మహిళల డబుల్స్‌పైనే ఆశలు | Women hopes on doubles | Sakshi
Sakshi News home page

మహిళల డబుల్స్‌పైనే ఆశలు

Published Sat, Aug 2 2014 1:46 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

మహిళల డబుల్స్‌పైనే ఆశలు - Sakshi

మహిళల డబుల్స్‌పైనే ఆశలు

స్క్వాష్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇప్పటికే సింగిల్స్‌లో ఏ ఒక్కరూ పతకం గెలుచుకోలేకపోగా శుక్రవారం జరిగిన రెండు మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్‌ లోనూ భారత జంటలు ఓటమిపాలయ్యాయి.
 
 తొలుత హరిందర్‌పాల్ సంధు-జోష్న చినప్ప జోడి క్వార్టర్స్‌లో 11-7, 8-11, 6-11తో న్యూజిలాండ్ జంట మార్టిన్ నైట్-జోలె కింగ్ చేతిలో ఓడింది. మరో మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో సౌరవ్ ఘోషల్-దీపికా పల్లికల్ జోడి 6-11, 9-11తో ఆస్ట్రేలియా ద్వయం పాల్మెర్-గ్రిన్హామ్ చేతిలో ఓటమిపాలైంది. భారత్ ఆశలన్నీ ఇక మహిళల డబుల్స్‌పైనే ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement