ఢిల్లీ, మణిపూర్ జట్లకు టైటిల్స్ | delhi, manipur teams clinched sepak takraw titles | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, మణిపూర్ జట్లకు టైటిల్స్

Published Tue, Nov 29 2016 11:11 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM

delhi, manipur teams clinched sepak takraw titles

సాక్షి, హైదరాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) జాతీయ సెపక్‌తక్రా అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఢిల్లీ, మణిపూర్ జట్లు విజేతలుగా నిలిచారుు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో సోమవారం జరిగిన బాలుర ఫైనల్లో ఢిల్లీ జట్టు 13-21, 21-20, 21-15తో మణిపూర్ జట్టుపై గెలుపొందింది.

 

బాలికల విభాగంలో మణిపూర్ జట్టు 19-21, 21-11, 21-12తో ఒడిశాను ఓడించి టైటిల్‌ను దక్కించుకుంది. అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో జమ్ము, కశ్మీర్ డీజీ జహంగీర్ పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement