quarter finals
-
Ranji Trophy QFs: అంకిత్ శతకం.. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
కోల్కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.లక్షయ్ దలాల్ (34), యశ్వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.మెరిసిన మనన్, జైమీత్బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
జెస్సికా జోరు
న్యూయార్క్: ఎట్టకేలకు గ్రాండ్స్లామ్ క్వార్టర్ ఫైనల్ ‘ఫోబియా’ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ జెస్సికా పెగూలా అధిగమించింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరుతో అదరగొట్టిన జెస్సికా ఏకంగా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్ను బోల్తా కొట్టించింది. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సీజన్ చివరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో ఈసారి అమెరికా క్రీడాకారులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. పురుషుల సింగిల్స్లో ఇద్దరు అమెరికా ఆటగాళ్లు టేలర్ ఫ్రిట్జ్, ఫ్రాన్సెస్ టియాఫో సెమీఫైనల్లోకి అడుగు పెట్టగా... మహిళల సింగిల్స్లోనూ ఇద్దరు అమెరికా క్రీడాకారిణులు జెస్సికా పెగూలా, ఎమ్మా నవారో సెమీఫైనల్కు చేరుకోవడం విశేషం.సినెర్, డ్రేపర్ తొలిసారి... పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ యానిక్ సినెర్ (ఇటలీ), 25వ ర్యాంకర్ జాక్ డ్రేపర్ (బ్రిటన్) తొలిసారి యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు. క్వార్టర్ ఫైనల్స్లో సినెర్ 6–2, 1–6, 6–1, 6–4తో 2021 చాంపియన్, గత ఏడాది రన్నరప్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలుపొందగా... డ్రేపర్ 6–3, 7–5, 6–2తో పదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆ్రస్టేలియా)ను ఓడించాడు. కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్ చేరిన డ్రేపర్ యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్ చేరుకున్న నాలుగో బ్రిటన్ ప్లేయర్గా నిలిచాడు. గతంలో గ్రెగ్ రుసెద్స్కీ (1997), టిమ్ హెన్మన్ (2004), ఆండీ ముర్రే (2008, 2011, 2012) ఈ ఘనత సాధించారు. ఏడో ప్రయత్నంలో...కెరీర్లో 23వసారి గ్రాండ్స్లామ్ టోర్నీలో ఆడుతున్న 30 ఏళ్ల జెస్సికా గతంలో ఆరుసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. అయితే ఈ ఆరుసార్లూ ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. కానీ ఏడో ప్రయత్నంలో జెస్సికా సఫలమైంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ నాలుగో క్వార్టర్ ఫైనల్లో జెస్సికా 6–2, 6–4తో టాప్ సీడ్ స్వియాటెక్ (పోలాండ్)ను కంగుతినిపించింది. 88 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో జెస్సికా ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 12 విన్నర్స్ కొట్టిన జెస్సికా 22 అనవసర తప్పిదాలు చేసింది. మరోవైపు స్వియాటెక్ 41 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. ‘గతంలో పలుమార్లు గ్రాండ్స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఓడిపోయాను. సెమీఫైనల్ ఎప్పుడు చేరుకుంటావు అని నా శ్రేయోభిలాషులు అడుగుతుండేవారు. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. ఎట్టకేలకు క్వార్టర్ ఫైనల్ను దాటి గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్కు చేరుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని జెస్సికా వ్యాఖ్యానించింది. నేడు జరిగే సెమీఫైనల్స్లో కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్)తో జెస్సికా; ఎమ్మా నవారో (అమెరికా)తో సబలెంకా (బెలారస్) తలపడతారు. -
క్వార్టర్ ఫైనల్స్లో ముగిసిన భారత్ పోరు
చెంగ్డూ: థామస్ కప్ పురుషుల టీమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు పోరాటం ముగిసింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 1–3తో 10 సార్లు చాంపియన్ చైనా చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో ప్రణయ్ 21–15, 11–21, 14–21తో షి యుకి చేతిలో... రెండో మ్యాచ్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి 15–21, 21–11, 12–21తో లియాంగ్ వె కెంగ్–వాంగ్ చాంగ్ చేతిలో ఓడిపోయారు. మూడో మ్యాచ్లో లక్ష్య సేన్ 13–21, 21–8, 21–14తో లి షి ఫెంగ్పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్లో సాయిప్రతీక్–ధ్రువ్ కపిల 10–21, 10–21తో హి జి టింగ్–రెన్ జియాంగ్ యు చేతిలో ఓటమి పాలవ్వడంతో భారత పరాజయం ఖరారైంది. ఉబెర్ కప్ మహిళల టీమ్ క్వార్టర్ ఫైనల్లో ద్వితీయ శ్రేణి క్రీడాకారిణులతో బరిలోకి దిగిన భారత జట్టు 0–3తో జపాన్ చేతిలో ఓడిపోయింది. తొలి మ్యాచ్లో అషి్మత 10–21, 22–20, 15–21తో అయా ఒహోరి చేతిలో... ప్రియ–శ్రుతి మిశ్రా 8–21, 9–21తో నామి మత్సుయామ–చిహారు షిదా చేతిలో... ఇషారాణి 15–21, 12–21తో ఒకుహారా చేతిలో ఓడిపోయారు. -
Ranji Trophy: ఆంధ్ర సహా క్వార్టర్ ఫైనల్ చేరిన జట్లు ఇవే
Ranji Trophy 2023-24- Quarter Finals: రంజీ ట్రోఫీ 2023- 24 సీజన్ లీగ్ దశ మ్యాచ్లు సోమవారంతో ముగిశాయి. ఎలైట్ డివిజన్లో మొత్తం 32 జట్లను 4 గ్రూప్లుగా (ఎ, బి,సి,డి; 8 జట్ల చొప్పున) విభజించారు. గ్రూప్ ‘బి’లో ముంబై జట్టు 37 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా... ఆంధ్ర జట్టు 26 పాయింట్లతో (3 విజయాలు, 3 ‘డ్రా’, 1 ఓటమి) రెండో స్థానంలో నిలిచింది. ఇక చివరి లీగ్ మ్యాచ్కంటే ముందే ఈ రెండు జట్లకు క్వార్టర్ ఫైనల్ బెర్త్లు ఖరారయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి విదర్భ (33 పాయింట్లు), సౌరాష్ట్ర (28 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి తమిళనాడు (28 పాయింట్లు), కర్ణాటక (27 పాయింట్లు)... గ్రూప్ ‘డి’ నుంచి మధ్యప్రదేశ్ (32 పాయింట్లు), బరోడా (26 పాయింట్లు) తొలి రెండు స్థానాల్లో నిలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. ఎలైట్ డివిజన్కు హైదరాబాద్ అర్హత కాగా 32 జట్లలో చివరి రెండు స్థానాల్లో నిలిచిన మణిపూర్, గోవా జట్లు వచ్చే సీజన్కు ‘ప్లేట్’ డివిజన్కు పడిపోగా... ‘ప్లేట్’ డివిజన్లో ఫైనల్ చేరిన హైదరాబాద్, మేఘాలయ ఎలైట్ డివిజన్కు అర్హత పొందాయి. ఫిబ్రవరి 23 నుంచి క్వార్టర్ ఫైనల్స్ ►ఇక ఈనెల 23 నుంచి జరిగే క్వార్టర్ ఫైనల్స్లో కర్ణాటకతో విదర్భ (నాగ్పూర్లో- Vidarbha vs Karnataka, 1st Quarter Final) ►ముంబైతో బరోడా (ముంబైలో- Mumbai vs Baroda, 2nd Quarter Final) ►తమిళనాడుతో సౌరాష్ట్ర (కోయంబత్తూరులో- Tamil Nadu vs Saurashtra, 3rd Quarter Final) ►మధ్యప్రదేశ్తో ఆంధ్ర (ఇండోర్లో- Madhya Pradesh vs Andhra, 4th Quarter Final ) తలపడతాయి. ఆటకు వీడ్కోలు ఇక రంజీ తాజా సీజన్ సందర్భంగా ఐదుగురు క్రికెటర్లు ఆటకు వీడ్కోలు పలికారు. మనోజ్ తివారి(బెంగాల్), ధవళ్ కులకర్ణి(ముంబై), సౌరభ్ తివారి(జార్ఖండ్), ఫైజ్ ఫజల్(విదర్భ), వరుణ్ ఆరోన్(జార్ఖండ్) ఫస్ట్క్లాస్ క్రికెట్కూ రిటైర్మెంట్ ప్రకటించారు. చదవండి: రోహిత్, కోహ్లిలా హీరో అయ్యే వాడిని.. కానీ ఆరోజు ధోని ఎందుకలా చేశాడో? -
India Open 2024: క్వార్టర్స్లో సాత్విక్ జోడీ
న్యూఢిల్లీ: ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రెండో సీడ్ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–14, 21–15తో చింగ్ యావో లు–పో హాన్ యాంగ్ (చైనీస్ తైపీ) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్లో భారత నంబర్వన్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. భారత్కే చెందిన ప్రియాన్షు రజావత్తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 20–22, 21–14, 21–14తో గెలుపొందాడు. -
క్వార్టర్స్లో పీవీ సింధు.. ఫామ్లోకి వచ్చినట్లేనా!
ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ల జోరు కొనసాగుతుంది. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్లు క్వార్టర్స్లో అడుగుపెట్టారు. మహిళల సింగిల్స్లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్ను 21-14, 21-10 తేడాతో మట్టికరిపించింది. కేవలం 38 నిమిషాల్లోనే మ్యాచ్ను ముగించిన సింధు క్వార్టర్స్లో అడుగుపెట్టింది. సింధు ఆడిన గత మూడు టోర్నీల్లో తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తాజాగా మాత్రం క్వార్టర్స్కు చేరుకోవడంతో ఫామ్లోకి వచ్చినట్లుగా అనిపిస్తోంది. ఇక క్వార్టర్స్లో సింధు అమెరికాకు చెందిన నాలుగో సీడ్ బీవెన్ జాంగ్తో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో కిడాంబి శ్రీకాంత్ ఆస్ట్రేలియన్ ఓపెన్లో క్వార్టర్స్లో అడుగుపెట్టడం ఇది మూడోసారి. రెండో రౌండ్లో శ్రీకాంత్.. చైనీస్ తైపీకి చెందిన సూ లీ యాంగ్ను 21-10, 21-17తో వరుస గేముల్లో ఓడించి క్వార్టర్స్కు చేరుకున్నాడు. ఇక మరో గేమ్లో హెచ్ఎస్ ప్రణయ్ చైనీస్ తైపీకి చెందిన వై. చీని 21-19, 19-21, 21-13తో ఓడించి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఇక భారత్కే చెందిన మరో షట్లర్ ప్రియాన్షు రజావత్ ఆకట్టుకున్నాడు. రెండో రౌండ్లో చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జూ వెయ్పై 21-, 13-21, 21-19తో కష్టపడి గెలిచి క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. ఇక ప్రియాన్షు రజావత్.. క్వార్టర్స్లో కిడాంబి శ్రీకాంత్తో తలపడనున్నాడు. చదవండి: Lionel Messi: ఏ ముహూర్తంలో జాయిన్ అయ్యాడో కానీ అంతా శుభమే.. Matthew Wade: కళ్లు చెదిరే ఫీల్డింగ్.. 35 ఏళ్ల వయసులో విన్యాసాలేంటి బ్రో? -
క్వార్టర్స్కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, సాత్విక్-చిరాగ్ జోడి
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. సింగిల్స్ విభాగంలో హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్లు క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లగా.. డబుల్స్ విభాగంలో టాప్ షట్లర్లు స్వాతిక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడి జోరు కనబరుస్తూ క్వార్టర్స్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్లో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ లక్ష్యసేన్ జపాన్కు చెందిన కాంటా సునేయమాపై 21-14, 21-16 వరుస గేముల్లో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ఇక డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ జోడి డెన్మార్క్కు చెందిన జెప్ బే- లాసే మొల్హెగ్డే ద్వయంపై 21-17, 21-11 వరుస సెట్లలో ఖంగుతినిపించారు. Lakshya Sen 🇮🇳 sets the pace against Kanta Tsuneyama 🇯🇵.#BWFWorldTour #JapanOpen2023 pic.twitter.com/INyZMUO6HR — BWF (@bwfmedia) July 27, 2023 ఇక హెచ్ఎస్ ప్రణయ్.. ప్రీక్వార్టర్స్ మ్యాచ్లో మన దేశానికే చెందిన కిడాంబి శ్రీకాంత్పై 19-21, 21-9, 21-9 తేడాతో గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టాడు. ప్రణయ్ తొలి గేమ్ను కోల్పోయినప్పటికి ఆ తర్వాత ఫుంజుకొని రెండు వరుస గేములను గెలుచుకొని మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో భారత టాప్ జోడి ట్రీసా జోలీ-పుల్లెల గాయత్రి గోపిచంద్ జంట ప్రీక్వార్టర్స్లో పరాజయం పాలైంది. జపాన్కు చెందిన నమీ మత్సయుమా-చిమారు షీడా చేతిలో 21-13, 19-21తో ఓటమిపాలయ్యారు. చదవండి: SL Vs PAK 2nd Test: ఏడు వికెట్లతో చెలరేగిన 36 ఏళ్ల పాక్ బౌలర్.. సిరీస్ క్లీన్స్వీప్ Kylian Mbappe: మొన్న 9వేల కోట్లు.. ఇవాళ 2700 కోట్లు; ఎవరికి అర్థంకాని ఎంబాపె! -
క్వార్టర్ ఫైనల్లో సింధు, లక్ష్యసేన్
కౌన్సిల్ బ్లఫ్స్ (అమెరికా): యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత స్టార్ పీవీ సింధు... పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్లు క్వార్టర్ ఫైనల్కు చేరారు. శుక్రవారం జరిగిన ప్రి క్వార్టర్స్లో సింధు చైనీస్ తైపీకి చెందిన సంగ్ షువో యన్ను 21-14, 21-12తో ఓడించింది. ఇక లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్లో చెక్ రిపబ్లిక్కు చెందిన జాన్ లౌడాను 21-8, 23-21తో మట్టికరిపించి క్వార్టర్స్కు చేరుకున్నాడు. అంతకముందు తొలి రౌండ్లో సింధు 21–15, 21–12తో దిశా గుప్తా (అమెరికా)పై నెగ్గింది. హైదరాబాద్ అమ్మాయి గద్దె రుతి్వక శివాని 14–21, 11–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. లక్ష్య సేన్ 21–8, 21–16తో కాలి కొల్జోనెన్ (ఫిన్లాండ్)పై, శంకర్ ముత్తుస్వామి 21–11, 21–16తో ఎన్హట్ నుగుయెన్ (ఐర్లాండ్)పై నెగ్గారు. హైదరాబాద్కు చెందిన భమిడిపాటి సాయిప్రణీత్ 15–21, 12–21తో ప్రపంచ ఏడో ర్యాంకర్ లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓటమి పాలయ్యాడు. చదవండి: #JyothiYarraji: జ్యోతి యర్రాజీకి సీఎం జగన్ అభినందనలు #YashasviJaiswal: 'ఇది ఆరంభం మాత్రమే.. చేయాల్సింది చాలా ఉంది' -
Madrid Spain Masters: క్వార్టర్ ఫైనల్లో సింధు, శ్రీకాంత్
మాడ్రిడ్: ఈ ఏడాది తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న భారత స్టార్ షట్లర్స్ పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ స్పెయిన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–14, 21–16తో ప్రపంచ 38వ ర్యాంకర్ పుత్రి కుసుమ వర్దిని (ఇండోనేసియా)పై 36 నిమిషాల్లో విజయం సాధించింది. ఈ గెలుపుతో గత వారం స్విస్ ఓపెన్లో కుసుమ వర్దిని చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో భారత్కే చెందిన అష్మిత చాలిహా 15–21, 15–21తో యో జియా మిన్ (సింగపూర్) చేతిలో ఓడిపోగా... గాయం కారణంగా మాళవిక బన్సోద్ తన ప్రత్యర్థి కరోలినా మారిన్ (స్పెయిన్)కు వాకోవర్ ఇచ్చింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్వన్ శ్రీకాంత్ 21–15, 21–12తో భారత్కే చెందిన సాయిప్రణీత్పై గెలుపొందాడు. భారత్కే చెందిన కిరణ్ జార్జి 17–21, 12–21తో మాగ్నస్ జొహాన్సెన్ (డెన్మార్క్) చేతిలో, ప్రియాన్షు రజావత్ 14–21, 15–21తో తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్) చేతిలో, సమీర్ వర్మ 15–21, 14–21తో కాంటా సునెయామ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–ఆరతి (భారత్) జోడీ 12–21, 13–21తో రుయ్ హిరోకామి–యునా కాటో (జపాన్) ద్వయం చేతిలో... పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎం.ఆర్.అర్జున్–ధ్రువ్ కపిల (భారత్) జంట 16–21, 20–22తో షున్టారో మెజకి–హరుయ నిషిద (జపాన్) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
శభాష్ విహారి.. నీ పోరాటానికి సలాం, మణికట్టు గాయమైనా ఒంటి చేత్తో వీరోచిత పోరాటం
Ranji Trophy 2022-23: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో హనుమ విహారి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ జట్టు వరుస విజయాలు నమోదు చేస్తూ, నిన్న (జనవరి 31) మధ్యప్రదేశ్తో మొదలైన క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరును కొనసాగిస్తుంది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) అద్భుత శతకాలతో రెచ్చిపోగా.. లోయర్ మిడిలార్డర్ ఆటగాళ్లు విఫలమవ్వడంతో ఆంధ్ర టీమ్ తొలి ఇన్నింగ్స్లో 379 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్.. రెండో రోజు టీ విరామం సమయానికి 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసి, ఏపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 327 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్ దూబే (20), హిమాన్షు మంత్రి (22) ఔట్ కాగా.. శుభమ్ శర్మ (5), రజత్ పాటిదార్ క్రీజ్లో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, పృథ్వీ రాజ్ యర్రాకు తలో వికెట్ పడింది. కాగా, రెండో రోజు ఆంధ్ర ఇన్నింగ్స్ ఆఖర్లో హనుమ విహారి (57 బంతుల్లో 27; 5 ఫోర్లు) కనబర్చిన వీరోచిత పోరాటం మ్యాచ్ మొత్తానికే హైలైట్గా నిలిచింది. తొలి రోజు ఆటలో 16 పరుగుల వద్ద ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో గాయపడిన విహారి.. మణికట్టు ఫ్రాక్చర్ కావడంతో రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అయితే రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల తర్వాత వెనువెంటనే ఔట్ అయ్యాక.. ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్కు చేరారు. ఏపీ టీమ్.. 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో (353/9) మణికట్టు ఫ్రాక్చర్ను సైతం లెక్క చేయకుండా బరిలోకి దిగిన విహారి.. గతంలో సిడ్నీ టెస్ట్లో చేసిన వీరోచిత పోరాటాన్ని మళ్లీ గుర్తు చేశాడు. Hanuma vihari batting with left hand due to the fracture of his wrist pic.twitter.com/qywEd31S5o — cric_mawa (@cric_mawa_twts) February 1, 2023 కుడి చేయికి ఫ్రాక్చర్ కావడంతో ఎడమ చేత్తో, కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన విహారి జట్టు స్కోర్కు అతిమూల్యమైన 26 పరుగులు జోడించి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. సలాం విహారి.. నువ్వు నిజమైన పోరాట యోధుడివి, జట్టు మనిషివి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నొప్పిని భరిస్తూ.. ఎడమ చేతిని కాపాడుకుంటూ విహారి చేసిన బ్యాటింగ్ విన్యాసం చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. గాయపడ్డాక బరిలోకి దిగిన విహారి రెండు బౌండరీలు బాదడం, అందులో ఒకటి ఆవేశ్ ఖాన్ బౌలింగ్లో కావడం మరో విశేషం. -
లక్ష్య సేన్ ఓటమి.. అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో కూడా ఇంటికే
ఇండోనేసియా మాస్టర్స్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. జకార్తాలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్య సేన్... మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఓడిపోయారు. ప్రపంచ 12వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21–15, 10–21, 13–21తో మూడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో లక్ష్య సేన్ తొలి గేమ్లో స్కోరు 15–15తో సమంగా ఉన్నపుడు వరుసగా ఆరు పాయింట్లు గెలిచి గేమ్ను సొంతం చేసుకున్నాడు. అయితే క్రిస్టీ పుంజుకొని వరుసగా రెండు గేముల్లో గెలిచి విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో అశ్విని–తనీషా 13–21, 18–21తో యూకీ ఫకుషిమా–సయాక హిరోటా (జపాన్) చేతిలో ఓడిపోయారు. చదవండి: MS Dhoni: ఏ మాత్రం తగ్గని ధోని మేనియా T20 WC Ind Vs Eng: ఆసీస్పై ఇంగ్లండ్ విజయం.. ఫైనల్లో టీమిండియాతో పోరు! చరిత్రకు అడుగు దూరంలో భారత్. End of 🇮🇳's campaign. 📸: @badmintonphoto#IndonesiaMasters2023#Badminton pic.twitter.com/etm7svf1rQ — BAI Media (@BAI_Media) January 27, 2023 -
Caroline Garcia: గార్సియాకు ఊహించని షాక్! లినెట్టి తొలిసారి..
Australian Open 2023: మహిళల సింగిల్స్ విభాగంలో నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్) కథ ప్రిక్వార్టర్ ఫైనల్లో ముగిసింది. ప్రపంచ 45వ ర్యాంకర్ మగ్దా లినెట్టి (పోలాండ్) 7–6 (7/3), 6–4తో గార్సియాను ఓడించింది. ఈ గెలుపుతో 30 ఏళ్ల మగ్దా లినెట్టి తన 30వ గ్రాండ్స్లామ్ టోర్నీలో తొలిసారి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్) 7–5, 6–2తో 12వ సీడ్ బెలిండా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)పై, డొనా వెకిచ్ (క్రొయేషియా) 6–2, 1–6, 6–3తో ఫ్రువిర్తోవా (చెక్ రిపబ్లిక్)పై, 30వ సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–4తో షుయె జాంగ్ (చైనా)పై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. చదవండి: KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. SA20 2023: ఐపీఎల్లో నిరాశపరిచినా.. ఆ లీగ్లో మాత్రం దుమ్మురేపుతున్న సన్రైజర్స్ -
సంచలనం సృష్టించిన అన్సీడెడ్ క్రీడాకారులు.. జొకోవిచ్తో పాటు..
Australian Open 2023- మెల్బోర్న్: తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో పదోసారి విజేతగా నిలిచేందుకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మూడు విజయాల దూరంలో ఉన్నాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జొకోవిచ్ 6–2, 6–1, 6–2తో 22వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్కు చేరుకున్నాడు. 126 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ కేవలం ఐదు గేమ్లను మాత్రమే తన ప్రత్యర్థికి కోల్పోయాడు. ఆరుసార్లు అలెక్స్ సర్వీస్ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 26 విన్నర్స్ కొట్టాడు. నెట్ వద్దకు 21 సార్లు దూసుకొచ్చి 14 సార్లు పాయింట్లు నెగ్గిన అతను తన సర్వీస్లో ఒక్కసారి కూడా ప్రత్యర్థికి బ్రేక్ పాయింట్ అవకాశం ఇవ్వలేదు. గట్టెక్కి రెండోసారి.. మరోవైపు.. ఐదో సీడ్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) ఐదు సెట్ల హోరాహోరీ పోరులో గట్టెక్కి రెండోసారి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 3 గంటల 37 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రుబ్లెవ్ 6–3, 3–6, 6–3, 4–6, 7–6 (11/9)తో హోల్గర్ రూన్ (డెన్మార్క్)పై విజయం సాధించాడు. సంచలనం సృష్టించి.. జొకోవిచ్తో పాటు అమెరికాకు చెందిన అన్సీడెడ్ క్రీడాకారులు టామీ పాల్, బెన్ షెల్టన్ తమ సంచలన ప్రదర్శన కొనసాగిస్తూ తమ కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో టామీ పాల్ 6–2, 4–6, 6–2, 7–5తో 24వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై, బెన్ షెల్టన్ 6–7 (5/7), 6–2, 6–7 (4/7), 7–6 (7/4), 6–2తో జేజే వుల్ఫ్ (అమెరికా)పై గెలిచారు. క్వార్టర్ ఫైనల్స్లో రుబ్లెవ్తో జొకోవిచ్; బెన్ షెల్టన్తో టామీ పాల్ తలపడతారు. చదవండి: Ind Vs NZ: పరుగుల వరద గ్యారంటీ! మిగిలింది కోహ్లి క్లాసిక్సే! అప్పుడు సెహ్వాగ్ డబుల్ సెంచరీ.. ఇప్పుడు కింగ్? KL Rahul- Athiya Shetty: చూడచక్కని జంట.. దిష్టి తగలకూడదు! కోహ్లి, సూర్య విషెస్! రిసెప్షన్ ఎప్పుడంటే.. -
Malaysia Open 2023: క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ప్రణయ్ 21–9, 15–21, 21–16 స్కోరుతో చికో అరా వర్డొయో (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. పురుషుల డబుల్స్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి కూడా క్వార్టర్స్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ సాత్విక్–చిరాగ్ 21–19, 22–20తో 49 నిమిషాల్లోనే షోహిబుల్ ఫిక్రి–మౌలానా బగస్ (ఇండోనేసియా)ను చిత్తు చేశారు. అయితే మహిళల డబుల్స్లో మాత్రం భారత్ కథ ముగిసింది. హోరాహోరీగా సాగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో భారత ద్వయం పుల్లెల గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ 13–21, 21–15, 17–21 తేడాతో గాబ్రియా స్టోవా – స్టెఫానీ స్టోవా (బల్గేరియా) చేతిలో ఓటమిపాలయ్యారు. -
పోర్చు‘గోల్స్’ మోత
దోహా: ఆరంభం నుంచి సూపర్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను ఆడించకపోయినా... తమ జట్టులో ప్రతిభావంతులకు కొదవలేదని నిరూపిస్తూ పోర్చుగల్ జట్టు ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో కళ్లు చెదిరే ప్రదర్శనతో మెరిసింది. ఆద్యంతం దూకుడుగా ఆడుతూ, పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ రొనాల్డో లేకున్నా పోర్చుగల్ జట్టు భవిష్యత్కు ఢోకా లేదని నిరూపించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి ప్రిక్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ 6–1 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తుగా ఓడించి 16 ఏళ్ల తర్వాత మళ్లీ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పోర్చుగల్ తరఫున తొలి ప్రపంచకప్లో ఆడుతున్న 21 ఏళ్ల గొన్సాలో రామోస్ (17వ, 51వ, 67వ ని.లో) మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేయగా... పెపె (33వ ని.లో), రాఫెల్ గెరెరో (55వ ని.లో), రాఫెల్ లియా (90+2వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. స్విట్జర్లాండ్ జట్టుకు మాన్యుయెల్ అకాంజీ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. చివరిసారి 1954లో ప్రపంచకప్లో క్వార్టర్ ఫైనల్ చేరిన స్విట్జర్లాండ్ ఆ తర్వాత ఐదుసార్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. మరోవైపు ఎనిమిదోసారి ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ మూడోసారి క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత సాధించింది. 1966లో మూడో స్థానంలో నిలిచిన పోర్చుగల్, 2006లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 10న జరిగే క్వార్టర్ ఫైనల్లో మొరాకోతో పోర్చుగల్ తలపడుతుంది. తొలిసారి సబ్స్టిట్యూట్గా రొనాల్డో... వరుసగా ఐదో ప్రపంచకప్లో ఆడుతున్న పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి తుది 11 మంది జట్టులో చోటు కోల్పోయాడు. రొనాల్డో స్థానంలో గొన్సాలో రామోస్ను తొలి నిమిషం నుంచి ఆడించాలని కోచ్ ఫెర్నాండో సాంటోస్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. జాతీయ జట్టుకు ఒక్క మ్యాచ్ ఆడకుండానే నేరుగా ప్రపంచకప్ జట్టులో స్థానం సంపాదించిన రామోస్ ఘనా, ఉరుగ్వేలతో మ్యాచ్ల్లో సబ్స్టిట్యూట్గా చివరి నిమిషాల్లో బరిలోకి దిగాడు. అయితే కీలకమైన మ్యాచ్లో అత్యంత అనుభవజ్ఞుడు, 37 ఏళ్ల రొనాల్డోను కాదని రామోస్ను ఆరంభం నుంచే ఆడించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే తన ఎంపిక సరైనదేనని రామోస్ నిరూపించుకున్నాడు. మూడు గోల్స్ చేయడమే కాకుండా గెరెరో గోల్ చేయడానికి రామోస్ సహాయపడ్డాడు. పోర్చుగల్ ఖాతాలో ఐదు గోల్స్ జమయ్యాక.. 74వ నిమిషంలో రొనాల్డోను జావో ఫెలిక్స్ స్థానంలో సబ్స్టిట్యూట్గా మైదానంలోకి పంపించారు. ప్రపంచకప్ మ్యాచ్ల్లో రొనాల్డో రిజర్వ్ బెంచ్కు పరిమితమై మ్యాచ్ మధ్యలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
FIFA WC: నరాలు తెగే ఉత్కంఠ.. క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16కు చేరిన జట్లు నాకౌట్ దశ కావడంతో గెలిచిన జట్టు ముందుకు.. ఓడిన జట్టు ఇంటికి చేరుతుంది. ఈ దశలో శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రౌండ్ ఆఫ్ 16లో మెస్సీ బృందం 2-0తో విజయం సాధించింది. గత మ్యాచ్లో గోల్ చేయడంలో విఫలమైన మెస్సీ ఈ మ్యాచ్లో మాత్రం కీలక దశలో మెరిశాడు. ఆట 35వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్ నుంచి గోల్ కొట్టడంతో అర్జెంటీనా బోణీ చేసింది. ఆ తర్వాత తొలి హాఫ్టైమ్ ముగిసేసరికి అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో అర్థభాగం మొదలయిన కాసేపటికే ఆట 57వ నిమిషంలో ఆస్ట్రేలియా గోల్ కీపర్ మాథ్యూ రేయాన్ను బోల్తా కొట్టిస్తూ సింపుల్ గోల్ చేయడంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆ తర్వాత ఆట 77వ నిమిషంలో ఆస్ట్రేలియా ఆటగాడు ఫెర్నాండేజ్ సెల్ఫ్గోల్ చేయడంతో ఆధిక్యం 2-1కి తగ్గింది. అయితే ఆ తర్వాత పలుమార్లు ఇరుజట్లు గోల్పోస్ట్పై దాడులు చేయడంతో ఉత్కంఠ పెరిగింది. చివరకు అర్జెంటీనా 2-1తో విజయం సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టింది. ఇక మెస్సీకి తన కెరీర్లో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఇక ఫిఫా వరల్డ్కప్లో అర్జెంటీనా డిసెంబర్ 10న జరిగే క్వార్టర్ ఫైనల్స్లో నెదర్లాండ్స్తో తలపడనుంది. • Messi's 🤌🏻 placement 🎯 • Alvarez's alertness 🚨 • Goodwin with a glimmer of hope 🙏 Watch all the 3️⃣ goals from #ARGAUS & keep watching the #FIFAWorldCup on #JioCinema & #Sports18 📺📲#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/3gOHiOknZq — JioCinema (@JioCinema) December 3, 2022 చదవండి: చరిత్ర సృష్టించిన మెస్సీ.. మారడోనా రికార్డు బద్దలు FIFA WC: అరబ్ గడ్డపై అందాల ప్రదర్శన.. చిక్కుల్లో సుందరి -
World Wrestling Championships: కాంస్యం రేసులో బజరంగ్
బెల్గ్రేడ్ (సెర్బియా): ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ను భారత్ కాంస్య పతకంతో ముగించేందుకు మరో అవకాశం లభించింది. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో భారత స్టార్ రెజర్ల్, బర్మింగ్హామ్ కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత బజరంగ్ పూనియా కాంస్య పతకం రేసులో నిలిచాడు. శనివారం జరిగిన 65 కేజీల విభాగంలో 28 ఏళ్ల బజరంగ్ క్వార్టర్ ఫైనల్లో 0–10తో జాన్ మైకేల్ డియాకొమిహాలిస్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు బజరంగ్ ప్రిక్వా ర్టర్ ఫైనల్లో 5–4తో అలెజాంద్రో ఎన్రిక్ వాల్డెస్ (క్యూబా)పై గెలుపొందాడు. బజరంగ్ను ఓడించిన జాన్ మైకేల్ ఫైనల్ చేరడంతో ‘రెపిచాజ్’ పద్ధతి ద్వారా బజరంగ్కు కాంస్య పతకం గెలిచే అవకాశం వచ్చింది. వాజ్జెన్ తెవాన్యన్ (అర్మేనియా), వ్లాదిమిర్ దుబోవ్ (బల్గేరియా) మధ్య విజేతతో నేడు జరిగే ‘రెపిచాజ్’ తొలి రౌండ్లో బజరంగ్ తలపడతాడు. ఈ బౌట్లో బజరంగ్ గెలిస్తే కాంస్య పతకం కోసం సెబాస్టియన్ రివెరా (ప్యూర్టోరికో)తో ఆడతాడు. ఏడోసారి ప్రపంచ చాంపియన్షిప్లో పోటీపడుతున్న బజరంగ్ ఇప్పటి వరకు ఈ మెగా ఈవెంట్లో మూడు పతకాలు సాధించాడు. 2013లో 60 కేజీల విభాగంలో బజరంగ్ కాంస్యం నెగ్గగా... 2018లో 65 కేజీల విభాగంలో రజతం, 2019లో కాంస్యం సాధించాడు. మరోవైపు పురుషుల 74 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ కాంస్య పతకం సాధించలేకపోయాడు. ఆసియా చాంపియన్ యూనస్ అలీఅక్బర్ (ఇరాన్)తో జరిగిన కాంస్య పతక బౌట్లో సాగర్ 0–6తో ఓడిపోయాడు. భారత్కే చెందిన విక్కీ (97 కేజీలు), పంకజ్ (61 కేజీలు) తొలి రౌండ్లోనే ఓటమి చవిచూశారు. వీరిద్దరిని ఓడించిన రెజ్లర్లు తదనంతరం ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు కాంస్య పతకం సాధించే అవకాశం లేకుండా పోయింది. -
US Open 2022: అల్కరాజ్ అద్భుతం
న్యూయార్క్: 315 నిమిషాలు... 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్, 21 ఏళ్ల జన్నిక్ సిన్నర్ మధ్య జరిగిన యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ సమరమిది. యూఎస్ ఓపెన్ చరిత్రలో రెండో సుదీర్ఘ పోరుగా రికార్డులకెక్కిన ఈ మ్యాచ్లో ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా తలపడగా చివరకు అల్కరాజ్దే పైచేయి అయింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం ముగిసిన ఈ మ్యాచ్లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 6–7 (7/9), 6–7 (0/7), 7–5, 6–3 స్కోరుతో 11వ సీడ్ సిన్నర్ (ఇటలీ)పై చిరస్మరణీయ విజయం సాధించి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. తద్వారా 1990 (పీట్ సంప్రాస్) తర్వాత యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సెమీ ఫైనల్లో అల్కరాజ్ 22వ సీడ్ ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా)తో తలపడతాడు. క్వార్టర్స్ మ్యాచ్లో టియాఫో 7–6 (7/3), 7–6 (7/0), 6–4 తేడాతో ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా)ను ఓడించి సెమీస్ చేరాడు. 2006 (ఆండీ రాడిక్) తర్వాత యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరిన తొలి అమెరికా ఆటగాడు టియాఫో కావడం విశేషం. ప్రతీ షాట్లో పోరాటం... ఈ ఏడాది వింబుల్డన్లో సిన్నర్ చేతిలో ఓడిన అల్కరాజ్ ప్రతీకారం తీర్చుకునే దిశగా తొలి సెట్లో ప్రత్యర్థి సర్వీస్ను మూడు సార్లు బ్రేక్ చేసి ఆధిక్యం ప్రదర్శించాడు. అయితే రెండో సెట్లో కోలుకున్న సిన్నర్ గట్టి పోటీనిచ్చాడు. నాలుగు సెట్ పాయింట్లు కాపాడుకున్న అతను టైబ్రేక్కు తీసుకెళ్లాడు. ఇక్కడా మరో సెట్ పాయింట్ను కాచుకొని స్కోరు సమం చేశాడు. మూడో సెట్లో కూడా ఇదే ఫలితం పునరావృతమైంది. అయితే ఈ సారి అల్కరాజ్ ముందుగా 4–2తో, ఆపై 6–5తో ఆధిక్యంలోకి వెళ్లి కూడా సెట్ను కోల్పోయాడు. సిన్నర్ పదునైన డిఫెన్స్తో స్పెయిన్ ఆటగాడిని అడ్డుకోగలిగాడు. నాలుగో సెట్ మళ్లీ హోరాహోరీగా సాగింది. ఇప్పుడు దురదృష్టం సిన్నర్ను పలకరించింది. 5–4తో ఆధిక్యంలో ఉండి సెమీస్ చేరేందుకు సర్వీస్ చేసిన అతను అనూహ్యంగా పట్టు కోల్పోయాడు. పుంజుకున్న అల్కరాజ్ పదో గేమ్తో పాటు మరో రెండు గేమ్లు వరుసగా నెగ్గి ఫలితాన్ని చివరి సెట్కు తీసుకెళ్లాడు. అ ప్పటికే ఇద్దరూ తీవ్రంగా అలసిపోగా...అల్కరాజ్ మాత్రం పట్టుదల కనబర్చి ఏకపక్షంగా సెట్ను సాధించి మ్యాచ్ గెలుచుకున్నాడు. సిన్నర్ 8, అల్కరాజ్ 5 ఏస్ల చొప్పున కొట్టగా... అల్కరాజ్ అనవసర తప్పిదాలు(38)తో పోలిస్తే సిన్నర్ (61) ఎక్కువ తప్పులతో మూల్యం చెల్లించుకున్నాడు. నంబర్వన్ జోరు... మహిళల సింగిల్స్లో వరల్డ్ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరైనా సబలెంకా (బెలారస్) సెమీస్లోకి అడుగు పెట్టారు. స్వియాటెక్ 6–3, 7–6 (7/4) స్కోరుతో ఎనిమిదో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా)పై విజయం సాధించగా...ఆరో సీడ్ సబలెంకా 6–1, 7–6 (7/4)తో కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ను చిత్తు చేసింది. -
వివాదం లేకుంటే మనసుకు పట్టదనుకుంటా.. నువ్వు మారవు!
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ సహనం కోల్పోయాడు. ఓడిపోయాననే బాధలో టెన్నిస్ రాకెట్ను నేలకేసి కొట్టడం వైరల్గా మారింది. ఆట కంటే వివాదాలతోనే ఎక్కువ పేరు సంపాదించిన కిర్గియోస్ ఆన్ఫీల్డ్, ఆఫ్ ఫీల్డ్లో చాలాసార్లు తన కోపాన్ని ప్రదర్శించాడు. తాజాగా యూఎస్ ఓపెన్లో క్వార్టర్స్లోనే వెనుదిరగడంతో కిర్గియోస్లో కోపం కట్టలు తెంచుకుంది. విషయంలోకి వెళితే.. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్థరాత్రి జరిగిన క్వార్టర్స్లో రష్యన్ టెన్నిస్ ప్లేయర్ కచనోవ్ చేతిలో 7-5, 4-6,7-5, 6-7(3-7)తో కిర్గియోస్ ఓటమి పాలయ్యాడు. దీంతో గ్రాండ్స్లామ్ కొట్టాలన్న అతని కల క్వార్టర్స్కే పరిమితం కావడంతో కోపం నషాళానికి అంటింది. ప్లేయర్కు, అంపైర్కు షేక్హ్యాండ్ ఇచ్చిన అనంతరం తన బ్యాగు వద్దకు వెళ్లిన కిర్గియోస్.. చేతిలోని రాకెట్ను కోపంతో నేలకేసి బాదాడు. అయినా కోపం తగ్గలేదనుకుంటా.. మరో టెన్నిస్ రాకెట్ను నేలకేసి కొట్టాడు. అనంతరం బ్యాగు వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ప్రాప్ స్వాప్ అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. ''కోపం నషాళానికి అంటింది.. కిర్గియోస్ తన రెండు రాకెట్లను ముక్కలు చేశాడు.'' అంటూ క్యాప్షన్ జత చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చిన నిక్ కిర్గియోస్ ఓటమిపై స్పందించాడు. ''నేను ఓడిపోవడం బాధ కలిగించింది. నేను గెలవాలని చాలా మంది మద్దతు ఇచ్చారు. కానీ వారి ఆశలను వమ్ము చేశాను. అందుకే కోపంతో టెన్నిస్ రాకెట్ను విరగొట్టాల్సి వచ్చింది. అయితే కచనోవ్ పోరాటం మెచ్చుకోదగినది. ఈరోజు అతనిలో ఒక ఫైటర్, వారియర్ కనిపించాడు. ఇక ముందు కూడా ఇదే పోరాట పటిమను కనబరిచి గ్రాండ్స్లామ్ నెగ్గాలని ఆశిస్తున్నా'' అంటూ పేర్కొన్నాడు. ఇక సెమీస్కు చేరుకున్న కచనోవ్ నార్వేకు చెందిన కాస్పర్ రూడ్తో తలపడనున్నాడు. ఇప్పటికే నాదల్, మెద్వదేవ్లు వెనుదిరగ్గా.. తాజాగా కిర్గియోస్ కూడా క్వార్టర్స్లోనే ఇంటిబాట పట్టడంతో యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ను ఎవరు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. Nick Kyrgios restringing his racket after the match pic.twitter.com/Q2TDri1mxa — PropSwap (@PropSwap) September 7, 2022 చదవండి: FIH Awards: ‘ఎఫ్ఐహెచ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు రేసులో హర్మన్ప్రీత్ సింగ్ -
బెస్ట్ ఫ్రెండ్ను ఓడించి క్వార్టర్స్కు నాదల్..
యూఎస్ ఓపెన్లో స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ దూసుకుపోతున్నాడు. తన బెస్ట్ ఫ్రెండ్ను ఓడించి క్వార్టర్స్కు ప్రవేశించిన నాదల్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ అందుకునేందుకు మరింత దగ్గరయ్యాడు. భారత కాలామన ప్రకారం ఆదివారం తెల్లవారజామున జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో నాదల్.. తన స్నేహితుడైన రిచర్డ్ గాస్కెట్ను 6-0, 6-1, 7-5తో మట్టికరిపించాడు. కాగా యూఎస్ ఓపెన్లో నాదల్ క్వార్టర్స్ చేరడం ఇది 18వ సారి కాగా.. తన మిత్రుడిపై ఆధిక్యం కూడా 18-0నే కావడం విశేషం. 47వ విజయం.. షూ విరగొట్టిన అల్కరాజ్ ఇక 19 ఏళ్ల టెన్నిస్ యువ కెరటం కార్లోస్ అల్కరాజ్ ఈ సీజన్లో 47వ విజయాన్ని అందుకున్నాడు. మూడో రౌండ్లో అమెరికాకు చెందిన జెన్సన్ బ్రూక్స్ను 6-3, 6-3, 6-3తో వరుస సెట్లలో ఖంగుతినిపించాడు. ఈ సీజన్లో 47 విజయాలతో రికార్డు బ్రేక్ చేసిన ఆనందలో అల్కరాజ్ తన షూస్ను విరగొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక క్వార్టర్స్లో 2014 చాంపియన్ మారిన్ సిలిచ్ను ఎదుర్కోనున్నాడు. ముగురుజాకు షాక్.. క్వార్టర్స్ చేరిన స్వియాటెక్ ఇక మహిళల సింగిల్స్లో వరల్డ్ నెంబర్ వన్ ఇగా స్వియాటెక్ వరుసగా రెండో ఏడాది క్వార్టర్స్కు చేరుకుంది. మూడో రౌండ్లో అన్ సీడెడ్ అయిన లారెన్ డేవిస్ను 6-3, 6-4తో మట్టికరిపించి నాలుగో రౌండ్కు చేరుకుంది. ఇక తొమ్మిదో సీడ్ గార్బిన్ ముగురుజాకు మూడో రౌండ్లో చుక్కెదురైంది. మూడో రౌండ్లో పెట్రో క్విటోవా చేతిలో 5-7, 6-3, 7-6(12-10)తో ఓడిపోయిన ముగురజా ఇంటిబాట పట్టింది. కాగా క్వార్టర్స్లో క్విటోవా.. అమెరికాకు చెందిన జెస్సీకా పెగులాతో తలపడనుంది. 🎾🇪🇸 نُقطة المُباراة والفوز رقم 1066 لرافاييل نادال بمسيرته الإحترافية والرقم 38 لهُ بهذا الموسم 👏🏻 #RafaelNadal𓃵 pic.twitter.com/jpxVTtmDOM — عشاق التنس Arab Tennis (@ArabTennis20) September 4, 2022 -
BWF 2022: ప్రణయ్ జోరుకు తెర
ప్రపంచ చాంపియన్షిప్లో రెండుసార్లు విజేతగా నిలిచిన జపాన్ స్టార్, టైటిల్ ఫేవరెట్ కెంటో మొమోటాపై సంచలన విజయంతో పతకం ఆశలు రేపిన హెచ్.ఎస్.ప్రణయ్ ‘షో’కు క్వార్టర్ ఫైనల్లో తెరపడింది. పురుషుల సింగిల్స్లో చైనా ఆటగాడు జావో జన్ పెంగ్ 19–21, 21–6, 21–18తో ప్రణయ్ ఆశల్ని క్వార్టర్స్లోనే తుంచేశాడు. తొలి గేమ్ ఆరంభంలో బాగా ఆడిన ప్రణయ్ ఒక దశలో 19–13తో ఆధిక్యంలో ఉన్నాడు. కానీ అదే పనిగా చేసిన తప్పిదాలతో అనూహ్యంగా ప్రత్యర్థి 19–19తో పుంజుకున్నాడు. కానీ ప్రణయ్ వరుసగా రెండు పాయింట్లు చేసి గేమ్ కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్లో భారత ఆటగాడు పూర్తిగా నిరాశపరిచాడు. దీంతో చైనీస్ షట్లర్ 11–1తో దూసుకెళ్లాడు. అదే జోరుతో గేమ్ గెలిచాడు. మూడో గేమ్లో ప్రత్యర్థికి దీటుగా రాణించినప్పటికీ కీలక తరుణంలో పాయింట్లు చేసిన చైనా ఆటగాడు గేమ్తో పాటు మ్యాచ్ గెలిచి సెమీస్ చేరాడు. గతేడాది స్పెయిన్లో జరిగిన ఈవెంట్లోనూ ప్రణయ్ ఆట క్వార్టర్స్లోనే ముగిసింది. -
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత్ సరికొత్త చరిత్ర
-
పతకాలకు విజయం దూరంలో...
టోక్యో: ఈ ఏడాది థామస్ కప్లో భారత్ తొలిసారి చాంపియన్గా అవతరించడంలో కీలకపాత్ర పోషించిన హెచ్ఎస్ ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లోనూ దూసుకుపోతున్నాడు. వరుసగా రెండో ఏడాది ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ చేరిన ఈ కేరళ ప్లేయర్ మరో విజయం సాధిస్తే కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంటాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 21–16, 21–17తో ప్రపంచ 10వ ర్యాంకర్, గత ఏడాది కాంస్య పతక విజేత, భారత్కే చెందిన లక్ష్య సేన్పై విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన జావో జున్ పెంగ్తో ఆడతాడు. గత ఏడాది ఈ ఇద్దరూ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించారు. ఈసారి మాత్రం ఒకరికి సెమీఫైనల్ బెర్త్తోపాటు పతకం కూడా లభించనుంది. మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి... ఎం.ఆర్. అర్జున్–ధ్రువ్ కపిల జోడీలు చరిత్ర సృష్టించేందుకు విజయం దూరంలో నిలిచాయి. ఈ రెండు జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో సాత్విక్–చిరాగ్ ద్వయం 21–12, 21–10తో జెప్పా బే–లాసె మోల్హెడె (డెన్మార్క్) జోడీపై... అర్జున్–ధ్రువ్ జోడీ 18–21, 21–15, 21–16తో టెరీ హీ–లో కీన్ హీన్ (సింగపూర్) ద్వయంపై గెలుపొందాయి. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో మూడో సీడ్ మొహమ్మద్ అహసాన్–సెతియవాన్ (ఇండోనేసియా)లతో అర్జున్–ధ్రువ్... రెండో సీడ్ టకురో హోకి–యుగో కొబయాషి (జపాన్)లతో సాత్విక్–చిరాగ్ తలపడతారు. ఈ మ్యాచ్ల్లో గెలిస్తే కనీసం కాంస్య పతకాలు ఖాయమవుతాయి. ఇప్పటివరకు ప్రపంచ చాంపియన్షిప్లో భారత్కు పురుషుల డబుల్స్ విభాగంలో ఒక్కసారి కూడా పతకం రాలేదు. సైనాకు నిరాశ మహిళల సింగిల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్, భారత స్టార్ సైనా నెహ్వాల్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 17–21, 21–16, 13–21తో బుసానన్ (థాయ్లాండ్) చేతిలో ఓడిపోయింది. బుసానన్ చేతిలో సైనా ఓడిపోవడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. -
Taipei Open: పోరాడి ఓడిన పారుపల్లి కశ్యప్
తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్ పారుపల్లి కశ్యప్ క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 40వ ర్యాంకర్ కశ్యప్ 12–21, 21–12, 17–21తో 59వ ర్యాంకర్ సూంగ్ జూ వెన్ (మలేసియా) చేతిలో ఓడిపోయాడు. కశ్యప్నకు 3 వేల డాలర్ల ప్రైజ్మనీ (రూ. 2 లక్షల 39 వేలు), 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–ఇషాన్ (భారత్) జంట 19–21, 12–21తో హూ పాంగ్ రోన్–తో ఈ వె (మలేసియా) జోడీ చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తనీషా–శ్రుతి (భారత్) ద్వయం 16–21, 22–20, 18–21తో ఎన్జీ సాజ్ యా– సాంగ్ హి యాన్ (హాంకాంగ్) జోడీ చేతిలో ఓడిపోయింది. -
Taipei Open 2022: క్వార్టర్స్లో కశ్యప్
తైపీ: భారత సీనియర్ షట్లర్ పారుపల్లి కశ్యప్ తైపీ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరాడు. డబుల్స్లో తనీషా క్రాస్టో రెండు విభాగాల్లో క్వార్టర్స్ చేరింది. మహిళల, మిక్స్డ్ డబుల్స్లో దూసుకెళుతోంది. గురువారం జరిగిన రెండో రౌండ్లో మూడో సీడ్ కశ్యప్ 21–10, 21–19తో చియ హో లీ (తైపీ)పై గెలుపొందగా, మిథున్ 24–22, 5–21, 17–21తో నాలుగో సీడ్ నరవొక (జపాన్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్లో సామియా ఫారుఖీ 18–21, 13–21తో వెచ్ చి హూ (తైపీ) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్లో తనీషా–సృష్టి జోడీ 21–14, 21–8తో జియా యిన్–లిన్ యూ (తైపీ)పై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్లో తనీషా–ఇషాన్ ద్వయం 21–14, 21–17తో చెంగ్ కై వెన్– వాంగ్ యూ (తైపీ)పై నెగ్గింది. -
51 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్.. క్వార్టర్కు కశ్యప్
తైవాన్ వేదికగా జరుగుతున్న తైపీ ఓపెన్లో పారుపల్లి కశ్యప్ క్వార్టర్స్ చేరాడు. పురుషుల సింగిల్స్ లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో తైవాన్ కు చెందిన లి చియా హోతో తలపడిన కశ్యప్.. అతడిని ఓడించి క్వార్టర్స్ కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్ లో కశ్యప్.. 21-10, 21-19 తేడాతో లి చియా ను ఓడించాడు. 51 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్ లో ఆది నుంచి ఆధిపత్యం చెలాయించిన కశ్యప్.. క్వార్టర్స్ కు చేరాడు. కశ్యప్ మినహా మిగతా భారత బృందం రెండో రౌండ్ లో తడబడింది. మిథున్ మంజునాథన్, ప్రియాన్షు రజవత్, కిరణ్ జార్జ్ లు రెండో రౌండ్ గండాన్ని దాటలేకపోయారు. ఇక మహిళల సింగిల్స్ లో ఏకైక ఆశాకిరణం సమియా ఫరూఖీ కూడా ఓడింది. మహిళల సింగిల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భారత ఏకైక క్రీడాకారిణి సమియా ఫరూఖీ.. తైవాన్ కే చెందిన వెన్ చి చేతిలో 18-21, 13-21 తో ఓటమిపాలైంది. మెన్స్ డబుల్స్ లో రెండో రౌండ్ కు చేరిన భట్నాగర్-ప్రతీక్ జోడీ తైవాన్ కే చెందిన యాంగ్-చి లిన్ చేతిలో ఓడింది. మిక్సడ్ డబుల్స్ లో భట్నాగర్-తనీషా క్రాస్టోల జోడీ రెండో రౌండ్ లో 21-14, 21-17 తేడాతో కై వెన్-యు కియా జోడీని మట్టికరిపించి క్వార్టర్స్ కు దూసుకెళ్లింది. -
Malaysia Open 2022: సింధుకు మళ్లీ నిరాశ
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ సూపర్–750 టోర్నీ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో ర్యాంకర్ సింధు 21–13, 15–21, 15–21తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయింది. తై జు చేతిలో సింధుకిది 16వ ఓటమి. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 18–21, 16–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశాడు. సింధు, ప్రణయ్లకు 3,712 డాలర్ల (రూ. 2 లక్షల 93 వేలు) చొప్పున ప్రైజ్మనీ లభించింది. -
Ranji Trophy: ట్రిపుల్ సెంచరీ, 2 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు.. సూపర్!
Ranji Trophy 2022: రంజీ ట్రోఫీ-2022లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద కొనసాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో భాగంగా ఉత్తరాఖండ్తో మ్యాచ్లో అతడు సెంచరీ సాధించాడు. రెండో రోజు ఆట సందర్బంగా ఈ సీజన్లో మూడో శతకం నమోదు చేసి సత్తా చాటాడు. ఇక ఇప్పటి వరకు అతడు 5 ఇన్నింగ్స్లో కలిపి 704 పరుగులు సాధించడం విశేషం. ఇందులో మూడు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉన్నాయి. ఈ క్రమంలో ముంబై జట్టును క్వార్టర్స్ చేర్చడంలో కీలక పాత్ర పోషించి.. క్వార్టర్ ఫైనల్లోనూ అదరగొడుతున్న సర్ఫరాజ్పై ప్రశంసలు కురుస్తున్నాయి. ‘‘సర్ఫరాజ్ అద్భుతం... ప్రతిభావంతుడైన ఆటగాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటి వరకు 2200కు పైగా పరుగులు సాధించిన ఈ ముంబై బ్యాటర్ మరింత గొప్పగా ఆడాలి’’ అంటూ ఆశిస్తున్నారు. టీమిండియా బ్యాటర్, ముంబైకర్ సూర్యకుమార్ యాదవ్ సైతం అతడిపై ప్రశంసలు కురిపించాడు. కాగా 2020 నుంచి ఇప్పటి వరకు రంజీ ట్రోఫీలో 10 మ్యాచ్లు(ప్రస్తుత క్వార్టర్ ఫైనల్) ఆడిన సర్ఫరాజ్ ఖాన్ సాధించిన పరుగుల జాబితా ఇలా! (ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఒక ట్రిపుల్ సెంచరీ, 3 సెంచరీలు ఉన్నాయి). ఉత్తరాఖండ్పై- 153 ఒడిశా- 165 గోవా- 63,48 సౌరాష్ట్ర- 275 మధ్యప్రదేశ్- 177, 6 సౌరాష్ట్ర- 78, 25 హిమాచల్ ప్రదేశ్- 226 నాటౌట్ ఉత్తర్ప్రదేశ్- 301 నాటౌట్ తమిళనాడు- 36 కర్ణాటక-8, 71 నాటౌట్ ఇక మంగళవారం నాటి ఉత్తరాఖండ్ మ్యాచ్లో 205 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్ 4 సిక్సర్లు, 14 ఫోర్ల సాయంతో 153 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అంతకుముందు మరో బ్యాటర్ సువేద్ పర్కార్ సెంచరీ సాధించడంతో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఆదిలోనే కెప్టెన్ పృథ్వీ షా(21)వికెట్ కోల్పోయినా.. సువేద్, సర్ఫరాజ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇక సువేద్ 227 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వలేదు.. అక్కడ మాత్రం దుమ్ము రేపాడు! A ton on #RanjiTrophy debut! 👏 👏 Sit back & relive how Mumbai batter Suved Parkar scored an unbeaten hundred on Day 1 of the #QF2 against Uttarakhand. 👍 👍 @Paytm | #MUMvCAU | @MumbaiCricAssoc Watch 🎥 🔽https://t.co/dgPAEzLbUb pic.twitter.com/Fs34pzXP5f — BCCI Domestic (@BCCIdomestic) June 6, 2022 Double hundred on Debut. Special knock Suved parkar. Very happy to see Sarfaraz khan continuing his Dream run. @MumbaiCricAssoc 💪 #RanjiTrophy — Surya Kumar Yadav (@surya_14kumar) June 7, 2022 -
రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్ షురూ..!
రెండు నెలల పాటు ఐపీఎల్–15వ సీజన్లో అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి ఆడిన భారత ఆటగాళ్లు ఇప్పుడు దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ బాట పట్టారు. ఐపీఎల్ టోర్నీకి ముందే లీగ్ దశ మ్యాచ్లన్నీ ముగిశాయి. సోమవారం(జూన్ 6) నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు మొదలవుతున్నాయి. బెంగళూరులో జరిగే తొలి క్వార్టర్స్లో బెంగాల్ జట్టుతో జార్ఖండ్ తలపడుతుంది. కాగా... మిగతా మ్యాచ్లన్నీ కూడా కర్ణాటకలోని ఆలూర్లో జరుగనున్నాయి. ముంబైతో ఉత్తరాఖండ్, కర్ణాటకతో ఉత్తరప్రదేశ్, పంజాబ్తో మధ్యప్రదేశ్ తలపడతాయి. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్, దినేష్ కార్తీక్కు నో ఛాన్స్..! -
క్వార్టర్ ఫైనల్లో సానియా–హర్డెస్కా జంట
ఇటాలియన్ ఓపెన్ మహిళల టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. సానియా జోడీతో ఆడాల్సిన రిబకినా (కజకిస్తాన్)–సమ్సోనోవా (రష్యా) ద్వయం గాయం కారణంగా బరిలోకి దిగకపోవడంతో ఇండో–చెక్ జంటను విజేతగా ప్రకటించారు. ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రోహన్ బోపన్న (భారత్)–మిడిల్కూప్ (నెదర్లాండ్స్) జోడీ 6–7 (3/7), 3–6తో కూలాఫ్ (నెదర్లాండ్స్)–స్కప్స్కీ (బ్రిటన్) జంట చేతిలో ఓడింది. -
క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ తెలుగుతేజం పీవీ సింధుకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్షిప్, కామన్వెల్త్, ఆసియా గేమ్స్ల్లో పతకాలు సాధించిన స్టార్కు ‘ఆల్ఇంగ్లండ్’ మాత్రం మరోసారి అందని ద్రాక్షే అయ్యింది. పురుషుల సింగిల్స్లో యువ సంచలనం లక్ష్యసేన్ భారత ఆశల పల్లకిని మోస్తున్నాడు. మూడో సీడ్ అంటోన్సెన్ను కంగుతినిపించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. బర్మింగ్హామ్: భారత రైజింగ్ స్టార్ లక్ష్యసేన్ టోర్నీ టోర్నీకి తన రాకెట్ పదును పెంచుతున్నాడు. తాజాగా ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో దూసుకెళ్తున్నాడు. అన్సీడెడ్ లక్ష్యసేన్ ప్రిక్వార్టర్స్లో మూడో సీడ్ అండర్స్ అంటోన్సెన్పై సంచలన విజయం సాధించాడు. గతేడాది ఆల్ ఇంగ్లండ్ టోర్నీ, ప్రపంచ చాంపియన్షిప్ సెమీఫైనలిస్ట్ అయిన అంటొన్సెన్ను ఈ సారి ప్రిక్వార్టర్స్లోనే ఇంటిదారి పట్టించాడు. పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ ఓడిపోగా... మహిళల సింగిల్స్లో వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్, మాజీ ప్రపంచ చాంపియన్ సింధులకు నిరాశ ఎదురైంది. తమ ప్రత్యర్థుల చేతుల్లో ప్రిక్వార్టర్స్లో ఇద్దరూ పోరాడి ఓడారు. డబుల్స్లో గాయత్రీ–ట్రెసా జాలీ, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీలు క్వార్టర్స్ చేరాయి. వరుస గేముల్లోనే... ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత లక్ష్యసేన్ పట్టుదలతో ముందంజ వేస్తున్నాడు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో అతను 21–16, 21–18తో ప్రపంచ మూడో ర్యాంకర్ అండర్స్ అంటొన్సెన్ (డెన్మార్క్)పై అసాధారణ విజయం సాధించాడు. అంతర్జాతీయ టోర్నీలో తనకెదురైంది టాప్–3 ప్లేయర్ అయినా... లక్ష్యసేన్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా యథేచ్ఛగా తన ‘మిషన్’ పూర్తిచేశాడు. తొలి గేమ్లో 11–9తో ఆధిక్యంలోకి వచ్చాక మళ్లీ వెనుదిరిగి చూడలేదు. నెట్ వద్ద పాదరసంలా కదిలిన భారత ఆటగాడు అదేజోరు గేమ్ను వశం చేసుకున్నాడు. ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీ రన్నరప్ అయిన అంటొన్సెన్ రెండో గేమ్లో సత్తాచాటాడు. దీంతో ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. దీంతో రెండుసార్లు 14–14, 16–16వద్ద స్కోరు సమమైంది. వరుసగా రెండు పాయింట్లు సాధించి 18–16తో ఆధిక్యంలోకి వచ్చిన లక్ష్యషేన్ తర్వాత చకచకా పాయింట్లు సాధించి గేమ్తో పాటు మ్యాచ్ను గెలుచుకున్నాడు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత యువ షట్లర్... చైనాకు చెందిన లు గ్వాంగ్ జుతో తలపడతాడు. మరో ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21–9, 18–21, 19–21తో ఐదో సీడ్ ఆంథోని సిన్సుకా (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. సింధు... మరో ‘సారీ’ ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు గెలిచిన పూసర్ల వెంకట సింధుకు ఎందుకనో ఆల్ ఇంగ్లండ్ కలిసిరావడం లేదు. ఈ ఏడాదీ ఆమె పతకం లేకుండానే నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్లో ఆరో సీడ్ సింధు 19–21, 21–16, 17–21తో సయాక టకహషి (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. సైనా నెహ్వాల్ 14–21, 21–17, 17–21తో రెండో సీడ్ యామగుచి (జపాన్) చేతిలో ఓడింది. ఫలితం నిరాశపరిచినప్పటికీ మాజీ ప్రపంచ నంబర్వన్ ఈ మ్యాచ్లో తన ఆటతీరుతో ఆకట్టుకుంది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో పుల్లెల గాయత్రీ–ట్రెసా జాలీ తొలి గేమ్ కోల్పోయి రెండో గేమ్లో దూసుకెళుతుండగా 18–21, 19–14 స్కోరువద్ద ఆరో సీడ్ ప్రత్యర్థి జోడీ గ్రేసియా–అప్రియని (ఇండోనేసియా) రిటైర్ట్ హర్ట్గా వెనుదిరిగింది. దీంతో భారత జోడీ ముందంజ వేసింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ 21–7, 21–7తో మార్క్ లామ్స్ఫుజ్–మార్విన్ సీడెల్ (జర్మనీ) ద్వ యంపై ఏకపక్ష విజయాన్ని సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే భారత జంట మ్యాచ్ను ముగించింది. -
ఆస్ట్రేలియన్ ఓపెన్ ముగిసిన సానియా పోరాటం.. క్వార్టర్స్లో నిష్క్రమణ
Sania Mirza-Rajeev Ram Lose Quarterfinals In Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్లో భారత మహిళల టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. అమెరికాకు చెందిన రాజీవ్ రామ్తో కలిసి మిక్స్డ్ డబుల్స్ బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో అన్ సీడెడ్ ఆస్ట్రేలియన్ జంట జేసన్ కుబ్లర్-జేమీ ఫోర్లిస్ చేతిలో 4-6, 6-7 తేడాతో పరాజయం పాలైంది. Thank you for the memories, @MirzaSania ❤️ The two-time #AusOpen doubles champion has played her final match in Melbourne.#AO2022 pic.twitter.com/YdgH9CsnF0— #AusOpen (@AustralianOpen) January 25, 2022 మ్యాచ్ ప్రారంభం నుంచి సానియా జోడీ అద్భుంగానే ఆడినప్పటికీ.. ప్రత్యర్ధి అంతకుమించి రాణించడంతో తలవంచక తప్పలేదు. గంటన్నర పాటు సాగిన ఈ మ్యాచ్లో ఆసీస్ జోడీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్లో సానియా శకం ముగిసింది. గతంలో రెండు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్స్ను నెగ్గిన సానియా.. ఈ ఏడాది తన కెరీర్కు ముగింపు పలుకనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. చదవండి: కార్నెట్ పట్టు వీడని పోరాటం -
ITF Tennis Tourney: క్వార్టర్స్లో రష్మిక, సౌజన్య
బెంగళూరు: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రష్మిక 6–2, 6–1తో ప్రతిభ (భారత్)పై అలవోక విజయాన్ని నమోదు చేసింది. తెలంగాణకే చెందిన టోర్నీ నాలుగో సీడ్ యడ్లపలిప్రాంజల, సౌజన్య బవిశెట్టి... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ రాచపూడి ప్రత్యూష క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. ప్రాంజల 6–3, 6–3తో యువరాణి బెనర్జీ (భారత్)పై, సౌజన్య 6–2, 6–2తో సోహా సాదిఖ్ (భారత్)పై, ప్రత్యూష 2–6, 6–2, 6–4తో జగ్మీత్ కౌర్ (భారత్)పై గెలిచారు. అయితే మరో తెలంగాణ ప్లేయర్ సామ సాత్వికకు నిరాశ ఎదురైంది. ప్రిక్వార్టర్స్లో ఆమె 4–6, 6–2, 2–6తో క్వాలిఫయర్ ఆకాంక్ష దిలీప్ (భారత్) చేతిలో ఓడింది. -
హడలెత్తించిన మిలింద్..క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్
సుల్తాన్పూర్ (గురుగ్రామ్): సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 క్రికెట్ టోర్నీ లో హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకుంది. ఎలైట్ గ్రూప్ ‘ఈ’లో భాగంగా మంగళవారం జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్లో హైదరాబాద్ 29 పరుగులతో ఉత్తరప్రదేశ్ను ఓడించింది. హైదరాబాద్ ఎడంచేతి వాటం పేసర్ సీవీ మిలింద్ ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. 3.2 ఓవర్లు వేసిన మిలింద్ కేవలం 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి ఉత్తరప్రదేశ్ను దెబ్బ తీశాడు. దాంతో 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉత్తరప్రదేశ్ 19.2 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఈ గెలుపుతో హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ గెలిచి 20 పాయింట్లతో గ్రూప్లో టాపర్గా నిలిచి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఈనెల 18న జరిగే క్వార్టర్ ఫైనల్లో గుజరాత్ జట్టుతో హైదరాబాద్ ఆడుతుంది. ఓవరాల్గా లీగ్ దశలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా సీవీ మిలింద్ (16 వికెట్లు) నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. కెప్టెన్ తన్మయ్ అగర్వాల్ (46 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో నాలుగో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. చదవండి: IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..! -
క్వార్టర్ ఫైనల్లో సంజీత్, నిశాంత్ ఓటమి
World Boxing Championship.. ప్రపంచ పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు సంజీత్ (92 కేజీలు), నిశాంత్ దేవ్ (71 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. బెల్గ్రేడ్లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో సంజీత్ 0–5తో అజీజ్ మొహియుద్దీన్ (ఇటలీ) చేతిలో... నిశాంత్ 1–4తో వాదిమ్ ముసయెవ్ (రష్యా) చేతిలో ఓడారు. 54 కేజీల విభాగంలో నేడు జరిగే సెమీఫైనల్లో భారత బాక్సర్ ఆకాశ్ కుమార్ కజకిస్తాన్కు చెందిన మక్మూద్ సమీర్ఖాన్తో తలపడనున్నాడు. -
Uber Cup: 11 ఏళ్ల తర్వాత క్వార్టర్ ఫైనల్స్కు
అర్హుస్ (డెన్మార్క్): థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో 11 ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. తాహితి జట్టుతో జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్లో భారత్ 5–0తో ఘనవిజయం సాధించింది. వరుసగా రెండో గెలుపుతో ఈ టోర్నీలో 2010 తర్వాత భారత్కు నాకౌట్ బెర్త్ ఖరారైంది. ఇదే గ్రూప్ నుంచి చైనా కూడా క్వార్టర్స్కు చేరింది. నేడు భారత్, చైనా మధ్య జరిగే మ్యాచ్ విజేత గ్రూప్ టాపర్గా నిలుస్తుంది. తాహితి జట్టుతో జరిగిన పోటీలో తొలి మ్యాచ్లో సాయిప్రణీత్ 21–5, 21–6తో లూయిస్ బిబోయిస్ను ఓడించాడు. రెండో మ్యాచ్లో సమీర్ వర్మ 21–12, 21–12తో రెమి రోస్పై, మూడో మ్యాచ్లో కిరణ్ జార్జి 21–4, 21–2తో మౌబ్లాంక్పై గెలవడంతో భారత్ 3–0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. తర్వాత రెండు డబుల్స్ మ్యాచ్ల్లో కృష్ణప్రసాద్–విష్ణువర్ధన్ గౌడ్; సాత్విక్–చిరాగ్ శెట్టి జోడీలు తమ ప్రత్యర్థి జంటలపై గెలుపొందాయి. మరోవైపు ఉబెర్ కప్లో ఇప్పటికే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత మహిళల జట్టు గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో 0–5తో థాయ్లాండ్ జట్టు చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో జపాన్తో భారత్ ఆడనుంది. -
US Open: సంచలనాల మోత
న్యూయార్క్: కెరీర్లో ఏడో గ్రాండ్స్లామ్ టోర్నీ ఆడుతున్న కెనడాకు చెందిన 19 ఏళ్ల లేలా ఫెర్నాండెజ్ తన జీవితంలోనే గొప్ప విజయాన్ని సాధించింది. యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోరీ్నలో మహిళల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై లేలా జయభేరి మోగించింది. 2 గంటల 4 నిమిషాలపాటు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్లో లేలా 5–7, 7–6 (7/2), 6–4తో ఒసాకాను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది. తొలి సెట్ సొంతం చేసుకొని, రెండో సెట్ లో 6–5తో ఆధిక్యంలో ఉండి విజయం కోసం సర్వీస్ చేసిన ఒసాకా తన సర్వీస్ను నిలబెట్టుకోలేకపోయింది. ఒసాకా సర్వీస్ను బ్రేక్ చేసిన లేలా స్కోరును 6–6తో సమం చేసి... టైబ్రేక్లోనూ పైచేయి సాధించి మ్యాచ్లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్లోనే ఒసాకా సరీ్వస్ను బ్రేక్ చేసి తన సర్వీస్ను కాపాడుకొని లేలా 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత లేలా తన సరీ్వస్లను నిలబెట్టుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో లేలా ఆరు ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. నెట్ వద్దకు ఆరుసార్లు దూసుకొచ్చి ఐదుసార్లు పాయింట్లు సాధించింది. మరోవైపు 2018, 2020లలో యూఎస్ ఓపెన్ చాంపియన్గా నిలిచిన ఒసాకా 15 ఏస్లు సంధించినా 36 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరో మూడో రౌండ్ మ్యాచ్లో పదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 4–6, 3–6తో మరియా సాకరి (గ్రీస్) చేతిలో ఓడిపోయింది. ప్రిక్వార్టర్స్లో స్వితోలినా, సబలెంకా ఇతర మూడో రౌండ్ మ్యాచ్ల్లో ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–2తో కసత్కినా (రష్యా)పై, రెండో సీడ్ సబలెంకా (బెలారస్) 6–3, 6–3తో కొలిన్స్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ క్రిచికోవా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–2తో రఖిమోవా (రష్యా)పై, తొమ్మిదో సీడ్ ముగురుజా (స్పెయిన్) 6–4, 3–6, 6–2తో మాజీ నంబర్వన్ అజరెంకా (బెలారస్)పై గెలిచారు. మెద్వెదేవ్ ముందంజ... పురుషుల సింగిల్స్లో మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా) మూడో రౌండ్లోనే ని్రష్కమించగా... రెండో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. మెద్వెదేవ్ 6–0, 6–4, 6–3తో పాబ్లో అందుహార్ (స్పెయిన్)పై నెగ్గాడు. మరోవైపు స్పెయిన్కు చెందిన 18 ఏళ్ల కార్లోస్ అల్కారజ్ 4 గంటల 7 నిమిషాల్లో 6–3, 4–6, 7–6 (7/2), 0–6, 7–6 (7/5)తో సిట్సిపాస్ను ఓడించగా... 23 ఏళ్ల అమెరికా యువతార టియాఫో 3 గంటల 45 నిమిషాల్లో 4–6, 6–3, 7–6 (8/6), 4–6, 6–1తో రుబ్లెవ్పై గెలిచాడు. తాజా విజయంతో అల్కారజ్ 1989లో పీట్ సంప్రాస్ (అమెరికా), మైకేల్ చాంగ్ (అమెరికా) తర్వాత యూఎస్ ఓపెన్లో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు. సిట్సిపాస్తో జరిగిన మ్యాచ్లో అల్కారజ్ కళ్లు చెదిరే ఫోర్హ్యాండ్ షాట్లతో హడలెత్తించాడు. సిట్సిపాస్ ఐదు డబుల్ ఫాల్ట్లు, 38 అనవసర తప్పిదాలు చేశాడు. రుబ్లెవ్తో జరిగిన మ్యాచ్లో టియాఫో 24 ఏస్లు సంధించడం విశేషం. టెన్నిస్ నుంచి నిరవధిక విరామం తీసుకోవాలనుకుంటున్నా. ఇటీవల కాలంలో నేను గెలిస్తే సంతోషం కలిగేది కాదు. ఊరట లభించినట్టు అనిపించేది. ఇక ఓడిపోతే తీవ్రంగా నిరాశ కలిగేది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే స్థితిలో లేను. నిజాయితీగా చెప్పాలంటే మళ్లీ నేను ఎప్పుడు రాకెట్ పట్టి కోర్టులోకి దిగుతానో నాకే తెలియదు. –ఒసాకా మిక్స్డ్లోనూ సానియా ఓటమి యూఎస్ ఓపెన్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పోరాటం ముగిసింది. మహిళల డబుల్స్లో తొలి రౌండ్లోనే ఓడిపోయిన సానియా... మిక్స్డ్ డబుల్స్లోనూ తొలి రౌండ్ను దాటలేకపోయింది. భారత సంతతికి చెందిన అమెరికా ప్లేయర్ రాజీవ్ రామ్ కలిసి సానియా మిక్స్డ్ డబుల్స్లో బరిలోకి దిగింది. తొలి రౌండ్లో సానియా–రాజీవ్ రామ్ ద్వయం 3–6, 6–7 (7/10)తో మాక్స్ పర్సెల్ (ఆస్ట్రేలియా)–డయానా యా్రస్టెమ్స్కా (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేíÙయా) జంట 3–6, 6–3, 7–6 (7/1)తో డక్వర్త్–థాంప్సన్ (ఆ్రస్టేలియా) ద్వయంపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. -
39 ఏళ్ల వయసులో అరుదైన ఘనత.. ఓపెన్ ఎరాలో ఒకే ఒక్కడు
లండన్: అత్యధిక గ్రాండ్స్లామ్ విన్నర్(20), టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) అరుదైన రికార్డు నెలకొల్పాడు. వింబుల్డన్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వయసులో క్వార్టర్స్కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుత టోర్నీలో ఇటలీకి చెందిన లోరెంజో సొనేగాపై గెలిచి క్వార్టర్స్లోకి అడుగుపెట్టడం ద్వారా ఆయన ఈ ఘనత సాధించాడు. 1968లో ఓపెన్ ఎరా ప్రారంభమైనప్పటి నుంచి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్న అతి పెద్ద వయసు ఆటగాడు ఫెదరర్ మాత్రమే కావడం విశేషం. కాగా, ఈ స్విస్ యోధుడు మరో ఐదు వారాల్లో 40వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆరవ సీడ్ రోజర్ ఫెదరర్ 7-5, 6-4, 6-2తో లోరెంజో సొనేగా (ఇటలీ)పై అలవోకగా విజయం సాధించాడు. మోకాలి సర్జరీ కారణంగా ఇటీవలి కాలంలో ఫామ్ను కోల్పోయిన ఫెడెక్స్.. గ్రాస్ కోర్టుపై మాత్రం చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో అతను వింబుల్డన్లో రికార్డు స్థాయిలో 18వ సారి క్వార్టర్స్కు చేరాడు. ఫెదరర్ తన తర్వాతి మ్యాచ్లో డానియల్ మెద్వెదెవ్ లేదా హుబెర్ట్ హుర్కాజ్తో తలపడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, పురుషుల సింగల్స్ విభాగంలో టాప్ సీడ్ జకోవిచ్, ఏడో సీడ్ బెరెటిని (ఇటలీ), పదోసీడ్ షపొవలోవ్ (కెనడా), కచనోవ్ (రష్యా), ఫుక్సోవిచ్ (హంగేరి) కూడా ప్రీక్వార్టర్స్ను అధిగమించారు. ఇక మహిళల విభాగంలో టాప్ సీడ్ ఆష్లే బార్టీ, రెండో సీడ్ సబలెంక (బెలారస్), ఆన్స్ జబేర్ (ట్యునీషియా), కెర్బర్ (జర్మనీ), ముచోవా (చెక్), గొల్బిచ్ (స్విట్జర్లాండ్)లు క్వార్టర్స్కు చేరారు. -
ఓర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ: క్వార్టర్స్లో సైనా
పారిస్: లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఓర్లీన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్లో ఫ్రాన్స్కు చెందిన 65వ సీడ్ మేరీ బాటోమెన్ను 18-21, 21-15, 21-10తో ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. 51 నిమిషాల పాటు సాగిన గేమ్లో సైనా అద్భుత ప్రదర్శన చేసి,తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. నాలుగోసారి ఒలింపిక్స్కు అర్హత సాధించాలని పట్టుదలగా ఉన్న సైనా.. ర్యాంకింగ్ పాయింట్లు దక్కించుకొని ఒలింపిక్ రేసులో నిలవాలని భావిస్తుంది. కాగా, గాయం కారణంగా గత వారం జరిగిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్ నుంచి వైదొలిగిన సైనా.. క్వార్టర్స్లో ఫ్రాన్స్కు చెందిన యాయెల్ హోయాక్స్ లేదా మలేషియాకు చెందిన ఐరిస్ వాంగ్తో తలపడనుంది. ఇదే టోర్నీలో మరో భారత షట్లర్ ఇరా శర్మ కూడా క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. ఐరా.. బల్గేరియాకు చెందిన మరియా మిట్సోవాను 21-18, 21-13 తో ఓడించింది. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన ఈ గేమ్లో ఐరా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఇరా తన తదుపరి గేమ్లో డెన్మార్క్కు చెందిన లైన్ క్రిస్టోఫెర్సన్తో పోటీపడే అవకాశం ఉంది. కాగా, బుధవారం జరిగిన మహిళల డబుల్స్లో కామన్వెల్త్ గేమ్స్ కాంస్య పతక విజేతలు అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి జంట.. డెన్మార్క్ జంట అమాలీ మాగెలుండ్, ఫ్రీజా రావ్న్పై 21-9, 17-21, 21-19తో విజయం సాధించారు. -
క్వార్టర్స్లో మేరీకోమ్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి బాక్సర్లు మేరీకోమ్ (51 కేజీలు), అమిత్ పంఘాల్ (52 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్స్లో మేరీకోమ్ 5–0తో టాస్మీన్ బెన్నీ (న్యూజిలాండ్)ను చిత్తుగా ఓడించగా... అమిత్ 3–2తో ఎన్క్మనాదక్ ఖర్కు (మంగోలియా)పై కష్టపడి గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో భారత బాక్సర్ గౌరవ్ సోలంకి (57 కేజీలు) 1–4తో టాప్ సీడ్ మిరాజిజ్బెక్ మిర్జాఖలీలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
క్వార్టర్ ఫైనల్లో మనీశ్, ఆశిష్, సచిన్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో గురువారం బరిలోకి దిగిన ముగ్గురు భారత బాక్సర్లు అదరగొట్టారు. మనీశ్ కౌశిక్ (63 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సచిన్ కుమార్ (81 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు విజయం దూరంలో నిలిచారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో మనీశ్ 5–0తో చు ఎన్ లాయ్ (చైనీస్ తైపీ)పై, ఆశిష్ 5–0తో ఒమర్బెక్ బెక్జిగిట్ యులు (కిర్గిస్తాన్)పై నెగ్గగా... డీ ఇవోపో (సమోవా)ను సచిన్ ఓడించాడు. -
క్వార్టర్స్లో బోపన్న జంట
న్యూఢిల్లీ : రోటర్డామ్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నమెంట్లో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట శుభారంభం చేసింది. నెదర్లాండ్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 7–6 (7/0), 6–7 (5/7), 10–8తో ‘సూపర్ టైబ్రేక్’లో జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా)–మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటను ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జోడీ 12 ఏస్లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్లు చేసింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్)–హొరియా టెకావ్ (రొమేనియా) ద్వయంతో బోపన్న జంట ఆడుతుంది. -
సెమీస్లో బంగ్లాదేశ్
పాచెఫ్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): అండర్–19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ నుంచి ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు నిష్క్రమించింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ 104 పరుగుల ఆధిక్యంతో దక్షిణాఫ్రికాను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 261 పరుగులు చేసింది. తాన్జిద్ హసన్ (80; 12 ఫోర్లు), తౌహిద్ హృదయ్ (51; 2 ఫోర్లు), షాహదత్ హుస్సేన్ దీపు (74 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. 262 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఎడంచేతి వాటం స్పిన్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రకీబుల్ హసన్ 9.3 ఓవర్లలో 19 పరుగులిచ్చి 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను దెబ్బ తీశాడు. నేడు జరిగే చివరి క్వార్టర్ ఫైనల్లో పాకిస్తాన్తో అఫ్గానిస్తాన్ ఆడుతుంది. -
క్వార్టర్స్లో ప్రణీత్
బాసెల్ (స్విట్జర్లాండ్): ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో సాయి ప్రణీత్ (భారత్) నిలకడగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల ప్రిక్వార్టర్స్ పోరులో 16వ సీడ్ సాయి ప్రణీత్ 21–19, 21–13తో ఆరో సీడ్ ఆంథోని జిన్టింగ్ (ఇండోనేసియా)ను చిత్తుచేసి క్వార్టర్స్లో ప్రవేశించాడు. 43 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్లో ప్రణీత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ముఖ్యంగా సుదీర్ఘ ర్యాలీలతో, స్మాష్ షాట్లతో హోరెత్తించాడు. ఆరంభంలో తడబడినా... జిన్టింగ్ మ్యాచ్ను ధాటిగా ఆరంభిం చాడు. తొలి మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకున్న అతను 3–0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. వెంటనే తేరుకున్న ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 4–3తో ఆధిక్యంలోకొచ్చాడు. ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15–15తో సమానంగా నిలి చారు. కీలక సమయం లో ఒత్తిడిని జయించిన ప్రణీత్ వరుసగా 4 పాయింట్లు సాధించి 21–17తో గేమ్ను సొంతం చేసుకున్నాడు. రెండో గేమ్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించి గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో క్వార్టర్స్ చేరడం ప్రణీత్కిది రెండోసారి. 2018లో కూడా అతను క్వార్టర్స్ చేరాడు. నేడు జరిగే క్వార్టర్స్లో నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)తో ప్రణీత్ తలపడతాడు. సింధు అలవోకగా... మహిళల విభాగంలో ఐదో సీడ్ పీవీ సింధు పెద్దగా కష్టపడకుండానే క్వార్టర్స్ చేరింది. ప్రిక్వార్టర్స్ మ్యాచ్లో ఆమె 21–14, 21–6తో తొమ్మిదో సీడ్ బీవెన్ జాంగ్ (అమెరికా)పై అలవోక విజ యాన్ని సాధించింది. కోర్టులో పాదరసంలా కదిలిన సింధు ప్రత్యర్థికి తన స్మాష్ షాట్లతో ముచ్చెమటలు పట్టించింది. నేడు జరిగే క్వార్టర్స్లో రెండో సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో సింధు తలపడుతుంది. మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)తో జరిగిన మరో ప్రి క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 21–15, 25–27, 12–21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీకాంత్, ప్రణయ్ ఔట్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ల పోరాటం ముగిసింది. గురువారం 46 నిమిషాల పాటు జరిగిన పురుషుల ప్రిక్వార్టర్ మ్యాచ్లో ప్రణయ్ 19–21, 12–21తో టాప్ సీడ్ కెంటో మొమోటా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. మొదటి గేమ్లో తీవ్రంగా ప్రతిఘటించిన ప్రణయ్ మ్యాచ్ ఓడినా ఆకట్టుకున్నాడు. మొదటి గేమ్లో ఇరువురు 18–18తో సమంగా ఉన్న సమయంలో... ఆ తర్వాతి పాయింట్ కోసం ఆటగాళ్ల మధ్య ఏకంగా 57 షాట్ల పాటు సాగిన ర్యాలీ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. అయితే ఆ పాయింట్ను ప్రత్యర్థికి కోల్పోయిన ప్రణయ్ తర్వాత గేమ్నూ సమర్పించుకున్నాడు. రెండో గేమ్లో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన మొమోటా సునాయాసంగా గెలిచేశాడు. మరో ప్రిక్వార్టర్ మ్యాచ్లో ఏడో సీడ్ కిడాంబి శ్రీకాంత్ 14–21, 13–21తో కాంతాపోన్ వాంగ్చరోయెన్ (థాయ్లాండ్) చేతిలో చిత్తయ్యాడు. -
క్వార్టర్ ఫైనల్లో భారత్
న్యూఢిల్లీ: భారత పురుషుల జట్టు అండర్–23 ఆసియా వాలీబాల్ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మయన్మార్లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలో ఆఖరి లీగ్ మ్యాచ్లో ఓడింది. భారత్ 2–3 (25–15, 23–25, 23–25, 25–23, 13–15)తో థాయ్లాండ్ చేతిలో పరాజయం చవిచూసినప్పటికీ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్ చేరింది. -
క్వార్టర్స్లో సింధు, సాయిప్రణీత్
టోక్యో: మరోసారి సాధికారిక ఆటతీరును ప్రదర్శించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పీవీ సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ సింధు 11–21, 21–10, 21–13తో ప్రపంచ 20వ ర్యాంకర్ అయా ఒహోరి (జపాన్)పై గెలుపొందగా... పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాయిప్రణీత్ 21–13, 21–16తో ప్రపంచ 17వ ర్యాంకర్ కాంటా సునెయామ (జపాన్)ను ఓడించాడు. హెచ్ఎస్ ప్రణయ్ పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. రాస్ముస్ గెమ్కే (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్లో ప్రణయ్ 9–21, 15–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 15–21, 21–11, 21–19తో హువాంగ్ కాయ్ జాంగ్– లియు చెంగ్ (చైనా) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్ చేరింది. మిక్స్డ్ డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్–అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 16–21, 17–21తో దెచాపోల్–సప్సిరి (థాయ్లాండ్) జోడీ చేతిలో ఓడింది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో అకానె యామగుచి (జపాన్)తో సింధు; సుగియార్తో (ఇండోనేసియా)తో సాయిప్రణీత్; తకెషి–కీగో సొనోడా (జపాన్)లతో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తలపడతారు. -
భారత పురుషుల ఆర్చరీ జట్టుకు ‘టోక్యో’ బెర్త్
ఎస్–హెర్టోగెన్బాష్ (నెదర్లాండ్స్): ప్రపంచ ఆర్చరీ చాంపియన్షిప్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ద్వారా భారత పురుషుల రికర్వ్ జట్టు వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. తరుణ్దీప్ రాయ్, అతాను దాస్, ప్రవీణ్ రమేశ్ జాదవ్లతో కూడిన భారత బృందం ప్రిక్వార్టర్ ఫైనల్లో 5–3తో కెనడా జట్టును ఓడించింది. మరోవైపు దీపిక, బొంబేలా దేవి, కోమలికలతో కూడిన భారత మహిళల రికర్వ్ జట్టు ప్రిక్వార్టర్ ఫైనల్లో 2–6తో బెలారస్ చేతిలో ఓడింది. తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. -
క్వార్టర్స్లో సౌరవ్ ఓటమి
షికాగో (అమెరికా): ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) ప్రపంచ చాంపియన్షిప్లో భారత పోరాటం ముగిసింది. పురుషుల సింగిల్స్ బరిలో మిగిలిన సౌరవ్ ఘోషాల్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్ ఫైనల్లో 11వ సీడ్ సౌరవ్ 8–11, 6–11, 7–11తో మూడో సీడ్ సైమన్ రోస్నర్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్లో 6–2తో ఆధిక్యంలో నిలిచిన సౌరవ్ ఆ తర్వాత తడబడి తేరుకోలేకపోయాడు. ఈ గెలుపుతో ప్రపంచ స్క్వాష్ చాంపియన్షిప్లో సెమీఫైనల్కు చేరిన తొలి జర్మనీ ప్లేయర్గా రోస్నర్ నిలిచాడు. -
క్వార్టర్స్లో సైనా, ఉత్తేజిత
లక్నో: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ దిశగా మరో అడుగు ముందుకేసింది. సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నమెంట్లో సైనాతోపాటు తెలుగమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు, రితూపర్ణ దాస్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా 21–14, 21–9తో భారత్కే చెందిన అమోలిక సింగ్ సిసోడియాను అలవోకగా ఓడించింది. సాయి ఉత్తేజిత 21–12, 21–15తో రేష్మా కార్తీక్ (భారత్)పై, రితూపర్ణ దాస్ 21–11, 21–15తో శ్రుతి ముందాడ (భారత్)పై విజయం సాధించారు. ఇతర మ్యాచ్ల్లో హైదరాబాద్ అమ్మాయి ప్రాషి జోషి 16–21, 18–21తో రుసెలి హర్తావాన్ (ఇండోనేసియా) చేతిలో... ఆంధ్రప్రదేశ్కు చెందిన మామిళ్లపల్లి తనిష్క్ 10–21, 9–21తో హాన్ వైయువె (చైనా) చేతిలో ఓడిపోయారు. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ మాజీ నంబర్వన్, లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా)తో సాయి ఉత్తేజిత; రితూపర్ణ దాస్తో సైనా తలపడతారు. సమీర్ వర్మ ముందంజ... పురుషుల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ కాబోయే భర్త పారుపల్లి కశ్యప్తోపాటు సాయిప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్ బెర్త్లను ఖాయం చేసుకోగా... గురుసాయిదత్ ఇంటిదారి పట్టాడు. ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కశ్యప్ 9–21, 22–20, 21–8తో ఫిర్మాన్ అబ్దుల్ ఖాలిక్ (ఇండోనేసియా)పై కష్టపడి గెలుపొందగా... సమీర్ వర్మ 22–20, 21–17తో జున్పెంగ్ జావో (చైనా)పై... సాయిప్రణీత్ 21–12, 21–10తో రుస్తావిటో (ఇండోనేసియా)పై విజయం సాధించారు. ఒకవేళ ఈ టోర్నీలో సమీర్ వర్మ విజేతగా నిలిస్తే బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్ టూర్ ఫైనల్స్కు అర్హత సాధిస్తాడు. సిక్కి–అశ్విని జంట జోరు... మహిళల డబుల్స్లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట క్వార్టర్ ఫైనల్కు చేరింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి–అశ్విని ద్వయం 21–14, 21–13తో ప్రీతి–ప్రియ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) ద్వయం 21–15, 21–10తో శివమ్ శర్మ–హేమనాగేంద్ర బాబు (భారత్) జోడీని ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి–దండు పూజ (భారత్); సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాయి. -
అందరూ ముందుకు
పారిస్: భారత స్టార్ షట్లర్లంతా ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు, సైనా నెహ్వాల్, పురుషుల సింగిల్స్లో డిఫెండింగ్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్స్ చేరారు. అయితే మహిళల డబుల్స్లో మేఘన–పూర్వీషా రామ్ జోడీకి ప్రి క్వార్టర్స్లో చుక్కెదురైంది. గురు వారం జరిగిన మహిళల సింగిల్స్లో మూడో సీడ్ సింధు 21–17, 21–16తో సయాక సాటో (జపాన్)పై అలవోక విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ శ్రీకాంత్ 12–21, 21–16, 21–18తో లీ డాంగ్ కిన్ (కొరియా)పై చెమటోడ్చి నెగ్గాడు. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో మొదటి గేమ్ను కోల్పోయిన భారత ఆటగాడు తర్వాత పుంజుకున్నాడు. మహిళల సింగిల్స్లో సైనా కూడా శ్రీకాంత్లాగే తొలి గేమ్లో వెనుకబడినప్పటికీ తర్వాత రెండు గేముల్లోను ప్రత్యర్థిని చిత్తు చేసింది. డెన్మార్క్ ఓపెన్ రన్నరప్ అయిన సైనా 10–21, 21–14, 21–17తో మాజీ ప్రపంచ చాంపియన్, ఎనిమిదో సీడ్ నొజోమి ఒకుçహార (జపాన్)పై గెలిచింది. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–13, 21–19తో హి జితింగ్–తన్ కియాంగ్ (చైనా) జంటపై నెగ్గింది. మహిళల డబుల్స్లో మేఘన–పూర్వీష జోడి 15–21, 13–21తో నాలుగో సీడ్ గ్రేసియా పొలి–అప్రియని రహయు (ఇండోనేసియా) జంట చేతిలో ఓటమి చవిచూసింది. మరో వైపు ఒలింపిక్, ప్రపంచ చాంపియన్షిప్ రన్నరప్ సింధు మళ్లీ రెండో ర్యాంకుకు ఎగబాకింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన తాజా మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో ఆమె ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్–2లో కొనసాగుతోంది. గతేడాది ఏప్రిల్లో తొలిసారిగా ఆమె రెండో ర్యాంకులోకి వచ్చినా ఆ స్థానంలో పదిలంగా కొనసాగలేకపోయింది. -
ప్రిక్వార్టర్స్లో సాయి ఉత్తేజిత
డచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. నెదర్లాండ్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్లో ఉత్తేజిత 21–10, 21–13తో మార్టినా రెపిస్కా (స్లొవేకియా)పై గెలిచింది. మరో మ్యాచ్లో హైదరాబాద్కు చెందిన శ్రీకృష్ణప్రియ 11–21, 12–21తో ఫాబిని డిప్రెజ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయింది. భారత్కే చెందిన శైలి రాణే, అనురా ప్రభు దేశాయ్, రియా ముఖర్జీ కూడా తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యారు. -
ప్రిక్వార్టర్స్లో అజయ్, సౌరభ్ వర్మ
తైపీ సిటీ: భారత షట్లర్లు అజయ్ జయరామ్, సౌరభ్ వర్మలు చైనీస్ తైపీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో అజయ్ జయరామ్ 18–21, 21–17, 21–9తో హషిరు షిమోన (జపాన్)పై, సౌరభ్ వర్మ 18–21, 21–16, 21–13తో లీ చీ హో (చైనీస్ తైపీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ కుర్రాడు చిట్టబోయిన రాహుల్ యాదవ్ 11–21, 9–21తో లూ చి హంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, అభిషేక్ 5–21, 6–21తో ఐదో సీడ్ జాన్ ఒ జార్జెన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు 15–21, 18–21తో చియాంగ్ ఇంగ్ లీ (చైనీస్ తైపీ) చేతిలో కంగుతినగా, హైదరాబాద్ అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21–23, 20–22తో లిన్ యింగ్ చన్ (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడింది. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్లో కిమ్ బ్రూన్ (డెన్మార్క్)తో అజయ్, రికి తకషిత (జపాన్)తో సౌరభ్ వర్మ తలపడతారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో తరుణ్ కోన–లిమ్ కిమ్ వా (మలేసియా) ద్వయం 13–21, 10–21తో నాలుగో సీడ్ ఒగ్ యి సిన్–టే యి (మలేసియా) జంట చేతిలో పరాజయం పాలైంది. -
థాయ్లాండ్ ఓపెన్ క్వార్టర్స్లో సింధు
థాయ్లాండ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. గురువారం బ్యాంకాక్లో జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సింధు 21–16, 21–14తో యిప్ పుయ్ యిన్ (హాంకాంగ్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్లో పారుపల్లి కశ్యప్, ప్రణయ్ ఓడిపోగా... డబుల్స్లో మను అత్రి–సుమీత్ రెడ్డి జంట, మిక్స్డ్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–అశ్విని పొన్నప్ప జోడీలు ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించాయి. శుక్రవారం జరుగనున్న క్వార్టర్స్లో సోనియా చెహ్ (మలేసియా)తో సింధు తలపడనుంది. -
ఫిఫా వరల్డ్ కప్; సెమీస్కు ఫ్రాన్స్
నిజ్ని నవ్గొరొడ్: రష్యా వేదికగా జరుగుతోన్న ఫిఫా 2018 ప్రపంచ కప్ టోర్నీలో ఫ్రాన్స్ జట్టు సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్లో ఉరుగ్వేపై 0-2 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. లీగ్ దశలో ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వని ఉరుగ్వే కీలకమైన మ్యాచ్లో చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. 39వ నిమిషంలో రఫెల్ వారన్ మొదటి గోల్ చేయడం ద్వారా ఫస్టాఫ్లో ఫ్రాన్స్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆట రెండో భాగంలోనూ అదే జోరుతో ప్రత్యర్థి గోల్పోస్టుపైకి పదే పదే దూసుకెళ్లింది. 61వ నిమిషంలో ఆంటోనీ గ్రిజ్మన్ రెండో గోల్ సాధించడంతో ఫ్రాన్స్ విజయావకాశాల్ని మరింత పదిలం చేసుకుంది. మ్యాచ్ ఏ దశలోనూ ప్రత్యర్థిని నిలువరించలేకోపోయిన ఉరుగ్వే ఓటమిభారంతో ఇంటిబాటపట్టింది. గెట్ రెడీ: రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో బ్రెజిల్-బెల్జియంలు తలపడనున్నాయి. శుక్రవారం రాత్రి గం.11.30 నుంచి ఈ మ్యాచ్ సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారంకానుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
అష్ట దిగ్గజాల ఆట...
విశ్వ సమరంలో వీర రస ప్రదర్శనకు మళ్లీ రంగం సిద్ధమైంది. ముప్ఫై రెండు నుంచి మొదలు పెట్టి అత్యుత్తమంగా నిలిచిన ఆఖరి ఎనిమిది జట్లు తమ సత్తా చాటేందుకు సై అంటున్నాయి. తొలి రోజు ఖండాంతర పోరులో శుక్రవారం ఉరుగ్వే–ఫ్రాన్స్, బ్రెజిల్–బెల్జియం క్వార్టర్ ఫైనల్స్లో తలపడనున్నాయి. వీటిలో సెమీస్ మెట్టును రెండు దక్షిణ అమెరికా (ఉరుగ్వే, బ్రెజిల్) జట్లే ఎక్కుతాయో... లేదా రెండు యూరప్ దేశాలు (ఫ్రాన్స్, బెల్జియం) ముందంజ వేస్తాయో చూడాలి...! నిజ్ని నవ్గొరొడ్: ప్రత్యర్థులకు ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా... అయిదు గోల్స్ చేసి లీగ్ దశను అజేయంగా ముగించింది ఉరుగ్వే. ప్రి క్వార్టర్స్లో పోర్చుగల్కు గోల్ ఇచ్చినా ప్రతిగా రెండు కొట్టి గెలుపొందింది. మరోవైపు ఫ్రాన్స్ ప్రయాణం నిదానంగా మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా, పెరూపై గెలిచి, డెన్మార్క్తో డ్రా చేసుకుంది. ప్రి క్వార్టర్స్లో మాత్రం అర్జెంటీనాపై జూలు విదిల్చింది. మొత్తమ్మీద రెండు జట్లు నాలుగు మ్యాచ్ల్లో ఏడు గోల్స్ చేశాయి. ఇక శుక్రవారం క్వార్టర్ ఫైనల్ను 350 మ్యాచ్ల విశేష అనుభవం ఉన్న డిగో గోడిన్, జిమెనెజ్, క్యాసెరెస్, లక్జాల్ట్ల ఆధ్వర్యంలోని ఉరుగ్వే రక్షణ శ్రేణికి... గ్రీజ్మన్, ఎంబాపెల ఫ్రాన్స్ ఫార్వర్డ్ దళానికి మధ్య పోరాటంగా పేర్కొనవచ్చు. స్టార్ స్ట్రయికర్ సురెజ్ ఫామ్ భరోసానిస్తున్నా, ప్రి క్వార్టర్స్లో రెండు గోల్స్తో గెలిపించిన మరో స్టార్ ఎడిన్సన్ కవాని గాయం ఉరుగ్వేను కలవరపరుస్తోంది. అతడు బరిలో దిగేది అనుమానంగానే ఉంది. గత మ్యాచ్లో అర్జెంటీనాపై విజయం ఫ్రాన్స్లో ఆత్మవిశ్వాసం పెంచి ఉంటుందనడంలో సందేహం లేదు. టీనేజ్ సంచలనం ఎంబాపె తన వేగంతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నాడు. అతడికి గ్రీజ్మన్, గిరౌడ్, ఉస్మాన్ డంబెల్ తోడైతే తిరుగుండదు. వీరి ఆధ్వర్యంలోని ఫార్వర్డ్ బృందం ప్రత్యర్థి రక్షణ శ్రేణిని ఛేదించే ప్రయత్నాలు మ్యాచ్ను ఆసక్తికరంగా మార్చడం ఖాయం. దీనిని దృష్టిలో పెట్టుకునే ‘ఫ్రాన్స్కు ఒక్కసారి అవకాశం ఇచ్చామో వారిని అందుకోవడం చాలా కష్టం’ అని ఇప్పటికే ఉరుగ్వే కోచ్ ఆస్కార్ తబ్రెజ్ వ్యాఖ్యానించాడు. ‘బలమైన ఉరుగ్వే నుంచి భిన్న ఆట ఎదురుకావొచ్చు’ అనేది ఫ్రాన్స్ కోచ్ డెచాంప్స్ అంచనా. ►ఉరుగ్వే (vs) ఫ్రాన్స్ రాత్రి గం. 7.30 నుంచి కజన్: వరల్డ్ కప్లో బ్రెజిల్ ప్రయాణం సాఫీగా సాగుతోంది. మాజీ చాంపియన్లు ఒక్కొక్కటే వెనుదిరుగుతున్నా, సాంబా జట్టు మాత్రం ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తోంది. లీగ్ దశలో డ్రాతో స్విట్జర్లాండ్ విస్మయపర్చినా... కోస్టారికా, సెర్బియాలపై సాధికార విజయాలు సాధించింది. ప్రి క్వార్టర్స్లో మెక్సికోకు చిక్కకుండా తప్పించుకుంది. అటువైపు బెల్జియం మాత్రం ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తూ లీగ్లో అజేయంగా నిలిచింది. ప్రి క్వార్టర్స్లో జపాన్ నుంచి మ్యాచ్ను లాగేసుకున్న తీరు అదెంత ప్రమాదకర జట్టో చాటింది. ప్రపంచ ర్యాంకుల్లో 2, 3 స్థానాల్లో ఉన్న వీటి మధ్య క్వార్టర్స్లో భీకర పోరాటం ఖాయం. టోర్నీలో ఇప్పటివరకు ఏడు గోల్స్ చేసిన బ్రెజిల్... ప్రత్యర్థులకు ఒక్కటే ఇచ్చింది. బెల్జియం ఏకంగా 12 గోల్స్ కొట్టి... నాలుగు ఇచ్చింది. కీలక సమయంలో స్టార్ ఆటగాడు నెమార్ ఫామ్లోకి రావడంతో పాటు సాంబా జట్టు ఆట క్రమంగా పదునెక్కుతోంది. యువ గాబ్రియెల్ జీసస్ కూడా మెరిస్తే తిరుగుండదు. థియాగో సిల్వా, మిరండా వంటి సీనియర్లతో పటిష్ఠంగా కనిపిస్తున్న వీరి రక్షణ శ్రేణిని బెల్జియం స్టార్లు హజార్డ్, లుకాకు, మెర్టెన్స్లు ఏమేరకు ఛేదిస్తారో చూడాలి. గత మ్యాచ్లోలా ఆధిక్యం కోల్పోతే కోలుకోవడానికి వీలుండదు. ఆటగాళ్లంతా అద్భుత ఫామ్లో ఉండటంతో బెల్జియంను ‘గోల్డెన్ జనరేషన్’ జట్టుగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు కాకుంటే మరె ప్పుడూ కప్పు గెలిచే అవకాశం రాదంటున్నారు. ఈ మ్యాచ్లో మాజీ చాంపియన్ను ఓడిస్తే 1986 తర్వాత బెల్జియం సెమీస్కు చేరినట్లవుతుంది. ►బ్రెజిల్ (vs) బెల్జియం రాత్రి గం.11.30 నుంచి ►సోనీ ఈఎస్పీఎన్, సోనీ టెన్–2, 3లలో ప్రత్యక్ష ప్రసారం -
క్వార్టర్స్లో జయరామ్
ఫులర్టన్ (అమెరికా): భారత షట్లర్ అజయ్ జయరామ్ యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 300 టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అజయ్ 19–21, 21–12, 21–16తో ఎనిమిదో సీడ్ యగోర్ కొయిలో (బ్రెజిల్)పై గెలిచి క్వార్టర్స్కు చేరాడు. తొలి గేమ్లో ఓటమి పాలైన అజయ్ వెంటనే పుంజుకొని వరుస గేముల్లో నెగ్గి మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. -
క్వార్టర్స్లో సాయి ప్రణీత్
అక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత షట్లర్లు సాయి ప్రణీత్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్స్కు చేరారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో సాయి ప్రణీత్ 21–18, 21–17తో డారెన్ ల్యూ (మలేసియా)పై; సమీర్ వర్మ 21–17, 21–19తో లీ చౌక్ యూ (హాంకాంగ్)పై గెలుపొంది క్వార్టర్స్కు అర్హత సాధించారు. యువ షట్లర్ లక్ష్యసేన్, అజయ్ జయరామ్ ప్రిక్వార్టర్స్లో ఓటమి పాలయ్యారు. లక్ష్యసేన్ 21–15, 15–21, 12–21తో బ్యాడ్మింటన్ దిగ్గజం, టాప్ సీడ్ లిన్ డాన్ చేతిలో పోరాడి ఓడాడు. అజయ్ జయరామ్ 15–21, 22–20, 6–21తో వాంగ్ హీ హియో (దక్షిణ కొరియా) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్లో మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం 21–9, 21–12తో అనువిత్–నథాపాట్ ట్రింకజీ (థాయ్లాండ్) జోడీ పై గెలిచి క్వార్టర్స్కు అర్హత సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో శివమ్ శర్మ–పూర్విషా రామ్ జంట రెండో రౌండ్లో 16–21, 14–21తో చాన్ పెంగ్ సూన్–లియూ యింగ్ గో (మలేసియా) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్లో మేఘన–పూర్విషా రామ్ జంట 15–21, 6–21తో డెల్లా హ్యారిస్–రిజ్కి ప్రదీప్త (ఇండోనేసియా) చేతిలో ఓడింది. -
క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట పరాజయం
బార్సిలోనా ఓపెన్ టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–వాసెలిన్ (ఫ్రాన్స్) జంట క్వార్టర్ ఫైనల్లో ఓడింది. డబుల్స్ క్వార్టర్స్లో బోపన్న–వాసెలిన్ ద్వయం 6–4, 6–7 (9/11), 11–13తో ‘సూపర్ టైబ్రేక్’లో కబాల్–రాబర్ట్ ఫరా (కొలంబియా) జోడీ చేతిలో పోరాడి ఓడిపోయింది. బోపన్న జోడీకి 20,540 యూరోల ప్రైజ్మనీ (రూ. 16 లక్షల 74 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. మరోవైపు ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగం రెండో రౌండ్లో మాజీ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా) 2–6, 6–1, 3–6తో క్వాలిఫయర్ క్లిజాన్ (స్లొవేకియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
క్వార్టర్ ఫైనల్లో శ్యామ్ కుమార్
ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. న్యూఢిల్లీలో సోమవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం ప్రిక్వార్టర్ ఫైనల్లో వైజాగ్ బాక్సర్ శ్యామ్ 5–0తో భారత్కే చెందిన నీరజ్ స్వామిని ఓడించాడు. మరో బౌట్లో ప్రపంచ యూత్ చాంపియన్ సచిన్ సివాచ్ థాయ్లాండ్ బాక్సర్ థాని నరీన్రామ్ చేతిలో ఓడిపోయాడు. మహిళల 51 కేజీల విభాగంలో భారత బాక్సర్లు సర్జూబాలా దేవి, పింకీ జాంగ్రా సెమీఫైనల్కు చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. -
భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!
-
నిరాశ పరిచిన సాక్షి మాలిక్
భారత్కు మరోసారి నిరాశే ఎదురైంది. రియో ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగట్ ప్రిక్వార్టర్స్ లో శుభారంభం చేసినా, క్వార్టర్స్ లో మాత్రం వెనుకంజ వేశారు. మహిళల 58 కేజీల ప్రీ స్టైల్ విభాగంలో క్వార్టర్స్ లో రష్యాకు చెందిన రెజ్లర్ వలేరియా కోబ్లోవా భారత రెజ్లర్ సాక్షి మాలిక్ పై 3-1 తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడి మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే. -
భారత మహిళా రెజ్లర్కు ఎంత కష్టం!
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్ తీవ్రంగా గాయపడింది. బుధవారం జరిగిన 48 కిలోల ఫ్రీ స్టైల్ విభాగం క్వార్టర్ ఫైనల్స్ లో చైనాకు చెందిన సన్ యనన్ తో తలపడ్డ బౌట్ లో గాయపడి మధ్యలోనే వైదొలిగింది. దీంతో చైనా రెజ్లర్ బౌట్ విజేతగా ప్రకటించారు. 1-2 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న సన్ సెమీఫైనల్లో ప్రవేశించింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్ లో రొమేనియాకు చెందిన ఎమిలియా అలినాపై 11-0తో ఫొగట్ విజయం సాధించి భారత శిబిరంలో ఆశలు రెకెత్తించింది. అయితే క్వార్టర్స్ లో చైనా రెజ్లర్ సన్ పట్టుకోసం యత్నించగా మోకాలి కింద ప్రాంతంలో ఫొగట్ కు గాయమై నొప్పితో విలవిల్లాడిపోయింది. దీంతో ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి అనంతరం స్ట్రెచర్ పై తీసుకెళ్లారు. -
టోర్నీ మధ్యలోనే తప్పుకొన్న వరల్డ్ నంబర్ 1
దుబాయ్: వరల్డ్ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జోకోవిచ్ దుబాయ్ ఓపెన్ టోర్నమెంట్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. గురువారం క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ ఆటగాడు ఫెలిసియనో లోపేజ్ తో తలపడగా అనారోగ్యం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. లోపేజ్ తో మ్యాచ్ లో తొలి సెట్ కోల్పోయిన తర్వాత తనకు కంటి సమస్య తలెత్తిందని భావించిన జోకో మ్యాచ్ కొనసాగించలేనని చెప్పడంతో అంపైర్ మ్యాచ్ ను నిలిపివేశాడు. చివరిసారిగా 2011లో అర్జైంటైనా ఆటగాడు డెల్ పొట్రోతో తలపడ్డ మ్యాచ్ మధ్యలోనే జోకోవిచ్ ఆట నుంచి తప్పకున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో వరల్డ్ నంబర్ 4, స్విస్ వీరుడు స్టానిస్లాస్ వావ్రింకా 7-5, 6-1తేడాతో జర్మనీ ప్లేయర్ కొల్స్క్రేబర్ పై విజయాన్ని సాధించాడు. ఈ మ్యాచ్ లో వావ్రింకా ఏడు ఎస్ లు సంధించగా జర్మనీ ఆటగాడి నుంచి సమాధానమే లేకపోయింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్ లలో బాగ్ధటిస్ 7-5, 6-0 తేడాతో స్పెయిన్ కు చెందిన రోబెర్టో బాటిస్టాపై, ఆస్ట్రేలియా ఆటగాడు నిక్ కిర్గియోస్ 6-4, 6-4 తేడాతో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ థామస్ బెర్డిచ్ పై గెలుపొందారు. -
మియామి ఓపెన్ క్వార్టర్స్లో సానియా జంట
ఫ్లోరిడా (అమెరికా): మియామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో సానియా-హింగిస్ జంట 7-6 (8/6), 6-4తో గాబ్రియేలా దబ్రోవ్స్కీ (కెనడా)-అలీసియా రొసోల్స్కా (పోలండ్) ద్వయంపై విజయం సాధించింది. -
క్వార్టర్స్లో హారిక
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రపంచ మాజీ చాంపియన్ అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హారిక ‘టైబ్రేక్’లో 1.5.-0.5తో విజయం సాధించింది. నిర్ణీత రెండు గేమ్ల తర్వాత వీరిద్దరూ 1-1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించడానికి బుధవారం టైబ్రేక్ను నిర్వహించారు. టైబ్రేక్ తొలి గేమ్లో తెల్లపావులతో ఆడిన హారిక 55 ఎత్తుల్లో కొస్టెనిక్ను ఓడించగా... నల్లపావులతో ఆడిన రెండో గేమ్ను 91 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్ తొలి గేమ్లో మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కోనేరు హంపి; మేరీ అరాబిద్జె (జార్జియా)తో హారిక తలపడతారు. -
క్వార్టర్స్లో హంపి
సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. అలీసా గలియమోవా (రష్యా)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో హంపి 2-0తో గెలిచింది. మంగళవారం జరిగిన రెండో గేమ్ లో హంపి 53 ఎత్తుల్లో విజయం సాధించింది. ఈ టోర్నీలో హంపికిది వరుసగా ఆరో గెలుపు కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక మాత్రం ప్రిక్వార్టర్స్ రెండో గేమ్లో అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) చేతిలో 51 ఎత్తుల్లో ఓడిపోయింది. ఫలితంగా వీరిద్దరూ 1-1తో సమఉ జ్జీగా నిలిచారు. దాంతో ఈ ఇద్దరి మధ్య బుధవారం టైబ్రేక్ గేమ్లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
'బంగ్లాను ఓడించడం అంత సులువు కాదు'
ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా నేరుగా వచ్చిన రెండే రెండు జట్లలో ఒకటి మన టీమిండియా. అలాంటి జట్టు.. బంగ్లాదేశ్ లాంటి పసికూనను ఓడించడానికి ఆలోచించాలా? అసలు వాళ్లను ఓడించడం అంత సులభం కాదని అంటున్నారు.. అలనాటి దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్. బంగ్లాదేశ్ జట్టుకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని, మహ్మదుల్లా ఎలాంటి ఆటనైనా తీసుకెళ్లిపోతాడని, ముష్ఫికుర్ రహీం, షకీబ్ కూడా మేజిక్ చేయగలరని అన్నారు. వాళ్లు ముందు బ్యాటింగ్ చేసి, 250 పరుగుల వరకు చేస్తే.. తర్వాత వాళ్ల బౌలింగులో ఆ లక్ష్యాన్ని ఛేజ్ చేయడం భారత్కు అంత సులభం కాదని గవాస్కర్ చెప్పారు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మనోళ్లకు నిజమైన పరీక్ష ఎదురైందని, మనవాళ్లు గెలవాలనే ఆశిస్తున్నా.. అదయితే అందరూ అనుకుంటున్నంత సులభం కాదని చెప్పారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ కూడా చాలా పెద్దదని, అందువల్ల అక్కడ మరీ ఎక్కువగా సిక్సర్లు కొట్టే అవకాశం ఉండదని అన్నారు. వాతావరణం కాస్త మబ్బుగా ఉండి.. బాల్ తిరిగిందంటే.. బ్యాటింగ్ అంత సులభంగా ఉండదని సన్నీ చెప్పారు. ఇలాంటి పరిస్థితి భారత జట్టుకు కూడా అనువుగా ఉండొచ్చన్నారు. -
రంజీ క్వార్టర్స్లో ఆంధ్ర ఓటమి
75 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు లాహ్లి: బౌలర్లు రాణించినా... బ్యాట్స్మెన్ వైఫల్యంతో రంజీ ట్రోఫీలో సెమీఫైనల్కు చేరుకునే అరుదైన అవకాశాన్ని ఆంధ్ర జట్టు చేజార్చుకుంది. మహారాష్ట్ర నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బ్యాట్స్మెన్ చతికిలపడ్డారు. దీంతో మూడు రోజుల్లోనే ముగిసిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో మహారాష్ట్ర 75 పరుగుల తేడాతో ఆంధ్రపై విజయం సాధించి సెమీస్కు చేరింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బుధవారం మూడో రోజు బరిలోకి దిగిన ఆంధ్ర 46.3 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. ప్రదీప్ (80 బంతుల్లో 25; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రశాంత్ (18)తో సహా మిగతా వారు ఘోరంగా నిరాశపర్చారు. ఆంధ్ర 46 పరుగుల వ్యవధిలో చివరి ఏడు వికెట్లు చేజార్చుకోవడం గమనార్హం. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచా నాలుగు వికెట్లు తీశాడు. అంతకుముందు 172/6 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన మహారాష్ట్ర రెండో ఇన్నింగ్స్లో 68.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శివకుమార్ మరోసారి ఆరు వికెట్లు తీశాడు. -
రంజీట్రోఫీ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్
రోహతక్ : 2014-15 జాతీయ రంజీట్రోఫీ క్రికెట్ పోటీల్లో భాగంగా జరిగుతున్న మ్యాచ్ లో మహారాష్ట్ర మొదటి ఇన్నింగ్స్ లో91పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 138 పరుగులకు ఆలౌటైంది. ప్రశాంత్ 28, శ్రీరాం 31, ఏజి ప్రదీప్ 27 పరుగులు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో సంక్లేచ 45 పరుగులిచ్చి 4 వికెట్లు సాధించాడు. మరో బౌలర్ 45 పరుగులిచ్చి 3 వికెట్లు సాధించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 6 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. ఖండేలవాల 47 పరుగులు చేశాడు. కెఎం జాదవ్ 81బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆంధ్ర జట్టులో శివకుమార్ 54 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మరో బౌలర్ స్టీఫెన్ 31 పరుగులిచ్చి 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. -
గుజరాత్ చేతిలో ఓడినా...
క్వార్టర్ ఫైనల్కు చేరిన హైదరాబాద్ చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ముగిసిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో 72 పరుగుల తేడాతో హైదరాబాద్ పరాజయం పాలైంది. అయితే లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్లు (టీఎన్సీఏ సిటీ ఎలెవన్, ముంబైలపై) నెగ్గడంతో నాకౌట్ అవకాశం దక్కించుకుంది. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ ఎలెవన్తో హైదరాబాద్ తలపడుతుంది. వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గిన ఉత్సాహం మీదున్న హైదరాబాద్, గుజరాత్ ముందు తలవంచింది. 306 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్నైట్ స్కోరు 33/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన అక్షత్ బృందం 61.2 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. ఆశిష్ రెడ్డి (54), కొల్లా సుమంత్ (51) అర్ధ సెంచరీలు చేయగా, ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రాంజల్ సుతాలియా 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. చెన్నై: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం ముగిసిన మ్యాచ్లో గుజరాత్ చేతిలో 72 పరుగుల తేడాతో హైదరాబాద్ పరాజయం పాలైంది. అయితే లీగ్ దశలో తొలి రెండు మ్యాచ్లు (టీఎన్సీఏ సిటీ ఎలెవన్, ముంబైలపై) నెగ్గడంతో నాకౌట్ అవకాశం దక్కించుకుంది. ఆదివారం జరిగే క్వార్టర్ ఫైనల్లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ డిస్ట్రిక్ ఎలెవన్తో హైదరాబాద్ తలపడుతుంది. వరుసగా రెండు మ్యాచ్లు నెగ్గిన ఉత్సాహం మీదున్న హైదరాబాద్, గుజరాత్ ముందు తలవంచింది. 306 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో... ఓవర్నైట్ స్కోరు 33/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన అక్షత్ బృందం 61.2 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. ఆశిష్ రెడ్డి (54), కొల్లా సుమంత్ (51) అర్ధ సెంచరీలు చేయగా, ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో ప్రాంజల్ సుతాలియా 86 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. -
మహిళల డబుల్స్పైనే ఆశలు
స్క్వాష్లో భారత్కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే సింగిల్స్లో ఏ ఒక్కరూ పతకం గెలుచుకోలేకపోగా శుక్రవారం జరిగిన రెండు మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ లోనూ భారత జంటలు ఓటమిపాలయ్యాయి. తొలుత హరిందర్పాల్ సంధు-జోష్న చినప్ప జోడి క్వార్టర్స్లో 11-7, 8-11, 6-11తో న్యూజిలాండ్ జంట మార్టిన్ నైట్-జోలె కింగ్ చేతిలో ఓడింది. మరో మిక్స్డ్ క్వార్టర్స్లో సౌరవ్ ఘోషల్-దీపికా పల్లికల్ జోడి 6-11, 9-11తో ఆస్ట్రేలియా ద్వయం పాల్మెర్-గ్రిన్హామ్ చేతిలో ఓటమిపాలైంది. భారత్ ఆశలన్నీ ఇక మహిళల డబుల్స్పైనే ఉన్నాయి. -
సింగిల్స్తో గట్టెక్కుతాం
థామస్, ఉబెర్ కప్లలో క్వార్టర్స్కు చేరతాం జాతీయ కోచ్ గోపీచంద్ విశ్వాసం న్యూఢిల్లీ: సింగిల్స్ భారత్కు ప్రధాన బలమని, స్వదేశంలో జరగనున్న థామస్, ఉబెర్ కప్లలో భారత జట్లు కచ్చితంగా క్వార్టర్ ఫైనల్స్కు చేరుతాయని జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నాడు. ఢిల్లీలో ఈ నెల 18 నుంచి 25 వరకు జరగనున్న ఈ టోర్నీల్లో భాగంగా థామస్ కప్లో భారత్.. మలేసియా, దక్షిణ కొరియా, జర్మనీలతో తలపడనుంది. అయితే తాము సింగిల్స్లో బలంగా ఉన్నామని, దక్షిణ కొరియాపై మూడు సింగిల్స్లోనూ గెలుస్తామని, మలేసియాపై కనీసం రెండు సింగిల్స్, ఒక డబుల్స్ మ్యాచ్లో పైచేయి సాధిస్తామని గోపీచంద్ తెలిపాడు. లీ చోంగ్ వీ వంటి ఆటగాడితో పోటీని మినహాయిస్తే మిగిలిన మ్యాచ్లు తాము కచ్చితంగా గెలుస్తామన్నాడు. జర్మనీపై సింగిల్స్తోపాటు డబుల్స్లోనూ అన్ని మ్యాచ్ల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. ఇక ఉబెర్ కప్లో థాయ్లాండ్, కెనడా, హాంకాంగ్లున్న గ్రూపులో భారత మహిళల జట్టు ఆడనుంది. అయితే సింగిల్స్తోపాటు ఒక డబుల్స్ జంట కూడా గెలుస్తుందని గోపీచంద్ తెలిపాడు. సింగిల్స్లోనూ పి.సి.తులసి, అరుంధతిలలో ఒకరు విజయాలను అందించగలరన్నాడు. ఇక సొంతగడ్డపై ఆడనుండడం తమకు ఎంత అనుకూలమో, అంత ప్రతికూలమూ కాగలదని, అయినా అన్నింటినీ అధిగమిస్తామని అన్నాడు. రెండు టోర్నీల్లోనూ భారత్ క్వార్టర్స్కు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని గోపీచంద్ పేర్కొన్నాడు. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) షట్లర్లకు చక్కని ప్రాక్టీస్ వంటిదని, ఒత్తిడిని అధిగమించి గెలవడమెలాగో ఈ లీగ్ ద్వారా షట్లర్లు అలవాటు చేసుకున్నారని వివరించాడు. -
క్వార్టర్స్లో సానియా జోడి
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ మాడ్రిడ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాడ్రిడ్ ఓపెన్ టోర్నీ డబుల్స్లో క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ సానియా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి 6-4, 6-1 తేడాతో హావ్ చింగ్ చాన్ (చైనీస్ తైపీ)-చానెలే షీపర్స్ (చైనా) జంటపై వరుస సెట్లలో గెలుపొందింది. ఇటీవలే పోర్చుగల్ ఓపెన్ టైటిల్ గెలుచుకుని ఊపుమీదున్న సానియా ద్వయం తొలి సెట్లో ఒక దశలో 4-1తో దూసుకెళ్లింది. అయితే చాన్-షీపర్స్ జోడి పోరాట పటిమ కనబరిచి ఆధిక్యాన్ని 3-4కు తగ్గించింది. తిరిగి పట్టు సాధించిన సానియా-కారా ద్వయం తొలిసెట్లో నెగ్గడంతోపాటు రెండో సెట్ను అలవోకగా కైవసం చేసుకొని మ్యాచ్ను గెలుపొందింది. -
క్వార్టర్స్లో సింధు, గురుసాయిదత్
జ్వాల జోడి కూడా... కశ్యప్కు చుక్కెదురు ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గిమ్చియోన్ (కొరియా): భారత బ్యాడ్మింటన్ యువతార పి.వి.సింధు... ఆసియా చాంపియన్షిప్లో దూసుకెళ్తోంది. మహిళల సింగిల్స్లో క్వార్టర్ఫైనల్కు చేరుకుని సత్తా చాటింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో ప్రపంచ 10వ ర్యాంకర్ సింధు 14-21, 21-13, 21-18తో హిరోస్ ఎరికో (జపాన్)పై విజయం సాధించింది. గంటా 13 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ అమ్మాయి తొలి గేమ్లో ఓడినా... మిగతా రెండు గేమ్ల్లో స్థాయి మేరకు రాణించింది. క్వార్టర్స్లో ప్రపంచ 18వ ర్యాంకర్ బుసానన్ ఆంగ్బుమ్రాంగపన్ (థాయ్లాండ్)తో సింధు తలపడుతుంది. గతంలో ఈమెతో తలపడిన రెండుసార్లూ ఏపీ అమ్మాయి పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్లో చాలా కాలం తర్వాత ప్రపంచ 38వ ర్యాంకర్ ఆర్.ఎం.వి. గురుసాయిదత్ జోరు కనబర్చాడు. ప్రిక్వార్టర్స్లో అతను 17-21, 21-13, 21-19తో వాంగ్ జూ వీ (చైనీస్ తైపీ)పై నెగ్గి క్వార్టర్స్కు చేరుకున్నాడు. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్లో ఏపీ కుర్రాడు చాలా ఓపికగా ఆడాడు. తొలి గేమ్ ఓడిన తర్వాత రెండో గేమ్లోనూ 3-7తో వెనుకబడ్డాడు. కానీ నెట్ వద్ద భిన్నమైన ఆటతీరుతో అదరగొట్టాడు. సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ ప్రత్యర్థిని అలసిపోయేలా చేసి తర్వాత బలమైన స్ట్రోక్స్తో వరుసగా పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో పారుపల్లి కశ్యప్ 23-25, 17-21తో సు జెన్ హో (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడాడు. మహిళల డబుల్స్లో జ్వాల గుత్తా-అశ్విని పొనప్ప జోడి (భారత్) 21-11, 21-18తో డుంగానోంగ్-కుంచాల ఉర్విచెత్చైకుల్ (థాయ్లాండ్)పై గెలిచి క్వార్టర్స్కు అర్హత సాధించింది. -
క్వార్టర్స్లో గురుసాయిదత్
జొహర్ బారు (మలేసియా): ఆంధ్రప్రదేశ్ షట్లర్ గురుసాయిదత్ మలేసియా గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్లో ఆరోసీడ్ గురుసాయి 23-21, 21-9 తేడాతో ఇండోనేసియాకు చెందిన అన్సీడెడ్ ఆటగాడు విస్ను యులీ ప్రసెట్యోపై గెలుపొందాడు. అంతకుముందు జరిగిన రెండో రౌండ్లో గురు 21-18, 22-20 తేడాతో సెంగ్ జో యో (మలేసియా)ను ఓడించాడు. శుక్రవారం జరగనున్న క్వార్టర్స్లో గురుసాయిదత్కు రెండో సీడ్ వీ ఫెంగ్ చోంగ్ (మలేసియా) రూపంలో కఠిన పరీక్ష ఎదురు కానుంది. భారత్కు చెందిన మరో ఆటగాడు సౌరభ్ వర్మ కూడా క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాడు. రెండో రౌండ్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన చేతన్ ఆనంద్ను 21-14, 21-17తో ఓడించిన సౌరభ్ వర్మ.. ప్రి క్వార్టర్ ఫైనల్లో 21-15, 17-21, 21-19 తేడాతో కజుమస సకాయ్ (జపాన్)పై గెలుపొందాడు. ఇక ఏపీకి చెందిన మరో ఆటగాడు సాయిప్రణీత్ పోరాటం ప్రి క్వార్టర్స్తోనే ముగిసింది. రెండో రౌండ్లో మలేసియా ఆటగాడు నూర్ మహ్మద్ అయూబ్పై 18-21, 21-12, 21-10 తేడాతో నెగ్గిన సాయిప్రణీత్.. తరువాతి రౌండ్లో తమసిన్ సిట్టికాన్ చేతిలో 17-21, 14-21 తేడాతో ఓడిపోయాడు. హెచ్.ఎస్.ప్రణయ్ 9-21, 21-17, 18-21తో నన్ వీ (హాంకాంగ్) చేతిలో ప్రి క్వార్టర్స్లో ఓడగా, అనూప్ శ్రీధర్, ఆదిత్య ప్రకాష్లు రెండో రౌండ్లోనే వెనుదిరిగారు. అనూప్ 13-21, 11-21 తేడాతో కజుమస సకాయ్ చేతిలో ఓడగా, ఆదిత్యను సిమోన్ సాంటొసో (ఇండోనేసియా) 21-17, 21-10తో ఓడించాడు. డబుల్స్లో ఆల్విన్ ఫ్రాన్సిస్-అరుణ్ విష్ణు జోడి క్వార్టర్స్లో అడుగు పెట్టింది. ప్రి క్వార్టర్స్లో భారత జోడి 17-21, 21-19, 21-19 తేడాతో థాయ్లాండ్ జంట అంపున్సువాన్-పటిఫట్పై గెలుపొందింది. మహిళల సింగిల్స్లో పి.సి.తులసి ప్రి క్వార్టర్స్లో 21-2, 17-21, 21-18తో భారత్కే చెందిన తన్వీ లాడ్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. మిక్స్డ్ డబుల్స్లో సిక్కిరెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ 21-13, 17-21, 21-14తో పోహాన్యాంగ్-హంగ్యుచూన్ (చైనీస్ తైపీ) జంటను ఓడించి క్వార్టర్స్కు చేరింది. -
సెమీస్లో సాకేత్, విష్ణు
ఐటీఎఫ్ టోర్నమెంట్ భీమవరం, న్యూస్లైన్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-2 టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో టాప్ సీడ్ సాకేత్ 6-2, 6-3తో చంద్రిల్ సూద్ (భారత్)పై గెలుపొందగా, విష్ణువర్ధన్ 7-6(4), 6-4తో రెండో సీడ్ జీవన్ నెదున్చెజియాన్ (భారత్)పై అద్భుత విజయం సాధించాడు. ఇతర క్వార్టర్స్లో సనమ్ సింగ్ 6-1, 6-1తో భారత్కే చెందిన శశికుమార్ ముకుంద్పై నెగ్గగా, శ్రీరామ్ బాలాజీ 6-1, 6-4తో కో సుజుకి (జపాన్)ను ఓడించి సెమీస్కు చేరాడు. సెమీఫైనల్లో సాకేత్.. బాలాజీతో, విష్ణు.. సనమ్సింగ్తో తలపడనున్నారు. ఇక డబుల్స్లో సాకేత్-సనమ్ సింగ్ జోడి టైటిల్ కోసం బాలాజీ-రంజిత్ మురుగేశన్ జంటతో అమీ తుమీ తేల్చుకోనుంది. సెమీఫైనల్స్లో సాకేత్-సనమ్ ద్వయం 6-7(5), 6-2 (10-7)తో విష్ణువర్ధన్-నెదున్చెజియాన్ జోడిపై గెలుపొందింది. బాలాజీ-మురుగేశన్ జోడి 6-4, 6-3తో రామ్కుమార్ రామనాథన్ (భారత్)-గాబ్రియెల్ ట్రుజిలోసోలర్ (స్పెయిన్) జంటను ఓడించింది. -
సెమీస్లో ఆసీస్
దుబాయ్: అండర్ -19 ప్రపంచకప్లో వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్... ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 26.3 ఓవర్లలో 70 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలోనే ఎవరైనా.. ఆ జట్టు వంద పరుగులు చేస్తే చాలా గొప్ప అనే అనుకుంటారు. కానీ మిడిలార్డర్ బ్యాట్స్మన్ నికోలస్ పూరన్ (160 బంతుల్లో 143; 14 ఫోర్లు; 6 సిక్స్లు) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. చివరి వరుస ఆటగాళ్లను అండగా చేసుకుని సెంచరీ చేయడమే కాకుండా జట్టు స్కోరును ఏకంగా 49.5 ఓవర్లలో 208 పరుగులకు చేర్చాడు. మిగతా వారిలో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేయగా మొత్తం జట్టు పరుగుల్లో 69 శాతం తనే సాధించడం విశేషం. అయితే ఆ తర్వాత ఆసీస్ 46.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ఫలితంగా ఐదు వికెట్ల తేడాతో నెగ్గి సెమీఫైనల్కు చేరుకుంది. ఓపెనర్లు షార్ట్ (62 బంతుల్లో 52; 4 ఫోర్లు), జెరోన్ మోర్గాన్ (66 బంతుల్లో 55; 8 ఫోర్లు; 1 సిక్స్) రాణించారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ వెస్టిండీస్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో పూరన్ క్రీజులోకి వచ్చాడు. సహచరుల నుంచి ఎలాంటి తోడ్పాటు అందలేదు. ఫలితంగా మరో 38 పరుగులకు మరో నాలుగు వికెట్లు పడ్డాయి. కావాల్సినని ఓవర్లున్నా చేతిలో ఉన్నవి రెండే వికెట్లు. ఈ క్లిష్ట పరిస్థితిలో జోన్స్ (36 బంతుల్లో 20; 2 ఫోర్లు) పూరన్కు చక్కగా సహకరించాడు. పూరన్ చాలా తెలివిగా ఆడుతూ ప్రతీ ఓవర్లో స్ట్రయికింగ్ తనకే వచ్చేటట్లు చూసుకుంటూ పరుగులు సాధించుకుంటూ వెళ్లాడు. 49వ ఓవర్లో మూడు సిక్స్లు బాదాడు. చివరి ఓవర్లో జోన్స్ రనౌట్ కాగా మరో బంతి మిగిలుండగా పూరన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికే తొమ్మిదో వికెట్కు 136 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇది అండర్-19 ప్రపంచకప్లోనే రికార్డు భాగస్వామ్యం. దక్షిణాఫ్రికా కూడా సెమీస్కు మరో క్వార్టర్ ఫైనల్లో అఫ్ఘానిస్థాన్పై దక్షిణాఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన అఫ్ఘాన్ 49.5 ఓవర్లలో 197 పరుగులు చేసింది. ఆ తర్వాత సఫారీలు 39.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 198 పరుగులు చేసి నెగ్గారు. మర్క్రమ్ (105) సెంచరీ చేశాడు. -
క్వార్టర్ ఫైనల్స్లో వెస్టిండీస్, ఇంగ్లండ్
అండర్-19 ప్రపంచకప్ అబుదాబి: అండర్-19 ప్రపంచకప్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. మంగళవారం షేక్ జయేద్ స్టేడియం నర్సరీ 1లో జరిగిన మ్యాచ్లో విండీస్ 63 పరుగుల తేడాతో కెనడా జట్టును ఓడించింది. తేజ్నరైన్ చందర్పాల్ (127 బంతుల్లో 93; 5 ఫోర్లు; 1 సిక్స్) తన అద్భుత ఫామ్ కొనసాగించడంతో... ముందుగా బ్యాటింగ్కు దిగిన విండీస్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 289 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (41 బంతుల్లో 67 నాటౌట్; 3 ఫోర్లు; 4 సిక్స్లు), సొలోజనో (72 బంతుల్లో 50; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన కెనడా కుర్రాళ్లు 49.3 ఓవర్లలో 226 పరుగులకు ఆలౌట్ అయ్యారు. నిఖిల్ దత్తా (107 బంతుల్లో 62; 2 ఫోర్లు), నితీష్ కుమార్ (56 బంతుల్లో 50; 6 ఫోర్లు) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మరో మ్యాచ్లో ఇంగ్లండ్ జట్టు 115 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను మట్టికరిపించింది. హిగ్గిన్స్ (83; 5 ఫోర్లు; 2 సిక్స్లు) ఆటతీరుతో 50 ఓవర్లలో 8 వికెట్లకు 229 పరుగులు చేసిన ఇంగ్లండ్.. కివీస్ను 36.1 ఓవర్లలో 114కు ఆలౌట్ చేసింది. -
హోరాహోరీగా బ్యాడ్మింటన్ మ్యాచ్లు
కడప స్పోర్ట్స్, న్యూస్లైన్ : కడప నగరంలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఆలిండియా బ్యాడ్మింటన్ సబ్జూనియర్ ర్యాంకింగ్ పోటీల్లో మెయిన్డ్రాకు చేరుకున్న క్రీడాకారుల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. శనివారం నిర్వహించిన ప్రీ క్వార్టర్, క్యార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఉత్కంఠను లేపుతూ క్రీడాభిమానులకు కనువిందుచేస్తోంది. మొత్తం 64 మ్యాచ్లు నిర్వహించగా సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో 32 మంది క్రీడాకారులు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. కాగా కడప క్రీడాకారుడు దత్తాత్రేయరెడ్డి 3వ సీడెడ్ క్రీడాకారుడు ఆర్జిత్ చేతిలో ఓటమి చవిచూశాడు. గట్టిపోటీ ఇచ్చినప్పటికీ విజయం అందుకోలేకపోయాడు. కాగా పుల్లెల గోపీచంద్ కుమార్తె గాయత్రి గోపీచంద్ సింగిల్స్ విభాగంలో క్వార్ట్ర్ ఫైనల్లో 3వ ర్యాంకు క్రీడాకారిణి రిచాముక్తిబోధ్ చేతిలో ఓటమి చవిచూసిన్పటికీ డబుల్స్ విభాగంలో విజయం సాధించి సెమీఫైనల్కు చేరుకుంది. అంతర్జాతీయ క్రీడాకారుడు లక్ష్యసేన్ ఏపీకి చెందిన జగదీష్పై విజయం సాధించాడు. క్వార్టర్ ఫైనల్ విజేతల వివరాలు.. అండర్ 13 డబుల్స్ బాలికల విభాగం : ఆర్.ముక్తిబోధ్ (కర్నాటక), సిమ్రాన్సింగ్, (మహారాష్ట్ర) వి. జక్కా, పుల్లెల గాయత్రి గోపీచంద్ (ఏపీ), దీత్యాజగదీష్, మేధాశశిధరన్ (కర్నాటక), జోషిదివ్యాన్షి, షిఫెయిల్ గౌతం (ఉత్తరఖండ్). అండర్ 13 డబుల్స్ బాలుర విభాగం : ఎస్.మదీన (ఏపీ), ఎం.మైరభ (మణిపూర్), బి.రితిన్, మణిదీప్ (ఏపీ), ఎస్.కర్రిషణ్ముకఅంజన్, పి.రాజ్వత్, చయంతిజోష్(ఉత్తరఖండ్), వికాస్యాదవ్ (ఢిల్లీ). అండర్ 15 డబుల్స్ బాలికల విభాగం : అశ్వినిభట్, మిథుల (కర్నాటక), రియాఅరోల్కర్, పుర్వబార్వే (మహారాష్ట్ర), ఉన్నతిబిషాట్(ఉత్తరఖండ్), చిమ్రాన్కలిత(అస్సాం), షబానాబేగం, కె. ప్రీతి (ఏపీ). అండర్ 15 డబుల్స్ బాలుర విభాగం : కె. గుల్షన్కుమార్ (ఢిల్లీ), లక్ష్యసేన్ (ఉత్తరఖండ్), జశ్వంత్ (ఏపీ), ధరువ్కపిల (పంజాబ్), గౌస్షేక్, బషీర్ సయ్యద్ (ఏపీ), కృష్ణప్రసాద్, సాత్విక్సాయిరాజ్ (ఏపీ). అండర్ 13 సింగిల్స్ బాలికల విభాగం : సిమ్రాన్సింగ్ (మహారాష్ట్ర), రిచాముక్తబోధ్ (కర్నాటక), తనిష్కదేశ్పాండే (మహారాష్ట్ర), నిషితావర్మ (ఏపీ). అండర్ 13 సింగిల్స్ బాలుర విభాగం : మైశ్నమ్ మైరభ (మణిపూర్), వరుణ్దేవ్ (మహారాష్ట్ర), బి.రితిన్ (ఏపీ), సాయి కర్రి షణ్ముఖఅంజన్ (ఏపీ). అండర్ 15 సింగిల్స్ బాలికల విభాగం : పూజ దవ్లేకర్ (మహారాష్ట్ర), పూర్వాబార్వే (మహారాష్ర్ట), రియాఅరోల్కర్ (మహారాష్ట్ర), కె. అశ్వినిభట్ (కర్నాటక) అండర్ 15 సింగిల్స్ బాలుర విభాగం : కార్తికేయ గుల్షన్కుమార్ (ఢిల్లీ), లక్ష్యసేన్ (ఉత్తరఖండ్), ఆర్జిత్ చలిహ (అస్సాం), రాహుల్ భరద్వాజ్ (కర్నాటక). -
క్వార్టర్స్లో కార్తికేయ్
ఎల్బీ స్టేడియం, న్యూస్లైన్: ఆలిండియా సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో అండర్-15 బాలుర సింగిల్స్లో ఏపీ కుర్రాడు డి.జస్వం త్, టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) క్వార్టర్ ఫైనల్స్కు చేరారు. సాత్విక్ సాయిరాజ్(ఏపీ) ఓడిపోయాడు. శనివారం కడపలోని వైఎస్ఆర్ ఇండోర్ స్టేడియం లో జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సి.జస్వంత్ (ఏపీ) 10-21, 22-20, 21-10తో మైస్నమ్ మేరాబా (మణిపూర్)పై విజయం సాధించాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ కార్తికేయ్ (ఢిల్లీ) 21-16, 21-8తో ప్రాకార్ (మధ్యప్రదేశ్)పై గెలిచాడు. ఇతర మ్యాచ్ల్లో కిరణ్ (కేరళ) 12-21, 21-18, 21-17తో నాలుగో సీడ్ సాత్విక్ సాయిరాజ్(ఏపీ)పై, రాహుల్ 21-19, 21-11తో ఆకాశ్ యాదవ్ (ఢిల్లీ)పై, ఒరిజీత్ (అస్సాం) 21-16, 21-15తో శ్రీదత్తాత్రేయ రెడ్డి(ఏపీ)పై, ధృవ్ కపిలా (పంజాబ్) 17-21, 21-10, 21-14తో కె.ఆర్.కె.చరిత్ (ఏపీ)పై, లక్ష సేన్ (ఉత్తరాంచల్) 21-13, 21-12తో కె.జగదీష్ (ఏపీ)పై నెగ్గారు.