట్ కావడం దిగ్భ్రాంతికి గురి చేసింది. పూర్తి స్థాయిలో క్రికెట్ అభిమానులు స్టేడియంలోకి రాక ముందే సచిన్ అవుట్ కావడం నిరాశకు గురిచేసింది. 24 బంతులు ఆడిన సచిన్ రెండు ఫోర్లతో 10 పరుగులకే పెవిలియన్ దారి పట్టాడు. నిజానికి అది వివాదాస్పద ఎల్బీడబ్ల్యూ నిర్ణయం. బౌలర్ షిల్లింగ్ఫోర్డ్ వేసిన బంతి చాలా ఎత్తులో సచిన్ వెనకాల తొడకు తగిలింది. బాల్ పయనిస్తున్న దృశ్యం సైడ్ యాంగిల్లో చూస్తే స్టంప్స్పై నుండి వెళ్లేదని తెలుస్తోంది. అందుకే సచిన్ అసంతృప్తితో ముఖం అడ్డంగా ఆడిస్తూ పెవిలియన్ దారి పట్టాడు. సచిన్కు ముందు చటేశ్వర పూజారా, సచిన్ తర్వాత యువ సంచలనం విరాట్ కోహ్లి మూడు పరుగలకే ఔటయ్యాడు. దాంతో 87 పరుగులకే ఇండియా సగం టీమ్ను కోల్పోయింది. భారత్ 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం కెప్టెన్ ధోని, రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు. -
199వ టెస్ట్లో బ్యాటింగ్కు దిగిన సచిన్
కోల్కతా : ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభిమానుల కల సాకారం అయ్యింది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో భారత్-విండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండో రోజు ఆటలో సచిన్ బ్యాటింగ్ ప్రారంభించాడు. జట్టు స్కోర్ 57 పరుగుల వద్ద మురళీ విజయ్ (26) అవుట్ అవటంతో సచిన్ బ్యాటింగ్కు దిగాడు. క్రికెట్ దేవుడి చివరి మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎక్కడలేని ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. మరోవైపు కోల్కతా అంతా మాస్టర్ ఫీవర్తో ఊగిపోతుంది. ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టారు.. పాఠశాల, కాలేజీ విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టారు.. అందరి దారీ ఈడెన్ గార్డెన్స్ వైపే.. దాంతో ఈడెన్ గార్డెన్స్ గ్యాలరీ అభిమానులతో కిక్కిరిసి పోయింది. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల చేతుల్లో సచిన్ టెండూల్కర్ భారీ చిత్రపటాలు కనిపించాయి. అందులో ‘ఆటను ఆస్వాదించు.. కలలను ఛేదించు.. స్వప్నాలను సాకారం చేసుకో’ అనే సచిన్ కొటేషన్ను కూడా పొందుపరిచారు. కొందరైతే త్రివర్ణ రంగులతో సచిన్ అనే పేరును తమ ముఖాలపై రాయించుకున్నారు. -
శిఖర్ ధావన్ వికెట్ కోల్పోయిన భారత్
కోల్కతా : రెండోరోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. గురువారం ఉదయం ప్రారంభించిన జట్టు 42 పరుగుల వద్ద షిల్లాంగ్ఫోర్డ్ బౌలింగ్లో శిఖర్ ధావన్ (23) అవుట్ అయ్యాడు. 20 ఓవర్లలో వికెట్ నష్టానికి భారత్ 56 పరుగులు చేసింది. మురళీ విజయ్ 26, చటేశ్వర్ పూజారా 5 పరుగులతో ప్రస్తుతం క్రీజ్లో ఉన్నారు. ఈడెన్ గార్డెన్లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఇన్సింగ్స్లో 234 పరుగులకు ఆల్అవుట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్ మొదటి రోజు ఆట ముగిసే సరికి వికెట్ కోల్పోకుండా 37 పరుగులు చేసింది. -
తొలి రోజు భారత్దే ఆధిపత్యం
నేడే చూడండి! సచిన్ అభిమానుంలంతా నేడు (గురువారం) టీవీల ముందు కూర్చోవడం మంచిది. భారత్ రెండు వికెట్లు కోల్పోగానే మాస్టర్ బ్యాటింగ్కు వస్తాడు. ఓపెనర్లు ధావన్, విజయ్లతో పాటు ఫస్ట్డౌన్లో వచ్చే పుజారా... ఈ ముగ్గురూ కలిసి రోజంతా ఆడితే తప్ప సచిన్ ఈ రోజే బ్యాటింగ్కు రావడం ఖాయం. అది గంటలోపా... లేక సాయంత్ర సెషన్లోనా అనేది భారత యువ ‘టాప్ ఆర్డర్’ చేతుల్లో ఉంది. సచిన్ మానియాతో ఊగిపోతున్న ఈడెన్ గార్డెన్స్లో ధోనిసేన అంచనాలకు తగ్గట్టుగానే రాణించింది. కొత్త కుర్రాడు మహ్మద్ షమీ సూపర్ స్పెల్తో చెలరేగడంతో తొలి రోజు భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆరంభంలో విండీస్ పటిష్ట స్థితిలో ఉన్నా మ్యాచ్ గడిచేకొద్ది చేతులెత్తేసింది. దీంతో తక్కువ స్కోరుకే ఆలౌటై కష్టాల్లో పడింది. మరోవైపు భారత ఓపెనర్లు జట్టుకు శుభారాంభాన్నిచ్చారు. కోల్కతా: అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన ఫేర్వెల్ సిరీస్లో భారత్కు ఘనమైన ఆరంభం లభించింది. సచిన్ నామస్మరణతో మారుమోగుతున్న ఈ‘డెన్’లో తొలి టెస్టు ఆడుతున్న 23 ఏళ్ల మహ్మద్ షమీ మెరుపులు మెరిపించాడు. రివర్స్ స్వింగ్ బంతులతో మ్యాజిక్ చేస్తూ భారీ హిట్టర్లున్న ప్రత్యర్థి జట్టును వణికించాడు. దీంతో బుధవారం వెస్టిండీస్తో ప్రారంభమైన తొలి టెస్టులో తొలి రోజు భారత్ ఆధిపత్యం కొనసాగింది. బ్యాటింగ్లో విఫలమైన స్యామీసేన తొలి ఇన్నింగ్స్లో 78 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. శామ్యూల్స్ (65) ఒంటరిపోరాటం చేయగా, చందర్పాల్ (36), పావెల్ (28) ఓ మోస్తరుగా ఆడారు. ఓ దశలో 138/2 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న విండీస్ 96 పరుగుల తేడాతో చివరి 8 వికెట్లను కోల్పోవడం దెబ్బతీసింది. షమీ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా, అశ్విన్కు 2 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 12 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ధావన్ (21 బ్యాటింగ్), విజయ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు మైదానంలో వరుసగా నిలబడి సచిన్కు గౌరవ అభివాదం చేశారు. స్కోరు వివరాలు వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: గేల్ (సి) విజయ్ (బి) భువనేశ్వర్ 18; పావెల్ (సి) భువనేశ్వర్ (బి) షమీ 28; డారెన్ బ్రేవో రనౌట్ 23; శామ్యూల్స్ (బి) షమీ 65; చందర్పాల్ (బి) అశ్విన్ 36; రామ్దిన్ (బి) షమీ 4; స్యామీ (సి) భువనేశ్వర్ (బి) ఓజా 16; షిల్లాంగ్ఫోర్డ్ ఎల్బీడబ్ల్యూ (బి) సచిన్ 5; పెరుమాల్ (సి) అండ్ (బి) అశ్విన్ 14; బెస్ట్ నాటౌట్ 14; కొట్రీల్ (బి) షమీ 0; ఎక్స్ట్రాలు: (బైస్ 4, లెగ్బైస్ 7) 11; మొత్తం: (78 ఓవర్లలో ఆలౌట్) 234. వికెట్లపతనం: 1-34; 2-47; 3-138; 4-138; 5-143; 6-172; 7-192; 8-211; 9-233; 10-234 బౌలింగ్: భువనేశ్వర్ 14-6-33-1; మహ్మద్ షమీ 17-2-71-4; అశ్విన్ 21-9-52-2; ఓజా 24-6-62-1; సచిన్ 2-1-5-1. భారత్ తొలి ఇన్నింగ్స్: ధావన్ నాటౌట్ 21; విజయ్ నాటౌట్ 16; ఎక్స్ట్రాలు: 0; మొత్తం: (12 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 37. బౌలింగ్: బెస్ట్ 2-0-15-0; కొట్రీల్ 5-2-13-0; షిల్లాంగ్ఫోర్డ్ 4-2-8-0; పెరుమాల్ 1-0-1-0. సెషన్-1 టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్కు గేల్ (18), పావెల్ (28) శుభారంభాన్నివ్వలేకపోయారు. వికెట్పై ఉండే తేమను సద్వినియోగం చేసుకున్న భువనేశ్వర్ ఆరంభంలో చెలరేగిపోయాడు. చక్కని లైన్ అండ్ లెంగ్త్తో హిట్టింగ్కు మారుపేరైన గేల్ను కట్టడి చేశాడు. రెండో ఎండ్లో షమీ కూడా ఓపెనర్లను ఇబ్బందులుపెట్టాడు. దీంతో విండీస్కు పరుగుల రాక మందగించింది. ఈ క్రమంలో భువీ... ఓ లో డెలివరితో గేల్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ధోని తన వ్యూహాన్ని మార్చి షమీ ఎండ్ మార్చాడు. ఫలితంగా షమీ ఓ చక్కని బంతితో పావెల్ను బోల్తా కొట్టించాడు. దీంతో స్యామీసేన 47 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డారెన్ బ్రేవో (23)కు జత కలిసిన శామ్యూల్స్ నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరు ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. సెషన్-2 లంచ్ తర్వాత బ్రేవో నెమ్మదిస్తే శామ్యూల్స్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఓజా బౌలింగ్లో రెండు భారీ సిక్సర్లు కొట్టి గాడిలో పడ్డాడు. ఈ క్రమంలో టెస్టుల్లో 19వ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే వీరి దూకుడుకు షమీ రివర్వ్ స్వింగ్తో అడ్డుకట్ట వేశాడు. 44వ ఓవర్లో ఓ షార్ప్ ఇన్ కట్టర్తో శామ్యూల్స్ను పెవిలియన్కు పంపాడు. దీంతో మూడో వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చందర్పాల్ క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించగా... తర్వాతి ఓవర్లో బ్రేవో రనౌట్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్ (46)లో రామ్దిన్ (4)ను షమీ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన స్యామీ (16), షిల్లాంగ్ఫోర్డ్ (5) కూడా ఎక్కువసేపు నిలబడకపోయారు. దీంతో 192/7 స్కోరుతో విండీస్ టీ విరామానికి వెళ్లింది. మొత్తానికి ఈ సెషన్లో షమీ హవా నడిచింది. సెషన్-3 ఓ ఎండ్లో సహచరులు చకచకా అవుటవుతున్నా రెండో ఎండ్లో చందర్పాల్ ఆచితూచి ఆడాడు. అయితే ఈ దశలో అశ్విన్ చక్కని బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. వరుస విరామాల్లో పెరుమాల్ (14)తో పాటు నిలకడగా ఆడుతున్న చందర్పాల్ను అవుట్ చేసి విండీస్కు షాకిచ్చాడు. తర్వాత కొద్దిసేపటికే కొట్రీల్ను షమీ పెవిలియన్కు పంపడంతో 234 పరుగుల వద్ద కరీబియన్ ఇన్నింగ్స్కు తెరపడింది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఓపెనర్లు నిలకడకు ప్రాధాన్యమిచ్చారు. ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీకి తరలించిన ధావన్... కొట్రీల్ బౌలింగ్లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. బెస్ట్ బౌలింగ్లో విజయ్ వరుసగా రెండు బౌండరీలు సాధించడంతో భారత్ స్కోరుబోర్డు పరుగెత్తింది. తర్వాత నెమ్మదించిన ఈ జోడి సింగిల్స్, డబుల్స్పై దృష్టిపెట్టి బ్యాటింగ్ను రొటేట్ చేస్తూ రోజును ముగించింది. 12 ఓవర్లపాటు బౌలింగ్ చేసిన విండీస్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. సచిన్కు అంకితం ‘తొలి టెస్టులో సాధించిన నాలుగు వికెట్ల ఘనతను సచిన్కు అంకితమిస్తున్నా. మాస్టర్తో కలిసి ఆడాలన్న నా కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు చాలా పెద్ద విషయం. నేను సాధించిన గొప్ప ఘనత కూడా ఇదే. టి20, వన్డేల్లో ఆడిన నేను టెస్టులోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నా. అదీ నెరవేరింది. బంతులను మార్చడం వల్ల రివర్స్ స్వింగ్ సులువుగా సాధ్యమైంది. తొలి బంతి చాలా మృదువుగా ఉండటంతో ఎక్కువ స్వింగ్ను రాబట్టలేకపోయా. కానీ బంతిని మార్చిన తర్వాత రివర్స్ స్వింగ్ లభించింది. మొదట తీసిన పావెల్ వికెట్ ఎప్పటికీ ప్రత్యేకమే. సవాళ్లను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉంటా.’ - షమీ (భారత పేసర్) కెవ్వు కేక సరిగ్గా మధ్యాహ్నం 1.36 నిమిషాలు.. అప్పటిదాకా ఈడెన్ గార్డెన్స్లో కాస్త స్తబ్ధుగానే కూర్చున్న ప్రేక్షకులు ఒక్కసారిగా సాచిన్... సాచిన్ అంటూ హోరెత్తిపోయారు. కెప్టెన్ ధోని.. బౌలింగ్ చేయమంటూ బంతిని సచిన్ వైపు విసరడమే ఈ అరుపులకు కారణం. అటు క్రీజులో ఉన్న విండీస్ బ్యాట్స్మెన్ కూడా ఆశ్చర్యపోయారు. 40 వేల ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య బౌలింగ్ ప్రారంభించిన సచిన్ తొలి బంతిని లెగ్ బ్రేక్గా వేయడంతో షిల్లింగ్ఫోర్డ్ డిఫెన్స్గా ఆడాడు. రెండో బంతి గూగ్లీకి లైగ్బైస్గా వెళ్లడంతో నాలుగు పరుగులు వచ్చాయి. రెండు బంతుల అనంతరం షిల్లింగ్ఫోర్డ్ను ఎల్బీగా అవుట్ చేయడంతో వేలాది గొంతుకలు మరోసారి మాస్టర్ నామస్మరణలో మునిగిపోయాయి. తొలి రోజే సచిన్ బ్యాటింగ్ విన్యాసాలు చూద్దామని ఈడెన్కు వచ్చిన ప్రేక్షకులు భారత్ ఫీల్డింగ్కు దిగడంతో నిరుత్సాహపడినా.. ఇలా బౌలింగ్తో మాస్టర్ వారి మనసు దోచుకున్నాడు. కొనసాగుతున్న క్యాబ్ పొరపాట్లు మాస్టర్ చివరి సిరీస్ పట్ల అత్యుత్సాహమో.. ఏమరుపాటో తెలీదు కానీ క్యాబ్ చేస్తున్న కొన్ని ఏర్పాట్లు వారి పరువు తీస్తున్నాయి. ఇప్పటికే స్టేడియంలో ఏర్పాటు చేసిన బిల్బోర్డులో సచిన్ పేరును సచినిగా పేర్కొంటూ అభాసుపాలైనా తీరు మారలేదు. తాజాగా తొలి రోజు ఆట లంచ్ సమయంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన సచిన్ సతీమణి అంజలి గురించి స్టేడియంలో ఉన్న భారీ స్క్రీన్ మీద ‘మిస్టర్ అంజలి టెండూల్కర్ అండ్ మాస్టర్ అర్జున్ టెండూల్కర్కు స్వాగతం’ అంటూ చూపించారు. ఆ తర్వాత తమ తప్పు తెలుసుకుని దాన్ని సరిచేశారు. బుక్లెట్ ప్రదానం సచిన్ క్రికెట్ జీవితంపై అరుదైన ఫొటోగ్రాఫ్స్, జ్ఞాపకాలతో కూడిన బుక్లెట్ను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) విడుదల చేసింది. దీన్ని తొలి రోజు ఆట సందర్భంగా సచిన్కు అందించింది. తొలి పేజీపై కెరీర్ తొలినాళ్లలో రింగు రింగుల జుట్టుతో ఉన్న యువ టెండూల్కర్ చిత్రాన్ని జోగేన్ చౌధురి గీశారు. కుటుంబసభ్యులతో పాటు డ్రెస్సింగ్ రూమ్లో దిగిన పలు ఫొటోలు ఇందులో ఉన్నాయి. అలాగే రిచర్డ్స్తో కలిసి చెస్ ఆడుతున్న ఫొటోను కూడా పొందుపరిచారు. ఈడెన్లో హంగామా కోల్కతా: ఉద్యోగులు తమ విధులకు సెలవు పెట్టారు.. పాఠశాల, కాలేజీ విద్యార్థులు తరగతులకు డుమ్మా కొట్టారు.. అందరి దారీ ఈడెన్ గార్డెన్స్ వైపే.. కోల్కతా అంతా మాస్టర్ ఫీవర్తో ఊగిపోయింది. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకుల చేతుల్లో సచిన్ టెండూల్కర్ భారీ చిత్రపటాలు కనిపించాయి. అందులో ‘ఆటను ఆస్వాదించు.. కలలను ఛేదించు.. స్వప్నాలను సాకారం చేసుకో’ అనే సచిన్ కొటేషన్ను కూడా పొందుపరిచారు. కొందరైతే త్రివర్ణ రంగులతో సచిన్ అనే పేరును తమ ముఖాలపై రాయించుకున్నారు. ఇరు జట్ల కెప్టెన్లు టాస్ వేసేందుకు వెళ్లినప్పుడు కూడా స్టేడియం అంతా సచిన్ పేరుతో మారుమ్రోగింది. అయితే టాస్ ఓడడంతో నిరాశచెందారు. సచిన్ కోసం వెయిటింగ్ ఈడెన్ గార్డెన్స్లో 70 వేల సామర్థ్యమున్నా ప్రత్యక్షంగా వీక్షించింది మాత్రం 40 వేల మందే. టిక్కెట్లు కొనుక్కున్నా.. వెస్టిండీస్ బ్యాటింగ్కు దిగిందనే వార్త తెలుసుకున్న చాలామంది మ్యాచ్కు దూరంగా ఉండిపోయారు. సగం సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. మాస్టర్ కోసం మరో రోజు వేచి చూద్దామని అభిమానులు భావించారు. నేడు (గురువారం) పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. బీసీసీఐ ‘థ్యాంక్యూ సచిన్’ కెరీర్లో చివరి సిరీస్ ఆడుతున్న సచిన్ టెండూల్కర్కు శుభాకాంక్షలు చెప్పేందుకు బీసీసీఐ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ట్విట్టర్లో హాష్లాగ్తో థ్యాంక్యూ సచిన్ అని బీసీసీఐకి ట్వీట్ చేస్తే చాలు.. వెంటనే అభిమానులకు బోర్డు నుంచి సచిన్ ఫొటో ఒకటి వస్తుంది. అంతేకాకుండా ఓ మెసేజి, సచిన్ ఆటోగ్రాఫ్ కూడా తిరుగు ట్వీట్లో వచ్చి ఆశ్చర్యపరుచనుంది. మ్యాచ్ ప్రారంభమైన వెంటనే బోర్డు ఈ ప్రచారాన్ని చేపట్టగా వెంటనే కోట్లాది సందేశాలు వెళ్లాయి. మీకూ ఆటోగ్రాఫ్ ఉన్న ఫొటో కావాలా? ట్విట్టర్లోకి లాగిన్ అయ్యి # thankyou sachin అని రాసి @BCCI కి ట్వీట్ చేయండి -
వెస్టిండీస్తో భారత్ తొలి టెస్టు మ్యాచ్ గ్యాలరీ
-
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కరేబియన్లు
కోల్కతా : ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇండియా- వెస్టిండీస్ తొలి టెస్టు... మాస్టర్ బ్లాస్టర్ 199 మ్యాచ్ ప్రారంభమైంది. కరీబియన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రిస్గేల్, కీరన్ పావెల్లు వెస్టిండీస్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ, బౌలర్ మహ్మద్ షమీలు టెస్ట్ అరంగేట్రం చేశారు. కాగా తొలిరోజే సచిన్ బ్యాటింగ్ను ఆస్వాదిద్దామనుకున్న అభిమానులకు వెస్టిండీస్ బ్యాటింగ్ కాస్త నిరాశనే కలిగించింది. మరోవైపు రెండు మ్యాచ్లు... నాలుగు ఇన్నింగ్స్... 24 ఏళ్ల కెరీర్కు ముగింపు పలికేందుకు క్రికెట్ ‘దేవుడు’ వేయనున్న ఈ రెండు అడుగుల కోసం ప్రపంచం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఒకటా, రెండా, వందల కొద్ది మ్యాచ్లు ఆడినా... ఒంటిచేత్తో గెలిపించినా... ఎన్నడూ లేని ఉత్కంఠ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. కోట్లాది మంది అభిమానులతో పాటు... ప్రపంచ క్రీడాలోకం మొత్తం ఓ దిగ్గజ ఆటగాడి ఆటలో చివరి అంకాన్ని తిలకించేందుకు సిద్ధమయింది. -
ఈడెన్ గార్డెన్లో క్రికెట్ కళ కళ
-
ఘనంగా ముగించాలి
సాక్షి క్రీడావిభాగం కోట్లాది అభిమానులను తన అసమాన ఆటతీరుతో ఉర్రూతలూగించి... క్రికెట్ను దేశంలో ఓ మతంగా మార్చిన క్రికెటర్ ఇక చివరి మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ తర్వాత ఆట నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగానే మాస్టర్ను ఎంతగానో ఆరాధించిన అభిమానులు ఆవేదన చెందారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే రిటైర్మెంట్ ప్రకటన (అక్టోబర్ 11) వచ్చిన నాటి నుంచి సచిన్ ఆడబోయే మ్యాచ్ల కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. మధ్యలో ఆడిన రంజీ మ్యాచ్నూ చూసి సంబరపడ్డారు. ఇక అసలైన రోజు రానే వచ్చింది. ఆడేది కేవలం రెండు టెస్టులే. తొలి మ్యాచ్ నేటి నుంచి ఈడెన్గార్డెన్స్లో జరుగుతుంది. ఓ క్రికెటర్గా సచిన్ కోల్కతా రావడం ఇదే చివరిసారనే భావన అక్కడి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటు దేశంలోని మిగిలిన నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం 9 గంటలకు మ్యాచ్ మొదలయ్యే వరకూ కోట్లాదిమంది టెన్షన్ తగ్గదేమో..! అద్భుతమైన ఆటతీరుతో ఇంతకాలం అలరించిన మాస్టర్... తన కెరీర్ను తన స్థాయికి తగ్గట్లుగా ఘనంగా వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు. సెంచరీ చేసి గాల్లోకి బ్యాట్ను చూపించే తన ట్రేడ్మార్క్ ఫోజును చూడాలని ఉబలాటపడుతున్నారు. ఈ మ్యాచ్లో లేదంటే ముంబైలో... ఎక్కడైనా ఫర్లేదు. సచిన్ ఒక్క సెంచరీ అయినా చేయాలి. చాలామంది గొప్ప క్రికెటర్లు తమ చివరి సిరీస్ను అద్భుతంగా ముగించారు. వెస్టిండీస్ దిగ్గజం రిచర్డ్స్ను సచిన్ బాగా ఇష్టపడతాడు. రిచర్డ్స్ తన చివరి సిరీస్లో ఇంగ్లండ్పై ఎనిమిది ఇన్నింగ్స్లో ఐదు అర్ధసెంచరీలు చేసి సిరీస్ను ఘనంగా ముగించాడు. అదే విధంగా మంచి కెప్టెన్గా మాస్టర్ నుంచి కితాబు అందుకున్న స్టీవ్వా కూడా తన చివరి సిరీస్లో 44.50 సగటుతో 267 పరుగులు చేశాడు. వీళ్ల తరహాలోనే సచిన్ కూడా తన కెరీర్ను ఘనంగా ముగించాలని కోరుకోవడం ఓ సగటు అభిమాని కోరికే కాదు... హక్కు కూడా..! ఎన్నో జ్ఞాపకాలు సచిన్ తొలిసారి 1991 జనవరి 4న శ్రీలంకతో వన్డేలో ఈడెన్గార్డెన్స్లో తొలిసారి బరిలోకి దిగాడు. అప్పటి నుంచి ఈ ప్రఖ్యాత స్టేడియంలో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. 1993లో తన సంచలన బౌలింగ్తో భారత్కు విజయాన్ని అందించాడు... 1996 ప్రపంచకప్లో అల్లరినీ దగ్గర్నించి చూశాడు.మార్చి 2012లో బంగ్లాదేశ్పై వన్డే సెంచరీ తర్వాత మళ్లీ సచిన్ శతకం చేయలేదు. మరోవైపు టెస్టుల్లో 51 శతకాలు సాధించిన సచిన్... 2011లో దక్షిణాఫ్రికాలో సెంచరీ చేశాక మళ్లీ మూడంకెల స్కోరు చేయలేదు. కాబట్టి మాస్టర్ ఓ భారీ ఇన్నింగ్స్ ఆడాలి. ఈడెన్లో మాస్టర్కు గొప్ప రికార్డేమీ లేదు. లక్ష్మణ్ (10 టెస్టుల్లో ఐదు సెంచరీలు), అజహరుద్దీన్ (7 మ్యాచ్ల్లో ఐదు సెంచరీలు), రాహుల్ ద్రవిడ్ (9 టెస్టుల్లో మూడు సెంచరీలు)లకు ఇది అచ్చొచ్చిన మైదానం. సచిన్ ఇక్కడ ఆడిన 20 ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు మాత్రమే సాధించాడు. రికార్డులు ఎలా ఉన్నా... ఇక తను ఇక్కడ ఆడేది ఇదే ఆఖరు. కాబట్టి మంచి స్కోరునే సాధించి అందరినీ అలరించాలని ఆశిద్దాం. -
ఇక ఆరామ్గా..అంజలి చేతి కాఫీ
ఇవాళ ఈడెన్, వారానికి వాంఖేడ్! తర్వాత? మాస్టర్ బ్లాస్టర్... ఎ ఫుల్టైమ్ ఫ్యామిలీ మేన్. భార్య, పిల్లలు, కబుర్లు, కుటుంబంతో టూర్లు. ఇప్పటి వరకు ఇవన్నీ లేవా? ఉండే ఉంటాయ్ కానీ... అంజలిని మొదటి సారి కలిసిందీ, కలిసి మొదటి సినిమా చూసిందీ తనని, పిల్లల్ని ఆమె ఎలా బ్యాలెన్స్ చేసిందీ... ఇవన్నీ మాట్లాడుకోడానికి ఎక్స్ట్రాగా ఇంకొంచెం టైమ్!! ఎట్లీస్ట్... బెడ్ కాఫీ అడగడానికీ, అర్ధాంగి తెచ్చే కాఫీ కోసం వెయిట్ చెయ్యడానికీ, ఆరామ్గా మరికొంత సమయం. అద్సరే... ఉరుకులు ‘పరుగుల’ మధ్య... పద్దెనిమిదేళ్ల పాటు వీరి దాంపత్య జీవితం ఎలా గడిచి ఉంటుంది? ఎలాగేముందీ... ‘మనసే జతగా...’ సచిన్ టెండూల్కర్ నా జీవితంలో ముగ్గురు మహిళలున్నారు. ఒకరు మా అమ్మ. తను ఉద్యోగిగానూ, ఇంటి బాధ్యతలను నిర్వర్తించడంలోనూ తీరికలేకుండా ఉండేది. కాని అంతపనిలోనూ నాకోసం సమయం కేటాయించేది. ఆఫీస్ అయిపోగానే ఇంటినీ చక్కదిద్దుకునేవారు. తనెప్పుడు నాకూ శక్తిమంతమైన మహిళగా అనిపిస్తుంది. మరొకరు మా మేనత్త. నాలుగేళ్లు అత్త వాళ్ల ఇంటిలో పెరిగాను. నాకు క్రికెట్ మీద ఉన్న ఇష్టాన్ని వారి ద్వారానే మా ఇంట్లో గుర్తించారు. ఇక మూడవ మహిళ నా భార్య అంజలి. అంజలి ఎప్పుడూ చాలా లో ప్రొఫైల్ను మెయింటెయిన్ చేస్తుంది. తను డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ! ఎవరి వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయదు. కుటుంబంలోనూ, బంధుమిత్రుల్లోనూ.. అందరితోనూ కలివిడిగా ఉంటుంది. అంజలీ టెండూల్కర్ అందరూ అనుకుంటున్నట్టు మా ఇద్దరికీ ముందు నుంచీ పరిచయం లేదు. మేమిద్దరం మొదటిసారి కలుసుకున్నది 1990లో ముంబయ్ ఎయిర్పోర్ట్లో! ఇంగ్లండ్ మ్యాచ్ ముగిశాక ఇండియా టీమ్ స్వదేశానికి వస్తోంది. ఆ రిటర్న్లో ఫస్ట్ టైమ్ ఎయిర్పోర్ట్లో సచిన్ను చూశాను. మా పరిచయం చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అప్పటివరకు నాకు క్రికెట్ గురించి ఏ మాత్రం పరిజ్ఞానం లేదు. మా ఇద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా మా పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఐదేళ్లకు 1995లో మా పెళ్లి అయ్యింది. పెళ్లికి ముందు మేమిద్దరం కలిసి చూసిన సినిమా ‘రోజా’. అప్పుడు నేను మెడిసిన్ చదువుతున్నాను. నేను సచిన్ను ఎందుకు ఇష్టపడ్డాను అంటే ఇదీ కారణం అని చెప్పలేను. మా అనుబంధం అలా పెరుగుతూనే ఉంది. మా బంధం నానాటికీ బలపడుతూనే ఉంది. నాకు 9-5 జాబ్ ఇష్టం ఉండదు. అందుకే వైద్యవృత్తిని ఎంచుకున్నాను. నా వృత్తిని అమితంగా ప్రేమిస్తాను. ఒకవేళ సచిన్ను పెళ్లి చేసుకుంటే కెరియర్ ఆగిపోతుంది అనుకుంటే, నేనసలు పెళ్లికే ఒప్పుకునేదాన్ని కాదేమో! ఎందుకు, ఏమిటి అనే విషయాల్లో సచిన్ చాలా క్లియర్గా ఉంటారు. రేపటి గురించి ఆలోచించరు. ప్రస్తుతం జరుగుతున్నదానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. నేనూ ప్రతిదీ సైంటిఫిక్గా, ప్రాక్టికల్గా చూస్తాను. మా ఇద్దరిలో ఉండే కామన్ థింగ్ ఇదే అనుకుంటాను. తను లతామంగేష్కర్, కిశోర్కుమార్ పాటలు వినడానికి చాలా ఇష్టపడతారు. హిందీ సినిమాలు, పాటలపై నాకు పెద్దగా పరిజ్ఞానం లేదు. సినిమాలు చూడ్డం, పాటలు వినడం.. అది కూడా పెళ్లి తర్వాతే మొదలుపెట్టాను. మాకు సారా, అర్జున్ ఇద్దరు పిల్లలు. వారికి అతిముఖ్యమైన పుట్టినరోజు, స్కూల్ డే వంటి వేడుకలకు సచిన్ అందుబాటులో ఉండరు. కాని ఎందుకు రాలేదో తర్వాత వివరించి చెబుతారు. పిల్లలు అర్థ్ధం చేసుకుంటారు. సచిన్కు క్రికెట్ తర్వాతే అన్నీ! అది నాకు తెలుసు. ఎక్కువగా ప్రాక్టీస్లోనే ఉంటారు. ఈ మధ్య పిల్లల విషయంలో సచిన్ చాలా రియలైజ్ అయ్యారనిపిస్తోంది. పిల్లలు పెద్దవుతున్నారు కదా! వారితో ఈ మధ్య ఎక్కువ సమయం కేటాయించడానికి ఇష్టపడుతున్నారు. క్రికెట్లో తనో లెజండ్! పిల్లలతో ఉండేప్పుడు మాత్రం చాలా సాధారణమైన తండ్రిలా అనిపిస్తారు. అంజలి చాలా గ్రేట్గా కనిపిస్తుంది. నేను నా క్రికెట్తో 24 గంటలూ ఉండిపోయినా ఇంటినీ, పిల్లలను, ఆసుపత్రినీ అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. తను నా జీవితంలోకి అడుగుపెట్టి 23 ఏళ్లు. మా పెళ్లయి 18 ఏళ్లు. కెరీర్లో ఒడిదొడుకులను ఎదుర్కొనే సమయంలో ఎంతో సపోర్ట్గా నిలిచింది అంజలి. గాయాలు అయి కష్టంగా అనిపించినప్పుడు నన్ను చిన్నపిల్లవాడిలా చూసుకుంది. జీవితంలో రెండోకోణాన్నీ చూడటం తన ద్వారానే తెలుసుకున్నాను. క్రికెట్లో ఇంతవరకు చేరుకోగలిగానంటే అది అంజలి వల్లే! పెళ్లి తర్వాత చాలామంది నే చదివిన చదువు వృథా అయిపోతుందని, గృహిణిగా ఇంటికే పరిమితం అవుతాను అనుకున్నారు. కాని నేనలా అనుకోలేదు. సచిన్ నాకా స్వేచ్ఛను ఇచ్చారు. సచిన్ను పెళ్లిచేసుకోవడం వల్లే మెడిసిన్ను ఫుల్టైమ్ కెరీర్గా చేయగలుగుతున్నాను. నేను పిడియాట్రీషియన్ని. ఏ టైమ్లో అయినా సరే... హాస్పిటల్లో రోగిని అడ్మిట్ చేశారు అని పిలుపు రాగానే ఆ సమయంలో అక్కడ వారికి అందుబాటులో ఉంటాను. ఇంట్లో కూడా ఏ చిన్న మార్పు చేయాలన్నా నిర్ణయం నాకే వదిలేస్తారు సచిన్. -
మళ్లీ ‘పిచ్’ఎక్కించాడు!
కోల్కతా: ఈడెన్ ‘సీతయ్య’ ప్రబీర్ ముఖర్జీ మరోసారి క్రికెటర్లంటే లెక్క లేని వైఖరిని ప్రదర్శించారు. ఒక వైపు సచిన్ 199వ టెస్టు అంటూ భారీ ప్రచారం, హడావిడి కనిపిస్తున్నా క్యురేటర్ మాత్రం తన దారి తనదే అన్నట్లు వ్యవహరించారు. తరచూ వివాదాలతో సావాసం చేసే ముఖర్జీ సోమవారం భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మను పిచ్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. వివరాల్లోకెళితే...మ్యాచ్కు ముందు ఆటగాళ్లు పిచ్ను పరిశీలించడం సహజం. భారత జట్టు ప్రాక్టీస్కు ముందు రోహిత్ శర్మ కూడా అదే పని చేయబోయాడు. బెంగళూరులో అద్భుత ప్రదర్శన అనంతరం ఈడెన్లో ఘన స్వాగతం దక్కించుకున్న రోహిత్కు క్యురేటర్ నుంచి మాత్రం అనూహ్యంగా తిరస్కారం ఎదురైంది. రోహిత్ పిచ్ వద్దకు వచ్చాక, ప్రబీర్ దానిని దగ్గరగా చూడనివ్వలేదు. అక్కడే ఉన్న ‘కేవలం కెప్టెన్, కోచ్లకు మాత్రమే అనుమతి’ అనే బోర్డును చూపిస్తూ ముఖర్జీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రోహిత్ మొహం చిన్నబోయింది. క్యురేటర్తో ఎలాంటి వాదనకు దిగకపోయినా శర్మ అసంతృప్తిగా వెనుదిరిగాడు. అయితే విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ విషయంలో మాత్రం క్యురేటర్ భిన్నంగా స్పందించారు. గేల్ కెప్టెన్ కాదు... కోచ్ కాదు... జట్టులోని సాధారణ ఆటగాడు మాత్రమే. కానీ గేల్ మాత్రం పిచ్ వద్ద కూర్చొని స్వేచ్ఛగా దానిని పరిశీలించడం గమనార్హం. -
కోల్కతాలో ‘సచిన్ కార్నివాల్’
కోల్కతా: సచిన్ టెండూల్కర్ చివరిసారిగా ఈడెన్ గార్డెన్స్లో ఆడనుండడంతో కోల్కతా అంతటా మాస్టర్ ఫీవర్ కొనసాగుతోంది. ఓరకంగా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈనెల 6 నుంచి 10 వరకు వెస్టిండీస్తో తొలి టెస్టు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సచిన్ను ఏ రీతిన గౌరవించాలనే విషయంపై బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఓ జాబితాను రూపొందించింది. ఈ మ్యాచ్ కోసం భారత క్రికెటర్లు నగరానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి ముంబై నుంచి వచ్చిన మాస్టర్కు విమానాశ్రయంలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారి మధ్య నుంచి సచిన్ను బయటకు తీసుకురావడానికి భద్రతా సిబ్బంది తంటాలుపడ్డారు. మ్యాచ్కు ముందు క్యాబ్ ఏర్పాటు చేద్దామనుకున్న విందును... ఆట మీద దృష్టి సారించేందుకు వీలుగా సచిన్ వద్దన్నాడు. కోల్కతాలో ఆదివారం కాళీ పూజ సందర్భంగా సచిన్ ఫొటోలతో అభిమానుల ప్రార్థన