New Zealand
-
PAK Vs NZ: పాక్కు పరాభవం
కరాచీ: సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్గా అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టు పేలవమైన ఆటను ప్రదర్శించింది. అన్ని రంగాల్లో విఫలమైన ఆ జట్టు చాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమిని మూటగట్టుకుంది. ఐదు రోజుల క్రితం ఇదే మైదానంలో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను మట్టికరిపించిన న్యూజిలాండ్ దానిని పునరావృతం చేసింది. అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ టోర్నీలో విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో సాంట్నర్ సారథ్యంలోని కివీస్ 60 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టామ్ లాథమ్ (104 బంతుల్లో 118 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్లు), విల్ యంగ్ (113 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. యంగ్, లాథమ్ నాలుగో వికెట్కు 118 పరుగులు జోడించారు. గ్లెన్ ఫిలిప్స్ (39 బంతుల్లో 61; 3 ఫోర్లు, 4 సిక్స్లు) దూకుడుగా ఆడాడు. లాథమ్, ఫిలిప్స్ ఐదో వికెట్కు 12.2 ఓవర్లలోనే 125 పరుగులు జత చేశారు. చివరి 10 ఓవర్లలో కివీస్ 113 పరుగులు సాధించింది. అనంతరం పాకిస్తాన్ 47.2 ఓవర్లలో 260 పరుగులకే ఆలౌటైంది. ఖుష్దిల్ షా (49 బంతుల్లో 69; 10 ఫోర్లు, 1 సిక్స్), బాబర్ ఆజమ్ (90 బంతుల్లో 64; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (సి) (సబ్) ఫహీమ్ (బి) నసీమ్ 107; కాన్వే (బి) అబ్రార్ 10; విలియమ్సన్ (సి) రిజ్వాన్ (బి) నసీమ్ 1; మిచెల్ (సి) అఫ్రిది (బి) రవూఫ్ 10; లాథమ్ (నాటౌట్) 118; ఫిలిప్స్ (సి) ఫఖర్ (బి) రవూఫ్ 61; బ్రేస్వెల్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 320. వికెట్ల పతనం: 1–39, 2–40, 3–73, 4–191, 5–316. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–68–0, నసీమ్ 10–0–63–2, అబ్రార్ 10– 0–47–1, రవూఫ్ 10–0–83–2, ఖుష్దిల్ 7–0– 40–0, సల్మాన్ 3–0–15–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షకీల్ (సి) హెన్రీ (బి) రూర్కే 6; బాబర్ ఆజమ్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 64; రిజ్వాన్ (సి) ఫిలిప్స్ (బి) రూర్కే 3; ఫఖర్ (బి) బ్రేస్వెల్ 24; సల్మాన్ (సి) బ్రేస్వెల్ (బి) స్మిత్ 42; తాహిర్ (సి) విలియమ్సన్ (బి) సాంట్నర్ 1; ఖుష్దిల్ (సి) బ్రేస్వెల్ (బి) రూర్కే 69; అఫ్రిది (సి) లాథమ్ (సి) లాథమ్ (బి) హెన్రీ 14; నసీమ్ (బి) హెన్రీ 13; రవూఫ్ (సి) మిచెల్ (బి) సాంట్నర్ 19; అబ్రార్ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 5; మొత్తం (47.2 ఓవర్లలో ఆలౌట్) 260. వికెట్ల పతనం: 1–8, 2–22, 3–69, 4–127, 5–128, 6–153, 7–200, 8–229, 9–260, 10–260. బౌలింగ్: హెన్రీ 7.2–1–25–2, రూర్కే 9–0–47–3, బ్రేస్వెల్ 10–1–38–1, ఫిలిప్స్ 9–0–63–0, సాంట్నర్ 10–0–66–3, స్మిత్ 2–0–20–1. -
ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్పై న్యూజిలాండ్దే పైచేయి..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఇవాల్టి నుంచి (ఫిబ్రవరి 19) ప్రారంభమవుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లు మినహా మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్లను పాక్లో ఆడటం లేదు. టీమిండియా మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయి.టోర్నీ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్.. న్యూజిలాండ్ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ పాకిస్తాన్లోని కరాచీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. పాక్పై న్యూజిలాండ్కు సంపూర్ణ ఆధిక్యం ఉంది. ఈ టోర్నీలో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు మ్యాచ్ల్లో తలపడగా.. మూడుసార్లు న్యూజిలాండే విజేతగా నిలిచింది.కెన్యా వేదికగా జరిగిన టోర్నీ రెండో ఎడిషన్లో (2000) పాకిస్తాన్, న్యూజిలాండ్ తొలిసారి తలపడ్డాయి. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ రెండు జట్లు ఢీకొన్నాయి. ఆ మ్యాచ్లో న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 49.2 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 49 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ తరఫున సయీద్ అన్వర్ (104) సెంచరీ చేసినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. న్యూజిలాండ్ ఆటగాడు రోజర్ ట్వూస్ (87) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. సెమీస్లో పాక్పై విజయం సాధించిన న్యూజిలాండ్.. ఆతర్వాత ఫైనల్లో భారత్పై కూడా గెలుపొంది తమ తొలి ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆతర్వాత భారత్లో జరిగిన 2006 ఎడిషన్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు రెండోసారి తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్దే పైచేయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పాక్ను 51 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన పాక్ 46.3 ఓవర్లలో 223 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తరఫున స్కాట్ స్టైరిస్ (86), పాక్ తరఫున మొహమ్మద్ యూసఫ్ (71) టాప్ స్కోరర్లుగా నిలిచారు.సౌతాఫ్రికాలో జరిగిన 2009 ఎడిషన్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు మూడో సారి తలపడ్డాయి. ముచ్చటగా మూడోసారి కూడా న్యూజిలాండే విజేతగా నిలిచింది. నాటి ఎడిషన్ సెమీఫైనల్లో ఈ ఇరు జట్లు తలపడగా.. న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెమీస్లో పాక్పై గెలుపుతో ఫైనల్కు చేరిన న్యూజిలాండ్.. ఫైనల్లో ఆసీస్ చేతిలో పరాజయంపాలైంది.ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్పై ఘనమైన రికార్డు కలిగిన న్యూజిలాండ్ మరో విజయం సాధిస్తుందో లేక తొలి ఓటమిని మూటగట్టుకుంటుదో వేచి చూడాలి. ఛాంపియన్స ట్రోఫీ-2025లో న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్పాకిస్తాన్ జట్టు..మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, బాబర్ ఆజం, కమ్రాన్ గులాం, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, సౌద్ షకీల్ -
ICC Champions Trophy: సై అంటే సై... ఏ జట్టు ఎలా ఉందంటే...
వన్డే క్రికెట్లో మరో ‘ప్రపంచ’ పోరుకు సమయం ఆసన్నమైంది. వరల్డ్ కప్ కాని వరల్డ్ కప్గా గుర్తింపు తెచ్చుకున్న చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. ప్రపంచ కప్తో పోలిస్తే తక్కువ జట్లతో టాప్–8తో పరిమితమైన ఈ ఐసీసీ టోర్నీలో జరగబోయే హోరాహోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్తాన్ ఒక ఐసీసీ టోర్నీకి వేదిక అవుతుండగా... భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై ఆడకుండా దుబాయ్కే పరిమితమవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం చివరిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో విజేతగా నిలిచిన పాక్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతుండగా... రెండుసార్లు టైటిల్ సాధించిన భారత్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దాటి ఈ ఫార్మాట్లో మళ్లీ ‘చాంపియన్’ హోదా కోసం రెడీ అంటోంది. కరాచీ: ఐసీసీ 2017లో చాంపియన్స్ ట్రోఫీని ఇంగ్లండ్లో నిర్వహించింది. లెక్క ప్రకారం 2021లో తర్వాతి టోర్నీ జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా కోవిడ్ కారణంగా ఐసీసీ అన్ని షెడ్యూల్లలో మార్పులు చేయాల్సి వచ్చింది. 2020లో జరగాల్సిన టి20 ప్రపంచ కప్ను తప్పనిసరి పరిస్థితుల్లో 2021కి మార్చారు. ఈ నేపథ్యంలో ఒకే ఏడాది రెండు ఐసీసీ టోర్నీల నిర్వహణ సాధ్యం కాదు కాబట్టి 2021 టోర్నీని పూర్తిగా రద్దు చేసేశారు. మరో నాలుగేళ్లకు ఇప్పుడు చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2023 వన్డే వరల్డ్ కప్లో తొలి 8 స్థానాల్లో నిలిచిన జట్లు దీనికి నేరుగా అర్హత సాధించాయి. దాంతో మాజీ చాంపియన్ శ్రీలంక దూరం కాగా... అసలు వరల్డ్ కప్ ప్రధాన పోటీలకే క్వాలిఫై కాని మరో మాజీ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఈ టోర్నీలో కనిపించడం లేదు. అఫ్గానిస్తాన్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో భాగంగా నాలుగు వేదికల్లో కలిపి మొత్తం 12 లీగ్ మ్యాచ్లు, రెండు సెమీఫైనల్స్, ఫైనల్ జరుగుతాయి. భారత్ ఆడే 3 లీగ్ మ్యాచ్లు మినహా మిగతా వాటికి పాకిస్తాన్ వేదిక కాగా... భారత్ తమ అన్ని మ్యాచ్లను దుబాయ్లోనే ఆడుతుంది. టీమిండియా సెమీఫైనల్, ఆపై ఫైనల్ చేరితే ఆ రెండు మ్యాచ్లూ దుబాయ్లోనే జరుగుతాయి. మరో సెమీఫైనల్కు మాత్రం పాక్ ఆతిథ్యమిస్తుంది. భారత్ ఫైనల్ చేరకపోతే మాత్రం టైటిల్ పోరును పాకిస్తాన్ గడ్డపైనే నిర్వహిస్తారు. ఏ జట్టు ఎలా ఉందంటే...» ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇంగ్లండ్ జట్టు రెండు సార్లు ఫైనల్స్లో ఓడింది. గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తాము నమ్ముకున్న విధ్వంసక ఆట ఇప్పుడు ఏమాత్రం పనికి రాక కుప్పకూలిపోతోంది. బ్యాటింగ్లో రూట్, కెప్టెన్ బట్లర్, బ్రూక్ రాణించడం కీలకం. పేసర్లు ప్రభావం చూపలేకపోతుండగా... బలమైన స్పిన్నర్ జట్టులో లేడు. ఫామ్పరంగా వరల్డ్ కప్ తర్వాత 14 వన్డేలు ఆడితే 4 మాత్రమే గెలి చింది. వెస్టిండీస్, భారత్ల చేతిలో చిత్తయింది. » 2000లో తమ ఏకైక ఐసీసీ టోర్నీ నెగ్గిన న్యూజిలాండ్... 2009లో ఫైనల్ చేరింది. వైవిధ్యమైన ఆటగాళ్ల కూర్పుతో జట్టు ఇతర అన్ని టీమ్లకంటే మెరుగ్గా కనిపిస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, లాథమ్లతో బ్యాటింగ్ బలంగా ఉండగా, కెప్టెన్ సాంట్నర్తో కలిపి ముగ్గురు స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. ఫెర్గూసన్ దూరం కావడం లోటే అయినా హెన్రీ పదునైన పేస్ కీలకం కానుంది. గత మూడు సిరీస్లలో రెండు గెలిచిన జట్టు... తాజాగా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో పాక్ను ఓడించి విజేతగా నిలిచింది. » టోర్నీలో రెండుసార్లు విజేతగా నిలిచిన ఆ్రస్టేలియా గత రెండుసార్లు సెమీస్ కూడా చేరలేకపోయింది. ముగ్గురు ప్రధాన పేసర్లు కమిన్స్, స్టార్క్, హాజల్వుడ్ లేకుండా బరిలోకి దిగడం బౌలింగ్ను బలహీనపర్చింది. దాంతో బ్యాటింగ్పైనే భారం ఉంది. కెప్టెన్ స్మిత్, హెడ్, మ్యాక్స్వెల్ కీలకం కానున్నారు. పేసర్లు జాన్సన్, ఎలిస్లతో పాటు స్పిన్నర్ జంపా రాణించాల్సి ఉంది. 2023 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లండ్పై సిరీస్ గెలిచిన ఆసీస్... పాక్, శ్రీలంక చేతుల్లో ఓడింది.» తొలిసారి 1998లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు ఆ తర్వాత నాలుగుసార్లు సెమీస్ చేరినా ముందంజ వేయలేకపోయింది. వరల్డ్ కప్ తర్వాత 14 మ్యాచ్లలో నాలుగే గెలిచినా... ఎక్కువసార్లు ద్వితీయ శ్రేణి జట్టే బరిలోకి దిగింది. కాబట్టి కీలక ఆటగాళ్లు రాణిస్తే సెమీస్ కచి్చతంగా చేరగలమని ఆశిస్తోంది. క్లాసెన్ అద్భుత ఫామ్లో ఉండగా... కెప్టెన్ బవుమా డసెన్, మార్క్రమ్ తమ వన్డే ఆటను ప్రదర్శించాల్సి ఉంది. రబడ మినహా బౌలింగ్లో పదును లేదు. » డిఫెండింగ్ చాంపియన్గా పాకిస్తాన్ బరిలోకి దిగుతోంది. గత టైటిల్ మినహా అంతకు ముందు పేలవ రికార్డు ఉంది. సొంతగడ్డపై జరుగుతుండటం పెద్ద సానుకూలత. ఫామ్లో లేకపోయినా ఇప్పటికీ బాబర్ ఆజమే కీలక బ్యాటర్. కెప్టెన్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా ప్రత్యర్థి స్పిన్ను ఎలా ఆడతారనే దానిపైనే జట్టు అవకాశాలు ఉన్నాయి. సయీమ్ అయూబ్ దూరం కావడం ఇబ్బంది పెట్టే అంశం. షాహీన్, నసీమ్, రవూఫ్లతో బౌలింగ్ ఇప్పటికీ సమస్యే. అబ్రార్ నాణ్యమైన స్పిన్నర్ కాదు.» టోర్నీ చరిత్రలో బంగ్లాదేశ్ 12 మ్యాచ్లు ఆడితే గెలిచింది 2 మాత్రమే. ఇటీవల వరుసగా వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ చేతుల్లో సిరీస్లు ఓడింది. చాలా కాలంగా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏమీ లేదు. అయితే టెస్టులు, టి20లతో పోలిస్తే వన్డేల్లో కాస్త మెరుగ్గా ఆడుతుండటంతో కొన్ని ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త తరం పేస్ బౌలర్లు తన్జీమ్, నాహిద్ చెప్పుకోదగ్గ రీతిలో ఆకట్టుకున్నారు. షకీబ్, తమీమ్ ఇక్బాల్ల తరాన్ని దాటి ఐసీసీ ఈవెంట్లో నజ్ముల్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఈసారి కాస్త కొత్తగా కనిపిస్తోంది. » అఫ్గానిస్తాన్ జట్టుకు ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ. వరల్డ్ కప్లో టాప్–8లో నిలిచి అర్హత సాధించడంతోనే ఆ జట్టు ఎంత మెరుగైందో చెప్పవచ్చు. వరల్డ్ కప్ తర్వాత ఐదు సిరీస్లు ఆడితే నాలుగు గెలిచింది. టి20 వరల్డ్ కప్లో కూడా సెమీస్ చేరిన టీమ్ తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమనే నమ్మకాన్ని కలిగిస్తోంది. గుర్బాజ్, కెప్టెన్ హష్మతుల్లా, అజ్మతుల్లా బ్యాటింగ్లో ప్రధానం కాగా...బౌలింగ్లో రషీద్ పెద్ద బలం. సీనియర్లు నబీ, నైబ్లకు గెలిపించగల సామర్థ్యం ఉంది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మరో బిగ్ వికెట్ డౌన్
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy-2025) ప్రారంభానికి ముందు మరో పెద్ద వికెట్ పడింది. న్యూజిలాండ్ స్టార్ పేసర్ లోకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) గాయం కారణంగా మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఫెర్గూసన్ కుడికాలి పాదంపై గాయమైంది. ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడంపై ముందు నుంచి అనుమానంగా ఉండింది. ప్రస్తుతం అదే నిజమైంది. ఫెర్గూసన్ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కానున్నాడని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఫెర్గూసన్కు రీప్లేస్మెంట్గా కైల్ జేమీసన్ను (Kyle Jamieson) ఎంపిక చేశారు న్యూజిలాండ్ సెలెక్టర్లు. గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన 11వ ప్లేయర్ ఫెర్గూసన్.ఇదివరకే స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్వుడ్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, అన్రిచ్ నోర్జే, గెరాల్డ్ కొయెట్జీ, సైమ్ అయూబ్, జేకబ్ బేతెల్, అల్లా ఘజన్ఫర్, బెన్ సియర్స్ గాయాల కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యారు. స్టార్ ఆటగాళ్లు.. ముఖ్యంగా పేసర్లు దూరం కావడంతో మెగా టోర్నీ కళ తప్పే అవకాశముంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం బారిన పడిన రెండో ఆటగాడు ఫెర్గూసన్. కొద్ది రోజుల ముందు పేసర్ బెన్ సియర్స్ కూడా గాయం బారిన పడ్డాడు. అతని స్థానంలో జేకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. తాజాగా ఫెర్గూసన్ కూడా గాయపడటంతో న్యూజిలాండ్ పేస్ విభాగం బలహీనపడినట్లు కనిపిస్తుంది. ఆ జట్టు పేస్ విభాగంలో మ్యాట్ హెన్నీ ఒక్కడే అనుభవజ్ఞుడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ పాకిస్తాన్తో తలపడనుంది. కరాచీలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లు పాకిస్తాన్లో జరుగుతాయి. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి.ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తమ తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 20న ఆడనుంది. తొలి మ్యాచ్లో టీమిండియా.. బంగ్లాదేశ్తో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. మార్చి 2న భారత్.. న్యూజిలాండ్తో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ షెడ్యూల్..ఫిబ్రవరి 19న పాకిస్తాన్తోఫిబ్రవరి 24న బంగ్లాదేశ్తోమార్చి 2న టీమిండియాతోఛాంపియన్స్ ట్రోఫీ కోసం న్యూజిలాండ్ జట్టు..మార్క్ చాప్మన్, విల్ యంగ్, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్వెల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, కైల్ జేమీసన్ -
కౌంటీల్లో ఆడనున్న కేన్ మామ
లండన్: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కౌంటీ జట్టు మిడిలెసెక్స్తో జతకట్టాడు. ఇంగ్లండ్ దేశవాళీ టి20 కౌంటీ చాంపియన్షిప్ ఆడేందుకు రెండేళ్ల పాటు మిడిలెసెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటికే ఇంగ్లండ్లో జరిగే ఫ్రాంచైజీ లీగ్ ‘ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్కు కివీస్ దిగ్గజం సారథ్యం వహిస్తున్నాడు. గతంలో టి20 కౌంటీ చాంపియన్షిప్లో గ్లూసెస్టర్షైర్ (2011–12), యార్క్షైర్ (2013–2018)కు ప్రాతినిధ్యం వహించాడు. తాజా సీజన్లో బ్లాస్ట్ గ్రూప్లో మిడిలెసెక్స్ తరఫున కనీసం పది మ్యాచ్లు ఆడనున్నాడు. అనంతరం మరో ఐదు కౌంటీ చాంపియన్షిప్ మ్యాచ్ల్లోనూ విలియమ్సన్ బరిలోకి దిగుతాడు.‘గతంలో అడపాదడపా కౌంటీలు ఆడాను. ఇప్పుడు మాత్రం పూర్తిస్థాయిలో సీజన్కు అందుబాటులో ఉంటాను’ అని అన్నాడు. ఈ వెటరన్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి 18,000 పైచిలుకు పరుగులు చేశాడు. 47 సెంచరీలు సాధించాడు. టెస్టుల్లో 54.88, వన్డేల్లో 49.65, టి20ల్లో 33.44 సగటు నమోదు చేశాడు. ఐపీఎల్లో సన్రైజర్స్, గుజరాత్ టైటాన్స్ ప్రాతినిధ్యం వహించిన విలియమ్సన్ కరీబియన్ లీగ్లో బార్బడోస్ ట్రిడెంట్స్, ఎస్ఏ–20 (సఫారీ లీగ్)లో డర్బన్ సూపర్జెయింట్స్ తరఫున బరిలోకి దిగాడు. ఈ సీజన్లో కరాచీ కింగ్స్ జట్టుతో జతకట్టిన కేన్ పాకిస్తాన్ సూపర్ లీగ్లోనూ ఆడనున్నాడు. -
ట్రై సిరీస్ ఫైనల్.. చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. స్వల్ప స్కోర్కే పరిమితమైన పాక్
కరాచీలో జరుగుతున్న ట్రయాంగులర్ సిరీస్ (Tri-Series) ఫైనల్లో న్యూజిలాండ్ (New Zealand), పాకిస్తాన్ (Pakistan) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగడంతో పాక్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. పేసర్ విలియమ్ ఓరూర్కీ నాలుగు వికెట్లు తీసి పాక్ను ప్రధాన దెబ్బకొట్టాడు. మైఖేల్ బ్రేస్వెల్, మిచెల్ సాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేసి తలో రెండు వికెట్లు తీశారు. జేకబ్ డఫీ, నాథన్ స్మిత్ చెరో వికెట్ దక్కించుకున్నారు.పాక్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ రిజ్వాన్ చేసిన 46 పరుగులే అత్యధికం. సల్మాన్ అఘా 45, తయ్యబ్ తాహిర్ 38, బాబర్ ఆజమ్ 29, ఫహీమ్ అష్రఫ్ 22, ఫకర్ జమాన్ 10, సౌద్ షకీల్ 8, ఖుష్దిల్ షా 7, షాహీన్ అఫ్రిది 1, నసీం షా 19 పరుగులు చేశారు.వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన బాబర్ఈ మ్యాచ్లో బాబర్ ఆజమ్ ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హాషిమ్ ఆమ్లాతో కలిసి రికార్డు షేర్ చేసుకున్నాడు. ఆమ్లా, బాబర్కు తలో 123 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగులు పూర్తి చేశారు. వన్డేల్లో అత్యంత వేగంగా 6000 పరుగులు పూర్తి చేసిన టాప్-5 ఆటగాళ్ల జాబితాలో బాబర్, ఆమ్లా తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి, కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. విరాట్ 136 ఇన్నింగ్స్ల్లో ఈ మైలురాయిని తాకితే.. కేన్ మామ, వార్నర్ భాయ్ తలో 139 ఇన్నింగ్స్ల్లో 6000 పరుగుల క్లబ్లో చేరారు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్లో పాక్, న్యూజిలాండ్తో పాటు సౌతాఫ్రికా కూడా పాల్గొంది. ఈ టోర్నీలో ఫైనల్కు ముందు మూడు జట్లు తలో రెండు మ్యాచ్లు ఆడాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్పై న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మూడో మ్యాచ్లో పాక్.. సౌతాఫ్రికా నిర్దేశించిన 353 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్కు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాక్ స్వదేశంలో ఈ టోర్నీని నిర్వహించింది.పాకిస్తాన్, దుబాయ్ వేదికలుగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభ కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ ఆడే మ్యాచ్లన్నీ దుబాయ్లో జరుగనుండగా.. మిగతా మ్యాచ్లన్నీ పాకిస్తాన్లో జరుగుతాయి. టోర్నీ ఆరంభ మ్యాచ్లో పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఫిబ్రవరి 20న జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్.. భారత్ను ఢీకొంటుంది. ఫిబ్రవరి 23న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగతుంది. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీపడుతున్నాయి. -
Champions Trophy: న్యూజిలాండ్కు ఊహించని షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముగింట న్యూజిలాండ్ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు లాకీ ఫెర్గూసన్, రచిన్ రవీంద్ర గాయాల బారిన పడగా.. తాజాగా యువ పేసర్ బెన్ సియర్స్ ఈ జాబితాలోకి చేరాడు. సియర్స్ తొడ కండరాల గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ ధ్రువీకరించింది. అతడి స్ధానాన్ని మరో పేసర్ జాకబ్ డఫీతో న్యూజిలాండ్ క్రికెట్ భర్తీ చేసింది. సియర్స్ ప్రస్తుతం పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ట్రైసిరీస్లో కివీస్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే పాకిస్తాన్తో ఫైనల్ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో సియర్స్ తొడ కండరాలు పట్టేశాయి.అనంతరం అతడిని స్కానింగ్కు తరలించగా.. గ్రేడ్-3 గాయంగా తేలినట్లు తెలుస్తోంది. దీంతో ఈ యువ ఆటగాడు రెండు నుంచి మూడు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ క్రమంలోనే కివీస్ సెలక్టర్లు అతడి స్ధానాన్ని జాకబ్ డఫీతో భర్తీ చేశారు. కాగా ఈ ఐసీసీ ఈవెంట్కు ముందు న్యూజిలాండ్ అద్బుతమైన ఫామ్లో ఉంది.ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్కు ఆర్హత సాధించింది. శుక్రవారం కరాచీ వేదికగా పాక్తో జరగనున్న ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగించాలని కివీస్ భావిస్తోంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్కు కివీ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర సైతం దూరమయ్యాడు.పాక్తో జరిగిన తొలి మ్యాచ్లో రవీంద్ర తలకు గాయమైంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభానికి అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని బ్లాక్క్యాప్స్ హెడ్కోచ్ గ్యారీ స్టెడ్ స్పష్టం చేశాడు. ఇక ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ మొదటి మ్యాచ్లో ఫిబ్రవరి 19న పాక్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర,జేకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
'అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు.. త్వరలోనే జట్టులోకి వస్తాడు'
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ముంగిట పాకిస్తాన్-దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ట్రైసిరీస్ తుది అంకానికి చేరుకుంది. కరాచీ వేదికగా శుక్రవారం జరగనున్న ఫైనల్ పోరులో కివీస్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీలో అడుగుపెట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.అయితే ఈ మ్యాచ్కు ముందు కివీస్కు గట్టి ఎదురు దెబ్బ తగలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్ రచిన్ రవీంద్ర గాయం కారణంగా ఫైనల్ పోరుకు కూడా దూరమయ్యాడు. ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. లహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో రవీంద్ర తలకు గాయమైంది. బంతి అతడి నుదిటికి తాకడంతో రక్తస్రావమైంది. దీంతో అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్కు రవీంద్ర దూరమయ్యాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికి రచిన్ కోలుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. రచిన్ వేగంగా కోలుకుంటున్నాడు. అతడికి హెడ్ ఇంజ్యూరీ అసెస్మెంట్(HIA) సంబంధించి అన్ని పరీక్షలు నిర్వహించాము. అతడు ప్రస్తుతం మా వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే గత మూడు నాలుగు రోజుల నుంచి కాస్త తలనొప్పితో బాధపడుతున్నాడు. గాయం తర్వాత రచిన్ తొలిసారి నెట్ ప్రాక్టీస్లో పాల్గోనున్నాడు. అతడు మరి కొన్ని రోజుల్లో తన ఫిట్నెస్ సాధిస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో మా తొలి మ్యాచ్కు అతడు అందుబాటులో ఉంటాడని నేను భావిస్తున్నాను అని స్టెడ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్లో ఫిబ్రవరి 19న పాకిస్తాన్తో తలపడనుంది.ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీచదవండి: ప్లీజ్.. నన్ను కింగ్ అని పిలవకండి: బాబర్ ఆజం -
క్రికెట్ చరిత్రలో అరుదైన ఘటన
అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ ట్రై సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (ఫిబ్రవరి 10) జరిగిన మ్యాచ్లో ప్లేయర్లు లేక సౌతాఫ్రికా జట్టు ఫీల్డింగ్ కోచ్ను బరిలోకి దించింది. మెజార్టీ శాతం ఆటగాళ్లు సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఇరుక్కుపోవడంతో ఈ టోర్నీలో సౌతాఫ్రికాకు ఆటగాళ్ల కొరత ఏర్పడింది. ఈ టోర్నీ కోసం సౌతాఫ్రికా సెలెక్టర్లు కేవలం 12 మంది సభ్యుల జట్టును మాత్రమే ఎంపిక చేశారు. ఈ 12లోనూ ఇద్దరు ఆటగాళ్లు ఎమర్జెన్సీ మీద మైదానాన్ని వీడటంతో ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ వాండిలే గ్వావు తప్పనిసరి పరిస్థితుల్లో సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. అయితే ఇలాంటి ఘటన సౌతాఫ్రికాకు మాత్రం కొత్తేమీ కాదు. గత సీజన్లో అబుదాబీలో జరిగిన ఓ మ్యాచ్లో ఆ జట్టు ఆటగాళ్లు అస్వస్థతకు గురికావడంతో బ్యాటింగ్ కోచ్ జేమీ డుమినీ సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా బరిలోకి దిగాడు.We don’t see that happening too often! 😅South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn— FanCode (@FanCode) February 10, 2025ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఓడించి, ఫైనల్కు చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. అరంగట్రేం ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కీ (150) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. ఈ సెంచరీతో బ్రీట్జ్కీ వన్డే అరంగేట్రంలో 150 పరుగుల మార్కును తాకిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో.. జే స్మిత్ (41) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కెప్టెన్ బవుమా (20), కైల్ వెర్రిన్ (1), ముత్తుసామి (2) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. బ్రేస్వెల్కు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (133) అజేయ శతకంతో విరుచుకుపడటంతో మరో 8 బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. డెవాన్ కాన్వే (97) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ.. న్యూజిలాండ్ గెలుపుకు గట్టి పునాది వేశాడు. విలియమ్సన్.. గ్లెన్ ఫిలిప్స్తో కలిసి (28 నాటౌట్) న్యూజిలాండ్ను గెలుపు తీరాలు దాటించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ 19, డారిల్ మిచెల్ 10, టామ్ లాథమ్ డకౌటయ్యారు.సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2, ఈథన్ బాష్, జూనియర్ డాలా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన విలియమ్సన్ వన్డేల్లో అత్యంత వేగంగా 7000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ టోర్నీలో రేపు (ఫిబ్రవరి 12) జరుగబోయే మ్యాచ్లో (పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా) విజేత ఫిబ్రవరి 14న జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్తాన్లో జరుగుతున్న టోర్నీ కావడంతో ఈ టోర్నీకి ప్రాధాన్యత సంతరించుకుంది. -
మార్టిన్ గప్టిల్ ఊచకోత.. 42 బంతుల్లో 160 పరుగులు! వీడియో వైరల్
న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటకి.. తనలో ఏ మాత్రం దూకుడు తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. లెజెండ్స్ 90 లీగ్ టోర్నీలో గప్టిల్ విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో ఛత్తీస్గఢ్ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న గప్టిల్.. సోమవారం రాయ్పూర్ వేదికగా బిగ్ బాయ్స్తో జరిగిన మ్యాచ్లో అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన గప్టిల్, ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అతడి బ్యాటింగ్ విధ్వంసంతో రాయ్పూర్ స్టేడియం దద్దరిల్లిపోయింది. కేవలం 49 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గప్టిల్.. 16 సిక్స్లు, 12 ఫోర్లతో 160 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ రిషి ధావన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 76 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరిశాడు.తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్గఢ్ వారియర్స్ నిర్ణీత 90 బంతుల్లో వికెట్ నష్టపోకుండా 240 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 241 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బిగ్ బాయ్స్ జట్టు.. నిర్ణీత 90 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి 151 పరుగులకే పరిమితమైంది. బిగ్ బాయ్స్ బ్యాటర్లలో రాబిన్ బిస్ట్(55) టాప్ స్కోరర్గా నిలవగా.. సౌరబ్ తివారీ(37) పరుగులతో రాణించారు. ఛత్తీస్గఢ్ వారియర్స్ బౌలర్లలో మనన్ శర్మ రెండు, అభిమన్యు మిథన్, ఖాలీం ఖాన్ తలా వికెట్ సాధించారు.తిరుగులేని గప్టిల్..కాగా న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో గప్టిల్ తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. 16 ఏళ్ల పాటు కివీస్కు ప్రాతనిథ్యం వహించిన గప్టిల్.. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు విడ్కోలు పలికాడు. టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా గప్టిల్ ఉన్నాడు. 122 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో 3531 పరుగులు చేశాడు. వన్డేల్లోనూ న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు (7,346) చేసిన మూడో బ్యాటర్గా ఉన్నాడు. అతడి కంటే ముందు రాస్ టేలర్ (8,607), స్టీఫెన్ ప్లెమింగ్ (8,007) ఉన్నారు.చదవండి: ICC Champions Trophy: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అంపైర్లు వీరే! ఐరెన్ లెగ్ లేడు Absolute carnage in Raipur! 🤯 Martin Guptill goes absolutely berserk, smashing 160 runs off just 49 deliveries, including 16 maximums! 😱#Legend90onFanCode pic.twitter.com/6Bpkw4aEA4— FanCode (@FanCode) February 10, 2025 -
అరంగేట్రంలోనే శతక్కొట్టిన సౌతాఫ్రికా ఓపెనర్.. వరల్డ్ రికార్డు
సౌతాఫ్రికా ఓపెనర్ (South Africa Opener) మాథ్యూ బ్రీట్జ్కీ (Matthew Breetzke) వన్డే అరంగేట్రంలోనే (ODI Debut) సెంచరీతో మెరిశాడు. పాకిస్తాన్ ట్రై సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్లో బ్రీట్జ్కీ ఈ ఫీట్ను సాధించాడు. అరంగేట్రంలోనే సెంచరీ సాధించిన 19వ ఆటగాడిగా, నాలుగో సౌతాఫ్రికన్ ప్లేయర్గా బ్రీట్జ్కీ రికార్డుబుక్కుల్లోకెక్కాడు. బ్రీట్జ్కీకి ముందు డెన్నిస్ అమిస్ (ఇంగ్లండ్), డెస్మండ్ హేన్స్ (విండీస్), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), సలీం ఇలాహి (పాకిస్తాన్), మార్టిన్ గప్తిల్ (న్యూజిలాండ్), కొలిన్ ఇంగ్రామ్ (సౌతాఫ్రికా), రాబర్ట్ నికోల్ (న్యూజిలాండ్), ఫిల్ హ్యూస్ (ఆస్ట్రేలియా), మైఖేల్ లంబ్ (ఇంగ్లండ్), మార్క్ చాప్మన్ (న్యూజిలాండ్), కేఎల్ రాహుల్ (ఇండియా), టెంబా బవుమా (సౌతాఫ్రికా), ఇమామ్ ఉల్ హార్ (పాకిస్తాన్), రీజా హెండ్రిక్స్ (సౌతాఫ్రికా), ఆబిద్ అలీ (పాకిస్తాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), మైఖేల్ ఇంగ్లిష్ (స్కాట్లాండ్), అమీర్ జాంగూ (వెస్టిండీస్) వన్డే అరంగేట్రంలోనే సెంచరీలు చేశారు.వన్డే అరంగేట్రంలనే సెంచరీలు చేసిన సౌతాఫ్రికా ఆటగాళ్లు..కొలిన్ ఇంగ్రామ్ 2010లో జింబాబ్వేపైటెంబా బవుమా 2016లో ఐర్లాండ్పైరీజా హెండ్రిక్స్ 2018లో శ్రీలంకపైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైతటస్థ వేదికపై వన్డే అరంగ్రేటంలో సెంచరీ చేసిన ఆటగాళ్లు..ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపైఇమామ్ ఉల్ హాక్ 2017లో శ్రీలంకపైఆబిద్ అలీ 2018లో ఆస్ట్రేలియాపైరహ్మానుల్లా గుర్బాజ్ 2021లో ఐర్లాండ్పైమాథ్యూ బ్రీట్జ్కీ 2025లో న్యూజిలాండ్పైబ్రీట్జ్కీ ప్రపంచ రికార్డున్యూజిలాండ్తో మ్యాచ్లో 148 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కీ 11 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 150 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ప్రదర్శనతో బ్రీట్జ్కీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో 150 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో వన్డే అరంగేట్రంలో 150 పరుగులు ఎవ్వరూ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్కు ముందు వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు విండీస్ దిగ్గజం డెస్మండ్ హేన్స్ పేరిట ఉండింది. హేన్స్ తన వన్డే డెబ్యూలో 148 పరుగులు స్కోర్ చేశాడు. తాజా ప్రదర్శనతో వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ రికార్డు కూడా బ్రీట్జ్కీ ఖాతాలోకి చేరింది.న్యూజిలాండ్తో మ్యాచ్ విషయానికొస్తే.. సౌతాఫ్రికా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది. ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. మాథ్యూ బ్రీట్జ్కీ (150) అరంగేట్రంలోనే సెంచరీతో కదంతొక్కగా.. వియాన్ ముల్దర్ (64) అర్ద సెంచరీతో రాణించాడు. జేసన్ స్మిత్ (41) పర్వాలేదనిపించాడు. టెంబా బవుమా 20, కైల్ వెర్రిన్ 1, సెనూరన్ ముత్తుసామి 2 పరుగులు చేసి ఔటయ్యారు.న్యూజిలాండ్ బౌలర్లలో విలియమ్ ఓరూర్కీ, మ్యాట్ హెన్రీ తలో రెండు వికెట్లు.. మైఖేల్ బ్రేస్వెల్ ఓ వికెట్ పడగొట్టారు. -
న్యూజిలాండ్ టీ20 టోర్నీ విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్ (Super Smash) విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ (Central Districts) (సెంట్రల్ స్టాగ్స్) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్బరీ కింగ్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ సూపర్ స్మాష్ టైటిల్ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్ ఎడిషన్లో (2006) టైటిల్ గెలిచిన కాంటర్బరీ కింగ్స్ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్తో సరిపెట్టుకుంది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్బరీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) టాప్ స్కోరర్గా నిలిచాడు. మెక్కోంచీ (27), చాడ్ బోవ్స్ (16), షిప్లే (10), మ్యాట్ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ హే (5), మాథ్యూ బాయిల్ (2), జకరీ ఫౌల్క్స్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్ 2, అంగస్ షా, టిక్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. డేన్ క్లీవర్ (43), విల్ యంగ్ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్లో జాక్ బాయిల్ 5, కెప్టెన్ టామ్ బ్రూస్ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. విలియమ్ క్లార్క్ (17), కర్టిస్ హీపీ (9) సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్బరీ కింగ్స్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2, విలియమ్ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్ పడగొట్టారు.కాగా, న్యూజిలాండ్లో జరిగే సూపర్ స్మాష్ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్ టీ20 కాంపిటీషన్ అని, ఆతర్వాత స్టేట్ టీ20 అని, 2009-2012 వరకు హెచ్ఆర్వీ కప్ అని, 2013-14 ఎడిషన్లో హెచ్ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్ నుంచి సూపర్ స్మాష్ అని నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు. -
T20 WC 2025 USA vs Ire: ధనాధన్.. 9.4 ఓవర్లలోనే..
ఐసీసీ మహిళల అండర్–19 టి20 ప్రపంచకప్-2025(ICC Under 19 Womens T20 World Cup 2025)లో అమెరికా తొలి గెలుపు నమోదు చేసింది. అమెరికా యువతుల జట్టు ఐర్లాండ్(Ireland Women U19 vs USA Women U19)పై మెరిక విజయం సాధించింది. కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. జొహూర్ బహ్రూ వేదికగా సోమవారం జరిగిన ఈ ‘సూపర్ షో’ టోర్నీకే వన్నె తెచ్చింది. 75 పరుగులకే ఆలౌట్ముందుగా ఐర్లాండ్ 17.4 ఓవర్లలో 75 పరుగులకే ఆలౌటైంది. అలైస్ వాల్ష్ (16; 2 ఫోర్లు), లాలా మెక్బ్రిడ్ (13), అబీ హ్యారిసన్ (13), ఫ్రెయా సర్జెంట్ (10) రెండంకెల స్కోర్లు చేశారు.ఇసాని వాఘెలా 3, అదితిబా, రీతూ సింగ్, చేతన ప్రసాద్ తలా 2 వికెట్లు తీశారు. తెలుగు సంతతి అమ్మాయి ఇమ్మడి శాన్వీ ఒక వికెట్ తీసింది. తర్వాత అమెరికా జట్టు 9.4 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి 79 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు దిశా ఢీంగ్రా (33 బంతుల్లో 46; 5 ఫోర్లు, 2 సిక్స్లు), తెలుగు సంతతి అమ్మాయి పగిడ్యాల చేతన రెడ్డి (25 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్కు 9.3 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. ఆ మరుసటి బంతికే ఇసాని వాఘేలా (4 నాటౌట్) బౌండరీ బాదడంతో ఇంకా 10.2 ఓవర్లు మిగిలుండగానే అమెరికా అమోఘ విజయం సాధించింది. ఇక మంగళవారం జరిగే మ్యాచ్ల్లో శ్రీలంకతో వెస్టిండీస్ (ఉదయం 8 గంటల నుంచి), మలేసియాతో భారత్ (మధ్యాహ్నం 12 గంటల నుంచి) తలపడతాయి.సంచలన విజయంఈ మెగా టోర్నీతోనే వరల్డ్కప్లో అరంగేట్రం చేసిన ఆఫ్రికా దేశం నైజీరియా యువతుల జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐసీసీ మహిళల అండర్–19 టీ20 ప్రపంచకప్లో సోమవారం జరిగిన పోరులో నైజీరియా... న్యూజిలాండ్కు ఊహించని షాక్ ఇచ్చింది. మహిళల క్రికెట్లో కివీస్ బలమైన జట్టు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లకు ఏమాత్రం తీసిపోని గట్టి ప్రత్యర్థి. అలాంటి జట్టును తాము నిర్దేశించిన 66 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించకుండా నిలువరించడం పెద్ద విశేషం.గ్రూప్ ‘సి’లో జరిగిన ఈ మ్యాచ్లో నైజీరియా అమ్మాయిల జట్టు 2 పరుగుల తేడాతో కివీస్పై గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్కు దిగిన నైజీరియా నిర్ణీత 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. కెప్టెన్ లక్కీ పియెటి (25 బంతుల్లో 19; 1 ఫోర్) టాప్స్కోరర్ కాగా, లిలియన్ ఉడే (22 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) రెండంకెల స్కోరు చేసింది.ఇతరుల్లో ఇంకెవరూ కనీసం పది పరుగులైనా చేయలేదు. తర్వాత స్వల్ప లక్ష్యమే అయినా కివీస్ 13 ఓవర్లలో 6 వికెట్లకు 63 పరుగులే చేసి ఓడింది. అనిక టాడ్ (27 బంతుల్లో 19; 1 ఫోర్), ఇవ్ వొలాండ్ (15 బంతుల్లో 14; 1 ఫోర్) మెరుగ్గా ఆడారంతే! లలియన్ ఉడే (3–0–8–1) బౌలింగ్లోనూ అదరగొట్టింది.ఆఖరి ఓవర్ డ్రామా... కివీస్ 57/5 స్కోరు చేసి గెలుపు వాకిట నిలబడింది. ఇక ఆఖరి ఓవర్లో విజయానికి 9 పరుగులు చేస్తే చాలు. కానీ నైజీరియన్ బౌలర్ లక్కీ పియెటి 6 పరుగులే ఇచ్చింది. దీంతో 2 పరుగుల తేడాతో ఊహించని విధంగా న్యూజిలాండ్ కంగుతింది. లక్కీ తొలి నాలుగు బంతుల్లో 4 పరుగులే ఇచ్చింది. ఇందులో రెండో బంతి ‘బై’ కాగా, నాలుగో బంతి లెగ్బై!అంటే బ్యాటర్లు కొట్టింది 2 పరుగులే అన్నమాట! ఐదో బంతికి పరుగే ఇవ్వలేదు. ఇక మిగిలింది. చివరి బంతి... కివీస్ గెలిచేందుకు 5 పరుగులు కావాలి. అయాన్ లంబట్ (6 నాటౌట్) కొట్టిన షాట్కు 2 పరుగులే రాగా, మరో పరుగుకు ప్రయతి్నంచడంతో కెప్టెన్ టష్ వేక్లిన్ (18 బంతుల్లో 18; 2 ఫోర్లు) రనౌటైంది. చదవండి: 10 బంతుల్లోనే ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్కప్-2025లో సంచలనం -
పొట్టి ప్రపంచకప్లో పెను సంచలనం.. న్యూజిలాండ్కు షాకిచ్చిన పసికూన
మహిళల అండర్-19 టీ20 వరల్డ్కప్-2025లో పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా పటిష్టమైన న్యూజిలాండ్కు షాకిచ్చింది. ఇవాళ (జనవరి 20) జరిగిన గ్రూప్ స్టేజీ మ్యాచ్లో నైజీరియా న్యూజిలాండ్పై 2 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. మహిళల అండర్ 19 టీ20 వరల్డ్కప్లో నైజీరియాకు ఇదే తొలి గెలుపు. మరోవైపు న్యూజిలాండ్ సీనియర్ మహిళల జట్టు ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్గా ఉంది. ఈ జట్టు గతేడాది పొట్టి ప్రపంచకప్ను సాధించింది.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. వెట్ ఔట్ ఫీల్డ్ కారణంగా ఈ మ్యాచ్ను 13 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన నైజీరియా 13 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. నైజీరియా తరఫున కెప్టెన్ లక్కీ పెటీ (22 బంతుల్లో 18; ఫోర్, సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ లిల్లియన్ ఉడే (25 బంతుల్లో 19; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఎనిమిదో నంబర్ బ్యాటర్ ఒమోసిగో ఎగువాకున్ (4 బంతుల్లో 9 నాటౌట్; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించింది. నైజీరియా ఇన్నింగ్స్ మొత్తంలో 4 బౌండరీలు, ఓ సిక్సర్ మాత్రమే నమోదయ్యాయి. న్యూజిలాండ్ తరఫున బౌలింగ్ చేసిన ఆరుగురిలో ఐదుగురు తలో వికెట్ తీశారు.అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పసికూన నైజీరియా విజయవంతంగా కాపాడుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ తొలి బంతికే వికెట్ కోల్పోయినా, ఆతర్వాత నిలదొక్కుకున్నట్లు కనిపించింది. ఆ జట్టుకు చెందిన ముగ్గరు మిడిలార్డర్ బ్యాటర్లు రెండంకెల స్కోర్లు చేశారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ముగ్గురు ఔట్ కావడంతో న్యూజిలాండ్ కోలుకోలేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా.. నైజీరియా బౌలర్ లిల్లియన్ ఉడే అద్భుతంగా బౌల్ చేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దీంతో నైజీరియా సంచలన విజయం నమోదు చేసింది. బ్యాట్తో రాణించిన నైజీరియా కెప్టెన్ బంతితోనూ పర్వాలేదనిపించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఆమెకే దక్కింది. ఈ గెలుపుతో నైజీరియా గ్రూప్-సి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ గ్రూప్లో నైజీరియాతో పాటు న్యూజిలాండ్, సౌతాఫ్రికా, సమోవా జట్లు ఉన్నాయి.కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో భారత్ నిన్ననే బోణీ కొట్టింది. గ్రూప్-ఏలో భాగంగా జరిగిన మ్యాచ్లో టీమిండియా వెస్టిండీస్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను 44 పరుగులకే కుప్పకూల్చారు. అనంతరం భారత బ్యాటర్లు 4.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 9 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఈ టోర్నీలో భారత్ జనవరి 21న (మలేసియాతో) తమ తదుపరి మ్యాచ్ ఆడుతుంది. జనవరి 23న భారత్.. శ్రీలంకతో తమ చివరి గ్రూప్ స్టేజీ మ్యాచ్ ఆడుతుంది. -
కేన్ విలియమ్సన్కు అవమానం
దిగ్గజ బ్యాటర్, న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్కు అవమానం జరిగింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) డ్రాఫ్ట్లో కేన్ మామను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. ప్లాటినమ్ డ్రాఫ్ట్లో కేన్ మరో 43 మంది స్టార్ ఆటగాళ్లతో కలిసి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఐపీఎల్ 2025 వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయిన కేన్ను పాకిస్తాన్ సూపర్ లీగ్లో కూడా ఎవరూ పట్టించుకోలేదు. కేన్ బరిలో నిలిచిన ప్లాటినమ్ డ్రాఫ్ట్ నుంచి 10 మంది ఆటగాళ్లను ఎంపిక చేసున్నాయి ఫ్రాంచైజీలు.అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ను కరాచీ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వార్నర్ రిటైర్మెంట్ తర్వాత కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో వార్నర్ అదరగొడుతున్నాడు. ఈ లీగ్లో వార్నర్ ఏడు ఇన్నింగ్స్ల్లో 63.20 సగటున 142.34 స్ట్రయిక్రేట్తో 316 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుత ఫామ్ కారణంగానే పీఎస్ఎల్ డ్రాఫ్ట్లో వార్నర్కు మాంచి గిరాకీ ఉండింది.విలియమ్సన్ విషయానికొస్తే.. ఈ కివీస్ లెజెండ్ ఇటీవలి కాలంలో పెద్దగా టీ20లు ఆడింది లేదు. 2023లో ఒక్క అంతర్జాతీయ టీ20 కూడా ఆడని కేన్.. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్కప్ (2024) కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్, పీఎస్ఎల్లో కేన్ ఎంపిక కాకపోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఓ కారణమే. ఇటీవలి కాలంలో కేన్ తరుచూ గాయాల బారిన పడుతున్నాడు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉండి కూడా కేన్ పొట్టి ఫార్మాట్లో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. బ్యాటింగ్లో వేగం లేకపోవడం, భారీ షాట్లు ఆడలేకపోవడం కేన్కు ప్రధాన సమస్యలు.కేన్ ప్రైవేట్ లీగ్ల్లో పెద్దగా రాణించలేకపోయినా అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం పర్వాలేదనిపించాడు. కేన్ తన దేశం తరఫున 93 టీ20లు ఆడి 33.44 సగటున 2575 పరుగులు చేశాడు. కేన్ను ప్రైవేట్ లీగ్ల్లో ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోకపోవడానికి అతని వయసు మరో ప్రధాన కారణం. ప్రస్తుతం కేన్ మామ వయసు 34 ఏళ్లు.కేన్ ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్లో ఆడుతున్నాడు. ఈ లీగ్లో కేన్ డర్బన్ జెయింట్స్ తరఫున ఆడుతున్నాడు. ఈ లీగ్లో ఆడిన తొలి మ్యాచ్లోనే కేన్ అదరగొట్టాడు. ప్రిటోరియా క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కేన్ 40 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.పీఎస్ఎల్ డ్రాఫ్ట్లో ఆయా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్న పలువురు స్టార్ ఆటగాళ్లు..డేవిడ్ వార్నర్ (కరాచీ కింగ్స్)డారిల్ మిచెల్ (లాహోర్ ఖలందర్స్)మార్క్ చాప్మన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)మైఖేల్ బ్రేస్వెల్ (ముల్తాన్ సుల్తాన్స్)ఆడమ్ మిల్నే (కరాచీ కింగ్స్)ఫిన్ అలెన్ (క్వెట్టా గ్లాడియేటర్స్)జేసన్ హోల్డర్ (ఇస్లామాబాద్ యునైటెడ్)ఆమెర్ జమాల్ (కరాచీ కింగ్స్) -
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం న్యూజిలాండ్ జట్టు ప్రకటన
ఛాంపియన్స్ ట్రోఫీ-2025, దానికి ముందు పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ఇవాళ (జనవరి 12) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు. కెప్టెన్ అయ్యాక సాంట్నర్కు ఇదే తొలి ఇసీసీ టోర్నీ. ఈ రెండు టోర్నీల కోసం పేస్ బౌలింగ్ త్రయం విలియమ్ ఓరూర్కీ, బెన్ సియర్స్, నాథన్ స్మిత్ ఎంపికయ్యారు. ఈ ముగ్గురికి ఇదే తొలి ఐసీసీ టోర్నీ. పేసర్ జేకబ్ డఫీ ఈ రెండు టోర్నీల కోసం స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికయ్యాడు. ILT20 ప్లే ఆఫ్స్ నేపథ్యంలో లోకీ ఫెర్గూసన్ ట్రయాంగులర్ సిరీస్కు దూరమయ్యే అవకాశం ఉంది. అందుకే స్టాండ్ బైగా డఫీ ఎంపికయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ తమ తొలి మ్యాచ్ను ఆతిథ్య పాకిస్తాన్తో ఆడనుంది. టోర్నీ ఆరంభ రోజునే ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ తొలి ఎడిషన్లో (2000) న్యూజిలాండే విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఛాంపియన్స్ ట్రోఫీ-2025, పాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు.. మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, లోకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్స్టాండ్ బై: జేకబ్ డఫీపాకిస్తాన్లో జరిగే ట్రయాంగులర్ సిరీస్ షెడ్యూల్..ఫిబ్రవరి 8- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ (ముల్తాన్)ఫిబ్రవరి 10- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 12- పాకిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (ముల్తాన్)ఫిబ్రవరి 14- ఫైనల్ (ముల్తాన్)ఈ మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతాయి.ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్..ఫిబ్రవరి 19- పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్ -ఏ, కరాచీఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి, కరాచీఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 23- పాకిస్తాన్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ వర్సెస్ న్యూజిలాండ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా, గ్రూప్-బి,రావల్పిండిఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, లాహోర్ఫిబ్రవరి 27- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, గ్రూప్-ఏ, రావల్పిండిఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా, గ్రూప్-బి, లాహోర్మార్చి 01- దక్షిణాఫ్రికా వర్సెస్ ఇంగ్లాండ్, గ్రూప్-బి, కరాచీమార్చి 02- న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, గ్రూప్-ఏ, దుబాయ్మార్చి 04- మొదటి సెమీ ఫైనల్ (A1 వర్సెస్ B2), దుబాయ్మార్చి 05- రెండో సెమీ ఫైనల్ (B1 వర్సెస్ A2), లాహోర్మార్చి 09- ఫైనల్ఈ టోర్నీలో మ్యాచ్లన్నీ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసకర వీరుడు
న్యూజిలాండ్ ప్టార్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 38 ఏళ్ల గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 367 మ్యాచ్లు (మూడు ఫార్మాట్లలో) ఆడాడు. తన జట్టు తరఫున ఎన్నో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన గప్తిల్ కెరీర్లో ఓవరాల్గా 23 సెంచరీలు చేశాడు.2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన గప్తిల్ 47 టెస్ట్లు, 198 వన్డేలు, 122 టీ20లు ఆడాడు. టెస్ట్ల్లో 29.4 సగటున 2586 పరుగులు చేసిన గప్తిల్.. ఈ ఫార్మాట్లో మూడు సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. గప్తిల్ తన మూడు టెస్ట్ సెంచరీలను బంగ్లాదేశ్ (189), జింబాబ్వే (109), శ్రీలంకపై (156) చేశాడు. గప్తిల్ తన చివరి టెస్ట్ను 2016లో ఆడాడు.వన్డేల విషయానికొస్తే.. గప్తిల్ ఈ ఫార్మాట్లో 41.7 సగటున, 87.3 స్ట్రయిక్రేట్తో 7346 పరుగులు చేశాడు. ఇందులో 18 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్లో గప్తిల్ ఓ డబుల్ సెంచరీ కూడా చేశాడు. 2015లో గప్తిల్ వెస్టిండీస్పై 237 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ తరఫున వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్ గప్తిల్ మాత్రమే. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాళ్ల జాబితాలో గప్తిల్ రెండో స్థానంలో ఉన్నాడు.ఈ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (264) పేరిట ఉంది. వన్డేల్లో న్యూజిలాండ్ తరఫున మూడో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ గప్తిల్కు రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రమే గప్తిల్ కంటే ఎక్కువ పరుగులు చేశారు. 2009లోనే వన్డే అరంగేట్రం చేసిన గప్తిల్.. తన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ తరఫున వన్డే అరంగేట్రంలో సెంచరీ చేసిన తొలి ఆటగాడు గప్తిలే.టీ20ల విషయానికొస్తే.. 135 స్ట్రయిక్రేట్తో 31.8 సగటున 3531 పరుగులు చేసిన గప్తిల్ పొట్టి ఫార్మాట్లో న్యూజిలాండ్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్గా కెరీర్ను ముగించాడు. టీ20ల్లో గప్తిల్ 2 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీలు చేశాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన గప్తిల్ న్యూజిలాండ్ తరఫున అండర్-19 స్థాయి నుంచి ఆడుతున్నాడు. అంతర్జాతీయ కెరీర్ను ముగించిన సందర్భంగా గప్తిల్ తన సహచరులకు , కోచింగ్ స్టాఫ్కు, కుటంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని గప్తిల్ చెప్పుకొచ్చాడు. -
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన న్యూజిలాండ్ ప్లేయర్.. వీడియో వైరల్
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆల్రౌండర్ నాథన్ స్మిత్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద స్మిత్ పక్షిలా గాల్లోకి ఎగిరి సూపర్ మ్యాన్ క్యాచ్ పట్టుకున్నాడు. ఛేదనలో లంక ఇన్నింగ్స్ 29వ ఓవర్లో (ఆఖరి బంతికి) ఇది జరిగింది. విలియమ్ ఓరూర్కీ బౌలింగ్లో లంక బ్యాటర్ ఎషాన్ మలింగ రూమ్ తీసుకుని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకుని వికెట్కీపర్ వెనుక భాగంలో డీప్ థర్డ్ దిశగా గాల్లోకి ఎగిరింది. నాథన్ స్మిత్ కొద్ది మీటర్ల పాటు స్ప్రింట్ చేసి బౌండరీ రోప్కు ముందు అద్బుతమైన డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. NATHAN SMITH GRABS AN ABSOLUTE STUNNER. 🤯pic.twitter.com/wDknkRRFOV— Mufaddal Vohra (@mufaddal_vohra) January 8, 2025దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. క్రికెట్ అభిమానులు నాథన్ స్మిత్ విన్యాసానికి ముగ్దులవుతున్నారు. సూపర్ క్యాచ్ అంటూ కొనియాడుతున్నారు.కాగా, ఈ మ్యాచ్లో శ్రీలంక న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓడింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు. లంక బౌలర్లలో మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు పడగొట్టగా.. హసరంగ రెండు, ఎషాన్ మలింగ, అశిత ఫెర్నాండో తలో వికెట్ తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. లంక ఇన్నింగ్స్లో కమిందు మెండిస్ (64) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. చమిందు విక్రమసింఘే (17), జనిత్ లియనగే (22), అవిష్క ఫెర్నాండో (10) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ లంక టాప్ స్కోరర్ కమిందు వికెట్ సహా మూడు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
NZ Vs SL: తీక్షణ హ్యాట్రిక్ వృధా.. రెండో వన్డేలోనూ ఓడిన శ్రీలంక
శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. హ్యామిల్టన్ వేదికగా ఇవాళ (జనవరి 8) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షం కారణంగా 37 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 9 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (63 బంతుల్లో 79; 9 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద శతకం బాదగా.. వన్ డౌన్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (52 బంతుల్లో 62; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీ చేశాడు. డారిల్ మిచెల్ (38), గ్లెన్ ఫిలిప్స్ (22), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. విల్ యంగ్ 16, టామ్ లాథమ్ 1, నాథన్ స్మిత్ 0, మ్యాట్ హెన్రీ 1, విలియమ్ ఓరూర్కీ 3 పరుగులు (నాటౌట్) చేశారు.తీక్షణ హ్యాట్రిక్ఈ మ్యాచ్లో లంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. 35 ఓవర్లో ఆఖరి రెండు బంతులకు వరుసగా రెండు వికెట్లు తీసిన తీక్షణ.. ఆ తర్వాత 37వ ఓవర్ తొలి బంతికి మరో వికెట్ పడగొట్టి వన్డేల్లో తన తొలి హ్యాట్రిక్ను నమోదు చేశాడు. మిచెల్ సాంట్నర్ను తొలుత ఔట్ చేసిన తీక్షణ.. ఆ తర్వాత వరుసగా నాథన్ స్మిత్, మ్యాట్ హెన్రీని ఔట్ చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తం 8 ఓవర్లు వేసిన తీక్షణ 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణతో పాటు హసరంగ (2), ఎషాన్ మలింగ (1), అశిత ఫెర్నాండో (1) వికెట్లు తీశారు.అనంతరం 256 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. 22 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన శ్రీలంకను కమిందు మెండిస్ (64), జనిత్ లియనాగే (22) ఆదుకునే ప్రయత్నం చేశారు. లియనాగే 16వ ఓవర్ ఆఖరి బంతికి ఔట్ కావడంతో పరిస్థితి మొదటికి వచ్చింది. చమిందు విక్రమసింఘే (17) క్రీజ్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం వచ్చిన ఆటగాళ్లు పెవిలియన్కు క్యూ కట్టారు. ఫలితంగా శ్రీలంక 30.2 ఓవర్లలో 142 పరుగులకే చాపచుట్టేసింది. లంక ఇన్నింగ్స్లో నిస్సంక 1, అవిష్క ఫెర్నాండో 10, కుసాల్ మెండిస్ 2, అసలంక 4, హసరంగ 1, తీక్షణ 6, మలింగ 4 పరుగులు చేసి ఔటయ్యారు. కివీస్ పేసర్ విలియమ్ ఓరూర్కీ కీలకమైన కమిందు మెండిస్ వికెట్ పడగొట్టడంతో పాటు ఇద్దరు చివరి వరుస ఆటగాళ్లను పెవిలియన్కు పంపాడు. జేకబ్ డఫీ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, నాథన్ స్మిత్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీశారు.కాగా, మూడు మ్యాచ్ల సిరీస్లో న్యూజిలాండ్ తొలి వన్డేలోనూ విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే జనవరి 11న ఆక్లాండ్లో జరుగనుంది. -
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా.. కీలక ఆందోళనలను పరిష్కరించడానికి, న్యూజిలాండ్ తన వీసా.. ఉపాధి అవసరాలకు అనేక మార్పులను ప్రకటించింది.న్యూజిలాండ్ వీసాలోని మార్పులలో ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయిన్యూజిలాండ్ వీసా నిబంధనల్లో మార్పులుఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV) హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్కు తీసుకురావాలనుకుంటే.. వారు ఏడాదికి సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుండి మారలేదు. ఎందుకంటే వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా బాగా జీవించడానికి దీనిని ప్రవేశపెట్టారు.దేశంలో కార్మికుల కొరతను తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్పీరియన్స్ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కొత్త రూల్ మరింత మంది ఉద్యోగాల కోసం.. న్యూజిలాండ్ వెళ్ళడానికి సహాయపడుతుంది.న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ-ఎంట్రీ వీసా మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల పాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..ఆస్ట్రేలియన్ & న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ (ANZSCO) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలను పొందడానికి.. ఉద్యోగులు రెండేళ్ల ముందు వీసా నుంచి మూడు సంవత్సరాల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో సంవత్సరం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 2025 నుంచి.. ఏదైనా ఇతర పని లేదా స్టూడెంట్ వీసాల నుంచి AEWVకి మారాలనుకునే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం చూస్తున్న వలసదారులకు ఇది సహాయం చేస్తుంది. -
ఆకాశాన్నంటుతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అక్కడ న్యూ ఇయర్ వచ్చేసింది
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్లో న్యూ ఇయర్ వేడుకలు ప్రారంభమమయ్యాయి. 2025 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆక్లాండ్ వాసులు న్యూఇయర్ వేడుకల్ని ప్రారంభించారు. భారత్లో కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ వాసులు 2025లోకి అడుగుపెట్టారు. ఆనందోత్సాహాల మధ్య ఆక్లాండ్ స్కై టవర్ వద్ద న్యూఇయర్ వేడుకల్ని అట్టహాసంగా ప్రారంభించారు. కాగా, ప్రపంచంలో తొలిసారిగా కొత్త సంవత్సరంలోకి అడుగుకు పెట్టే నగరం ఆక్లాండ్ -
కిరిబాటి.. కొత్త సంవత్సరం వచ్చేసిందోచ్!
Happy New Year 2025: పాత ఒక రోత.. కొత్త ఒక వింత అంటే బాగోదేమో.. కానీ పాత జ్ఞాపకాలని మదిలో దాచుకుంటూ కొత్త ఆశల్ని భుజానకెత్తుకోవడం అంటే సరిగ్గా సరిపోతుంది కదా. మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. ఒక్కో దేశం ఒక్కో విధంగా కొత్త ఏడాదిలోకి ప్రవేశించబోతోంది.అయితే ఇప్పటికే పలు దేశాల్లో కొత్త ఏడాది ఉదయించింది’. ప్రపంచంలో అన్నింటికి కంటే ముందు సూర్యుడు ఉదయించే దేశాల్లో పసిఫిక్ మహాసముద్ర తీర ప్రాంత దేశాలు ముందు వరుసలో ఉంటాయి. అందులో కిరిబాటి అనే ద్వీప దేశం ఒకటి. సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే క్రమంలో ఆ భానుడి లేలేత కిరణాలు కిరిబాటి అనే చిన్న దేశం మీద ముందుగా పడతాయి. అంటే ఈ దేశమే ముందు నిద్ర లేస్తుంది అన్నమాట. ఇదొక ద్వీప దేశం. దీని జనాభా చాలా తక్కువ.ఇక్కడ జనాభా 1.34 లక్షలు అని ఒక అంచనా. మన లెక్కన ఒక అసెంబ్లీ నియోజవర్గం ఓటర్ల సంఖ్య కంటే చిన్న దేశం ఇది. భారత్లో డిసెంబర్ 31(3.30 PM) సూర్యుడు అస్తమించే సమయంలో అక్కడ జనవరి 1వ తేదీ వచ్చేస్తుంది. భారత్కు కిరిబాటికి ఇంచుమించు 8.30 గంటల సమయం వ్యత్యాసం ఉంది.🎆✨ Happy New Year 2025! ✨🎆The first to welcome 2025: 🎉Christmas Island, Kiribati: 5 AM EST (3:30 PM IST)Chatham Islands, NZ: 5:15 AM EST (3:45 PM IST)Auckland & Wellington, NZ: 6 AM EST (4:30 PM IST)The countdown begins! 🌍#HappyNewYear #HappyNewYear2025 pic.twitter.com/RRqFy7PgT8— Shahadat Hossain (@shsajib) December 31, 2024 భూమిపై ప్రకృతి సౌందర్యం, ప్రజలు తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి. ప్రపంచంలోని అత్యుత్తమ ప్రదేశాల టాప్-10 జాబితాలో కూడా ఈ ద్వీప దేశానికి చోటు ఉండటం విశేషం. ఇది పసిఫిక్ మహాసముద్రం మధ్యలో, న్యూజిలాండ్కు ఉత్తరాన ఉంది. భారత్లో ( 12 am అయిన సందర్భంలో)కొత్త ఏడాది ప్రారంభం కావడానికంటే ముందే నూతన సంవత్సరం జరుపుకునే పలు దేశాల జాబితా వరుస క్రమంలో..కిరిబాటి(8.30 am on Jan 1)సమోవా, టోంగా((7.30 am on Jan 1)న్యూజిలాండ్((7.30 am on January 1)రష్యా, ఫిజి((6.30 am on January 1)ఆస్ట్రేలియా((5.30 am on January 1)పాపువా న్యూగినియా((4.30 am on January 1)ఇండోనేషియా, జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా( 1.30 am on January 1)చైనా, మలేషియా, సింగపూర్(2.30 am on January 1)వియాత్నాం, థాయ్లాండ్( 1.30 am on January 1)మయన్మార్(1 am on January 1)బంగ్లాదేశ్, కజికిస్తాన్, భూటాన్( 12.30 am on January 1)నేపాల్(12.15 am on January 1) -
నిప్పులు చెరిగిన డఫీ.. లంకను చిత్తు చేసిన కివీస్.. సిరీస్ కైవసం
మౌంట్ మాంగనూయ్ వేదికగా శ్రీలంకతో (Sri Lanka) జరిగిన రెండో టీ20లో ఆతిథ్య న్యూజిలాండ్ (New Zealand) 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్ సిరీస్ను కివీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.ఇవాళ (డిసెంబర్ 30) జరిగిన రెండో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి న్యూజిలాండ్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. టిమ్ రాబిన్సన్ (41), మార్క్ చాప్మన్ (42), మిచెల్ హే (41 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రచిన్ రవీంద్ర 1, గ్లెన్ ఫిలిప్స్ 23, డారిల్ మిచెల్ 18 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో మిచెల్ హే (Mitchell Hay) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో న్యూజిలాండ్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. లంక బౌలర్లలో వనిందు హసరంగ రెండు వికెట్లు పడగొట్టగా.. నువాన్ తుషార, మతీశ పతిరణ తలో వికెట్ దక్కించుకున్నారు.187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. జేకబ్ డఫీ (Jacob Duffy) (4-0-15-4) నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాశించాడు. మ్యాట్ హెన్రీ, మిచెల్ సాంట్నర్ తలో రెండు.. మైఖేల్ బ్రేస్వెల్, జకరీ ఫోల్క్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు. లంక ఇన్నింగ్స్లో కుసాల్ పెరీరా (48) టాప్ స్కోరర్గా నిలువగా.. పథుమ్ నిస్సంక (37), చరిత్ అసలంక (20), కుసాల్ మెండిస్ (10) రెండంకెల స్కోర్లు చేశారు. కమిందు మెండిస్ (7), అవిష్క ఫెర్నాండో (5), వనిందు హసరంగ (1), మహీశ్ తీక్షణ (0), బినుర ఫెర్నాండో (3), మతీశ పతిరణ (0) విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 నెల్సన్ వేదికగా వచ్చే ఏడాది జనవరి 2న జరుగనుంది.తొలి మ్యాచ్లోనూ ఇబ్బంది పెట్టిన డఫీన్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ తలో టీ20లోనూ లంక బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఆ మ్యాచ్లో డఫీ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. తద్వారా ఛేదనలో శ్రీలంక ఇబ్బంది పడి ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది.తొలి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (62), మైఖేల్ బ్రేస్వెల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, హసరంగ, బినుర తలో రెండు వికెట్లు తీయగా.. పతిరణ ఓ వికెట్ దక్కించుకున్నాడు.173 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక.. ఓపెనర్లు నిస్సంక (90), కుసాల్ మెండిస్ (46) రాణించడంతో ఓ దశలో గెలుపు దిశగా సాగింది. అయితే డఫీ సహా కివీస్ పేసర్లు మ్యాట్ హెన్రీ (2/28), జకరీ ఫోల్క్స్ (2/41) ఒక్కసారిగా విజృంభించడంతో శ్రీలంక ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి లక్ష్యానికి 9 పరుగుల దూరంలో నిలిచిపోయింది. లంక ఇన్నింగ్స్లో ఓపెనర్లు మినహా ఎవ్వరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయలేకపోయారు. -
న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు ప్రకటన
న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం 16 మంది సభ్యుల శ్రీలంక జట్టును ఇవాళ (డిసెంబర్ 18) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా చరిత్ అసలంక వ్యవహరించనున్నాడు. ఈ సిరీస్ కోసం శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ దునిత్ వెల్లలగేను విడిచిపెట్టింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్తో తలపడిన లంక జట్టులో ఇది ఏకైక మార్పు.ప్రస్తుతం ప్రకటించిన లంక జట్టు పేస్ మరియు స్పిన్ బౌలర్లతో సమతూకంగా ఉంది. గత న్యూజిలాండ్ సిరీస్లో అరంగేట్రం చేసిన సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్ చమిందు విక్రమసింఘే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రముఖ ఆల్రౌండర్ వనిందు హసరంగ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. హసరంగ స్పిన్ టీమ్లో మహీశ్ తీక్షణ, లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండడ్సే ఉన్నారు.లంక పేస్ విభాగాన్ని అశిత ఫెర్నాండో లీడ్ చేయనున్నాడు. నువాన్ తుషార, మతీష పతిరణ, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ బినుర ఫెర్నాండో పేస్ టీమ్లో సభ్యులుగా ఉన్నారు. బ్యాటింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ అసలంక, నిస్సంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, చండీమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్సతో ఈ విభాగం పటిష్టంగా ఉంది.కాగా, న్యూజిలాండ్ పర్యటనలో తొలి టీ20 డిసెంబర్ 28న జరుగనుంది. మౌంట్ మాంగనూయ్లోని బే ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం డిసెంబర్ 30వ తేదీ రెండో టీ20 జరుగనుంది. తొలి టీ20 జరిగిన చోటే ఈ మ్యాచ్ కూడా జరుగనుంది. వచ్చే ఏడాది జనవరి 2న మూడో టీ20 జరుగనుంది. నెల్సన్లోని సాక్స్టన్ ఓవల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. టీ20 సిరీస్ అనంతరం జనవరి 5, 8, 11 తేదీల్లో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగనుంది.న్యూజిలాండ్తో టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు..చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో, దినేష్ చండిమాల్, కమిందు మెండిస్, భానుక రాజపక్స, వనిందు హసరంగా, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరణ, జెఫ్రీ వాండర్సే, నువాన్ తుషార, అశిత ఫెర్నాండో, బినుర ఫెర్నాండో, మహేశ్ తీక్షణ -
న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్గా మిచెల్ సాంట్నర్
న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల (వన్డే, టీ20) ఫుల్ టైమ్ కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ న్యూజిలాండ్ అధికారికంగా ప్రకటించింది. సాంట్నర్.. కేన్ విలియమ్సన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరిస్తాడు. కేన్ మామ ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ అనంతరం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 32 ఏళ్ల సాంట్నర్ న్యూజిలాండ్ తరఫున 100కు పైగా వన్డేలు, టీ20లు ఆడాడు. సాంట్నర్ ఇప్పటికే 24 టీ20లు, 4 వన్డేల్లో న్యూజిలాండ్ కెప్టెన్గా వ్యవహరించాడు. న్యూజిలాండ్ ఫుల్ టైమ్ కెప్టెన్గా మిచెల్ సాంట్నర్ ప్రస్తానం ఈ నెలాఖరులో జరిగే శ్రీలంక సిరీస్తో మొదలవుతుంది. సమీప భవిష్యత్తులో న్యూజిలాండ్ బిజీ షెడ్యూల్ (పరిమిత ఓవర్ల సిరీస్లు) కలిగి ఉంది. శ్రీలంకతో సిరీస్ల అనంతరం పాక్తో కలిసి ట్రయాంగులర్ సిరీస్లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీని తర్వాత స్వదేశంలో పాక్తో టీ20, వన్డే సిరీస్లు ఆడాల్సి ఉంది.న్యూజిలాండ్ పరిమిత ఓవర్ల జట్ల కెప్టెన్గా ఎంపిక కావడంపై సాంట్నర్ స్పందిస్తూ.. ఇది చాలా గొప్ప గౌరవమని అన్నాడు. చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు న్యూజిలాండ్కు ఆడాలనేది తన కల అని చెప్పాడు. అలాంటిది ఏకంగా తన జట్టును ముందుండి నడిపించే అవకాశం రావడం అదృష్టమని తెలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టడం సవాలుగా భావిస్తున్నానని అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ రెడ్ బాల్ (టెస్ట్) కెప్టెన్గా టామ్ లాథమ్ కొనసాగనున్నాడు. -
న్యూజిలాండ్తో మూడో టెస్ట్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
హ్యామిల్టన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లో ఇంగ్లండ్ ముందు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేన్ విలియమ్సన్ (156) సెంచరీతో కదంతొక్కడంతో న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ గెలవాలంటే 658 పరుగులు చేయాలి.న్యూజిలాండ్ భారీ స్కోర్కేన్ విలియమ్సన్తో పాటు విల్ యంగ్ (60), డారిల్ మిచెల్ (60), రచిన్ రవీంద్ర (44), టామ్ బ్లండెల్ (44 నాటౌట్), మిచెల్ సాంట్నర్ (49) రాణించడంతో సెకెండ్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. విలియమ్సన్ ఔటైన తర్వాత న్యూజిలాండ్ టెయిలెండర్లు వేగంగా పరుగులు రాబట్టారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేకబ్ బేతెల్ 3, బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్ చెరో 2, పాట్స్, అట్కిన్సన్, రూట్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులకు ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్ (32) టాప్ స్కోరర్గా నిలువగా.. జాక్ క్రాలే (21), బెన్ డకెట్ (11), జేకబ్ బేతెల్ (12), ఓలీ పోప్ (24), బెన్ స్టోక్స్ (27) రెండంకెల స్కోర్లు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో పాట్స్ 4, అట్కిన్సన్ 3, బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
NZ Vs ENG 3rd Test: చరిత్ర సృష్టించిన కేన్ మామ
హ్యామిల్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ సెంచరీ చేశాడు. కేన్కు టెస్ట్ల్లో ఇది 33వ సెంచరీ. జేకబ్ బేతెల్ బౌలింగ్లో సిక్సర్ బాది కేన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేన్ తన సెంచరీ మార్కును 137 బంతుల్లో అందుకున్నాడు. కేన్ సెంచరీలో 14 బౌండరీలు, ఓ సిక్సర్ ఉన్నాయి. కేన్ తన కెరీర్లో 105 టెస్ట్లు ఆడి 54.91 సగటున 33 సెంచరీలు, 37 హాఫ్ సెంచరీల సాయంతో 9225 పరుగులు చేశాడు.చరిత్ర సృష్టించిన కేన్ మామఇంగ్లండ్తో జరుగుతున్న మూడో టెస్ట్లో సెంచరీ చేసిన అనంతరం కేన్ మామ చరిత్ర సృష్టించాడు. ఒకే వేదికపై ఐదు వరుస సెంచరీలు చేసిన తొలి బ్యాటర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేన్ హ్యామిల్టన్ గడ్డపై వరుసగా ఐదు టెస్ట్ సెంచరీలు చేశాడు. హ్యామిల్టన్లో కేన్ సగటు 97.69గా ఉంది. ఇక్కడ కేన్ 12 టెస్ట్ మ్యాచ్లు ఆడి 1563 పరుగులు చేశాడు.ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగిన రికార్డు క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్మన్ పేరిట ఉంది. బ్రాడ్మన్ మెల్బోర్న్లో 128.53 సగటు కలిగి ఉన్నాడు. బ్రాడ్మన్ తర్వాత ఒకే వేదికపై అత్యధిక సగటు కలిగి రికార్డు వీవీఎస్ లక్ష్మణ్ పేరిట ఉంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో లక్ష్యణ్ సగటు 110.63గా ఉంది.మ్యాచ్ విషయానికొస్తే.. కేన్ మామ సెంచరీతో కదంతొక్కడంతో మూడో టెస్ట్లో న్యూజిలాండ్ పట్టు బిగించింది. మూడో రోజు టీ విరామం సమయానికి న్యూజిలాండ్ 478 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెకెండ్ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ స్కోర్ 274/4గా ఉంది. కేన్ విలియమ్సన్ (123), డారిల్ మిచెల్ (18) క్రీజ్లో ఉన్నారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (60) అర్ద సెంచరీతో రాణించగా.. రచిన్ రవీంద్ర (44) పర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. పాట్స్, అట్కిన్సన్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 143 పరుగులకే ఆలౌటైంది. మ్యాట్ హెన్రీ (4/48), విలియమ్ ఓరూర్కీ (3/33), మిచెల్ సాంట్నర్ (3/7) ఇంగ్లండ్ను దెబ్బకొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జో రూట్ (32) టాప్ స్కోరర్గా నిలిచాడు.దీనికి ముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (63), సాంట్నర్ (76) అర్ద సెంచరీలతో రాణించగా.. విల్ యంగ్ (42), కేన్ విలియమ్సన్ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
న్యూజిలాండ్తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన
హ్యామిల్టన్ వేదికగా న్యూజిలాండ్తో రేపటి నుంచి (డిసెంబర్ 14) ప్రారంభంకాబోయే మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టులో ఇంగ్లండ్ మేనేజ్మెంట్ ఓ మార్పు చేసింది. గత రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడిన క్రిస్ వోక్స్ స్థానంలో మాథ్యూ పాట్స్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ ఒక్క మార్పు మినహా రెండో టెస్ట్ ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించనుంది ఇంగ్లండ్ మేనేజ్మెంట్.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో ఇంగ్లండ్ గెలుపొందింది. మరో టెస్ట్ మిగిలుండగానే ఇంగ్లండ్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. 2008 తర్వాత న్యూజిలాండ్ గడ్డపై ఇంగ్లండ్కు ఇది తొలి టెస్ట్ సిరీస్ విజయం.తొలి టెస్ట్లో 8 వికెట్ల తేడాతో విజయంక్రైస్ట్చర్చ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు.323 పరుగుల తేడాతో విజయంవెల్లింగ్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 323 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ తరఫున హ్యారీ బ్రూక్ (123, 55), జో రూట్ (106) సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో దారుణంగా విఫలమైంది.మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఒల్లీ పోప్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే, మాథ్యూ పాట్స్, షోయబ్ బషీర్ -
WTC Final: న్యూజిలాండ్ అవకాశాలపై నీళ్లు చల్లిన ఐసీసీ
ఇంగ్లండ్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) షాకిచ్చింది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ఇరు జట్ల మ్యాచ్ ఫీజ్లో 15 శాతం కోత విధించింది. అలాగే ఇరు జట్లకు మూడు డబ్ల్యూటీసీ పాయింట్లు పెనాల్టీ పడ్డాయి.ఐసీసీ తీసుకున్న ఈ చర్య వల్ల ఇంగ్లండ్కు పెద్దగా నష్టమేమీ లేనప్పటికీ.. న్యూజిలాండ్కు మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరే అవకాశాలు దెబ్బతిన్నాయి. తాజా పెనాల్టీ అనంతరం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ ఐదో స్థానానికి పడిపోయింది. దీనికి ముందు ఆ జట్టు శ్రీలంకతో పాటు సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉండింది.న్యూజిలాండ్.. ఇంగ్లండ్తో తదుపరి జరుగబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరలేదు. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పర్సెంటేజీ 47.92గా ఉంది. ఇంగ్లండ్తో తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో గెలిచినా న్యూజిలాండ్ పాయింట్ల పర్సెంటేజీ 55.36 శాతం వరకు మాత్రమే చేరుకుంటుంది. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరేందుకు ఇది సరిపోదు. కాబట్టి ఐసీసీ తాజాగా విధించిన పాయింట్ల కోత న్యూజిలాండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను దెబ్బతీసిందనే చెప్పాలి. మరోవైపు న్యూజిలాండ్తో పాటు పాయింట్ల కోత విధించబడ్డ ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి ఇదివరకే అనధికారికంగా నిష్క్రమించింది. ప్రస్తుతం ఆ జట్టు 40.75 శాతం పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది.ఇదిలా ఉంటే, క్రైస్ట్చర్చ్ వేదికగా తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో హ్యారీ బ్రూక్ (171), బ్రైడన్ కార్స్ (10 వికెట్లు) సత్తా చాటి ఇంగ్లండ్ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి మొదలవుతుంది. -
న్యూజిలాండ్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
క్రైస్ట్చర్చ్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్ట్లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. గ్లెన్ ఫిలిప్స్ 58 పరుగుల అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో నాలుగు వికెట్లు పడగొట్టగా.. గస్ అట్కిన్సన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.బ్రూక్ భారీ శతకంఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో హ్యారీ బ్రూక్ భారీ సెంచరీతో (171) కదం తొక్కాడు. ఓలీ పోప్ (77), బెన్ స్టోక్స్ (80) అర్ద శతకాలతో రాణించారు. బెన్ డకెట్ (46), గస్ అట్కిన్సన్ (48), బ్రైడన్ కార్స్ (33 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. నాథన్ స్మిత్ మూడు, టిమ్ సౌథీ రెండు, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ దక్కించుకున్నారు.నిప్పులు చెరిగిన బ్రైడన్ కార్స్తొలి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్కు దెబ్బకొట్టిన బ్రైడన్ కార్స్ సెకెండ్ ఇన్నింగ్స్లోనూ సత్తా చాటాడు. ఈ ఇన్నింగ్స్లో కార్స్ 6 వికెట్లు పడగొట్టాడు. కార్స్తో పాటు క్రిస్ వోక్స్ (3/59), అట్కిన్సన్ (1/57) కూడా చెలరేగడంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 254 పరుగులకు చాపచుట్టేసింది. కివీస్ ఇన్నింగ్స్లో విలియమ్సన్ (61), డారిల్ మిచెల్ (84) అర్ద సెంచరీలతో రాణించారు.ఆడుతూపాడుతూ విజయతీరాలకు..!104 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 12.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. అరంగేట్రం ఆటగాడు జాకబ్ బేతెల్ 37 బంతుల్లో 50 పరుగులు.. జో రూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. బెన్ డకెట్ 27, జాక్ క్రాలే ఒక్క పరుగు చేసి ఔటయ్యారు. మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన బ్రైడన్ కార్స్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టెస్ట్ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. -
శతక్కొట్టిన హ్యారీ బ్రూక్.. సెకెండ్ ఫాస్టెస్ట్ ప్లేయర్గా రికార్డు
క్రైస్ట్చర్చ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాడు హ్యారీ బ్రూక్ సెంచరీతో కదంతొక్కాడు. బ్రూక్ తన కెరీర్లో ఏడో టెస్ట్ సెంచరీని 123 బంతుల్లో పూర్తి చేశాడు. బ్రూక్ సెంచరీ మార్కును బౌండరీతో చేరుకోవడం విశేషం. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన బ్రూక్.. ఓలీ పోప్తో (77) కలిసి ఐదో వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. అనంతరం బ్రూక్.. బెన్ స్టోక్స్తో (32 నాటౌట్) కలిసి ఆరో వికెట్కు అజేయమైన 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ప్రస్తుతం బ్రూక్ 126 పరుగుల వద్ద ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. 71 ఓవర్ల అనంతరం ఇంగ్లండ్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 309 పరుగులుగా ఉంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంగ్లండ్ ఇంకా 39 పరుగులు మాత్రమే వెనుకపడి ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్రూక్ఈ మ్యాచ్లో బ్రూక్ 2000 పరుగుల మైలురాయిని అధిగమించాడు. టెప్ట్ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. బ్రూక్ 2000 పరుగుల మార్కును తాకేందుకు 2300 బంతులు తీసుకున్నాడు. ఈ జాబితాలో బ్రూక్ సహచరుడు బెన్ డకెట్ టాప్లో ఉన్నాడు. డకెట్ 2293 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.టెస్ట్ల్లో వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితా..బెన్ డకెట్-2293హ్యారీ బ్రూక్-2300టిమ్ సౌథీ-2418అడమ్ గిల్క్రిస్ట్-2483 -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్యాచ్.. నమ్మశక్యం కాని రీతిలో..!
క్రికెట్ చరిత్రలో అత్యంత అద్భుతమైన క్యాచ్కు న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ వేదికైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఆటగాడు గ్లెన్ ఫిలిప్స్ నమ్మశక్యం కాని రీతిలో ఒంటిచేత్తో డైవింగ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి బ్యాటర్ ఓలీ పోప్ సహా ఫీల్డ్లో ఉన్న వారందరికి మతి పోయింది. ఫిలిప్స్ విన్యాసం చూసి నెటిజన్లు ముగ్దులైపోతున్నారు. ఇదేం క్యాచ్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ క్యాచ్కు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.Glenn Phillips adds another unbelievable catch to his career resume! The 151-run Brook-Pope (77) partnership is broken. Watch LIVE in NZ on TVNZ DUKE and TVNZ+ #ENGvNZ pic.twitter.com/6qmSCdpa8u— BLACKCAPS (@BLACKCAPS) November 29, 2024వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్ బ్యాటింగ్ 53వ ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టిమ్ సౌథీని బౌలింగ్కు దించాడు. అప్పటికే ఓలీ పోప్.. హ్యారీ బ్రూక్తో కలిసి ఐదో వికెట్కు 151 పరుగులు జోడించాడు. సౌథీ వేసిన షార్ట్ పిచ్ డెలివరీకి ఓలీ పోప్ కట్ షాట్ ఆడగా.. గ్లెన్ ఫిలిప్స్ అకస్మాత్తుగా ఫ్రేమ్లోకి వచ్చి అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఫలితంగా పోప్ 77 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ బాట పట్టాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓలీ పోప్ ఔటైన అనంతరం కెప్టెన్ బెన్ స్టోక్స్ క్రీజ్లోకి వచ్చాడు. బ్రూక్ 86 పరుగుల వద్ద బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ స్కోర్ 232/5గా ఉంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 0, బెన్ డకెట్ 46, జాకబ్ బేతెల్ 10, జో రూట్ 0, ఓలీ పోప్ 77 పరుగులు చేసి ఔటయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో నాథన్ స్మిత్ 2, టిమ్ సౌథీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓరూర్కీ తలో వికెట్ పడగొట్టారు.అందకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 348 పరుగులకు ఆలౌటైంది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (58 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీ చేశాడు. టామ్ లాథమ్ (47), రచిన్ రవీంద్ర (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్ తలో 4 వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఇంగ్లండ్తో తొలి టెస్ట్.. సెంచరీ చేజార్చుకున్న కేన్ మామ
క్రైస్ట్చర్చ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్ట్లో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కేన్ విలియమ్సన్ (93) ఏడు పరుగుల తేడాతో 33వ సెంచరీ మిస్ అయ్యాడు. కివీస్ ఇన్నింగ్స్లో కెప్టెన్ టామ్ లాథమ్ 47, డెవాన్ కాన్వే 2, రచిన్ రవీంద్ర 34, డారిల్ మిచెల్ 19, టామ్ బ్లండెల్ 17, నాథన్ స్మిత్ 3, మ్యాట్ హెన్రీ 18 పరుగులు చేసి ఔట్ కాగా.. గ్లెన్ ఫిలిప్స్ (41), టిమ్ సౌథీ (10) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ తలో రెండు వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్లో విలియమ్సన్, రచిన్ రవీంద్ర క్రీజ్లో ఉండగా న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. అయితే షోయబ్ బషీర్ స్వల్ప వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి న్యూజిలాండ్ను దెబ్బకొట్టాడు. కాగా, గాయం కారణంగా కేన్ విలియమ్సన్ భారత్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ను భారత్ 0-3 తేడాతో న్యూజిలాండ్కు కోల్పోయింది.ఆరేళ్లలో తొలిసారి..ఈ మ్యాచ్లో కేన్ సెంచరీ సాధిస్తాడని అంతా అనుకున్నారు. అయితే కేన్ అట్కిన్సన్ బౌలింగ్లో టెంప్టింగ్ షాట్ ఆడి జాక్ క్రాలే చేతికి చిక్కాడు. కేన్ 90ల్లో ఔట్ కావడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. విలియమ్సన్ తన చివరి టెస్ట్ సెంచరీని ఇదే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాపై సాధించాడు. -
‘క్రో–థోర్ప్’ ట్రోఫీ కోసం న్యూజిలాండ్, ఇంగ్లండ్ పోరు
లండన్: భారత్, ఆ్రస్టేలియాల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లాగే ఇకపై న్యూజిలాండ్, ఇంగ్లండ్ల జట్ల మధ్య ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ నిర్వహించనున్నారు. న్యూజిలాండ్ దివంగత దిగ్గజం మార్టిన్ క్రో, ఇంగ్లండ్ దివంగత లెజెండ్ గ్రాహం థోర్ప్ల పేరిట ఈ ఏడాది నుంచి ద్వైపాక్షిక సిరీస్ అంకురార్పణ జరగనుంది. విజేతకు బహూకరించే ట్రోఫీకి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఆ ఇద్దరు దిగ్గజ క్రికెటర్ల బ్యాట్లను ఉపయోగించి ‘క్రో–థోర్ప్ ట్రోఫీ’ని రూపొందించారు. న్యూజిలాండ్కు చెందిన ప్రముఖ డిజైనర్ డేవిడ్ ఎన్గవాటి ఈ కలప (బ్యాట్) ట్రోఫీని తయారు చేశారు. ప్రపంచ శ్రేణి కళాకృతులను, వినియోగదారుల అభిరుచులకు తగ్గ ఆకృతులను (కస్టమ్ డిజైన్) తయారు చేయడంలో ‘మహు క్రియేటివ్’ సంస్థకు మంచి పేరుంది. డేవిడ్కు చెందిన ఈ సంస్థే గతంలో కివీస్, సఫారీల మధ్య జరిగిన టోర్నీ కోసం ‘తంగివాయ్ షీల్డ్’ను రూపొందించింది. దిగ్గజ క్రికెటర్ల విషయానికొస్తే అసలైన క్రికెట్ ఫార్మాట్ (టెస్టు)లో అటు మారి్టన్ క్రో... ఇటు గ్రాహం థోర్ప్ అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ముద్ర వేశారు. తన కెరీర్లో 77 టెస్టులాడిన క్రో 45.36 సగటుతో 5444 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 18 అర్ధసెంచరీలున్నాయి. 143 వన్డేల్లో 38.55 సగటుతో 4704 పరుగులు సాధించాడు. 4 శతకాలు, 34 అర్ధశతకాలు బాదాడు. థోర్ప్ సరిగ్గా 100 టెస్టులాడాడు. 44.66 సగటుతో 6744 పరుగులు చేశాడు. 16 సెంచరీలు, 39 ఫిఫ్టీలున్నాయి. వన్డే కెరీర్లో 82 మ్యాచ్ల్లో 37.18 సగటుతో 2380 పరుగులు చేశాడు. 21 అర్ధసెంచరీలున్నాయి. సాధారణంగా క్రికెట్ ట్రోఫీలన్నీ లోహం (మెటల్)తోనే తయారవుతాయి. కానీ ‘కో–థోర్ప్ ట్రోఫీ’ మాత్రం భిన్నమైంది. ఇరు దిగ్గజ క్రికెటర్ల కుటుంబాలు బ్యాట్లు ఇవ్వడంతో డేవిడ్ తన నైపుణ్యంతో కలప ‘టోఫీ’గా మలిచాడు. దీన్ని మారి్టన్ సోదరి డెబ్ క్రో, మాజీ ఇంగ్లండ్ సారథి మైకేల్ అథర్టన్ కలిసి గురువారం క్రైస్ట్చర్చ్లో మొదలయ్యే తొలి టెస్టు సందర్భంగా జరిగే కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు. -
న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్ జట్టుకు ఎదురుదెబ్బ
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు వికెట్కీపర్ బ్యాటర్ జోర్డన్ కాక్స్ కుడి చేతి బొటన వేలు ఫ్రాక్చర్ అయ్యింది. క్వీన్టౌన్లో జరుగుతున్న నెట్ సెషన్ సందర్భంగా కాక్స్ గాయపడ్డాడు. గాయం కారణంగా కాక్స్ న్యూజిలాండ్తో జరిగే టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కాక్స్కు రీప్లేస్మెంట్ను ప్రకటించాల్సి ఉంది.కాగా, క్రైస్ట్ చర్చ్ వేదికగా నవంబర్ 28 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్లో కాక్స్ అరంగేట్రం చేయాల్సి ఉండింది. అయితే ఈ లోపే అతను గాయపడి డెబ్యూ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. కాక్స్ జేమీ స్మిత్ స్థానంలో స్టాండ్ ఇన్ వికెట్కీపర్గా న్యూజిలాండ్ టూర్కు ఎంపికయ్యాడు. జేమీ స్మిత్ ప్రస్తుతం పితృత్వ సెలవులో ఉన్నాడు.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టు న్యూజిలాండ్ ఎలెవెన్తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. జోర్డన్ కాక్స్ ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో పాల్గొన్నాడు. ఆతర్వాత అతను గాయపడ్డాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చింది. తొలి ఇన్నింగ్స్లో జాక్ క్రాలే (94), ఓలీ పోప్ (42).. రెండో ఇన్నింగ్స్లో జో రూట్ (82 నాటౌట్), బెన్ స్టోక్స్ (59) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగింది.న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ఇంగ్లండ్ జట్టు..హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జాక్ క్రాలే, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాకబ్ బేతెల్, రెహాన్ అహ్మద్, క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, ఓలీ పోప్ (వికెట్కీపర్), , షోయబ్ బషీర్, గస్ అట్కిన్సన్, ఓల్లీ స్టోన్, జాక్ లీచ్, మాథ్యూ పాట్స్ఇంగ్లండ్తో తొలి టెస్ట్కు న్యూజిలాండ్ జట్టు..గ్లెన్ ఫిలిప్స్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, నాథన్ స్మిత్, రచిన్ రవీంద్ర, టామ్ లాథమ్ (కెప్టెన్), టామ్ బ్లండెల్ (వికెట్కీపర్), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, మ్యాట్ హెన్రీ, విలియమ్ ఓ రూర్కీ, టిమ్ సౌథీషెడ్యూల్.. నవంబర్ 28-డిసెంబర్ 2 వరకు- తొలి టెస్ట్ (క్రైస్ట్ చర్చ్)డిసెంబర్ 6-10 వరకు- రెండో టెస్ట్ (వెల్లింగ్టన్)డిసెంబర్ 14-18 వరకు- మూడో టెస్ట్ (హ్యామిల్టన్) -
శ్రీలంక, న్యూజిలాండ్ మూడో వన్డే రద్దు
పల్లెకెలె వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 19) జరగాల్సిన మూడో వన్డే వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 21 ఓవర్ల పాటు మ్యాచ్ సజావుగా సాగింది. ఆతర్వాత వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్ ఆగిపోయే సమయానికి న్యూజిలాండ్ వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. టిమ్ రాబిన్సన్ 9 పరుగులు చేసి ఔట్ కాగా.. విల్ యంగ్ 56, హెన్రీ నికోల్స 46 పరుగులతో అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో మొహమ్మద్ షిరాజ్కు ఓ వికెట్ దక్కింది.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో శ్రీలంక తొలి రెండు మ్యాచ్ల్లో నెగ్గింది. తద్వారా 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్కు ముందు జరిగిన రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. రెండు మ్యాచ్ల టీ20, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. -
నిరసన డ్యాన్సులు..
-
న్యూజిలాండ్ - పార్లమెంట్ దద్దరిల్లింది
-
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. 18 ఏళ్ల కెరీర్కు గుడ్ బై!
న్యూజిలాండ్ స్టార్ పేసర్ టిమ్ సౌథీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 35 ఏళ్ల సౌథీ టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. ఈ ఏడాది డిసెంబర్లో తన హోం గ్రౌండ్( హామిల్టన్లోని సెడాన్ పార్క్)లో ఇంగ్లండ్తో జరగనున్న మ్యాచ్ అనంతరం టెస్టులకు విడ్కోలు పలకనున్నట్లు సౌథీ వెల్లడించాడు.ఒకవేళ కివీస్ ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తే మాత్రం అతడు తన దేశం తరపున ఆడేందుకు అందుబాటులో ఉండనున్నాడు. అదే విధంగా దేశీవాళీ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లో కొనసాగనున్నట్లు ఈ కివీ స్టార్ పేసర్ చెప్పుకొచ్చాడు. "న్యూజిలాండ్కు ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. 18 సంవత్సరాలుగా బ్లాక్క్యాప్స్ కోసం ఆడటం నాకు చాలా స్పెషల్. టెస్టు క్రికెట్కు నా హృదయంలో ప్రత్యేక స్ధానం ఉంది. ఏ జట్టుపై అయితే నేను టెస్టు క్రికెట్ అరంగేట్రం చేశానో, ఇప్పుడు అదే జట్టుపై నా కెరీర్ను ముగించనున్నాను. నాకు బాగా ఇష్టమైన మూడు మైదానాల్లో సెడాన్ పార్క్ ఒకటి.అందుకే అక్కడే టెస్టులకు విడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను"అని సౌథీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. కాగా 2008లో ఇంగ్లండ్పై సౌథీ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్లో కివీస్ తరపున ఇప్పటివరకు 104 టెస్టులు ఆడిన సౌథీ.. 385 వికెట్లతో పాటు 2185 పరుగులు సాధించాడు. మరోవైపు 161 వన్డేల్లో 742 పరుగులు, 221 వికెట్లు తీశాడు. 125 టీ20లు ఆడిన సౌథీ 303 పరుగులు, 164 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.చదవండి: సూర్యకుమార్ వల్లే సాధ్యమైంది -
New Zealand: ఆమె మళ్లీ వచ్చింది.. దద్దరిల్లిన పార్లమెంట్!
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పార్లమెంట్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీ హన-రాహితి ‘హక’ వినూత్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బిల్లు పేపర్లను చించేస్తూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో మరోసారి వైరల్గా మారింది.న్యూజిలాండ్లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా హన-రాహితి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్లమెంట్లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తమ కమ్యూనిటీ(మావోరి కమ్యూనిటీ)పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం సంచలనం రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక, తాజాగా మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు.తాజాగా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓ బిల్లును వ్యతిరేకిస్తూ హన ‘హక’ ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్లమెంట్లో బిల్లు పేపర్లు చించేస్తూ అధికార సభ్యులను చూస్తూ కోపంతో ఊగిపోయారు. ఇక, వెంటనే ఆమెకు మద్దతుగా సహచర ఎంపీలు, గ్యాలరీలో ఉన్నవారు కూడా గళం కలపడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు.🇳🇿 Māori MPs performing the Haka in New Zealand Parliament ripping apart a bill redefining the Treaty of Waitangi.The Treaty of Waitangi is a document of central importance to the history of New Zealand, its constitution, and its national mythos. pic.twitter.com/OeUZ0g1UMj— Lord Bebo (@MyLordBebo) November 14, 2024ఇదిలా ఉండగా.. ఆమె గత ఏడాది అక్టోబర్లో నానాయా మహుతా నుంచి పోటీ చేసి హన-రాహితి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆమె (మావోరి కమ్యూనిటీ) గిరిజనుల కోసం పోరాడుతున్నారు. ఆమె హంట్లీ అనే ఓ చిన్న పట్టణానికి చెందింది. ఇక జనవరిలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ‘నేను మీ కోసం చనిపోతాను. కానీ నేను మీకోసం కూడా జీవిస్తాను. నేను రాజకీయ నాయకురాలిని కాదు. మావోరీ భాష యొక్క సంరక్షకురాలిని అని చెప్పుకొచ్చారు. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. కుసాల్, అవిష్క శతకాలు.. శ్రీలంక భారీ స్కోర్
మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో ఇవాళ (నవంబర్ 13) జరుగుతున్న తొలి మ్యాచ్లో శ్రీలంక జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (115 బంతుల్లో 100; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), వన్డౌన్ బ్యాటర్ కుసాల్ మెండిస్ (128 బంతుల్లో 143; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలతో కదంతొక్కారు. శ్రీలంక స్కోర్ 324/5 (49.2 ఓవర్లు) వద్ద నుండగా వర్షం అంతరాయం కలిగించింది. లంక ఇన్నింగ్స్లో మరో నాలుగు బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి.శ్రీలంక వన్డేల్లో న్యూజిలాండ్పై 300 ప్లస్ స్కోర్ సాధించడం ఇది రెండో సారి మాత్రమే. 2019లో ఆ జట్టు 326 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో లంక బ్యాటర్లు కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్కు 206 పరుగులు జోడించారు. వన్డేల్లో న్యూజిలాండ్పై ఏ వికెట్కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. న్యూజిలాండ్తో ఒకే వన్డేలో ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయడం ఇది రెండోసారి. 2001లో షార్జాలో జరిగిన మ్యాచ్లో సనత్ జయసూర్య (107), మహేళ జయవర్దనే (116) సెంచరీలు చేశారు.మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 17 పరుగులకే ఆ జట్టు ఓపెనర్ పథుమ్ నిస్సంక (12) వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కుసాల్ మెండిస్, అవిష్క ఫెర్నాండో రెండో వికెట్కు 206 పరుగులు జోడించారు. సెంచరీ పూర్తైన వెంటనే అవిష్క ఔటయ్యాడు. అనంతరం బరిలోకి దిగిన సదీర సమరవిక్రమ 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆతర్వాత బరిలోకి దిగిన కెప్టెన్ అసలంక వేగంగా 40 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జనిత్ లియనాగే క్రీజ్లో ఉన్నాడు.కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ మూడు వికెట్లు పడగొట్టగా.. మైఖేల్ బ్రేస్వెల్, ఐష్ సోధి తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా, ఈ సిరీస్కు ముందు శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ జరిగింది. ఈ సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. తొలి మ్యాచ్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించగా.. చివరి బంతి వరకు రసవత్తరంగా సాగిన రెండో టీ20లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుంది. -
న్యూజిలాండ్కు భారీ షాక్.. హ్యాట్రిక్ వీరుడు దూరం
న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా తొడ కండరాల గాయం కారంణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. దంబుల్లా వేదికగా కివీస్తో జరిగిన రెండో టీ20లో హసరంగా తొడ కండరాలు పట్టేశాయి.గాయంతో బాధపడుతూనే తన బౌలింగ్ కోటాను హసరంగా పూర్తి చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్లో కూడా వికెట్ల మధ్య కుంటుతూ కన్పించాడు. దీంతో అతడికి లంక మేనెజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానాన్ని దుషాన్ హేమంతతో శ్రీలంక క్రికెట్ భర్తీ చేసింది. దుషాన్ హేమంత శ్రీలంక తరపున ఇప్పటివరకు ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవల ఎమర్జింగ్ ఆసియాకప్లో కూడా హేమంత అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడికి సెలక్టర్లు పిలుపునిచ్చారు. బుధవారం దంబుల్లా వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.ఫెర్గూసన్కు గాయం..మరోవైపు న్యూజిలాండ్కు కూడా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ మోకాలి గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దంబుల్లా వేదికగా లంకతో జరిగిన రెండో టీ20లో ఫెర్గూసన్ గాయ పడ్డాడు.ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి ఫెర్గూసన్ తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు. కానీ అంతలోనే గాయపడడంతో సిరీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని ఆడమ్ మిల్నేతో సెలక్టర్లు భర్తీ చేశారు.చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. టీమిండియా స్టార్ ప్లేయర్పై వేటు! అతడికి ఛాన్స్? -
సూర్యకుమార్ యాదవ్ రికార్డును సమం చేసిన హసరంగ
శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ల ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కించుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్లతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం హసరంగ ఖాతాలో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. అలాగే సూర్యకుమార్ యాదవ్, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, షకీబ్ అల్ హసన్ పేరిట కూడా ఐదు ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు ఉన్నాయి. హసరంగ 23 టీ20 సిరీస్ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకుంటే.. స్కై 22 సిరీస్ల్లో, బాబర్ ఆజమ్ 35, వార్నర్ 42, షకీబ్ 45 సిరీస్ల్లో ఐదు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నారు. టీ20ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్న రికార్డు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 46 సిరీస్ల్లో ఏడు సార్లు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. కాగా, తాజాగా న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్లో హసరంగ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. ఇది అతనికి ఐదో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు.ఇదిలా ఉంటే, న్యూజిలాండ్తో నిన్న (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో శ్రీలంక జట్టు 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. హసరంగ (4-1-17-4), మతీశ పతిరణ (4-1-11-3, నువాన్ తుషార (4-0-22-2), తీక్షణ (3.3-0-16-1) దెబ్బకు 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌట్ కాగా.. శ్రీలంక ఈ మాత్రం స్కోర్ను కూడా ఛేదించలేక 19.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా న్యూజిలాండ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపులో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను 1-1 సమం చేసుకుంది. ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్లు తీసి శ్రీలంక పతనానికి బీజం వేసిన లోకీ ఫెర్గూసన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. రెండు మ్యాచ్ల ఈ సిరీస్లో ఆరు వికెట్లు తీసిన హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. -
కివీస్తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్ (2-0-7-3) హ్యాట్రిక్తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్ను లాగేసుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్ నిస్సంకను (52) ఫిలిప్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి ఔట్ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో ఫిలిప్స్, ఫెర్గూసన్ తలో 3 వికెట్లు.. బ్రేస్వెల్ 2, సాంట్నర్, ఫోల్క్స్ తలో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే. -
శ్రీలంకతో రెండో టీ20.. హ్యాట్రిక్ తీసిన న్యూజిలాండ్ బౌలర్
డంబుల్లా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ పేసర్ లోకీ ఫెర్గూసన్ హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ 108 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఫెర్గూసన్ తన స్పెల్ మొదటి ఓవర్ చివరి బంతికి ఓ వికెట్ (కుసాల్ పెరీరా).. ఆతర్వాత రెండో ఓవర్ తొలి రెండు బంతులకు రెండు వికెట్లు (కమిందు మెండిస్, అసలంక) తీశాడు. ఫెర్గూసన్.. న్యూజిలాండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన ఐదో బౌలర్గా (జేకబ్ ఓరమ్, టిమ్ సౌథీ (2), మైఖేల్ బ్రేస్వెల్, మ్యాట్ హెన్రీ).. ఓవరాల్గా టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన 64వ బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు.The Lockie Ferguson hat-trick. 🌟pic.twitter.com/dhtmS1tLlp— Mufaddal Vohra (@mufaddal_vohra) November 10, 2024మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్ తుషార (4-0-22-2), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక..ఫెర్గూసన్ (2-0-7-3), మిచెల్ సాంట్నర్ (3-0-10-1) ధాటికి 34 పరుగులకే (7.2 ఓవర్లలో) నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కుసాల్ మెండిస్ 2, కుసాల్ పెరీరా 3, కమిందు మెండిస్ 1, అసలంక డకౌట్ కాగా.. పథుమ్ నిస్సంక (33), భానుక రాజపక్స్ (15) శ్రీలంకను విజయతీరాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 11.2 ఓవర్ల తర్వాత శ్రీలంక స్కోర్ 63/4గా ఉంది. ఈ మ్యాచ్లో శ్రీలంక గెలవాలంటే మరో 52 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి. కాగా, రెండు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో శ్రీలంక తొలి మ్యాచ్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
లంక స్పిన్నర్ల మాయాజాలం.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్
డంబుల్లా వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక స్పిన్నర్లు రెచ్చిపోయారు. వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), మహీశ్ తీక్షణ (3.3-0-16-1) మాయాజాలం ధాటికి న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. తొలి బంతికే వికెట్ తీసిన పేసర్ నువాన్ తుషార రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి బంతికే ఓపెనర్ టిమ్ రాబిన్సన్ తుషార బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో విల్ యంగ్ (30), జోష్ క్లార్క్సన్ (24), మిచెల్ సాంట్నర్ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్క్ చాప్మన్ 2, గ్లెన్ ఫిలిప్స్ 4, మైఖేల్ బ్రేస్వెల్ 0, మిచ్ హే 3, జాకరీ ఫోల్క్స్ 6, ఐష్ సోధి ఒక్క పరుగు చేశారు. ఈ మ్యాచ్లో లంక బౌలర్లు ఏ దశలోనూ న్యూజిలాండ్ బ్యాటర్లను మెరుగైన స్కోర్ దిశగా సాగనీయలేదు. కాగా, రెండు మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో శ్రీలంక తొలి మ్యాచ్లో గెలిచిన విషయం తెలిసిందే. -
అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్.. న్యూజిలాండ్పై శ్రీలంక ఘన విజయం
న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ను శ్రీలంక విజయంతో ఆరంభించింది. దంబుల్లా వేదికగా జరిగిన తొలి టీ20లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై గెలుపొందింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 19.3 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది.బ్రాస్వెల్ (27), జాకరీ ఫోల్క్స్ (27 నాటౌట్) మినహా తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. టిమ్ రాబిన్సన్ (3), గ్లెన్ ఫిలిప్స్ (1), మిషెల్ హై (0), జోష్ క్లార్క్సన్ (3) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలగే 3, పతిరన, హసరంగ, నువాన్ తుషారా తలా రెండు వికెట్లు పడగొట్టారు.అసలంక కెప్టెన్ ఇన్నింగ్స్..అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక 19 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ చరిత్ అసలంక (28 బంతుల్లో 35; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... కుశాల్ పెరీరా (23), కమిందు మెండిస్ (23), వనిందు హసరంగ (22) రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకరీ ఫోల్క్స్ 3 వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల మధ్య నేడు దంబుల్లాలోనే రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
ఆత్మపరిశీలన అవసరం!
సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్సిరీస్ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ పరాభవంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్ క్రికెట్కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్కు చెందిన అలస్టయిర్ కుక్ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్ సిరీస్లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్ సిరీస్లలో విజయం మనదే. కివీస్పైనా ఆ ట్రాక్ రికార్డ్ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్ ఓడిపోయినప్పుడే సిరీస్ చేజారింది. అయితే, ముంబయ్లో జరుగుతున్న ఆఖరి టెస్ట్లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్తో బెంగుళూరు టెస్ట్లో టాస్ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్మన్ల ఆర్డర్లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. సిరీస్కు ముందు దులీప్ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్ బోర్డ్ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్లో 46 పరుగుల అత్యల్పస్కోర్కి భారత్ అవుటైనప్పుడే అర్థమైపోయింది. స్పిన్ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్ బ్యాట్స్మెన్ అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఇద్దరూ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్ బౌలింగ్లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్ ఎత్తిచూపినట్టయింది. అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్ ఓపెనర్గా ఇంగ్లండ్లో సక్సెస్ సాధించిన రోహిత్ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్ల రిటైర్మెంట్కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్ కోహ్లీ, రోహిత్లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్ సిరీస్ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపి యన్ షిప్ విషయానికొస్తే, కివీస్ సిరీస్ దెబ్బతో వరల్డ్ టెస్ట్ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్ ఫైనల్కు చేరడం కష్టమే. ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్తో సిరీస్లో లాగా బోర్లా పడక తప్పదు. నిజానికి, భారత్ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్ ఎంత ఉన్నా ఆటలో టెంపర్మెంట్ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్ కప్లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! -
Ind vs NZ: ‘రిజర్వ్’ నుంచి ‘హీరో’గా మారి... టీమిండియాపై గెలుపులో కీలకంగా
ముంబై: న్యూజిలాండ్ బ్యాటర్ విల్ యంగ్ 2020 డిసెంబర్లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అయితే భారత్తో సిరీస్కు ముందు వరకు ఈ నాలుగేళ్లలో అతను 16 టెస్టులు మాత్రమే ఆడగలిగాడు. ప్రతీసారి రిజర్వ్ ఆటగాడిగానే ఎంపిక కావడం... విరామంలో సహచరులకు డ్రింక్స్ అందించడం మినహా అతనికి చెప్పుకోదగ్గ అవకాశాలే రాలేదు! జట్టులో ఎవరైనా గాయపడితే తప్ప యంగ్ పేరును టీమ్ మేనేజ్మెంట్ పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి కూడా అదే పరిస్థితి. గాయం నుంచి కేన్ విలియమ్సన్ కోలుకోకపోవడంతో ముందుగా తొలి టెస్టులో చాన్స్ లభించింది. ఆ తర్వాత విలియమ్సన్ తర్వాతి మ్యాచ్లూ ఆడలేడని ఖాయం కావడంతో యంగ్ చోటుకు ఢోకా లేకుండా పోయింది. చివరకు సిరీస్లో మొత్తం 244 పరుగులు సాధించి కివీస్ చారిత్రాత్మక విజయంలో కీలకపాత్ర పోషించిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా కూడా నిలిచాడు. డ్రింక్స్ అందించడమే తనకు అలవాటుగా మారిపోయిందని... ఇప్పుడు టీమ్ను గెలిపించడం తనకు గర్వంగా అనిపిస్తోందని విల్ యంగ్ వ్యాఖ్యానించాడు. ‘నాలుగేళ్లలో వేర్వేరు కారణాలతో నేను మైదానంలో కంటే బయటే ఎక్కువగా ఉన్నాను. ఎప్పుడూ రిజర్వ్ బ్యాటర్గానే నా పేరు ఉండేది. జట్టు సభ్యులకు డ్రింక్స్ అందించడమే ఒక అనుభవంగా మారిపోయింది. అయితే ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించా. విలియమ్సన్ స్థానంలో వచ్చి నా అతడిని అనుకరించకుండా నా సొంత ఆటనే ఆడాను. ఇప్పుడు నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉంది’ అని యంగ్ అన్నాడు. భారత్ను స్పిన్ పిచ్లపైనే చిత్తు చేయడం గొప్పగా అనిపించిందని యంగ్ చెప్పాడు. -
స్వయంకృతమే.. భారత సీనియర్ ఆటగాళ్ల ఘోరవైఫల్యం
బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో పేసర్లను ఎదుర్కోలేక టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో తిరిగి కోలుకునే ప్రయత్నం చేసినా మ్యాచ్ మాత్రం చేజారింది! దీంతో 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు ఒక టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది. ‘అప్పుడప్పుడు ఇలా జరగడం సహజమే’ అని కెప్టెన్ అంటే... అభిమానులు కూడా అతడికి అండగా నిలిచారు.సిరీస్లో వెనుకబడ్డ టీమిండియా రెండో టెస్టు కోసం పుణేలో స్పిన్ పిచ్ను సిద్ధం చేసింది. అది ముందే పసిగట్టిన న్యూజిలాండ్ పేసర్లను పక్కన పెట్టి స్పిన్నర్లను రంగంలోకి దింపి ఫలితం రాబట్టింది. మామూలు స్పిన్నర్లను సైతం ఎదుర్కోలేకపోయిన టీమిండియా... ఈసారి తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆలౌట్ కాగా... మరో ఓటమి తప్పలేదు. ఈ విజయంతో భారత గడ్డపై న్యూజిలాండ్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్ గెలిచింది.కనీసం మూడో టెస్టులోనైనా భారత జట్టు విజయం సాధించక పోతుందా అని ఆశపడ్డ అభిమానులకు వాంఖడే స్టేడియంలోనూ గుండెకోత తప్పలేదు. 147 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 121 పరుగులకే పరిమితమై సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైంది. ఒకవైపు మ్యాచ్ మ్యాచ్కూ పరిణతి చెందుతూ ముందుకు సాగిన న్యూజిలాండ్ మ్యాచ్కు ఒకటి చొప్పున ఘనతలు ఖాతాలో వేసుకుంటే... టీమిండియా మాత్రం చెత్త రికార్డు లిఖించుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఆత్మపరిశీలన చేసుకోకుండా అంతకుమించిన పొరబాటు మరొకటి ఉండదు! సాక్షి క్రీడా విభాగం విదేశాల్లో ప్రదర్శనల సంగతి పక్కన పెడితే... స్వదేశంలో టీమిండియాకు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. పుష్కరకాలంగా దీనికి మరింత బలం చేకూర్చుతూ భారత జట్టు... ప్రత్యర్థులపై సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ వరుస సిరీస్లు గెలుస్తూ వస్తోంది. ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఇలా ప్రత్యర్థులు మారుతున్నారు తప్ప ఫలితం మాత్రం మారలేదు. ఈ జోరుతోనే వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన భారత్... ముచ్చటగా మూడోసారీ తుదిపోరుకు అర్హత సాధించడం ఖాయమే అనిపించింది. 12 ఏళ్లుగా స్వదేశంలో పరాజయం ఎరగకుండా జైత్రయాత్ర సాగిస్తున్న టీమిండియా... ఈ క్రమంలో వరుసగా 18 టెస్టు సిరీస్లు గెలిచి రికార్డు సృష్టించింది. ఇదే జోష్లో ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుతుందనుకుంటున్న దశలో న్యూజిలాండ్ జట్టు సమష్టి ప్రదర్శనతో చెలరేగి టీమిండియాను నేలకు దించింది. మెరుగైన వ్యూహాలకు, మెరికల్లాంటి ప్లేయర్లు తోడైతే భారత్ను భారత్లో ఓడించడం పెద్ద కష్టం కాదని కివీస్ ప్లేయర్లు నిరూపించారు. ఇన్నాళ్లు భారత ప్లేయర్ల ప్రధాన బలమనుకున్న స్పిన్తోనే టీమిండియాను ఎలా దెబ్బకొట్టవచ్చో న్యూజిలాండ్ అచరణలో చూపింది. శ్రీలంకలో క్లీన్స్వీప్నకు గురై... కనీసం ఒక్క మ్యాచ్ గెలిచినా చాలు అనే స్థితిలో భారత్లో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సిరీస్ క్లీన్స్వీప్ చేస్తే... అదే సమయంలో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తూ టీమిండియా 91 ఏళ్ల తమ టెస్టు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన దశలో భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్... అత్యుద్భుత ప్రదర్శనతో టీమిండియాపై సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. తమ ప్రధాన ఆటగాడు కేన్ విలియమ్సన్ లేకుండానే భారత్పై కివీస్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చితే... రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి ప్రపంచ స్థాయి బ్యాటర్లున్న టీమిండియా మాత్రం నాసిరకం ఆటతీరుతో ఉసూరుమనిపించింది. ఆ ఏకాగ్రత ఏది? సుదీర్ఘ ఫార్మాట్లో సంయమనం ముఖ్యం అనేది మరిచిన భారత ప్లేయర్లు... క్రీజులోకి అడుగు పెట్టడంతోనే భారీ షాట్లకు పోయి వికెట్ సమర్పించుకోవడం చూస్తుంటే మనవాళ్లు టి20ల మాయలో పడ్డట్లు కనిపిస్తోంది. ఇదే నిజం అనుకుందాం అంటే ముంబై టెస్టులో 147 పరుగుల లక్ష్యఛేదనలో తలా రెండు భారీ షాట్లు ఆడిన టీమిండియా గెలవాల్సింది కానీ అదీ జరగలేదు. తొలి ఇన్నింగ్స్లో మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయిన కోహ్లి... రెండో ఇన్నింగ్స్లో అసలు నిలిచే ప్రయత్నం కూడా చేయలేకపోగా... రెండు ఫోర్లు బాదిన రోహిత్ అదే జోష్లో మరో చెత్త షాట్ ఆడి అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో గొప్ప పోరాట పటిమ చూపిన గిల్ రెండో ఇన్నింగ్స్లో అనూహ్యంగా టర్న్ అయిన బంతికి బౌల్డ్ కాగా... యశస్వి వికెట్ల ముందు దొరికిపోయాడు. మిడిలార్డర్లో ఆకట్టుకుంటాడనుకున్న సర్ఫరాజ్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ విఫలమయ్యాడు. పంత్ ఒక్కడే సిరీస్ మొత్తం నిలకడ కనబర్చాడు. పక్కా గేమ్ ప్లాన్తో బరిలోకి దిగితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా పరుగులు రాబట్టడం పెద్ద కష్టం కాదని పంత్ నిరూపించాడు. ఇక మన స్పిన్నర్లు విజృంభిస్తారు అనుకొని సిద్ధం చేసిన పిచ్లపై ప్రత్యర్థి అనామక స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటుంటే... అనుభవజ్ఞులైన మనవాళ్లు మాత్రం కింద వరుస బ్యాటర్లను సైతం అడ్డుకోలేక ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. ఎలాంటి పిచ్పైనైనా మొండిగా నిలబడి పోరాడగల చతేశ్వర్ పుజారా, రహానే వంటి ఆటగాళ్లు లేని లోటు ఈ సిరీస్తో స్పష్టం కాగా... ఆ్రస్టేలియా పర్యటనకు ముందు టీమిండియాకు ఈ సిరీస్ చాలా పాఠాలు నేరి్పంది. ఈ జట్టుతోనే ఆసీస్ టూర్కు వెళ్లనున్న టీమిండియా... లోపాలను అధిగమించకపోతే ‘బోర్డర్–గవాస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. -
రసవత్తర స్థితిలో...
ఆఖరి మూడో టెస్టును స్పిన్నే దున్నేస్తోంది. రెండో రోజు 15 వికెట్లు కూలాయి. ఇంతలా గింగిర్లు తిరుగుతున్న పిచ్పై రిషభ్ పంత్ టెస్టులో టి20 ఆట ఆడేశాడు. దీంతో తొలి సెషన్లో ఆతిథ్య జట్టు వేగంగా పరుగులు సాధించింది. రెండో సెషన్లో ఎజాజ్ స్పిన్ భారత్ను చుట్టేసింది. అయితే మూడో సెషన్లో మన స్పిన్ ద్వయం జడేజా, అశ్విన్లు చెలరేగడంతో భారత్ పట్టు బిగించినట్లు కనిపించింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. నామమాత్రమైన ఆఖరి వికెట్ మిగిలుంది. ఇలాంటి కఠిన పిచ్పై ఇది కూడా చిన్న లక్ష్యమేమీ కాదు కాబట్టి మూడో రోజూ హోరాహోరీ పోరు ఖాయం. ముంబై: చివరి టెస్టు రసవత్తర ముగింపునకు సిద్ధమైంది. అటో... ఇటో... ఎవరివైపో కానీ ఈ మ్యాచ్ అయితే మూడు రోజుల్లో ముగియడం ఖాయమైంది. ప్రత్యర్థి స్పిన్కు ఎదురీదితే భారత్ 1–2తో సిరీస్లో పరువు నిలుపుకుంటుంది. ఉచ్చులో పడితే మాత్రం సొంతగడ్డపై వైట్వాష్ అవుతుంది. రెండో రోజు ఆటలో మాత్రం భారత బ్యాటర్లే కాస్త పైచేయి సాధించారని చెప్పొచ్చు. 6 వికెట్లు సమర్పించుకున్న టీమిండియా క్రితం రోజు స్కోరుకు 177 పరుగులు జత చేసింది. శుబ్మన్ గిల్ (146 బంతుల్లో 90; 7 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అదరగొట్టారు. ఎజాజ్ పటేల్కు 5 వికెట్లు దక్కాయి. భారత్కు తొలి ఇన్నింగ్స్లో 28 పరుగుల కీలక ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లు చేజార్చుకున్న న్యూజిలాండ్ 171 పరుగులు చేసింది. విల్ యంగ్ (100 బంతుల్లో 51; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. పంత్ ధనాధన్ ఫిఫ్టీ తొలి సెషన్లో భారత బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్మన్ నిలకడగా ఆడటంతో కివీస్ బౌలర్ల ఆటలు సాగలేదు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ చాప్మన్ లాంగాన్లో గిల్ ఇచ్చిన క్యాచ్ను, లాంగాఫ్లో పంత్ క్యాచ్ను మ్యాట్ హెన్రీ వదిలేశారు. దీన్ని సద్వినియోగం చేసుకొన్న బ్యాటర్లు ఇద్దరూ అర్ధ సెంచరీలతో ఇన్నింగ్స్ను కుదుట పరిచారు. శనివారం 86/4 ఓవర్నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 59.4 ఓవర్లలో 263 పరుగుల వద్ద ఆలౌటైంది.పంత్, గిల్ కివీస్ బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రిషభ్ టి20 ఫార్మాటల్లే చెలరేగిపోయాడు. ఎజాజ్ పటేల్, ఫిలిప్స్ బౌలింగ్లో చూడచక్కని బౌండరీలు, భారీ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. దీంతో 29వ ఓవర్లోనే భారత్ స్కోరు 150 పరుగులను దాటింది. మరుసటి ఓవర్లోనే ఇద్దరి ఫిఫ్టీలు పూర్తయ్యాయి.30వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన గిల్ 66 బంతుల్లో, నాలుగో బంతికి పరుగు తీసిన రిషభ్ 36 బంతుల్లో అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. కాసేపటి తర్వాత ఇష్ సోధి... పంత్ను ఎల్బీగా అవుట్ చేయడంతో ఐదో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా (14) క్రీజులోకి రాగా, టీమిండియా లంచ్ విరామానికి 195/5 స్కోరు చేసింది. అప్పటికి ఇంకా ఆతిథ్య జట్టు 40 పరుగులు వెనుకబడే ఉంది. ఎజాజ్ దెబ్బ రెండో సెషన్లో ఎజాజ్ పటేల్ స్పిన్ మాయాజాలం మొదలవడంతో భారత్ ఇబ్బందుల్లో పడింది. జట్టు స్కోరు 200 దాటగానే జడేజాను ఫిలిప్స్ అవుట్ చేయగా, స్వల్ప వ్యవధిలో ఎజాజ్... సర్ఫరాజ్ (0), గిల్, అశ్విన్ (6)ల వికెట్లను పడగొట్టడంతో గిల్ 10 పరుగుల దూరంలో సెంచరీ అవకాశాన్ని కోల్పోగా... భారత్ భారీ ఆధిక్యం సాధించలేకపోయింది.ఆకాశ్దీప్ (0) రనౌట్ కావడంతో టీ విరామానికి ముందే భారత్ 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. అయితే వికెట్ పూర్తిగా స్పిన్కు అనువుగా మారిపోవడంతో భారత సీనియర్ స్పిన్ ద్వయం అశ్విన్–జడేజా కివీస్ రెండో ఇన్నింగ్స్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వన్డౌన్ బ్యాటర్ విల్ యంగ్ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు.మిచెల్ (21; 1 ఫోర్, 1 సిక్స్), ఫిలిప్స్ (26; 1 ఫోర్, 3 సిక్స్లు)ల అండతో యంగ్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. 171 పరుగుల వద్ద హెన్రీ (10)ని జడేజా బౌల్డ్ చేయడంతో రెండో రోజు ఆటను ముగించారు. ఆకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం కివీస్ 143 పరుగుల ముందంజలో ఉంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 235 భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) ఎజాజ్ 30; రోహిత్ (సి) లాథమ్ (బి) హెన్రీ 18; గిల్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 90; సిరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ఎజాజ్ 0; కోహ్లి రనౌట్ 4; పంత్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సోధి 60; జడేజా (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 14; సర్ఫరాజ్ (సి) బ్లన్డెల్ (బి) ఎజాజ్ 0; సుందర్ నాటౌట్ 38; అశ్విన్ (సి) మిచెల్ (బి) ఎజాజ్ 6; ఆకాశ్దీప్ రనౌట్ 0; ఎక్స్ట్రాలు 3; మొత్తం (59.4 ఓవర్లలో ఆలౌట్) 263. వికెట్ల పతనం: 1–25, 2–78, 3–78, 4–84, 5–180, 6–203, 7–204, 8–227, 9–247, 10–263. బౌలింగ్: మ్యాట్ హెన్రీ 8–1–26–1, విలియమ్ ఓ రూర్కే 2–1–5–0, ఎజాజ్ పటేల్ 21.4–3– 103–5, గ్లెన్ ఫిలిప్స్ 20–0–84–1, రచిన్ రవీంద్ర 1–0–8–0, ఇష్ సోధి 7–0–36–1. న్యూజిలాండ్ రెండోఇన్నింగ్స్: లాథమ్ (బి) ఆకాశ్దీప్ 1; కాన్వే (సి) గిల్ (బి) సుందర్ 22; యంగ్ (సి అండ్ బి) అశ్విన్ 51; రచిన్ (స్టంప్డ్) పంత్ (బి) అశ్విన్ 4; మిచెల్ (సి) అశ్విన్ (బి) జడేజా 21; బ్లన్డెల్ (బి) జడేజా 4; ఫిలిప్స్ (బి) అశ్విన్ 26; ఇష్ సోధి (సి) కోహ్లి (బి) జడేజా 8; హెన్రీ (బి) జడేజా 10; ఎజాజ్ నాటౌట్ 7; ఎక్స్ట్రాలు 17; మొత్తం (43.3 ఓవర్లలో 9 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–2, 2–39, 3–44, 4–94, 5–100, 6–131, 7–148, 8–150, 9–171. బౌలింగ్: ఆకాశ్దీప్ 5–0–10–1, వాషింగ్టన్ సుందర్ 10–0–30–1, అశ్విన్ 16–0–63–3, జడేజా 12.3–2–52–4. -
ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్.. ఆధిక్యం ఎంతంటే..?
-
IND Vs NZ: రెచ్చిపోయిన సుందర్.. లంచ్ విరామం సమయానికి కివీస్ స్కోర్ ఎంతంటే..?
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఇవాళ (నవంబర్ 1) మూడో టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్లో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెచ్చిపోయాడు. కివీస్ స్టార్ బ్యాటర్లు టామ్ లాథమ్ (28), రచిన్ రవీంద్రను (5) క్లీన్ బౌల్డ్ చేశాడు. డెవాన్ కాన్వేను (4) ఆకాశ్దీప్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. లంచ్ విరామం సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. విల్ యంగ్ (38), డారిల్ మిచెల్ (11) క్రీజ్లో ఉన్నారు.WASHINGTON SUNDAR WITH TWO ABSOLUTE JAFFAS..!!!- First Latham, now Rachin. 🤯👌pic.twitter.com/JBz5P04YwP— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024రెండో టెస్ట్లో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సుందర్ ఈ మ్యాచ్లోనూ ఇరగదీస్తున్నాడు. కాగా, ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది.Akash Deep traps Conway. 🔥 pic.twitter.com/tuTjqKupDf— Mufaddal Vohra (@mufaddal_vohra) November 1, 2024తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీఇదిలా ఉంటే, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
న్యూజిలాండ్తో మూడో టెస్ట్.. బుమ్రా ఔట్
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా టీమిండియాతో ఇవాళ (నవంబర్ 1) మొదలుకానున్న మూడో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం న్యూజిలాండ్ రెండు మార్పులు చేసింది. మిచెల్ సాంట్నర్ గాయపడటంతో అతని స్థానంలో ఐష్ సోధి.. టిమ్ సౌథీ స్థానంలో మ్యాట్ హెన్రీ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు భారత్ సైతం ఓ మార్పు చేసింది. బుమ్రా స్థానంలో సిరాజ్ తుది జట్టులోకి వచ్చాడు. బుమ్రా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. కాగా, మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో ఇదివరకే రెండు మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్ 2-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. తుది జట్లు..భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్దీప్, మొహమ్మద్ సిరాజ్న్యూజిలాండ్: టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధి, మ్యాట్ హెన్రీ, అజాజ్ పటేల్, విలియమ్ ఓరూర్కీచదవండి: విధ్వంసం సృష్టించిన ఎవిన్ లెవిస్.. తొలి వన్డేలో విండీస్ విజయం -
IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..?
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే మూడో టెస్ట్లో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆడటం లేదని తెలుస్తుంది. వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. మూడో టెస్ట్కు బుమ్రా అందుబాటులో ఉండడన్న విషయాన్ని టీమ్ మేనేజ్మెంట్ నేరుగా చెప్పనప్పటికీ.. వర్క్ లోడ్ అనే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తుంది. దీన్ని బట్టి చూస్తే బుమ్రాకు విశ్రాంతినివ్వడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది. ప్రాక్టీస్ సెషన్స్లో సైతం బుమ్రా పెద్దగా బౌలింగ్ చేయలేదు. ఆకాశ్దీప్, మొహ్మద్ సిరాజ్ నెట్స్లో లాంగ్ స్పెల్స్ వేశారు. దీన్ని బట్టి చూస్తే రేపటి నుంచి ప్రారంభం కాబోయే మూడో టెస్ట్లో ఈ ఇద్దరు ఆడటం ఖాయంగా కనిపిస్తుంది.మూడో టెస్ట్లో ఇద్దరు పేసర్లతో పాటు ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. రెండో టెస్ట్లో ఆడిన స్పిన్నర్లే మూడో టెస్ట్లోనూ కొనసాగవచ్చు. మూడో టెస్ట్ కోసమని హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నప్పటికీ.. అతను బెంచ్కే పరిమితం అయ్యేలా కనిపిస్తున్నాడు. మూడో టెస్ట్లో టీమిండియా ఒక్క మార్పు మాత్రమే చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. బుమ్రా స్థానాన్ని సిరాజ్ భర్తీ చేసే అవకాశం ఉంది. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగవచ్చు.న్యూజిలాండ్తో మూడో టెస్ట్ కోసం భారత జట్టు (అంచనా)..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్, మహ్మద్ సిరాజ్కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో గెలిచిన న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్ను కైవసం చేసుకుంది. మూడో టెస్ట్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రేపు ఉదయం 9:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. చదవండి: మళ్లీ ఐదేసిన రబాడ.. ఫాలో ఆన్ ఆడుతున్న బంగ్లాదేశ్ -
India vs New Zealand: జయమా... పరాభవమా!
పుష్కర కాలం తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్ కోల్పోయిన టీమిండియా... ఇప్పుడు క్లీన్స్వీప్ ప్రమాదం ముంగిట నిలిచింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్లోనూ క్లీన్స్వీప్ కాని భారత జట్టు... ఇప్పుడు న్యూజిలాండ్ తో అలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు భారత్లో భారత్పై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ నెగ్గని న్యూజిలాండ్... ఆ పని పూర్తి చేసి క్లీన్స్వీప్పై కన్నేసింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ బెర్త్ దక్కాలంటే ఈ మ్యాచ్లో విజయం అనివార్యం అయిన పరిస్థితుల్లో రోహిత్ బృందం ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందనేది ఆసక్తికరం! తొలి రెండు టెస్టుల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా కదంతొక్కాలని, భారత్ను గెలుపు బాట పట్టించాలని అభిమానులు ఆశిస్తున్నారు.ముంబై: అనూహ్య తడబాటుతో న్యూజిలాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిన భారత జట్టు శుక్రవారం నుంచి వాంఖడే మైదానం వేదికగా నామమాత్రమైన మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే 0–2తో సిరీస్ కోల్పోయిన టీమిండియా ... కనీసం ఆఖరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తుంటే... తొలిసారి భారత్ లో సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్ దాన్ని క్లీన్స్వీప్గా మలచాలని భావిస్తోంది. ఈ సిరీస్కు ముందు స్వదేశంలో గత 12 సంవత్సరాలుగా భారత జట్టు టెస్టు సిరీస్ ఓడిపోలేదు. అంతేకాకుండా 1984 నుంచి స్వదేశంలో భారత జట్టు ఏ ద్వైపాక్షిక సిరీస్లోనూ మూడు టెస్టుల్లో ఓడిపోలేదు. బెంగళూరు వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో పేస్ పిచ్ను సిద్ధం చేసి... వాతావరణ మార్పుల మధ్య తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో ఘోర పరాజయం మూటగట్టుకున్న రోహిత్ జట్టు... పుణేలో జరిగిన రెండో టెస్టులో స్పిన్ పిచ్పై కూడా తడబడింది. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోగలరనే పేరున్న మన ఆటగాళ్లు పుణే టెస్టులో పార్ట్ టైమ్ స్పిన్నర్ లాంటి సాంట్నర్ను ఎదుర్కోలేక చేతులెత్తేయడం అభిమానులను కలవర పరిచింది. ఈ నేపథ్యంలో వాంఖడే పిచ్ను సహజసిద్ధంగా ఉంచామని... జట్టు కోసం పిచ్లో ఎలాంటి మార్పులు చేయలేదని భారత సహాయక కోచ్ అభిషేక్ నాయర్ అన్నాడు. ఈ సిరీస్లో ఆకట్టుకోలేకపోయిన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆఖరి మ్యాచ్లోనైనా రాణిస్తారా చూడాలి. వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడిన టీమిండియా... ముచ్చటగా మూడోసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించాలంటే మిగిలిన ఆరు టెస్టుల్లో సత్తా చాటాల్సిన అవసరముంది. బ్యాటర్లపైనే భారం! కొట్టిన పిండి లాంటి స్వదేశీ పిచ్లపై పరుగులు రాబట్టేందుకు భారత ఆటగాళ్లు ఇబ్బంది పడుతుంటే... న్యూజిలాండ్ బ్యాటర్లు మాత్రం సులువుగా పరుగులు చేస్తున్నారు. 2, 52, 0, 8... ఈ సిరీస్లో టీమిండియా కెపె్టన్ రోహిత్ శర్మ స్కోర్లివి. టాపార్డర్లో ముందుండి ఇన్నింగ్స్ను నడిపించాల్సిన రోహిత్ ఇలాంటి ప్రదర్శన చేస్తుండగా... స్టార్ బ్యాటర్ కోహ్లి గత నాలుగు ఇన్నింగ్స్ల్లో 0, 70, 1, 17 పరుగులు చేశాడు. చాన్నాళ్లుగా జట్టు బాధ్యతలు మోస్తున్న ఈ జంట స్థాయికి ఈ ప్రదర్శన తగినది కాకపోగా... మిగిలిన వాళ్లు కూడా నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. యశస్వి జైస్వాల్ మంచి టచ్లో ఉండగా... శుబ్మన్ గిల్, సర్ఫరాజ్, పంత్ కలిసి కట్టుగా కదం తొక్కితేనే భారీ స్కోరు సాధ్యం. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అశి్వన్, వాషింగ్టన్ సుందర్ కేవలం బౌలింగ్పైనే కాకుండా బ్యాటింగ్లోనూ తమ వంతు పాత్ర పోషించాల్సిన అవసరముంది. ప్రధానంగా గత టెస్టులో టీమిండియా స్టార్ ఆటగాళ్లను న్యూజిలాండ్ స్పిన్నర్ సాంట్నర్ వణికించిన చోట... అశ్విన్–జడేజా జోడీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ లోపాలను అధిగమించకపోతే టీమిండియా మూడో టెస్టులోనూ పరాభవం మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మరోవైపు కేన్ విలియమ్సన్ వంటి కీలక ఆటగాడు లేకుండానే భారత్పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ ఇదే జోరు చివరి మ్యాచ్లోనూ కొనసాగించాలని చూస్తోంది. కాన్వే, రచిన్ రవీంద్ర, కెపె్టన్ లాథమ్ నిలకడగా రాణిస్తుండగా... ఫిలిప్స్, మిచెల్ కూడా మెరుగైన ప్రదర్శన చేస్తే న్యూజిలాండ్కు ఈ టెస్టులోనూ తిరుగుండదు. బౌలింగ్ విభాగంలో సౌతీ, ఒరూర్కీ, హెన్రీ, సాంట్నర్ విజృంభిస్తే భారత జట్టుకు ఇబ్బందులు తప్పవు. జోరుగా సాధన తొలి రెండు టెస్టుల్లో ప్రభావం చూపలేకపోయిన టీమిండియా... కివీస్తో మూడో టెస్టుకు ముందు జోరుగా ప్రాక్టీస్ చేస్తోంది. వాంఖడే పిచ్ స్పిన్కు సహకరించే అవకాశం ఉండటంతో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై మన ప్లేయర్లు దృష్టి సారించారు. రోహిత్ శర్మ, కోహ్లితో పాటు ప్లేయర్లందరూ సాధనలో పాల్గొన్నారు. -
మూడో టెస్టుకు హర్షిత్
ముంబై: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే మూడో టెస్టు కోసం పేస్ బౌలర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నారు. బుధవారం అతను జట్టుతో చేరతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ట్రావెలింగ్ రిజర్వ్లలో ఢిల్లీకి చెందిన హర్షిత్ కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రధాన జట్టులోకి రానున్నాడని సమాచారం. నవంబర్ 1 నుంచి భారత్, కివీస్ మధ్య మూడో టెస్టు వాంఖెడే మైదానంలో జరుగుతుంది. హర్షిత్కు ఇప్పటికే బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆ్రస్టేలియాకు వెళ్లే భారత టెస్టు టీమ్లో చోటు లభించింది. దానికి ముందు ఒక టెస్టులో అతడిని ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.కివీస్తో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో మూడో టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే హర్షిత్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టవచ్చు. బంగ్లాదేశ్తో టి20 సిరీస్లకు ఎంపికైనా... హర్షిత్కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మంగళవారం అస్సాంతో ముగిసిన రంజీ మ్యాచ్లో 7 వికెట్లు తీసిన హర్షిత్...ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 10 మ్యాచ్ల ఫస్ట్క్లాస్ కెరీర్లో 24.00 సగటుతో రాణా 43 వికెట్లు పడగొట్టాడు. విలియమ్సన్ దూరం వెలింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ భారత్తో సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు. గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేని అతను ఇప్పుడు మూడో టెస్టునుంచి తప్పుకున్నాడు. విలియమ్సన్ భారత్కు రావడం లేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. గాయం నుంచి కోలుకొని అతను ప్రస్తుతం రీహాబిలిటేషన్లో ఉన్నాడు. అయితే ముందు జాగ్రత్తగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.సంచలన ప్రదర్శనతో కివీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న నేపథ్యంలో హడావిడిగా విలియమ్సన్ను బరిలోకి దించరాదని బోర్డు భావించింది. ఈ సిరీస్ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్తో న్యూజిలాండ్ తలపడనుంది. దాని కోసం విలియమ్సన్ పూర్తి స్థాయిలో ఫిట్గా అందుబాటులో ఉండాలనేదే ప్రధాన కారణం. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ఆడిన తర్వాత స్వదేశానికి వెళ్లిన విలియమ్సన్ గాయం కారణంగా భారత గడ్డపై అడుగు పెట్టనే లేదు. -
టీమిండియాతో మూడో టెస్ట్కు ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్
టీమిండియాతో మూడో టెస్ట్కు ముందు న్యూజిలాండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా ఆ జట్టు స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్కు దూరమయ్యాడు. గాయం కారణంగానే విలియమ్సన్ తొలి రెండు టెస్ట్లకు కూడా దూరమయ్యాడు. వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగే టెస్ట్ సిరీస్ దృష్ట్యా విలియమ్సన్ను మూడో టెస్ట్కు దూరంగా ఉంచామని కివీస్ మేనేజ్మెంట్ తెలిపింది. ప్రస్తుతం విలియమ్సన్ న్యూజిలాండ్లోనే రిహాబ్లో ఉన్నాడు. అతను మూడో టెస్ట్ కోసం భారత్కు రావడం లేదని కివీస్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది.కాగా, మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లోకి తొలి రెండు మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. చివరిదైన మూడో టెస్ట్ ముంబై వేదికగా నవంబర్ 1న ప్రారంభం కానుంది. చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా వరల్డ్కప్ విన్నర్ -
సిరీస్ తేల్చే సమరం
అహ్మదాబాద్: ‘భారత జట్టు విజయం సాధించేందుకు కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఇది సిగ్గు పడాల్సిన విషయం’... ఆదివారం జరిగిన రెండో వన్డేపై న్యూజిలాండ్ మహిళల జట్టు కెపె్టన్ సోఫీ డివైన్ చేసిన వ్యాఖ్య ఇది. ప్రత్యర్థి సారథి కాస్త ఘాటుగానే చెప్పినా మన జట్టు బ్యాటింగ్ బలహీనతను అది చూపించింది. గత మ్యాచ్లో 260 పరుగుల లక్ష్య ఛేదనలో 18వ ఓవర్లోనే 77 పరుగులకు భారత టాప్–5 వెనుదిరగడంతోనే ఓటమి దాదాపుగా ఖాయమైంది. 9వ నంబర్ బ్యాటర్ రాధా యాదవ్ ఆదుకోకపోతే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. కీలకమైన చివరి పోరులోనైనా బ్యాటింగ్లో రాణిస్తే సొంతగడ్డపై సిరీస్ గెలుచుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత్, కివీస్ టీమ్లు తలపడనున్నాయి. తొలి వన్డేలో కూడా భారత్ మెరుగైన బౌలింగ్ ప్రదర్శనతోనే నెగ్గింది. రెండు వన్డేల్లో కలిపి మన బ్యాటర్లు ఎవరూ కనీసం అర్ధ సెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. చివరి మ్యాచ్లో నెగ్గాలంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, కెపె్టన్ హర్మన్ప్రీత్ కౌర్ చెలరేగాల్సి ఉంది. ముఖ్యంగా స్మృతి సుదీర్ఘ కాలంగా వరుసగా విఫలమవుతూ తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఈ సిరీస్లో ఆమె 5, 0 స్కోర్లకే పరిమితమైంది. ఇదే సిరీస్తో అరంగేట్రం చేసిన తేజల్ను తప్పు పట్టలేం కానీ జెమీమా కూడా మిడిలార్డర్లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. అందరూ సమష్టిగా చెలరేగితేనే కివీస్పై ఆధిపత్యం ప్రదర్శించవచ్చు. మరోవైపు న్యూజిలాండ్ గత విజయం తర్వాత ఉత్సాహంగా బరిలోకి దిగుతోంది. రెండో వన్డేలో బ్యాటర్లు మూడు అర్ధ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఓపెనర్లు సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, హ్యాలిడే, మ్యాడీ గ్రీన్లతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక కెపె్టన్ సోఫీ డివైన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ఆల్రౌండ్ ప్రదర్శనతో పాటు ఇటు సారథిగా కూడా ఆమె జట్టును సమర్థంగా నడిపిస్తోంది. సీనియర్ పేసర్ తహుహు ఆఫ్స్పిన్నర్ ఈడెన్ కార్సన్లు ఎలాంటి బ్యాటర్లనైనా ఇబ్బంది పెట్టగల సమర్థులు. లాంటి స్థితిలో స్వదేశంలో సిరీస్ కోల్పోరాదంటే హర్మన్ బృందం రెట్టింపు శ్రమించాల్సి ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్ కౌర్ (కెపె్టన్), షఫాలీ, స్మృతి, యస్తిక, జెమీమా, తేజల్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, సైమా ఠాకూర్, ప్రియా మిశ్రా/శ్రేయాంక పాటిల్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ప్లిమ్మర్, లారెన్ డౌన్, హ్యాలిడే, గ్రీన్, ఇసబెల్లా, జెస్ కెర్, తహుహు, కార్సన్, జొనాస్. -
న్యూజిలాండ్తో రెండో వన్డే.. టీమిండియా ఓటమి
అహ్మదాబాద్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టుతో ఇవాళ (అక్టోబర్ 27) జరిగిన రెండో వన్డేలో న్యూజిలాండ్ 78 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. సూజీ బేట్స్ (58), కెప్టెన్ సోఫీ డివైన్ (79) అర్ద సెంచరీలతో రాణించగా.. జార్జియా ప్లిమ్మర్ (41), మ్యాడీ గ్రీన్ (42) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ రెండు, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 47.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు లియా తహుహు, సోఫీ డివైన్ తలో మూడు వికెట్లు.. ఏడెన్ కార్సన్, జెస్ కెర్ చెరో రెండు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాశించారు. భారత ఇన్నింగ్స్లో రాధా యాదవ్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. షెఫాలీ వర్మ 11, స్మృతి మంధన 0, యస్తికా భాటియా 12, హర్మన్ప్రీత్ కౌర్ 24, జెమీమా రోడ్రిగెజ్ 17, తేజల్ హసబ్నిస్ 15, దీప్తి శర్మ 15, అరుంధతి రెడ్డి 2, సైమా ఠాకోర్ 29 పరుగులు చేసి ఔటయ్యారు.కాగా, మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపుతో 1-1తో సిరీస్ సమం అయ్యింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఇదే అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 29న జరుగనుంది. -
సిరీస్పై భారత మహిళల గురి
అహ్మదాబాద్: భారత మహిళల జట్టు సిరీస్ లక్ష్యంగా రెండో వన్డే బరిలోకి దిగుతోంది. ఆల్రౌండ్ ప్రదర్శనతో తొలి మ్యాచ్లో పర్యాటక న్యూజిలాండ్ను కంగు తినిపించిన భారత్ ఇప్పుడు వరుస విజయంపై కన్నేసింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు కివీస్ ఈ మ్యాచ్లో పుంజుకొని సిరీస్ రేసులో నిలవాలని ఆశిస్తోంది. తప్పక గెలవాల్సిన ఒత్తిడి ఉన్న కివీస్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. స్మృతి రాణిస్తేనే... గత మ్యాచ్లో రెగ్యులర్ కెపె్టన్ హర్మన్ప్రీత్ ఫిట్నెస్ సమస్యలతో దూరం కావడంతో సారథ్యం వహించిన స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన ఫామ్ జట్టును కలవరపెడుతోంది. ఇటీవలి టి20 ప్రపంచకప్ సహా వరుసగా విఫలమవడం బ్యాటింగ్ విభాగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. టాపార్డర్లో షఫాలీ, యస్తిక భాటియా మెరుగ్గా ఆడటం, జెమీమా, దీప్తిశర్మ తమ స్థాయికి తగ్గ ఆటతీరు కనబరుస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. గత మ్యాచ్తో అరంగేట్రం చేసిన తేజల్ హసబి్నస్ మిడిలార్డర్లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో హర్మన్ జట్టులోకి వచ్చినా ఆమె స్థానానికి ఢోకాలేదు. కివీస్కు మరో దెబ్బ సిరీస్లో వెనుకబడిన న్యూజిలాండ్కు అమెలియా కెర్ గాయం మరో దెబ్బకొట్టింది. తొలి వన్డే సందర్భంగా ఆమె తొడకండరాల గాయానికి గురైంది. దీంతో మిగతా మ్యాచ్లకు దూరమైన ఆమె స్వదేశానికి పయనమైంది. ఇటీవల టి20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టార్ ఆల్రౌండర్ లేకపోవడం జట్టుకు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోఫీ డివైన్ సేన సమష్టిగా ఆడితేనే గెలిచి సిరీస్లో నిలుస్తుంది. లేదంటే సిరీస్ కోల్పోయే పరిస్థితి వస్తుంది. జట్లు (అంచనా) భారత్: హర్మన్ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ, యస్తిక, జెమిమా, తేజల్ హసబ్నిస్, దీప్తిశర్మ, అరుంధతీ, రాధా యాదవ్, సయిమా, రేణుకా సింగ్. న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీబేట్స్, జార్జియా, బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసాబెల్ల గేజ్, జెస్ కెర్, మోలి ఫెన్ఫోల్డ్, ఎడెన్ కార్సన్, లీ తహుహు. -
IND vs NZ 2nd Test: ‘పరాభవ భారం’
‘నాపై ఇక కత్తులు దూయండి’... బెంగళూరు టెస్టులో 46కు ఆలౌట్ అయిన తర్వాత మీడియా సమావేశంలో రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది! ‘12 ఏళ్ల తర్వాత ఒక సిరీస్ ఓడిపోయాం...ఈమాత్రం మినహాయింపు ఇవ్వడంలో తప్పు లేదు’...రెండో టెస్టులో ఓటమి అనంతరం అదే కెప్టెన్ చెప్పిన మాట ఇది. ఇన్నేళ్లుగా తమ ఆటతో విజయాలనే తాము అలవాటు చేశామని, కాబట్టి పరాజయం అందరికీ కొత్తగా అనిపిస్తోందని కూడా రోహిత్ అన్నాడు. అంటే 46 ఆలౌట్ను ఒకానొక అరుదైన రోజుగా అంగీకరించిన కెప్టెన్ కు ఇప్పుడు ఓటమి అలవాటైపోయినట్లుగా అనిపించింది! అయితే ఈ పుష్కర కాలంలో అప్పుడప్పుడు వచ్చిన మ్యాచ్ పరాజయాలకు, తాజాగా సిరీస్ కోల్పోవడానికి మధ్య చాలా తేడా ఉంది. ఇన్నేళ్లలో ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలాంటి టీమ్లు భారత్ను ఓడించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. మ్యాచ్లు గెలిచినా అవి సిరీస్ను మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. వీటితో పోలిస్తే న్యూజిలాండ్ టెస్టుల్లో అనామక జట్టు కిందే లెక్క. దీనికి ముందు 12 సిరీస్లలో కలిపి ఆ టీమ్ ఇక్కడ రెండే మ్యాచ్లు గెలవగలిగింది. పైగా ఇటీవలే శ్రీలంక చేతిలో 0–2తో చిత్తుగా ఓడి ఇక్కడకు వచ్చింది. సౌతీ, లాథమ్లకు మినహా మిగతావారెవరికీ ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ఎక్కువగా లేదు. కేన్ విలియమ్సన్లాంటి స్టార్ ప్లేయర్ కూడా అందుబాటులో లేడు. అయినా సరే కివీస్ టీమ్ భారత్పై పైచేయి సాధించగలిగింది. రెండు పూర్తిగా భిన్నమైన పిచ్లపై ఆ జట్టు పైచేయి సాధించిన తీరు టీమిండియా లోపాలను చూపించింది. ముందుగా బెంగళూరు టెస్టులో పేస్ బౌలింగ్ ముందు భారత్ మోకరిల్లి చెత్త రికార్డులను నమోదు చేసింది. దాంతో హడావిడిగా మన బలం స్పిన్ అంటూ పూర్తిగా స్పిన్ పిచ్తో సిద్ధమైంది. కానీ ముందు మన బ్యాటర్లు అలాంటి పిచ్పై, స్పిన్ను సమర్థంగా ఆడగలరా లేదా అనే ఆలోచన రానట్లుంది! అందుకే సాంట్నర్ స్పిన్ను కూడా ఎదుర్కోలేకపోయింది. 2017లో ఇదే పుణేలో, ఇదే తరహా పిచ్పై ఇలాంటి లెఫ్టార్మ్ స్పిన్నర్ స్టీవ్ ఒ కీఫ్కు 12 వికెట్లు అప్పగించి ఆసీస్ చేతిలో భారత్ 333 పరుగులతో చిత్తయింది. ఇప్పుడు కూడా పదునైన స్పిన్ను ఆడటం తమ వల్ల కాదని మన బ్యాటర్లు నిరూపించారు. పిచ్పై గిర్రున తిరుగుతున్న బంతులకు వారి వద్ద జవాబు లేకపోయింది. బంగ్లాలాంటి బలహీన జట్టుపై దూకుడైన ఆటతో సిరీస్ గెలిచిన వైనంతో మన ప్లేయర్లలో అతి విశ్వాసం పెరిగినట్లు కనిపించింది. పైగా న్యూజిలాండ్ టెస్టుల్లో ప్రభావం చూపలేదనే తేలికపాటి భావం కూడా కావచ్చు! సిరీస్లో రోహిత్ విఫలం కాగా, కోహ్లి తన ఆటతో తీవ్రంగా నిరాశపర్చాడు. జైస్వాల్ ఒక్కడే ఆకట్టుకోగా, రెండో ఇన్నింగ్స్లో పంత్ రనౌట్ అతని నిరక్ష్యాన్ని చూపించింది. సాంట్నర్ చెలరేగిన చోట అదే శైలి బౌలర్ అయిన జడేజాకు తొలి ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఇదే టీమ్ ఆ్రస్టేలియాకు వెళ్లి గెలుస్తుందనుకోవడం అత్యాశే. మరో వైపు కోచ్ గౌతమ్ గంభీర్కు కూడా ఈ ఓటమిలో పాత్ర ఉంది. బంగ్లాపై సిరీస్ విజయాన్ని గొప్పగా చెప్పుకుంటూ...‘ఒక్క రోజులో 400 పరుగులు చేయగల, అవసరమైతే రెండు రోజులు నిలబడి డ్రా చేసుకోగల జట్టుగా మేం మారాలి. నా దృష్టిలో ఆటలో ఎదగడం అంటే అదే’ అంటూ వ్యాఖ్య చేశాడు. 400 సంగతేమో కానీ మన బ్యాటింగ్ బలహీనత ఏమిటో ఇది చూపించింది. శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓటమి, 46 ఆలౌట్, 36 ఏళ్ల తర్వాత కివీస్ చేతిలో టెస్టు పరాజయం, ఇప్పుడు తొలిసారి సిరీస్, 12 ఏళ్ల తర్వాత స్వదేశంలో పరాభవం...ఇవన్నీ కూడా కోచ్ గంభీర్ ఖాతాలో చేరాల్సినవే! ఇకపై మాటలను కట్టిపెట్టి కోచ్గా తన బాధ్యతలు సరిగ్గా నెరవేర్చాల్సిన సమయమిది. 4 రోహిత్ కెప్టెన్సీలో స్వదేశంలో భారత్ ఓడిన టెస్టుల సంఖ్య. గతంలో అజహర్, కపిల్ కెప్టెన్సీలో 4 మ్యాచ్లు ఓడగా... పటౌడీ నాయకత్వంలో భారత్ 9 మ్యాచ్లు ఓడింది. –సాక్షి క్రీడావిభాగం -
IND vs NZ: రెండో టెస్టులో భారత్ ఓటమి..
-
IND VS NZ 2nd Test: కివీస్ చేతిలో టీమిండియా ఓటమి
అప్డేట్:న్యూజిలాండ్తో రెండో టెస్టులో టీమిండియా 113 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.టీ విరామ సమయానికి టీమిండియాస్కోరు: 178-7(40 ఓవర్లలో). విజయానికి ఇంకా 181 పరుగుల దూరంలో ఉంది.పూణే వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 147 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగుతుంది. భారత ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్ (77) రాణించగా.. రోహిత్ శర్మ (8), శుభ్మన్ గిల్ (23), విరాట్ కోహ్లి (17), రిషబ్ పంత్ (0) విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (21), సర్ఫరాజ్ ఖాన్ (9) కూడా నిరాశపరిచారు. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 181 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్లో (7/59) భారత్ను దెబ్బకొట్టిన మిచెల్ సాంట్నర్ ఈ ఇన్నింగ్స్లోనూ (4/49) కష్టాల్లోకి నెట్టాడు.అంతకుముందు న్యూజిలాండ్ సెకెండ్ ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది. టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు.దీనికి ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. -
255 పరుగులకు ఆలౌటైన న్యూజిలాండ్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
పూణే వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్లో (సెకెండ్ ఇన్నింగ్స్లో) న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. 198/5 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన న్యూజిలాండ్ ఓవర్నైట్ స్కోర్కు మరో 57 పరుగులు జోడించి మిగతా ఐదు వికెట్లు కోల్పోయింది. తద్వారా న్యూజిలాండ్.. టీమిండియా ముందు 359 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2 వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో (సెకెండ్) టామ్ లాథమ్ అర్ద సెంచరీతో (86) రాణించగా.. టామ్ బ్లండెల్ (41), గ్లెన్ ఫిలిప్స్ (48 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ సాంట్నర్ ఏడు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. గ్లెన్ ఫిలిప్స్ 2, సౌతీ ఓ వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా (38) టాప్ స్కోరర్గా నిలిచాడు. యశస్వి, గిల్ చెరో 30 పరుగులు చేశారు.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ ఏడు వికెట్లతో చెలరేగి కివీస్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టాడు. కివీస్ ఇన్నింగ్స్లో కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) అర్ద సెంచరీలతో రాణించారు. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో న్యూజిలాండ్ తొలి టెస్ట్లో నెగ్గిన విషయం తెలిసిందే. చదవండి: రసిఖ్ సలాం.. టీమిండియా రైజింగ్ స్టార్ -
ఇలా అయితే కష్టమే!
‘ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు’... అన్న చందంగా ఏరి కోరి సిద్ధం చేసుకున్న స్పిన్ పిచ్పై టీమిండియా బోల్తా కొట్టింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో పిచ్ పేస్కు అనుకూలించడం వల్లే టీమిండియా తడబడింది అని సర్దిచెప్పుకున్న వాళ్లు సైతం... పుణే ప్రదర్శనతో బేజారవుతున్నారు. ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసి ఉక్కిరి బిక్కిరి చేయాలనుకున్న రోహిత్ సేన చివరకు ఆ ఉచ్చులోనే చిక్కి విలవిల లాడింది. టెస్టు కెరీర్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా నాలుగు కంటే ఎక్కువ వికెట్లు తీసిన అనుభవం లేని సాంట్నర్కు ఏకంగా మనవాళ్లు ఏడు వికెట్లు సమర్పించుకున్నారు. భారత ఆటగాళ్లు తడబడ్డ చోటే రెండో ఇన్నింగ్స్లోనూ న్యూజిలాండ్ ప్లేయర్లు స్వేచ్ఛగా పరుగులు రాబట్టడం పుండు మీద కారం చల్లినట్లయింది. తొలి ఇన్నింగ్స్లో ఏడు వికెట్లు తీసిన భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండో ఇన్నింగ్స్లోనూ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నా... కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ మాత్రం చక్కటి ఇన్నింగ్స్తో అలరించాడు. స్పిన్నర్లను ఎదుర్కొనే క్రమంలో క్రీజు వదలి ఒక అడుగు ముందుకు వేసి బంతిని అందుకోవడంతో పాటు... కాళ్ల కదలికలో చురుకుదనం చూపిస్తూ ఖాళీల్లోకి బంతిని పోనిచ్చి పరుగులు పిండుకున్నాడు. మరో ఎండ్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్నా... ఏమాత్రం తడబడకుండా క్రీజులో నిలిచి కెపె్టన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా రెండో టెస్టులో న్యూజిలాండ్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 1955–56 నుంచి భారత్లో పర్యటిస్తున్న న్యూజిలాండ్... ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇక్కడ టెస్టు సిరీస్ గెలవలేకపోయింది. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో టెస్టు మ్యాచ్ ఓడిన టీమిండియా... ఇప్పుడు టెస్టు క్రికెట్ చరిత్రలో మొదటిసారి సిరీస్ ఓటమి అంచున నిలిచింది. వరుసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు చేరాలనుకుంటున్న టీమిండియా... ఇదే ప్రదర్శన కొనసాగిస్తే మున్ముందు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పదు. 2023–25 ఎడిషన్లో భాగంగా భారత్ ఇంకా కేవలం ఆరు టెస్టు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో ఒకటి న్యూజిలాండ్తో కాగా... మిగిలిన ఐదు ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో. ఇలాంటి దశలో స్వదేశంలో ఆడుతున్న సిరీస్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చి డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితితో ఆసీస్ గడ్డపై అడుగు పెడుతుంది అనుకుంటే... ఫలితాలు మాత్రం అందుకు విరుద్ధంగా వస్తున్నాయి. తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయం తర్వాత భారత మాజీ కెప్టెన్ , హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ‘జట్టులో పుజారా వంటి ప్లేయర్ ఎంతో అవసరం. ఎలాంటి పిచ్పైనైనా ఓపికగా నిలవడంతో పాటు సహచరులకు భరోసా ఇవ్వగల సామర్థ్యం అతడి సొంతం’ అని అన్నాడు. ఇప్పుడు వరుసగా రెండో టెస్టులోనూ మన బ్యాటర్ల ఆటతీరు చూస్తుంటే కుంబ్లే చెప్పింది నిజమే అనిపిస్తోంది. స్వదేశంలోనే పరిస్థితి ఇలా ఉంటే... ఆ్రస్టేలియా టూర్లో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుందనే అనుమానాలు రేకెత్తక మానవు! గత రెండు ఆసీస్ పర్యటనల్లోనూ పుజారా క్రీజులో పాతుకుపోయి జట్టుకు మూలస్తంభంలా నిలిచి మరపురాని విజయాలు అందించాడు. మరి బెంగళూరు, పుణే పిచ్పైనే పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడుతున్న మనవాళ్లు కంగారూ గడ్డపై ఏం చేస్తారో వేచి చూడాలి! –సాక్షి క్రీడావిభాగం -
కాంస్యం కోసం యువ భారత్ పోరు
కౌలాలంపూర్: జొహర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. టాప్–2లో నిలిచిన ఆ్రస్టేలియా, బ్రిటన్ జట్లు టైటిల్ కోసం పోటీపడనుండగా... మూడో స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్లు కాంస్య పతకం కోసం తలపడతాయి. 5–6 స్థానాల కోసం జపాన్, ఆతిథ్య మలేసియా జట్లు ఆడతాయి. వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు నాలుగో మ్యాచ్లో ఆ్రస్టేలియా కళ్లెం వేసింది. ఒక్క గోల్ సమర్పించుకోకుండా భారత్ఫై నాలుగు గోల్స్ సాధించి ఆ్రస్టేలియా ఘనవిజయం నమోదు చేసుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిస్తే భారత జట్టు ఫైనల్కు చేరుకునేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్తో మ్యాచ్ను భారత జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (6వ నిమిషంలో), రోహిత్ (17వ నిమిషంలో), తాలెమ్ ప్రియోబర్తా (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు జాంటీ ఎల్మెస్ (17వ, 32వ, 45వ నిమిషాల్లో) ఏకంగా మూడు గోల్స్ అందించాడు. కివీస్తో మ్యాచ్ ‘డ్రా’ కావడంతో భారత జట్టు ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధార పడింది. అయితే బ్రిటన్ జట్టు 3–1తో జపాన్పై, ఆ్రస్టేలియా 9–3తో మలేసియాపై ఘనవిజయం సాధించాయి. ఫలితంగా బ్రిటన్, ఆ్రస్టేలియా, భారత జట్లు 10 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఆ్రస్టేలియా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో నిలువగా... భారత్కు మూడో స్థానం దక్కింది. -
IND Vs NZ: పుణేలోనూ పరేషాన్
తొలి టెస్టులో న్యూజిలాండ్ పేస్ బౌలర్ల ధాటికి దాసోహం అన్న భారత జట్టు... రెండో టెస్టులో స్పిన్నర్లను ఎదుర్కోలేక చేతులెత్తేసింది. ఏడేళ్ల క్రితం ఇక్కడే జరిగిన టెస్టు మ్యాచ్లో పూర్తి స్పిన్ పిచ్ను సిద్ధం చేసి ఆ్రస్టేలియా చేతిలో భంగపాటుకు గురైన టీమిండియా... ఇప్పుడు న్యూజిలాండ్ చేతిలోనూ అలాంటి పరిస్థితే ఎదుర్కుంటోంది. స్పిన్ను ఆడటంలో సిద్ధహస్తులు అనుకున్న మన బ్యాటర్లు ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టడంతో తొలి ఇన్నింగ్స్లో రోహిత్ బృందం కుప్పకూలగా ... భారత బ్యాటర్లు అష్టకష్టాలు పడ్డచోట కివీస్ ఆటగాళ్లు ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టారు. ఫలితంగా రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా గడ్డు స్థితిలో ఉంది. భారత గడ్డపై ఇప్పటి వరకు టెస్టు సిరీస్ గెలవని న్యూజిలాండ్ ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యంతో దూసుకెళ్తుండగా... పుష్కర కాలం నుంచి సొంతగడ్డపై సిరీస్ ఓటమి ఎరుగని టీమిండియా ఇప్పుడు ఆ ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది! ఇక ఈ మ్యాచ్ నుంచి రోహిత్ బృందం గట్టెక్కాలంటే అద్భుతం జరగాల్సిందే! పుణే: దశాబ్ద కాలంగా సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ... ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న టీమిండియా 12 సంవత్సరాల తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి అంచున నిలిచింది. బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ పేసర్ల ధాటికి బెంబేలెత్తి పరాజయం పాలైన టీమిండియా... ఇప్పుడు పుణేలో ప్రత్యర్థి స్పిన్ దెబ్బకు వెనుకంజ వేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్లో చక్కటి ప్రదర్శన కనబర్చిన న్యూజిలాండ్ జట్టు శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 53 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (133 బంతుల్లో 86; 10 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. బ్లన్డెల్ (30 బ్యాటింగ్; 2 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు. చేతిలో ఐదు వికెట్లు ఉన్న న్యూజిలాండ్... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 103 పరుగులు కలుపుకొని ఓవరాల్గా 301 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. బ్లన్డెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 16/1తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 45.3 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటైంది. రవీంద్ర జడేజా (38; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా... యశస్వి జైస్వాల్ (30), శుబ్మన్ గిల్ (30) ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిషెల్ సాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా... గ్లెన్ ఫిలిప్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. లాథమ్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడిన చోట... బ్యాటింగ్ ఎలా చేయాలో లాథమ్ ఆచరణలో చూపాడు. అప్పటికే 100 పరుగులకు పైగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కడంతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన లాథమ్... ఒక్కో పరుగు జోడిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో స్కోరు బోర్డును నడిపించాడు. కాన్వే (17), విల్ యంగ్ (23), రచిన్ రవీంద్ర (9), మిచెల్ (18) ఎక్కువసేపు నిలవకపోయినా... చిన్న చిన్న భాగస్వామ్యాలు నిరి్మస్తూ ఇన్నింగ్స్కు వెన్నెముకలా నిలిచాడు. పేసర్లు ప్రభావం చూపకపోవడంతో భారత కెపె్టన్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే స్పిన్నర్లను నమ్ముకోగా.. సుందర్ మినహా అశ్విన్, జడేజా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయారు. మరి కాసేపట్లో రెండో రోజు ఆట ముగుస్తుందనగా.. లాథమ్ను సుందర్ వికెట్ల ముందు దొరక బుచ్చుకోగా... ఇప్పటికే 301 పరుగుల ఆధిక్యం సాధించిన న్యూజిలాండ్... టీమిండియా ముందు ఎంత లక్ష్యాన్ని నిర్దేశిస్తుందనేది ఆసక్తికరం.ఒకరి వెంట ఒకరు.. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్లో 46 పరుగులకే కుప్పకూలి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు... స్పిన్కు స్వర్గధామంలా కనిపిస్తున్న పుణే పిచ్పైనైనా చెలరేగుతుంది అనుకుంటే అదీ సాధ్యపడలేదు. రెండో వికెట్కు గిల్, జైస్వాల్ జోడించిన 49 పరుగులే భారత ఇన్నింగ్స్లో అత్యధిక భాగస్వామ్యం కాగా.. జట్టు స్కోరు 50 వద్ద గిల్ ఔటయ్యాడు.ఇక అక్కడి నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం ఏ దశలోనూ ఆగలేదు. సాంట్నర్ వేసిన ఊరించే బంతికి విరాట్ కోహ్లి (1) క్లీన్ బౌల్డ్ కాగా.. యశస్వి జైస్వాల్, పంత్ (18)ను ఫిలిప్స్ బుట్టలో వేసుకున్నాడు. గత మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడి తన విలువ చాటుకున్న కోహ్లి చెత్త బంతికి పెవిలియన్ చేరాడు. సర్ఫరాజ్ (11), అశ్విన్ (4) ఎక్కువసేపు నిలువలేకపోయారు. బెంగళూరులో భారీ సెంచరీతో జట్టులో ఆత్మవిశ్వాసం నింపిన సర్ఫరాజ్ ఈసారి అదే ప్రయత్నం చేయలేకపోయాడు. జడేజా ధాటిగా ఆడగా... సుందర్ (18 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయంగా నిలిచాడు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 259; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) మిచెల్ (బి) ఫిలిప్స్ 30; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 30; కోహ్లి (బి) సాంట్నర్ 1; పంత్ (బి) ఫిలిప్స్ 18; సర్ఫరాజ్ (సి) రూర్కే (బి) సాంట్నర్ 11; జడేజా (ఎల్బీ) సాంట్నర్ 38; అశ్విన్ (ఎల్బీ) (బి) సాంట్నర్ 4; సుందర్ (నాటౌట్) 18; ఆకాశ్దీప్ (బి) సాంట్నర్ 6; బుమ్రా (ఎల్బీ) (బి) సాంట్నర్ 0; ఎక్స్ట్రాలు: 0; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 156. వికెట్ల పతనం: 1–1, 2–50, 3–56, 4–70, 5–83, 6–95, 7–103, 8–136, 9–142, 10–156. బౌలింగ్: సౌతీ 6–1–18–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 11–1–54–0, సాంట్నర్ 19.3–1–53–7, ఫిలిప్స్ 6–0–26–2. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) సుందర్ 86; కాన్వే (ఎల్బీ) (బి) సుందర్ 17; యంగ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 23; రచిన్ (బి) సుందర్ 18; మిషెల్ (సి) జైస్వాల్ (బి) సుందర్ 18; బ్లన్డెల్ (బ్యాటింగ్) 30; ఫిలిప్స్ (బ్యాటింగ్) 9; ఎక్స్ట్రాలు 6; మొత్తం (53 ఓవర్లలో 5 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–36, 2–78, 3–89, 4–123, 5–183. బౌలింగ్: అశ్విన్ 17–1–64–1; సుందర్ 19–0–56–4; జడేజా 11–1–50–0; బుమ్రా 6–1–25–0. -
‘సప్త’ సుందర్
వాషింగ్టన్ సుందర్ టెస్టు మ్యాచ్ ఆడి మూడున్నరేళ్లు దాటింది. ఈ సిరీస్ తొలి టెస్టులో అతనికి చోటే లేదు. అయితే రంజీ ట్రోఫీలో ప్రదర్శన కారణంగా జట్టులో నలుగురు రెగ్యులర్ స్పిన్నర్లు ఉన్నా రెండో టెస్టు కోసం 16వ సభ్యుడిగా అతడిని అదనంగా ఎంపిక చేశారు. ఆఫ్ స్పిన్తో పాటు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి ఈ అవకాశం కల్పించింది. తొలి రోజు సుందర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏకంగా ఏడు వికెట్లతో న్యూజిలాండ్ను పడగొట్టాడు. సహచర తమిళనాడు సీనియర్ అశ్విన్ తొలి మూడు వికెట్లతో మొదలు పెడితే సుందర్ దానిని కొనసాగించాడు. కివీస్ను 259 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా... రోహిత్ శర్మ వికెట్ చేజార్చుకొని రోజును కాస్త నిరాశగా ముగించింది. పుణే: భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో ఊహించినట్లుగానే తొలి రోజు నుంచే స్పిన్నర్ల జోరు మొదలైంది. ఆఫ్స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (7/59), రవిచంద్రన్ అశ్విన్ (3/64) ధాటికి న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 79.1 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌటైంది. డెవాన్ కాన్వే (141 బంతుల్లో 76; 11 ఫోర్లు), రచిన్ రవీంద్ర (105 బంతుల్లో 65; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం ఆట ముగిసేసరికి భారత్ 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (0) డకౌట్ కాగా... యశస్వి జైస్వాల్ (6 బ్యాటింగ్), శుబ్మన్ గిల్ (10 బ్యాటింగ్) తమ దూకుడును కట్టిపెట్టి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ స్థానాల్లో గిల్, ఆకాశ్దీప్, సుందర్ జట్టులోకి వచ్చారు. ఈసారీ వారిద్దరే... గత టెస్టు తరహాలోనే ఈ సారి కూడా కివీస్ టాప్–7లో కాన్వే, రచిన్ మాత్రమే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్లు ఆడగా... మిగతా వారంతా విఫలమయ్యారు. పేసర్లు వేసిన తొలి 7 ఓవర్లలో కివీస్ 5 ఫోర్లతో చకచకా 30 పరుగులు రాబట్టింది. అయితే ఇన్నింగ్స్ 8వ ఓవర్లోనే అశ్విన్ను బౌలింగ్కు దించడం ఫలితాన్ని అందించింది. తన ఐదో బంతికే టామ్ లాథమ్ (15)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతను కొద్ది సేపటికే విల్ యంగ్ (18)ను పెవిలియన్ పంపించాడు. ఈ దశలో కాన్వే, రచిన్ కలిసి జట్టును ఆదుకున్నారు. లంచ్ తర్వాత బుమ్రా వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన కాన్వే 109 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు 62 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యం తర్వాత కాన్వేను అవుట్ చేసి అశ్విన్ ఈ జోడీని విడగొట్టాడు. అయితే రచిన్ మాత్రం చక్కటి షాట్లతో ఇన్నింగ్స్ను నడిపించాడు. ఆకాశ్దీప్ ఓవర్లో రెండు వరుస ఫోర్లతో అతను 93 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ను అందుకోగా... ఒకదశలో కివీస్ 197/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. టపటపా... స్పిన్నర్ సుందర్ కొత్త స్పెల్తో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చక్కటి బంతితో రచిన్ను క్లీన్»ౌల్డ్ చేసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టిన అతను తర్వాతి ఓవర్లో బ్లన్డెల్ (3) పని పట్టాడు. టీ విరామం తర్వాత చివరి సెషన్లో మిగిలిన ఐదు వికెట్లు తీసేందుకు సుందర్కు ఎక్కువ సమయం పట్టలేదు. అతని బంతులను ఆడలేక బ్యాటర్లంతా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క మిచెల్ సాన్ట్నర్ (51 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్లు) మాత్రమే కొద్దిసేపు పోరాడగలిగాడు. తన తొలి 13 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని సుందర్ తర్వాత 61 బంతుల వ్యవధిలో 7 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రత్యర్థి 10 వికెట్లను ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లే కలిసి పడగొట్టడం భారత్ తరఫున ఇదే తొలిసారి. 62 పరుగుల వ్యవధిలో కివీస్ చివరి 7 వికెట్లు కోల్పోయింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: లాథమ్ (ఎల్బీ) (బి) అశ్విన్ 15; కాన్వే (సి) పంత్ (బి) అశ్విన్ 76; యంగ్ (సి) పంత్ (బి) అశ్విన్ 18; రచిన్ (బి) సుందర్ 65; మిచెల్ (ఎల్బీ) (బి) సుందర్ 18; బ్లన్డెల్ (బి) సుందర్ 3; ఫిలిప్స్ (సి) అశ్విన్ (బి) సుందర్ 9; సాన్ట్నర్ (బి) సుందర్ 33; సౌతీ (బి) సుందర్ 5; ఎజాజ్ (బి) సుందర్ 4; రూర్కే (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 13; మొత్తం (79.1 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–32, 2–76, 3–138, 4–197, 5–201, 6–204, 7–236, 8–242, 9–252, 10–259. బౌలింగ్: బుమ్రా 8–2–32–0, ఆకాశ్దీప్ 6–0–41–0, అశ్విన్ 24–2–64–3, వాషింగ్టన్ సుందర్ 23.1–4–59–7, జడేజా 18–0–53–0. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బ్యాటింగ్) 6; రోహిత్ (బి) సౌతీ 0; గిల్ (బ్యాటింగ్) 10; ఎక్స్ట్రాలు 0; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 16. వికెట్ల పతనం: 1–1. బౌలింగ్: సౌతీ 3–1–4–1, రూర్కే 3–2–5–0, ఎజాజ్ 3–1–5–0, సాన్ట్నర్ 2–0–2–0. -
IND Vs NZ: న్యూజిలాండ్తో రెండో టెస్ట్.. టీమిండియాలో మూడు మార్పులు
పూణే వేదికగా టీమిండియాతో ఇవాళ (అక్టోబర్ 24) ప్రారంభంకానున్న రెండో టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్తో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేసింది. కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్ స్థానాల్లో శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్ తుది జట్టులోకి వచ్చారు. మరోవైపు న్యూజిలాండ్ సైతం నేటి మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. పేసర్ మ్యాట్ హెన్రీ స్థానంలో స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ తుది జట్టులోకి వచ్చాడు. కాగా, మూడు మ్యాచ్ల ఈ టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.తుది జట్లు..భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రాన్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్(వికెట్కీపింగ్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కేచదవండి: స్కై, విరాట్లను అధిగమించిన సికందర్ రజా -
హర్మన్ప్రీత్కు పరీక్ష!
అహ్మదాబాద్: ఇటీవల మహిళల టి20 ప్రపంచకప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన భారత జట్టు మరో పరీక్షకు సిద్ధమైంది. తాజా టి20 ప్రపంచకప్లో విశ్వవిజేతగా నిలిచిన న్యూజిలాండ్ జట్టుతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్లో హర్మన్ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వచ్చే ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్నకు ఇప్పటి నుంచే జట్టును సిద్ధం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఐసీసీ ట్రోఫీ కోసం చకోర పక్షిలా చూస్తున్న భారత మహిళల జట్టుకు తాజా టి20 ప్రపంచకప్లో చుక్కెదురైంది. దీంతో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై వేటు పడటం ఖాయమే అని అంతా భావించినా... సెలక్షన్ కమిటీ మాత్రం హర్మన్పై నమ్మకముంచింది. న్యూజిలాండ్తో సిరీస్కు హర్మన్కే పగ్గాలు అప్పగించింది. మరి అందరికంటే అనుభవజు్ఞరాలైన హర్మన్ప్రీత్ జట్టును ఎలా నడిపిస్తుందో చూడాలి. 12వ తరగతి పరీక్షల కారణంగా రిచా ఘోష్ను ఈ సిరీస్కు ఎంపిక చేయకపోగా.. ఆశ శోభన గాయంతో జట్టుకు దూరమైంది. దీంతో నలుగురు యువ ఆటగాళ్లు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఆ్రస్టేలియాలో పర్యటించిన భారత ‘ఎ’ జట్టు ప్లేయర్లు తేజల్, సయాలీ, ప్రియా మిశ్రాతో పాటు డబ్ల్యూపీఎల్లో రాణించిన సైమా ఠాకూర్ మొదటిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. టి20 ప్రపంచకప్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచిన 35 ఏళ్ల హర్మన్పై ఒత్తిడి అధికంగా ఉండగా... స్మృతి మంధాన, షఫాలీ వర్మ మెరుగైన ఆరంభాలు ఇవ్వాల్సిన అవసరముంది. మిడిలార్డర్లో హర్మన్తో పాటు జెమీమా, హేమలత, దీప్తి కీలకం కానున్నారు. మరోవైపు సోఫీ డివైన్ సారథ్యంలో టి20 ప్రపంచకప్ గెలిచి ఉత్సాహంగా ఉన్న న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. 20 భారత్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 20 వన్డేలు జరిగాయి. 10 మ్యాచ్ల్లో భారత్ నెగ్గగా... 9 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలిచింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. 9 తొమ్మిది సంవత్సరాల తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో భారత్ వన్డే సిరీస్ ఆడుతోంది. చివరిసారి 2015లో జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు 3–2తో సొంతం చేసుకుంది.54 ఓవరాల్గా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 54 వన్డే మ్యాచ్లు జరిగాయి. 20 మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించగా... 33 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ గెలుపొందింది. ఒక మ్యాచ్ ‘టై’గా ముగిసింది. -
పుణేలో ప్రతీకారానికి సిద్ధం!
సొంతగడ్డపై తొలి టెస్టులో ప్రత్యర్థి చేతిలో ఓడి వెనుకబడటం, ఆ తర్వాత కోలుకొని వరుస విజయాలతో సిరీస్ గెలుచుకోవడం భారత జట్టుకు కొత్త కాదు. ఇటీవల ఆస్ట్రేలియా ఒకసారి, ఇంగ్లండ్ రెండుసార్లు ఇలాగే ముందంజ వేసినా మన టీమ్ మళ్లీ సత్తా చాటి తామేంటో చూపించింది. ఇప్పుడు ఈ విషయంలో న్యూజిలాండ్ వంతు! ప్రతికూల పిచ్ దెబ్బకు అనూహ్యంగా కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓడిన టీమిండియా ప్రతీకారానికి సిద్ధమైంది. తమ స్థాయిని ప్రదర్శిస్తూ రెండో టెస్టులో విజయమే లక్ష్యంగా రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగుతోంది. మరోవైపు గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో న్యూజిలాండ్ కూడా ఎక్కడా తగ్గరాదని పట్టుదలగా ఉంది. పుణే: ‘రెండు గంటలు మినహా మిగతా మ్యాచ్ మొత్తం మేం బాగా ఆడాం’... బెంగళూరు టెస్టులో ప్రదర్శనపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్య ఇది. పిచ్పై అంచనా తప్పడంతో 0–1తో సిరీస్లో వెనుకబడిన భారత్ ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వ రాదని భావిస్తోంది. అందుకే తమ టీమ్ బలగంతో పాటు స్పిన్ బలాన్ని కూడా నమ్ముకుంటోంది. పూర్తిగా స్పిన్కు అనుకూలించే పిచ్ను రూపొందించి ప్రత్యర్థికి సవాల్ విసురుతోంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నేటి నుంచి రెండో టెస్టు జరగనుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సిరీస్లో 1–1తో సమంగా నిలుస్తుంది. బరిలోకి గిల్... గత టెస్టు మ్యాచ్ ఆడిన జట్టులోంచి భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి కోలుకున్న టాపార్డర్ బ్యాటర్ శుబ్మన్ గిల్ మ్యాచ్కు అందుబాటులో ఉన్నాడని మేనేజ్మెంట్ ప్రకటించింది. అయితే గిల్ వస్తే ఎవరిని తప్పిస్తారనేది ఆసక్తికరం. రాహుల్పై విమర్శలు వస్తున్నా... అతను మిడిలార్డర్కు మారిన తర్వాత 1 సెంచరీ, 2 అర్ధసెంచరీలతో మెరుగైన ప్రదర్శనే చేశాడు. కానీ గత టెస్టులో ఆటను బట్టి సర్ఫరాజ్కే మొగ్గు చూపవచ్చు. ఈ యువ ఆటగాడు తన బ్యాటింగ్ జోరు కొనసాగించేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరోవైపు సిరాజ్ ఫామ్లో లేకపోవడంతో అతనికి బదులుగా ఆకాశ్దీప్ను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఎలాగూ స్పిన్తో యుద్ధానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి నాలుగో స్పిన్నర్గా వాషింగ్టన్ సుందర్ను ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదు. రోహిత్, యశస్వి, గిల్, కోహ్లిలతో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. పంత్ కూడా పూర్తిగా కోలుకున్నాడు. బంగ్లాదేశ్తో ఆడిన తరహాలో అశ్విన్, జడేజా కూడా ఒక చేయి వేస్తే తిరుగుండదు. బౌలింగ్లో వీరిద్దరితో పాటు కుల్దీప్ కివీస్ను కుప్పకూల్చాలని టీమ్ కోరుకుంటోంది. సాన్ట్నర్కు చోటు... తొలి టెస్టులో గెలిచినా... వాస్తవ పరిస్థితి ఏమిటో న్యూజిలాండ్కు తెలుసు. గత మ్యాచ్ విజయం తమలో స్ఫూర్తి నింపేందుకు పనికొస్తుందే తప్ప వరుసగా రెండో టెస్టులో భారత్ను ఇక్కడ ఓడించడం అంత సులువు కాదనేది నిజం. అందుకే టీమ్ అన్ని రకాలుగా సన్నద్ధమై ఉంది. పూర్తిగా స్పిన్ పిచ్ అయినా సరే ముందే బెదిరిపోమని, దానికి అనుగుణంగా తమ ఆటను మార్చుకుంటామని కెపె్టన్ లాథమ్ చెబుతున్నాడు. తొలి టెస్టులో కీలక బ్యాటింగ్ ప్రదర్శన చేసిన రచిన్, కాన్వే, యంగ్ మరోసారి జట్టుకు భారీ స్కోరు అందించగల సమర్థులు. వీరితో పాటు లాథమ్, మిచెల్, బ్లన్డెల్ కూడా రాణించాలని జట్టు ఆశిస్తోంది. దూకుడైన బ్యాటింగ్ చేయగల సమర్థుడైన ఫిలిప్స్ ఇటీవల పార్ట్టైమ్ స్పిన్నర్గా రాణిస్తుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. అయితే బెంగళూరు తరహాలో ముగ్గురు పేసర్లు ప్రభావం చూపించే అవకాశం లేదు కాబట్టి ఒకరిని తప్పించి మరో రెగ్యులర్ స్పిన్నర్ సాన్ట్నర్ను జట్టు బరిలోకి దించనుంది. 2 పుణేలో భారత జట్టు ఇప్పటి వరకు రెండు టెస్టులు ఆడింది. ఒక మ్యాచ్లో ఓడి, మరో మ్యాచ్లో గెలిచింది. 2017లో ఆ్రస్టేలియా చేతిలో ఓడిన భారత్... 2019లో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలిచింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో విరాట్ కోహ్లి తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పిచ్, వాతావరణం తొలి టెస్టు ముగిసిన దగ్గరి నుంచి చెబుతున్నట్లుగా పూర్తిగా పొడిగా ఉండే స్పిన్ వికెట్ను సిద్ధం చేశారు. ఆట సాగుతున్నకొద్దీ స్పిన్నర్లు మరింత ప్రభావం చూపగలరు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. వర్షసూచన ఏమాత్రం లేదు. అయితే 2017లో ఇదే మైదానంలో పూర్తిగా స్పిన్ పిచ్ను తయారు చేసిన భారత్... ఆసీస్ స్పిన్ దెబ్బకు 333 పరుగులతో ఓడి భంగపడిన విషయం గమనార్హం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: రోహిత్, జైస్వాల్, గిల్, కోహ్లి, సర్ఫరాజ్/రాహుల్, పంత్, జడేజా, అశ్విన్, కుల్దీప్, బుమ్రా, ఆకాశ్దీప్/సుందర్. న్యూజిలాండ్: లాథమ్ (కెప్టెన్ ), కాన్వే, యంగ్, రచిన్, మిచెల్, బ్లన్డెల్, ఫిలిప్స్, హెన్రీ, ఎజాజ్, సాన్ట్నర్, సౌతీ/రూర్కే. -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్లు
లిస్ట్-ఏ క్రికెట్లో (50 ఓవర్ల ఫార్మాట్) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ నమోదైంది. న్యూజిలాండ్లో జరిగే ఫోర్డ్ ట్రోఫీలో క్యాంటర్బరీ ఆటగాడు చాడ్ బోవ్స్ 103 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ బాదాడు. క్రైస్ట్చర్చ్ వేదికగా ఒటాగోతో జరిగిన మ్యాచ్లో బోవ్స్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్కు ముందు లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, ఎన్ జగదీశన్ పేరిట ఉండేది. వీరిద్దరూ 114 బంతుల్లో డబుల్ సాధించారు. తాజాగా బోవ్స్.. హెడ్ (సౌత్ ఆస్ట్రేలియా), జగదీశన్ (తమిళనాడు) రికార్డును బద్దలు కొట్టాడు. View this post on Instagram A post shared by Canterbury Cricket (@canterbury.cricket)బోవ్స్ ఈ మ్యాచ్లో మరో ఘనత కూడా సాధించాడు. న్యూజిలాండ్ లిస్ట్-ఏ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో మొత్తంగా 110 బంతులు ఎదుర్కొని 205 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ లిస్ట్-ఏ చరిత్రలో అత్యధిక స్కోర్ రికార్డు జేమీ హౌ (222) పేరిట ఉంది.CHAD BOWES SMASHED THE FASTEST DOUBLE HUNDRED IN LIST A CRICKET HISTORY - 103 BALLS. 🤯 pic.twitter.com/sMbIUJnQBW— Mufaddal Vohra (@mufaddal_vohra) October 23, 2024మ్యాచ్ విషయానికొస్తే.. బోవ్స్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాంటర్బరీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఒటాగో 103 పరుగులకే ఆలౌటై 240 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. చదవండి: న్యూజిలాండ్ టీమ్కు కొత్త కెప్టెన్ -
న్యూజిలాండ్ టీమ్కు కొత్త కెప్టెన్
నవంబర్ 9 నుంచి శ్రీలంకతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టుకు కొత్త కెప్టెన్ను ఎంపిక చేశారు ఆ దేశ సెలెక్టర్లు. ఈ సిరీస్లలో మిచెల్ సాంట్నర్ కివీస్ జట్టును ముందుండి నడిపించనున్నాడు. కేన్ విలియమ్సన్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత న్యూజిలాండ్ ఆడుతున్న మొదటి పరిమిత ఓవర్ల సిరీస్ ఇదే. ఈ సిరీస్లలో సాంట్నర్ న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరిస్తాడు.ఆల్రౌండర్ నాథన్ స్మిత్, వికెట్కీపర్ కమ్ బ్యాటర్ మిచ్ హే తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫెర్గూసన్, జాకబ్ డఫీ, జాక్ ఫోల్క్స్ పేసర్లుగా.. ఐష్ సోధి స్పెషలిస్ట్ స్పిన్నర్గా.. గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్వెల్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా.. మార్క్ చాప్మన్, హెన్రీ నికోల్స్, టిమ్ రాబిన్సన్, జోష్ క్లార్క్సన్ స్పెషలిస్ట్ బ్యాటర్లుగా ఎంపికయ్యారు.ఈ సిరీస్ల కోసం టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విలియమ్ ఓరూర్కీ, రచిన్ రవీంద్ర, టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్లను పరిగణలోకి తీసుకోలేదు. వీరంతా ప్రస్తుతం భారత్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో బిజీగా ఉన్నారు. భారత్తో సిరీస్ ముగిసిన అనంతరం వీరు ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది.కాగా, రెండు టీ20లు, మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. నవంబర్ 9న డంబుల్లా వేదికగా తొలి టీ20, నవంబర్ 10న అదే డంబుల్లా వేదికగా రెండో టీ20 జరుగనున్నాయి. అనంతరం నవంబర్ 13న డంబుల్లా వేదికగానే తొలి వన్డే, నవంబర్ 17, 19 తేదీల్లో క్యాండీ వేదికగా రెండు, మూడు వన్డేలు జరుగనున్నాయి.శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు..మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, జోష్ క్లార్క్సన్, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, జాక్ ఫౌల్క్స్, డీన్ ఫాక్స్క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్కీపర్), హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, టిమ్ రాబిన్సన్, నాథన్ స్మిత్, ఐష్ సోధి, విల్ యంగ్చదవండి: శ్రేయస్ అయ్యర్కు గాయం -
వారిద్దరూ సిద్ధమే
పుణే: గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన శుబ్మన్ గిల్తో పాటు... మోకాలి వాపుతో కీపింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన రిషబ్ పంత్ రెండో టెస్టు వరకు అందుబాటులో ఉంటారని భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వెల్లడించాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా... భారత్, న్యూజిలాండ్ మధ్య గురువారం నుంచి పుణేలో రెండో టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. అనంతరం డస్కటే మీడియాతో మాట్లాడాడు. బెంగళూరు టెస్టులో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కాన్వేను స్టంపౌట్ చేసే ప్రయత్నంలో పంత్ మోకాలికి గాయమైంది. గతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అదే కాలికి శస్త్రచికిత్స జరగడంతో జట్టు మొత్తం ఆందోళనకు గురైంది. గాయం తీవ్రత ఎక్కువ ఉండటంతో వెంటనే పంత్ మైదానాన్ని వీడగా... అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టాడు. అనంతరం అత్యవసర పరిస్థితుల్లో రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన పంత్... పరిగెత్తడానికి ఇబ్బంది పడుతూనే విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం ‘పంత్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరముంది’ అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొనడంతో అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే సంశయం నెలకొంది. అయితే తాజాగా డస్కటే ఈ అంశంపై స్పష్టత ఇచ్చాడు. ‘పంత్ పూర్తిగా కోలుకున్నాడు. పుణే టెస్టుకు అతడు అందుబాటులో ఉంటాడు. గిల్ ఆరోగ్యం కూడా కుదుట పడింది. అతడు నెట్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మ్యాచ్ వరకు అంతా సవ్యంగా ఉంటుంది అనుకుంటున్నాం’ అని డస్కటే పేర్కొన్నాడు. ఆ ఇద్దరి మధ్యే పోటీ భారత తుది జట్టులో చోటు కోసం ఇద్దరు ఆటగాళ్ల మధ్య పోటీ ఉందని డస్కటే అన్నాడు. తొలి టెస్టులో భారీ సెంచరీతో రాణించిన సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ మధ్య పోటీ ఉందని అన్నాడు. ‘ఇందులో దాయడానికి ఏమీ లేదు. తుది జట్టులో ఓ బెర్త్ కోసం పోటీ ఉంది. బెంగళూరు టెస్టులో సర్ఫరాజ్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. రాహుల్ కూడా సంసిద్ధంగా ఉన్నాడు. పిచ్, పరిస్థితులను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది. రాహుల్ ఆటతీరును కోచ్ గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలిస్తున్నాడు. రాహుల్పై టీమ్ మేనేజ్మెంట్కు నమ్మకముంది. అదే సమయంలో దేశవాళీలతో పాటు అవకాశం వచ్చిన ప్రతిసారీ జాతీయ జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సర్ఫరాజ్ను కూడా పక్కన పెట్టలేం. అందుకే అందరు ఆటగాళ్లకు అండగా నిలుస్తాం. న్యూజిలాండ్ జట్టులో ఎక్కువ మంది ఎడంచేతి వాటం ఆటగాళ్లు ఉండటం వల్లే ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ను జట్టుకు ఎంపిక చేశారు. ఇటీవల రంజీ ట్రోఫీలో అతడి ప్రదర్శన బాగుంది. తమిళనాడు తరఫున మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగి భారీ సెంచరీ బాదడంతో పాటు... బౌలింగ్లోనూ రాణించాడు’ అని డస్కటే గుర్తు చేశాడు. ఇక స్వదేశంలో జరిగిన టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ను కూడా డస్కటే వెనకేసుకొచ్చాడు. ‘బెంగళూరు టెస్టు ఆఖరి రోజు తొలి గంటలో సిరాజ్ చక్కటి బౌలింగ్ చేశాడు. దురదృష్టవశాత్తు వికెట్ దక్కక పోయినా... అతడి బౌలింగ్లో ఎలాంటి లోపం లేదు. నాణ్యమైన బంతులతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. పుణేలో పరిస్థితులను బట్టే జట్టు ఎంపిక ఉంటుంది’ అని డస్కటే వివరించాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు ఎలాంటి సమస్యలు లేవని అతడు అన్నాడు. మ్యాచ్ పరిస్థితులను బట్టే అతడు తక్కువ బౌలింగ్ చేశాడని తెలిపాడు. టీమిండియా ముమ్మర సాధన తొలి టెస్టులో పరాజయం పాలై సిరీస్లో వెనుకబడిన టీమిండియా... రెండో టెస్టు కోసం కసరత్తులు చేస్తోంది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భారత ఆటగాళ్లు చెమటోడ్చారు. పంత్ గాయం నేపథ్యంలో మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్... కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కాసేపటికి మైదానంలోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంతో పాటు చివర్లో కీపింగ్ సాధన కూడా చేయడంతో అతడి ఫిట్నెస్పై ఉన్న అనుమానాలు పటాపంచలయ్యాయి. మరోవైపు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్ కూడా ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఇక కొత్తగా జట్టుతో కలిసి వాషింగ్టన్ సుందర్ నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ సాగించాడు. ఈ మ్యాచ్ కోసం రూపొందించిన పిచ్ను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెపె్టన్ రోహిత్ శర్మ, బౌలర్లు జడేజా తదితరులు నిశితంగా పరిశీలించారు. రెండో టెస్టు కోసం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్ను తయారు చేసినట్లు సమాచారం. -
ఎలాంటి పిచ్ ఎదురైనా...
పుణే: తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు... రెండో మ్యాచ్ కోసం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఆ జట్టు ఆల్రౌండర్ డారిల్ మిచెల్ అన్నాడు. పుణేలో స్పిన్ పిచ్ ఎదురయ్యే అవకాశముందని... అయితే దాని కోసం కివీస్ ప్లేయర్ల వద్ద తగిన ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన న్యూజిలాండ్... 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ నెగ్గింది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్ అనంతరం మిచెల్ మాట్లాడుతూ.. ‘పిచ్ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు. అది ఆటగాళ్ల పని కాదు. పరిస్థితులను ఆకలింపు చేసుకొని దానికి తగ్గట్లు ముందుకు సాగడం ముఖ్యం. ఇందులో మా ప్లేయర్లు సిద్ధహస్తులు. పరిస్థితులకు తగ్గట్లు ఆడటం ముఖ్యం. ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టడంతో పాటు మంచి స్కోర్లు చేయడం గురించే మేం ఆలోచిస్తున్నాం. బెంగళూరు విజయం జట్టులో మరింత సానుకూల దృక్పథం నింపింది. అయితే దాన్ని పక్కన పెట్టి పుణేలో మళ్లీ తాజాగా ప్రారంభించాల్సిందే. శ్రీలంక పర్యటనలో భాగంగా గాలెలో పూర్తిగా స్పిన్ పిచ్లపై మ్యాచ్లు ఆడాం. ఒక్కో పిచ్ ప్రత్యేకత ఒకలా ఉంటుంది. వికెట్ను బట్టి ఆటతీరును మార్చుకుంటూ ముందుకు సాగాలి. తొలి టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ ప్రపంచ స్థాయి ప్లేయర్ అతడి ఆటతీరు నాకు చాలా ఇష్టం’ అని మిచెల్ అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు తొలిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ గెలవడం చాలా ఆనందంగా ఉందని మిచెల్ పేర్కొన్నాడు. రెండో టెస్టుకూ విలియమ్సన్ దూరంపుణే: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ భారత్తో రెండో టెస్టులో కూడా బరిలోకి దిగబోడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. గజ్జల్లో గాయం కారణంగా బెంగళూరులో జరిగిన తొలి టెస్టుకు దూరమైన విలియమ్సన్... ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో రెండో టెస్టుకు కూడా అందుబాటులో ఉండడని బోర్డు మంగళవారం స్పష్టం చేసింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు గెలిచిన న్యూజిలాండ్... గురువారం నుంచి రెండో టెస్టులో టీమిండియాతో తలపడుతుంది. శ్రీలంకతో సిరీస్ సందర్భంగా గాయపడ్డ విలియమ్సన్ అప్పటి నుంచి చికిత్స పొందుతున్నాడు. ‘కేన్ కోలుకుంటున్నాడు. అయితే వంద శాతం ఫిట్నెస్ సాధించలేదు. అందుకే అతడు రెండో టెస్టులో ఆడబోవడం లేదు. ప్రస్తుతం విలియమ్సన్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. మూడో టెస్టు వరకు అతడు మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నాం’ అని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. విలియమ్సన్ గైర్హాజరీలోనూ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకున్న న్యూజిలాండ్ జట్టు... 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచి సిరీస్లో ముందంజ వేసింది. -
ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ టీమ్ ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కరు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని న్యూజిలాండ్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో కూడిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఐసీసీ ప్రకటించింది.ఈ టీమ్కు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్ను కెప్టెన్గా ఎంపిక చేశారు. వోల్వార్ట్ తన అద్భుత కెప్టెన్సీ, ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఫైనల్కు చేర్చింది. 12 మంది సభ్యుల ఈ టీమ్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల నుంచి చెరో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్కు ఒక్కరికే చోటు దక్కింది. . భారత జట్టు సెమీఫైనల్కు చేరడంలో విఫలమైనా నాలుగు ఇన్నింగ్స్లలో కలిపి హర్మన్ 2 అర్ధ సెంచరీలు సహా 133.92 స్ట్రయిక్ రేట్తో 150 పరుగులు సాధించింది.జట్టు వివరాలు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజీమిన్ బ్రిట్స్, నాన్కులులెకొ ఎమ్లాబా (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్), డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), డానీ వ్యాట్ (ఇంగ్లండ్), మెగాన్ షుట్ (ఆ్రస్టేలియా), నిగార్ సుల్తానా (బంగ్లాదేశ్), హర్మన్ప్రీత్ కౌర్ (భారత్). -
అయ్యో పంత్...! నీకే ఎందుకిలా..? ఏడోసారి సెంచరీ మిస్..