-
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్.. క్రికెట్కు గుడ్బై చెప్పిన స్టార్ క్రికెటర్
న్యూజిలాండ్ విధ్వంంసకర ఓపెనర్ కోలిన్ మున్రో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మున్రో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్-2024 కివీస్ జట్టులో చోటు ఆశించిన మున్రోకు సెలక్టర్లు మొండి చేయి చూపించారు. ఈ క్రమంలో జట్టులో చోటు దక్కకపోవడంతోనే మున్రో అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. "అత్యున్నత స్ధాయిలో న్యూజిలాండ్ క్రికెట్కు ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. అన్ని ఫార్మాట్లలోనూ బ్లాక్ క్యాప్స్ జెర్సీని నేను ధరించాను. అది నేను నా జీవితంలో సాధించిన అతి పెద్ద విజయం. మళ్లీ న్యూజిలాండ్ తరపున ఆడేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూశాను. కానీ టీ20 వరల్డ్కప్లో జట్టులో నా పేరు లేదు. కాబట్టి క్రికెట్కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయం అని భావించానని మున్రో పేర్కొన్నట్లు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది.న్యూజిలాండ్ క్రికెట్లో మున్రోకు అంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంటర్ననేషనల్ క్రికెట్లో మున్రో కివీస్ తరపున 100కు పైగా మ్యాచ్లు ఆడాడు. 2014, 2016 టీ20 వరల్డ్కప్లలో న్యూజిలాండ్ జట్టులో మున్రో భాగమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మూడు పైగా సెంచరీలు చేసిన ఏడు మంది ఆటగాళ్లలో మున్రో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2012 లో అంతర్జాతీయ క్రికెటలో అడుగుపెట్టిన మున్రో. . తన కెరీర్లో 57 వన్డేలు, 65 టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. వన్డేల్లో 1271 పరుగులు, టీ20ల్లో 1724 పరుగులు చేశాడు. అదే విధంగా ఎకైక టెస్టులో 15 పరుగులు మాత్రమే చేశాడు. ఇక టీ20ల్లో 47 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు అతడి పేరిట ఉంది. 2018లో వెస్టిండీస్ పై ఈ ఘనత సాధించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న మున్రో.. ఫ్రాంచైజీ క్రికెట్లో మాత్రం కొనసాగననున్నాడు. -
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్, న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెల్ తన మంచి మనుసును చాటుకున్నాడు. ఐపీఎల్-2024లో ధర్మశాల వేదికగా మే5న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 28 పరుగుల తేడాతో సీఎస్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు మిచెల్ బౌండరీ లైన్ నెట్స్లో తీవ్రంగా శ్రమించాడు. మిచిల్ ఫుల్ షాట్ ఆడగా.. బంతి ప్రమాదశాత్తూ స్టాండ్స్లో ఉన్న అభిమానికి తాకింది. వెంటనే పక్క సీట్లో పడిపోయాడు. ఈ క్రమంలో అతడి చేతిలో ఉన్న ఐ ఫోన్ గ్లాస్ సైతం బ్రేక్ అయింది. అదృష్టవశాత్తూ ఆ అభిమానికి ఎటువంటి గాయం కాలేదు. కానీ అతడి ఫోన్ మాత్రం పాడైపోయింది. ఇది చూసిన మిచెల్ అతడికి క్షమపణలు తెలిపాడు. అంతేకాకుండా తర్వాత అతడికి వద్ద తన బ్యాటింగ్కు గ్లౌవ్స్ను మిచెల్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శెభాష్ మిచెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సీఎస్కే తమ తదుపరి మ్యాచ్లో అహ్మదాబాద్ వేదికగా మే 10న అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. A guy got hurt and broke his iPhone during practice!!!Daz gave him his Gloves as a reward!!!💛👊🏻⭐️😎 pic.twitter.com/NkfAGp8Zph— AnishCSK💛 (@TheAnishh) May 7, 2024 -
న్యూజిలాండ్ టీ20 వరల్డ్కప్ జట్టు ప్రకటన.. వినూత్న ప్రయోగం
యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా ఈ ఏడాది జూన్ 1 నుంచి జరుగబోయే టీ20 వరల్డ్కప్ 2024 కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 29) ప్రకటించారు. స్టార్లతో నిండిన ఈ జట్టుకు కేన్ విలియమ్సన్ సారథ్యం వహించనున్నాడు. గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో మ్యాట్ హెన్రీ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, లోకీ ఫెర్గూసన్లతో కలిసి హెన్రీ కొత్త బంతిని షేర్ చేసుకుంటాడు. బొటనవేలి గాయంతో బాధపడుతున్న డెవాన్ కాన్వేను సైతం న్యూజిలాండ్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ జట్టులో మరో వికెట్కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్కు స్థానం లభించినప్పటికీ.. వరల్డ్కప్లో కాన్వేనే కీపింగ్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వికెట్కీపర్ బ్యాటర్లైన టిమ్ సీఫర్ట్, టామ్ బ్లండెల్లకు వరల్డ్కప్ జట్టులో చోటు లభించలేదు. ఇటీవల పాక్తో సిరీస్ను (టీ20) డ్రా చేసుకున్న జట్టుకు సారధి అయిన మైఖేల్ బ్రేస్వెల్ కూడా వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. జిమ్మీ నీషమ్, డారిల్ మిచెల్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ల కోటాలో ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఐష్ సోధి, మిచెల్ సాంట్నార్.. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్ వ్యవహరించనున్నారు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్కప్లో మూడు శతకాలతో విజృంభించిన రచిన్ తొలిసారి టీ20 వరల్డ్కప్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా లూక్ రాంచీ, బౌలింగ్ కోచ్గా జేకబ్ ఓరమ్, అసిస్టెంట్ కోచ్గా జేమ్స్ ఫోస్టర్ వ్యవహరించనున్నారు. హెడ్ కోచ్గా గ్యారీ స్టెడ్ కొనసాగనున్నాడు. వరల్డ్కప్ కోసం న్యూజిలాండ్ జట్టు మే 23న బయల్దేరనుంది. జూన్ 7న న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ (ఆఫ్ఘనిస్తాన్) ఆడనుంది.న్యూజిలాండ్ టీ20 వరల్డ్కప్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, ఐష్ సోధీ [ట్రావెలింగ్ రిజర్వ్-బెన్ సియర్స్ ]Join special guests Matilda and Angus at the squad announcement for the upcoming @t20worldcup in the West Indies and USA. #T20WorldCup pic.twitter.com/6lZbAsFlD5— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 వరల్డ్కప్ జట్టును వినూత్నంగా ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్న్యూజిలాండ్ క్రికెట్ తమ టీ20 వరల్డ్కప్ జట్టును వినూత్నంగా ప్రకటించింది. సెలక్టర్లు, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రతినిథులు కాకుండా ఇద్దరు చిన్నారులు జట్టు సభ్యుల పేర్లను వెల్లడించారు. న్యూజిలాండ్ క్రికెట్ మటిల్డా, ఆంగస్ అనే ఇద్దరు చిన్నారులకు చీఫ్ గెస్ట్లుగా ఆహ్వానించింది. The team's kit for the 2024 @T20WorldCup 🏏Available at the NZC store from tomorrow. #T20WorldCup pic.twitter.com/T4Okjs2JIx— BLACKCAPS (@BLACKCAPS) April 29, 2024 న్యూజిలాండ్ క్రికెట్ చేసిన ఈ వినూత్న ప్రయోగం అందరినీ ఆకట్టుకుంది. వరల్డ్కప్ జట్టు ప్రకటన సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ తమ వరల్డ్కప్ జెర్సీని కూడా రివీల్ చేసింది. మెగా టోర్నీలో న్యూజిలాండ్ క్రికెటర్లు తాము రెగ్యులర్గా ధరించే బ్లాక్ కిట్ కాకుండా వేరే కలర్లో ఉండే కిట్లను ధరించనున్నారు. -
న్యూజిలాండ్ బ్యాటర్ భారీ విన్యాసం.. వైరల్ వీడియో
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య నిన్న (ఏప్రిల్ 27) జరిగిన టీ20 మ్యాచ్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ టిమ్ సిఫర్ట్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని ఆడేందుకు భారీ విన్యాసం చేశాడు. మొహమ్మద్ ఆమిర్ బౌలింగ్లో వైడ్గా వెళ్తున్న బంతిని ఆడేందుకు సీఫర్ట్ భారీ డైవ్ కొట్టాడు. సహజంగా ఇలాంటి విన్యాసాలను ఫీల్డింగ్ చేసేప్పుడు చూస్తాం. కానీ సీఫర్ట్ మాత్రం బ్యాటింగ్లో డైవింగ్ షాట్ ఆడే ప్రయత్నం చేసి హైలైటయ్యాడు. సీఫర్ట్ డైవిండ్ బ్యాటింగ్కు సంబంధించిన వీడియో నిన్నటి నుంచి నెట్టింట చక్కర్లు కొడుతుంది. Full stretch dive from Tim Seifert during the batting. 😂👌 pic.twitter.com/fV5n0Mh0y7— Tanuj Singh (@ImTanujSingh) April 27, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్లో పాక్ న్యూజిలాండ్ను 9 పరుగుల తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను 2-2తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్లో బాబర్ ఆజమ్ (69) అర్దసెంచరీతో రాణించగా.. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో డైవింగ్ షాట్ హీరో సీఫర్ట్ (52) మెరుపు అర్దశతకంతో ఆకట్టుకున్నాడు. కివీస్ ఇన్నింగ్స్లో సీఫర్ట్ మినహా ఎవరూ రాణించకపోవడంతో పర్యాటక జట్టుకు ఓటమి తప్పలేదు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో పాక్.. మూడు, నాలుగు మ్యాచ్ల్లో న్యూజిలాండ్.. నిన్న జరిగిన ఆఖరి మ్యాచ్లో పాక్ గెలుపొందాయి. -
PAK Vs NZ: పాక్, న్యూజిలాండ్ తొలి టీ20 వర్షార్పణం
పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య రావల్పిండి వేదికగా నిన్న (ఏప్రిల్ 18) జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండా రద్దైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తుండగా.. భారీ వర్షం మొదలైంది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షం ప్రారంభమయ్యే సమయానికి న్యూజిలాండ్ స్కోర్ 0.2 ఓవర్లలో 2/1గా ఉండింది. ఓపెనర్ టిమ్ రాబిన్సన్ (0) షాహీన్ అఫ్రిది బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. టిమ్ సీఫర్ట్, మార్క్ చాప్మన్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో కోసం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు పాక్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనకు న్యూజిలాండ్ ద్వితియ శ్రేణి జట్టుతో బయల్దేరింది. కివీస్ స్టార్లంతా ఐపీఎల్తో బిజీగా ఉండగా.. కొందరు గాయాల కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఇదే వేదికగా ఏప్రిల్ 20న జరుగనుంది. పాక్ కెప్టెన్సీ తిరిగి చేపట్టాక ఈ సిరీస్ బాబర్కు మొదటిది. -
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. సీజన్ మొత్తానికి దూరమైన స్టార్ ప్లేయర్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఓపెనర్, న్యూజిలాండ్ ఆటగాడు డెవాన్ కాన్వే సీజన్ మొత్తానికే దూరమయ్యాడు. గాయం కారణంగా సీజన్ తొలి ఆరు మ్యాచ్లకు దూరమైన కాన్వే.. ఇప్పుడు సీజన్ మొత్తానికే దూరం కావడం ఆ జట్టుపై పెను ప్రభావం పడనుంది. కాన్వే గత రెండు సీజన్లుగా సీఎస్కేలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. సీఎస్కే మరో టైటిల్ దిశగా అడుగులు వేసే క్రమంలో కాన్వే లాంటి ఆటగాడు అందుబాటు లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలను బాగా దెబ్బతీస్తుంది. కాన్వే సీజన్ మొత్తానికి దూరమైన విషయాన్ని సీఎస్కే యాజమాన్యం ఇవాళ (ఏప్రిల్ 18) అధికారికంగా ప్రకటించింది. కాన్వేకు ప్రత్యామ్నాయంగా ఇంగ్లండ్ వెటరన్ పేసర్ రిచర్డ్ గ్లీసన్ను ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించింది. గ్లీసన్ను సీఎస్కే కనీస ధర 50 లక్షలకు సొంతం చేసుకుంది. కాగా, సీఎస్కే ప్రస్తుత సీజన్లో 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది. కొత్త సారధి రుతురాజ్ సారధ్యంలో సీఎస్కే గత రెండు మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించింది. ఈ జట్టు రేపు (ఏప్రిల్ 19) జరుగబోయే తమ తదుపరి మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇంకా ఎనిమిది మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మరో నాలుగు మ్యాచ్లు గెలిస్తే సీఎస్కే ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకుంటుంది. Richard Gleeson - The new Super King🦁pic.twitter.com/ZPvNldEqLw — CricTracker (@Cricketracker) April 18, 2024 Welcome To CSK, RICHARD GLEESON 🦁💛 Dismissed Rohit Sharma, Virat Kohli and Rishabh Pant within his first eight balls on debut. 🔥pic.twitter.com/rF7FAnSskk — 🜲 (@balltamperrer) April 18, 2024 -
నేడు పాక్, కివీస్ తొలి టి20
రావల్పిండి: టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్ జట్టు తో పాకిస్తాన్ ఐదు టి20 మ్యాచ్ల సిరీస్ లో పోటీపడేందుకు సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్లో బ్రేస్వెల్ నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టుతో బాబర్ ఆజమ్ సారంథ్యంలోని పాకిస్తాన్ జట్టు తలపడు తుంది. తొలి మూడు మ్యాచ్లు రావల్పిండిలో, చివరి రెండు మ్యాచ్లు లాహోర్లో జరుగుతాయి. రాత్రి గం. 7:30 నుంచి మొదలయ్యే ఈ మ్యాచ్లను ఫ్యాన్కోడ్ యాప్లో తిలకించవచ్చు. -
విదేశాల్లో ఓలా క్యాబ్స్ షట్డౌన్.. కారణం ఏంటంటే?
ప్రముఖ దేశీయ రైడ్ షేరింగ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్లలో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ చివరి నాటికి అంతర్జాతీయ ఓలా క్యాబ్స్ సేవలకు స్వస్తి పలకనుంది. ఓలా క్యాబ్స్ ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తన అంతర్జాతీయ యూజర్లకు నోటిఫికేషన్ పంపింది. సంస్థ 2018లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో తన సేవల్ని ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్కు ఓలా గుడ్బై కాగా, తమ దేశంలో ఓలా సేవలను మూసివేయడంపై ఆస్ట్రేలియన్ మీడియా గతంలోనే అనేక కథనాలు ప్రచురించింది. మీడియా సంస్థ ఆస్ట్రేలియన్ ఫైనాన్షియల్ రివ్యూ డ్రైవర్లకు ఓలా పంపిన ఇమెయిల్ను ఉదహరించింది. ఏప్రిల్ 12 నుండి అన్ని సంబంధిత లేబుల్లను తీసివేయమని, దాని పర్మిట్ల కింద బుకింగ్లు తీసుకోవడం ఆపివేయమని కోరింది. అదే తేదీ నుండి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు కస్టమర్లకు పంపిన ఇమెయిల్ను న్యూస్.కామ్.ఏయూ అనే మీడియా సంస్థ హైలెట్ చేసింది. కారణం ఇదేనా క్యాబ్ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాబ్స్ను ఈవీలుగా మార్చాలంటే ఖర్చుతో కూడుకున్న పని. పెట్టుబడి కూడా భారీ మొత్తంలో పెట్టాలి. పైగా న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో ఓలా క్యాబ్స్ ఈ నిర్ణయం తీసుకుంది.భారత్లో విస్తరణకు మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓలా ప్రతినిధులు చెబుతున్నారు. -
న్యూజిలాండ్ వీసా నిబంధనలు కఠినతరం
వెల్లింగ్టన్: వలసలను నియంత్రించేందుకు వీసా నిబంధనలను న్యూజిలాండ్ కఠినతరం చేసింది. ఇకపై తక్కువ నైపుణ్యమున్న పనివారు కూడా ఇంగ్లిష్పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి ఐదేళ్ల నివాస పరిమితిని మూడేళ్లకు తగ్గించింది. వీసాదారులకు నైపుణ్యం, అనుభవాలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. వెల్డర్లు, ఫిట్టర్లు, టర్నర్లు తదితర 11 కేటగిరీల వారిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. అవసరమైతే వీసా నిబంధనలను మరింత కఠినం చేయెచ్చని కూడా సంకేతాలిచ్చింది. -
ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు
వెల్లింగ్టన్ : మీరు ఆ దేశానికి వెళ్లేందుకు, అక్కడ పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారా? ఇందుకోసం వీసాకి అప్లయి చేస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని విసా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, చదువు అనేది సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశం అనేది ఓ కల. అందుకే దేశీయంగా ఆదరణ, అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్స్లు చదివి విదేశాలకు క్యూకడుతుంటారు. దీనికి తోడు ఆయా దేశాల అభివృద్దిలో భాగం చేసేందుకు వీసా మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో న్యూజిలాండ్ ఎంప్లాయింటెంట్ వీసా ప్రోగ్రాంలో భారీగా మార్పులు చేసింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో విదేశీయులు తమ దేశానికి వలదారులు భారీ ఎత్తున క్యూ కట్టారని, దీంతో విసాలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో పనిచేసే వారికి న్యూజిలాండ్లో వసతి ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. న్యూజిలాండ్ వీసాలో చేసిన కీలక మార్పులు తక్కువ నైపుణ్యం కలిగిన లెవల్ 4, లెవల్ 5 కోసం ఉద్యోగాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతున్న వలసదారులకు ఇంగ్లీష్ తప్పని సరి చేసింది. కనీస నైపుణ్యాలు వర్క్ ఎక్స్పీరియన్స్లో మార్పులు లెవల్ 4, లెవల్ 5 వంటి లో స్కిల్డ్ ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఆయా సంస్థలు సంబంధిత విభాగాల ఉద్యోగులకు వీసా ఇచ్చే విషయంలో వారి జీతాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. లెవల్ 4, లెవల్ 5 ఉద్యోగులకు న్యూజిలాండ్లో నివసించే కాలవ్యవధిని 5 నుంచి 3ఏళ్లకు తగ్గించింది. ఫ్రాంఛైజీ అక్రిడిటేషన్ను రద్దు చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు ప్రామాణిక, హైవ్యాల్యూమ్ ఉపాధి అక్రిడిటేషన్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్లో నైపుణ్యం కొరత ఉన్న సెకండరీ టీచర్ల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం,నిలుపుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ వాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలి అని ఆమె అన్నారు. కాగా, గత సంవత్సరం, దాదాపు 173,000 మంది న్యూజిలాండ్కు వలస వెళ్ళారు. సుమారు 5.1 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్కు కోవిడ్ తగ్గుముఖం పెట్టిన తర్వాత విదేశీయుల తాకిడి ఎక్కువైంది. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా వలసదారులు పెరిగారు. దీంతో రాబోయే రెండేళ్లలలో వలసదారుల్ని తగ్గించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
IPL 2024: ఐపీఎల్పై అవాక్కులు చవాక్కులు పేలిన పాక్ మాజీ ఆటగాడు
భారత క్రికెట్పై, క్రికెటర్లపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్తాన్ క్రికెటర్లకు పరిపాటిగా మారింది. సందర్భం ఏదైనా సరే పాక్ ప్రస్తుత, మాజీలు భారత క్రికెట్పై నోరుపారేసుకుంటుంటారు. తాజాగా ఓ పాక్ మాజీ భారత క్రికెట్లో అంతర్బాగమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్పై అవాక్కులు చవాక్కులు పేలాడు. 34 ఏళ్ల పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ జునైద్ ఖాన్ ఐపీఎల్ను, ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ఓర్వలేని కామెంట్లు చేశాడు. ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ ఓపెనర్ సునీల్ నరైన్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ను జునైద్ చులకన చేసే ప్రయత్నం చేశాడు. In IPL batting is so easy on these flat pitches, Sunil Narine has scored a total of 155 in his international T20 career and today he has scored 85 as an opener. The team total is 272.#KKRvsDC #IPL2024 — Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024 ఐపీఎల్లో (భారత్లో) ఫ్లాట్ పిచ్లపై బ్యాటింగ్ చేయడం చాలా సులువని.. అంతర్జాతీయ కెరీర్ (టీ20ల్లో) మొత్తంలో 155 పరుగులు చేసిన నరైన్ ఒక్క ఇన్నింగ్స్లోనే 85 పరుగులు చేయడమే ఇందుకు నిదర్శనమని ట్విటర్ వేదికగా అర్దంపర్దం లేని కామెంట్లు చేశాడు. It's sad to see leagues are being prioritised over the team that gave them all the respect. 11/12 senior players are not available for an international series.#PAKvNZ #pakistan https://t.co/MlPrSycxNb — Junaid khan (@JunaidkhanREAL) April 3, 2024 జునైద్ ఈ ట్వీట్ చేయకముందు న్యూజిలాండ్ క్రికటర్లను సైతం అవమానిస్తూ ఓ ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్ క్రికెటర్లకు జాతీయ జట్టు ప్రయోజనాల కంటే ఐపీఎలే ముఖ్యమైందని కామెంట్ చేశాడు. కివీస్ సీనియర్లు జాతీయ జట్టుకు అందుబాటులో ఉండకుండా ఐపీఎల్ ఆడేందుకు చెక్కేశారని అన్నాడు. జునైద్ చేసిన ఈ కామెంట్స్పై భారత క్రికెట్ అభిమానులు స్పందించేందకు సైతం ఇష్టపడటం లేదు. పాక్ క్రికెటర్లకు భారత క్రికెట్ను ఆడిపోసుకోకపోతే నిద్ర పట్టదు, తిండి సహించదని చురకలంటిచి వదిలేస్తున్నారు. కాగా, పాకిస్తాన్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును నిన్న ప్రకటించారు. ఐపీఎల్ కారణంగా ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్ ఆటగాళ్లు పాక్ సిరీస్లో పాల్గొనడం లేదు. ఈ కారణంగానే జునైద్ ఐపీఎల్పై అవాక్కులు చవాక్కులు పేలాడు. పాక్ క్రికెటర్లకు ఐపీఎల్లో ప్రవేశం లేదన్న విషయం తెలిసిందే. 34 ఏళ్ల జునైద్ 2011-19 మధ్యలో పాక్ తరఫున 22 టెస్ట్లు, 76 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. ఇందులో అతను 189 వికెట్లు పడగొట్టాడు. -
పాకిస్తాన్తో టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఏప్రిల్ 18-27 మధ్యలో పాకిస్తాన్తో జరుగబోయే ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 3) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ 15 మంది సభ్యుల బృందాన్ని పాకిస్తాన్కు పంపనుంది. ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచ్ సాంట్నర్,కేన్ విలియమ్సన్ లాంటి సీనియర్లు ఐపీఎల్తో బిజీగా ఉండటంతో న్యూజిలాండ్ సెలెక్టర్లు ద్వితియ శ్రేణి జట్టును పాక్కు పంపనున్నారు. ఈ జట్టుకు మైఖేల్ బ్రేస్వెల్ సారధ్యం వహించనున్నాడు. ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, ఐష్ సోధి లాంటి గుర్తింపు పొందిన ఆటగాళ్లు మినహా మిగతావన్నీ కొత్త ముఖాలే. టీ20 వరల్డ్కప్కు ముందు న్యూజిలాండ్ ఆటగాళ్లకు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కని వారికి ఈ సిరీస్ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ సిరీస్లో రాణిస్తే వరల్డ్కప్ జట్టులో చోటు దక్కే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్లోని తొలి మూడు మ్యాచ్లు రావల్పిండిలో జరుగనుండగా.. ఆఖరి రెండు లాహోర్లో జరుగనున్నాయి. పాకిస్తాన్తో ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మైఖేల్ బ్రేస్వెల్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, బెన్ లిస్టర్, కోల్ మెక్కాన్చీ, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, విల్ ఓ'రూర్క్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, టిమ్ సీఫెర్ట్ (వికెట్కీపర్), ఐష్ సోధి షెడ్యూల్.. తొలి టీ20: ఏప్రిల్ 18 (రావల్పిండి) రెండో టీ20: ఏప్రిల్ 20 (రావల్పిండి) మూడో టీ20: ఏప్రిల్ 21 (రావల్పిండి) నాలుగో టీ20: ఏప్రిల్ 25 (లాహోర్) ఐదో టీ20: ఏప్రిల్ 27 (లాహోర్) -
లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో మాథ్యూ హెన్రీ
న్యూజిలాండ్ పేస్ బౌలర్ మాథ్యూ హెన్రీకి ఐపీఎల్లో ఆడే అవకాశం లభించింది. గత ఏడాది జరిగిన వేలంలో హెన్రీని ఏ జట్టూ తీసుకోలేదు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ జట్టు సభ్యుడు, ఇంగ్లండ్ పేస్ బౌలర్ డేవిడ్ విల్లే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు. దాంతో లక్నో ఫ్రాంచైజీ విల్లే స్థానంలో హెన్రీని అతని కనీస ధర రూ. 1 కోటీ 25 లక్షలకు తీసుకుంది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న 32 ఏళ్ల హెన్రీ న్యూజిలాండ్ తరఫున 25 టెస్టులు, 82 వన్డేలు, 17 టి20లు ఆడి 256 వికెట్లు పడగొట్టాడు. -
సొంత దేశాన్ని వీడి యూఎస్ఏకు ఆడనున్న ఫాస్టెస్ట్ సెంచరీ హీరో
వన్డేల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ (36 బంతుల్లో) సెంచరీ వీరుడు, న్యూజిలాండ్ మాజీ ఆల్రౌండర్ కోరె ఆండర్సన్ సొంత దేశాన్ని వీడి అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న యూఎస్ఏకు ఆడేందుకు సిద్దమయ్యాడు. త్వరలో కెనడాతో జరుగబోయే 5 మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం యూఎస్ఏ సెలెక్టర్లు ఆండర్సన్ ఎంపిక చేశారు. 2018 నవంబర్లో చివరిసారిగా న్యూజిలాండ్కు ప్రాతినిథ్యం వహించిన ఆండర్సన్.. వ్యక్తిగత కారణాల చేత 2020లో యూఎస్ఏకు షిఫ్ట్ అయ్యాడు. అప్పటి నుంచి అక్కడే దేశవాలీ క్రికెట్ (మైనర్ లీగ్ క్రికెట్) ఆడుతూ ఐదేళ్ల నిరీక్షణ అనంతరం జాతీయ జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. లోకల్ కేటగిరీలో మేజర్ లీగ్ క్రికెట్ ఆడే అవకాశం దక్కించుకున్న ఆండర్సన్.. ముంబై ఇండియన్స్ న్యూయార్క్ తరఫున మెరుగైన ప్రదర్శనలు చేశాడు. కెనడా సిరీస్ కోసం ఆండర్సన్తో పాటు మరికొందరు నాన్ ఆటగాళ్లు కూడా ఎంపికయ్యారు. భారత అండర్-19 ఫేమ్ హర్మీత్ సింగ్ యూఎస్ఏ దేశవాలీ టోర్నీలతో పాటు మేజర్ లీగ్ క్రికెట్లో సియాటిల్ ఆర్కాస్ తరఫున రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. హర్మీత్తో పాటు మరో భారత క్రికెటర్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఢిల్లీ మాజీ ఆటగాడు, ఐపీఎల్లో ఆర్సీబీ ప్లేయర్ మిలింద్ కుమార్ అక్కడి దేశవాలీ క్రికెట్లో సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వీరితో పాటు కెనడా జాతీయ జట్టు మాజీ కెప్టెన్, భారత మూలాలున్న నితీశ్ కుమార్ కూడా యూఎస్ఏ జట్టుకు ఎంపికైన వారిలో ఉన్నారు. తాజాగా ప్రకటించిన యూఎస్ఏ జట్టులో భారత అండర్-19 మాజీ క్రికెటర్, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ బ్యాటర్ ఉన్ముక్త్ చంద్కు చోటు దక్కలేదు. ఉన్ముక్త్కు నితీశ్ కుమార్ నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అంతిమంగా సెలెక్టరు నితీశ్పైపే మొగ్గు చూపారు. కెనడా సిరీస్ కోసం ఎంపిక చేసిన యూఎస్ఏ జట్టు: మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), కోరె అండర్సన్, గజానంద్ సింగ్, జెస్సీ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, నిసర్గ్ పటేల్, స్టీవెన్ టేలర్, ఆండ్రీస్ గౌస్, హర్మీత్ సింగ్, షాడ్లీ వాన్ షాల్క్విక్, నోస్తుష్ కెంజిగే, మిలింద్ కుమార్, నితీష్ కుమార్, ఉస్మాన్ రఫిక్ -
CSK Vs GT: రచిన్ రవీంద్ర విధ్వంసం.. కేవలం 20 బంతుల్లోనే! వీడియో వైరల్
కివీస్ యవ సంచలనం, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రచిన్ రవీంద్ర తన ఐపీఎల్ అరంగేట్ర సీజన్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్-2024లో భాగంగా ఆర్సీబీతో జరిగిన తొలి మ్యాచ్లో అదరగొట్టిన రవీంద్ర.. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ సత్తాచాటాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లను రవీంద్ర ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే రవీంద్ర బౌండరీల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో 20 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర.. 6 ఫోర్లు, 3 సిక్స్లతో 46 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు సీఎస్కేకు మరో సూపర్ స్టార్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024 మినీ వేలంలో రచిన్ రవీంద్రను రూ. 1.80 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో చెన్నై బ్యాటర్లు విధ్వంసం సష్టించారు. రచిన్ రవీంద్ర(20 బంతుల్లో 46, 6 ఫోర్లు, 3 సిక్స్లు), రుతురాజ్ గైక్వాడ్ (20 బంతుల్లో 46, 5 ఫోర్లు, 1సిక్స్లు), శివమ్ దూబే(23 బంతుల్లో 51, 2 ఫోర్లు, 5 సిక్స్లు) చెలరేగారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా.. సాయి కిషోర్, జాన్సన్, మొహిత్ శర్మ తలా వికెట్ పడగొట్టారు. Rachin Ravindra is a superstar!!! ⭐pic.twitter.com/FUYcUekI9Y — Mufaddal Vohra (@mufaddal_vohra) March 26, 2024 -
పాకిస్తాన్ హెడ్ కోచ్గా న్యూజిలాండ్ దిగ్గజం.. !?
పాకిస్తాన్ పురుషల క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రోంచి బాధ్యతలు చేపటనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. రోంచి కూడా పీసీబీ ఆఫర్పై ఆసక్తిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోంచి ప్రస్తుతం న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్గా పనిచేస్తున్నాడు. ఒకవేళ పీసీబీ ఆఫర్ను అతడు అంగీకరిస్తే న్యూజిలాండ్ అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి తప్పుకోనున్నాడు. కాగా వన్డే ప్రపంచకప్ 2023లో లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. బాబర్ ఆజం పాకిస్తాన్ కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. హెడ్ కోచ్ మిక్కీ ఆర్థర్ సైతం తన పదవికి రాజీనామా చేశాడు. ఈ క్రమంలో గత డిసెంబర్, జనవరిలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల కోసం మహమ్మద్ హఫీజ్ తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించాడు. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో పాకిస్తాన్ జట్టు స్వదేశంలో న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. ఈ సిరీస్కు ముందు తమ జట్టు హెడ్కోచ్ పదవిని భర్తీ చేసే పనిలో పీసీబీ పడింది. ఇప్పటికే ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్, విండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామిని హెడ్కోచ్ పదవి కోసం పీసీబీ సంప్రదించింది. కానీ పీసీబీ ఆఫర్ను వారిద్దరూ రిజక్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ల్యూక్ రోంచితో పీసీబీ చర్చలు జరపుతోంది. Luke Ronchi in talks with PCB for Pakistan's head coach position.#PakistanCricket pic.twitter.com/nelmZvVm2b — Nawaz 🇵🇰🇦🇪 (@Rab_Nawaz31888) March 26, 2024 -
ఒక్కొక్కరూ, రెండు సీట్లు కొనుక్కోండి : ఎయిర్లైన్ సిబ్బంది అమానుషం
బరువుఎక్కువగా ఉన్నారనే కారణంతో ఇద్దరు మహిళల్ని విమానం నుంచి దించేసిన అమానుష ఘటన న్యూజిలాండ్లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీ అంతర్జీతీయ మహిళా దినోత్సవం రోజు ఈ పరిణామం జరగడం గమనార్హం. అయితే ఈ వివాదంపై స్పందించిన ఎయిర్ న్యూజిలాండ్ ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెప్పింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి: ఏంజెల్ హార్డింగ్ మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి నేపియర్ నుండి ఆక్లాండ్ ఇంటికి ప్రయాణిస్తుండగా ఈ షాకింగ్ పరిణామం ఎదురైంది. విమానం ఎక్కి, విమానం రన్వేపైకి చేరుకుందో లేదో అటెండెంట్ వచ్చి సీట్ ఆర్మ్రెస్ట్ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఎందుకని ప్రశ్నిస్తే అది సరిగ్గా ఫిట్ అయ్యేంతవరకు విమానం టేకాఫ్ చేయబోనని పైలట్ చెప్పినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన పట్ల అటెండెంట్ చాలా దురుసుగా వ్యవహరించిందని ఏంజెల్ హార్డింగ్ ఆవేదన వ్యక్తంచేశారు. అంతేకాదు సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించారట. దీంతో ఈ వివాదం మరింత ముదిరి విమానాన్ని బోర్డింగ్ ప్రదేశానికి తీసుకొచ్చారు. మరోవైపు తమకు ఇబ్బంది కలుగుతోంది అంటూ మిగిలిన ప్రయాణీకులు ఒత్తిడి తేవడంతో బాధిత మహిళల్ని దిగిపోవాలని సిబ్బంది కోరారు. అయితే ఇలా ఎందుకు బాధిత మహిళలు గట్టిగా నిలదీశారు. ఇక్కడ సిబ్బంది సమాధానంతో వారు షాకయ్యారు. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్ చేసుకోవాలంటూ వ్యంగ్యంగా మాట్లాడటంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇలాంటి అవమానకర పరిస్థితి మనమందరం మనుషులం,మరెవ్వరికీ తన లాంటి అవమానం ఎదురుకాకూడదంటూ విమానయాన సంస్థకు ఫిర్యాదు చేశారు. దీన్ని విచారించిన సంస్థ బాధితులకు క్షమాపణలు చెప్పింది. వారి విమాన ప్రయాణ బిల్లును చెల్లించి, వారి ఖర్చు లన్నింటినీ భరించింది. అలాగే ప్రయాణికులతో హుందాగా నడుచుకునేలా చూస్తామని ఎయిర్లైన్ ప్రతినిధి హామీ ఇచ్చారు. అయితే ఈ అవమానానికి తగిన పరిహారం చెల్లించాల్సిందే అంటూ హార్డింగ్ స్నేహితుడు పట్టుపడుతున్నాడు. -
సత్తా చాటిన హీథర్ నైట్.. న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు.. సిరీస్లో భాగంగా ఇవాళ (మార్చి 19) జరిగిన తొలి మ్యాచ్లో స్థానిక మహిళా టీమ్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. సత్తా చాటిన హీథర్ నైట్.. హీథర్ నైట్ మెరుపు అర్దశతకంతో (39 బంతుల్లో 63; 8 ఫోర్లు,సిక్స్) సత్తా చాటడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. నైట్కు జతగా మైయా బౌచియర్ (43 నాటౌట్), డంక్లీ (32) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్, ఫ్రాన్ జోనాస్, లియా తుహుహు తలో వికెట్ పడగొట్టారు. తడబడిన న్యూజిలాండ్.. ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. వేగంగా పరుగులు సాధించలేక లక్ష్యానికి 28 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుజీ బేట్స్ (65) అర్దశతకంతో రాణించినప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన వారు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. బ్రూక్ హల్లీడే 27 నాటౌట్, జార్జియా ప్లిమ్మర్ 21 పరుగులు చేయగా.. మ్యాడీ గ్రీన్ 8, జెస్ కెర్ 8 నాటౌట్, ఇసబెల్లా గేజ్, మికేలా గ్రేగ్ డకౌట్లయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో లారెన్ బెల్ 2 వికెట్లు పడగొట్టగా.. సారా గ్లెన్ ఓ వికెట్ దక్కించుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టీ20 మార్చి 22న జరుగనుంది. -
రచిన్ రవీంద్రకు అరుదైన అవార్డు.. తొలి క్రికెటర్గా
ప్రపంచ క్రికెట్లో ఇటీవల సంచలన ప్రదర్శనతో దూసుకొచ్చిన న్యూజిలాండ్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ఆ దేశపు బోర్డు నుంచి సముచిత గుర్తింపు దక్కింది. కివీస్ వార్షిక అవార్డుల్లో రచిన్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచి ప్రతిష్టాత్మక ‘సర్ రిచర్డ్ హ్యడ్లీ’ పురస్కారాన్ని అందుకున్నాడు. అటు టెస్టు, ఇటు పరిమిత ఓవర్ల క్రికెట్లో గత ఏడాది కాలంలో 24 ఏళ్ల రచిన్ సంచలన ప్రదర్శన కనబర్చాడు. వన్డే వరల్డ్కప్లో 3 సెంచరీలు సహా 578 పరుగులు సాధించిన రచిన్... ఇటీవల దక్షిణాఫ్రికాపై టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు. అతి పిన్న వయసులో ‘హ్యాడ్లీ అవార్డు’ గెలుచుకున్న ప్లేయర్గా రచిన్ నిలిచాడు. న్యూజిలాండ్ ’టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కేన్ విలియమ్సన్కు దక్కింది. -
NZ vs AUS 2nd Test: ఆసీస్ అద్భుతం
క్రైస్ట్చర్చ్: న్యూజిలాండ్ పర్యటనలో రెండు టెస్టుల సిరీస్ను ఆ్రస్టేలియా 2–0తో క్లీన్స్వీప్ చేసింది. అలెక్స్ క్యారీ (98 నాటౌట్; 15 ఫోర్లు), మిచెల్ మార్ష్ (80; 10 ఫోర్లు, 1 సిక్స్) అసాధారణ పోరాటంతో రెండో టెస్టులో ఆసీస్ 3 వికెట్ల తేడాతో కివీస్పై గెలిచింది. 279 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 77/4 ఓవర్నైట్ స్కోరుతో నాలుగోరోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన ఆసీస్ 80 పరుగులకే ఐదో వికెట్ కోల్పోయింది. దీంతో ఆసీస్ కు పరాజయం ఖాయమనిపించింది. కానీ మార్ష్ , క్యారీ ఆరో వికెట్కు 140 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది. 220 స్కోరు వద్ద మార్ష్ ని్రష్కమించినా, స్టార్క్ (0) డకౌటైనా... కెపె్టన్ కమిన్స్ (32 నాటౌట్; 4 ఫోర్లు), క్యారీ అబేధ్యమైన ఎనిమిదో వికెట్కు 61 పరుగులు జోడించి ఆసీస్ను గెలిపించారు. 2005 నుంచి కివీస్ గడ్డపై ఆ్రస్టేలియా వరుసగా ఏడు టెస్టుల్లో గెలిచింది. టెస్టు క్రికెట్ చరిత్రలో సంయుక్తంగా ఇది రెండో అత్యుత్తమ వరుస విజయాల ఘనత. సఫారీ గడ్డపై ఇంగ్లండ్ (1889 నుంచి 1999 వరకు) 8 వరుస టెస్టుల్లో గెలిచింది. జింబాబ్వేపై కివీస్ (2000 నుంచి ఇప్పటివరకు) వరుసగా 7 టెస్టులు గెలిచింది. -
న్యూజిలాండ్పై సూపర్ విక్టరీ.. రెండో స్థానానికి ఎగబాకిన ఆస్ట్రేలియా
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో పర్యాటక ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా రెండు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. డబ్యూటీసీలో ప్రస్తుతం ఆసీస్ విజయాల శాతం 62.51గా ఉంది. ప్రస్తుత డబ్యూటీసీ సైకిల్లో ఆసీస్ 12 మ్యాచ్ల్లో 8 విజయాలతో 90 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆసీస్ చేతిలో ఓడిన న్యూజిలాండ్ రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దిగజారింది. ఆ జట్టు ప్రస్తుత డబ్లూటీసీ సైకిల్లో 50 శాతం విజయాలతో 36 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఐదో టెస్ట్లో ఇంగ్లండ్పై విజయంతో టీమిండియా తమ విజయాల శాతాన్ని మరింత మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్లో కొనసాగుతుంది. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత బంగ్లాదేశ్ (50 శాతం విజయాలు), పాకిస్తాన్ (36.66), వెస్టిండీస్ (33.33), సౌతాఫ్రికా (25), ఇంగ్లండ్ (17.5) వరుస స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే, మిచెల్ మార్ష్ (80), అలెక్స్ క్యారీ (98 నాటౌట్), పాట్ కమిన్స్ (32 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్లు ఆడటంతో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ను 3 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. 279 పరుగుల లక్ష్య ఛేదనలో 80 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి కొరల్లో చిక్కుకున్న ఆసీస్ను ఈ ముగ్గురు కలిసి విజయతీరాలకు చేర్చారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 162, సెకెండ్ ఇన్నింగ్స్లో 372 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైన ఆసీస్.. సెకెండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసి, 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
భారత అంపైర్కు గొప్ప గౌరవం
భారత అంపైర్ నితిన్ మీనన్కు గొప్ప గౌరవం దక్కనుంది. ప్రపంచ క్రికెట్లో ఫాబ్ ఫోర్గా పిలువబడే నలుగురు స్టార్ క్రికెటర్ల వందో టెస్ట్ మ్యాచ్లో ఇతను అంపైర్గా వ్యవహరించనున్నాడు. ఇదివరకే విరాట్ కోహ్లి, జో రూట్, స్టీవ్ స్మిత్ల వందో టెస్ట్ మ్యాచ్కు అంపైర్గా పని చేసిన మీనన్.. ఫాబ్ ఫోర్లోని మరో ఆటగాడైన కేన్ విలియమ్సన్ వందో టెస్ట్లో కూడా అంపైర్గా వ్యవహరించే సువర్ణావకాశాన్ని దక్కించుకున్నాడు. ఓ తరంలో నలుగురు గొప్ప క్రికెటర్లకు చిరకాలం గుర్తుండిపోయే మ్యాచ్ల్లో అంపైర్గా వ్యవహరించే గొప్ప గౌరవం నితిన్ మీనన్ మాత్రమే దక్కనుంది. విలియమ్సన్ వందో టెస్ట్ మ్యాచ్ మార్చి 8న ప్రారంభమవుతుంది. క్రైస్ట్చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్ కేన్ మామతో పాటు న్యూజిలాండ్ ప్రస్తుత కెప్టెన్ టిమ్ సౌథీకి కూడా వందో టెస్ట్ మ్యాచ్ కానుంది. కేన్, సౌథీ వందో టెస్ట్ మ్యాచ్కు సరిగ్గా ఒక్క రోజు ముందు మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు తమ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నారు. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ వికెట్కీపర్ బ్యాటర్ జానీ బెయిర్స్టో రేపటి నుంచి ప్రారంభంకాబోయే భారత్-ఇంగ్లండ్ ఐదో టెస్ట్ మ్యాచ్తో వంద టెస్ట్ల మైలురాయిని తాకనున్నారు. ధర్మశాల వేదికగా రేపటి నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1 తేడాతో కైవసం చేసుకోగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండు మ్యాచ్ల సిరీస్లో ఆతిథ్య న్యూజిలాండ్ 0-1తో వెనుకపడి ఉంది. -
IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్.. ఈ సారి కష్టమే మరి!?
ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, కివీస్ క్రికెటర్ డెవాన్ కాన్వే గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది. కాన్వే ప్రస్తుతం చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 సం డెవాన్ కాన్వే ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. .దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్కు తరలించగా ఫ్రాక్చర్ ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో వైద్యులు అతడికి సర్జరీ అవసరమని సూచించారు. కాన్వే చేతి వేలికి త్వరలోనే శస్త్రచికిత్స జరగనుంది. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స అనంతరం అతడికి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి వైద్యులు తెలిపినట్లు సమాచారం. అంటే మే వరకు కాన్వే అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు. ఈ క్రమంలోనే సీజన్ మొత్తానికి డెవాన్ దూరం కానున్నాడు. కాగా గతేడాది సీఎస్కే ఛాంపియన్స్గా నిలవడంలో కాన్వేది కీలక పాత్ర. గుజరాత్ జెయింట్స్తో జరిగిన ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్గా డెవాన్ నిలిచాడు. అటువంటి అద్బుతమైన ఆటగాడు దూరం కావడం సీఎస్కేకు నిజంగా గట్టి ఎదురుదెబ్బే. ఈ సీఎస్కే తమ తొలి మ్యాచ్లో మార్చి 22న ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చదవండి: Shreyas Iyer: కష్టాల్లో జట్టు.. తుస్సుమన్పించిన శ్రేయస్ అయ్యర్! స్టంప్స్ ఎగిరిపోయాయిగా -
చరిత్ర సృష్టించిన ఫిలిప్స్.. తొలి ఆటగాడిగా! 15 ఏళ్లలో
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ స్టార్ గ్లెన్ ఫిలిప్స్ సంచలన ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్లో పార్ట్ టైమ్ బౌలర్గా ఎటాక్లోకి వచ్చిన ఫిలిప్స్ తన స్పిన్ మయాజాలంతో ఆసీస్ను ముప్పుతిప్పులు పెట్టాడు. ఫిలిప్స్ ఏకంగా 5 వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. 16 ఓవర్లు బౌలింగ్ చేసిన గ్లెన్.. కేవలం 45 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. అందులో 4 మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఫిలిప్స్ స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్ తమ సెకెండ్ ఇన్నింగ్స్లో 164 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగిన ఫిలిప్స్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. గత 15 ఏళ్లలో న్యూజిలాండ్ గడ్డపై 5 వికెట్ల ఘనత సాధించిన తొలి కివీ స్పిన్నర్గా ఫిలిప్స్ నిలిచాడు. ఆఖరిగా 2008లో బ్లాక్ క్యాప్స్ స్పిన్నర్ జీతన్ పటేల్ 5 వికెట్ల హాల్ సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ కివీస్ ముందు 369 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 369 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లు నష్టపోయి 111 పరుగులు చేసింది. చదవండి: ‘రాజు- రాణి వచ్చేశారు’.. అనంత్- రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కోహ్లి?! నిజం ఇదే -
పాపం కేన్ మామ.. ఎలా ఔటయ్యాడో చూడండి.. 12 ఏళ్లలో..!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ (0) ఆసక్తికర రీతిలో రనౌటయ్యాడు. కేన్ పరుగు పూర్తి చేసే క్రమంలో మరో ఎండ్ నుంచి వస్తున్న సహచరుడు విల్ యంగ్ను గుద్దుకోవడంతో పరుగు పూర్తి చేయలేకపోయాడు. కేన్ క్రీజ్కు చేరకునే లోపు లబూషేన్ డైరెక్ట్ త్రోతో వికెట్లకు గిరాటు వేశాడు. కేన్ రనౌట్ కావడానికి ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా పరోక్ష కారకుడయ్యాడు. కేన్ పరుగు తీస్తుండగా.. స్టార్క్ కూడా అడ్డుతగిలాడు (ఉద్దేశపూర్వకంగా కాదు).12 ఏళ్లలో కేన్ రనౌట్ కావడం ఇదే తొలిసారి. చివరిసారిగా అతను 2012లో రనౌటయ్యాడు. కేన్ రనౌట్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. KANE WILLIAMSON IS RUN OUT IN TEST CRICKET FOR THE FIRST TIME IN 12 YEARS...!!! 🤯pic.twitter.com/KRheTm61sg — Mufaddal Vohra (@mufaddal_vohra) March 1, 2024 కాగా, ఆసీస్ బౌలర్లు మూకుమ్మడగా రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 179 పరుగులకే కుప్పకూలింది. కేన్తో పాటు రచిన్ రవీంద్ర, కుగ్గెలిన్ డకౌట్లయ్యారు. టామ్ లాథమ్ (5), విల్ యంగ్ (9), సౌథీ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. 29 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ను గ్లెన్ ఫిలిప్స్ (71) మెరుపు అర్దసెంచరీతో గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. టామ్ బ్లండల్ (33), మ్యాట్ హెన్రీ (42) ఓ మోస్తరు స్కోర్లు చేయగా డారిల్ మిచెల్ 11 పరుగులు చేశాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయోన్ 4, హాజిల్వుడ్ 2, స్టార్క్, కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు. దీనికి ముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులకు ఆలౌటైంది. కెమరూన్ గ్రీన్ భారీ శతకం (174) సాధించి అజేయంగా నిలువగా.. స్టీవ్ స్మిత్ 31, ఉస్మాన్ ఖ్వాజా 33, లబూషేన్ 1, హెడ్ 1, మిచెల్ మార్ష్ 40, అలెక్స్ క్యారీ 10, స్టార్క్ 9, కమిన్స్ 16, లయోన్ 5, హాజిల్వుడ్ 22 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ ఐదు వికెట్ల ప్రదర్శనలతో రాణించగా.. విలియమ్ రూర్కీ, కుగ్గెలిన్ తలో 2 వికెట్లు, రచిన్ రవీంద్ర ఓ వికెట్ పడగొట్టాడు. 204 పరుగుల లీడ్తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 13 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ డకౌట్ కాగా..లబూషేన్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు. ఖ్వాజా (5), నైట్ వాచ్మెన్ లయెన్ (6) క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 217 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
లక్షణాలిలా..
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
తప్పక చదవండి
- 9 సీట్లలో గెలుపు ఖాయం
- అంచనాలకు మించి..
- Lok Sabha Election 2024: నల్లత్రాచు నుంచి ‘అప్సరస’ వరకు..
- Lok Sabha Election 2024: చివరి పంచ్ ఎవరిదో!
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
Advertisement