క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట పరాజయం  | Bopanna pair lost in the quarterfinals | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న జంట పరాజయం 

Published Thu, Apr 26 2018 1:30 AM | Last Updated on Thu, Apr 26 2018 1:30 AM

Bopanna pair lost in the quarterfinals - Sakshi

బార్సిలోనా ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో రోహన్‌ బోపన్న (భారత్‌)–వాసెలిన్‌ (ఫ్రాన్స్‌) జంట క్వార్టర్‌ ఫైనల్లో ఓడింది.  డబుల్స్‌ క్వార్టర్స్‌లో బోపన్న–వాసెలిన్‌ ద్వయం 6–4, 6–7 (9/11), 11–13తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో కబాల్‌–రాబర్ట్‌ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జోడీకి 20,540 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 16 లక్షల 74 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగం రెండో రౌండ్‌లో మాజీ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 2–6, 6–1, 3–6తో క్వాలిఫయర్‌ క్లిజాన్‌ (స్లొవేకియా) చేతిలో ఓటమి చవిచూశాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement