భారత్‌కు ఐదు పతకాలు | Five medals for India | Sakshi

భారత్‌కు ఐదు పతకాలు

Jun 12 2015 1:03 AM | Updated on Sep 3 2017 3:35 AM

ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్‌కు మొత్తం 5 పతకాలు...

న్యూఢిల్లీ : ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్‌కు మొత్తం 5 పతకాలు దక్కాయి. 85 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అరుణ్ కుమార్, 50 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ప్రదీప్ స్వర్ణాలు గెలుచుకున్నారు. అరుణ్ 7-6తో హషిమిజుబర్ (ఇరాన్)పై విజయం సాధించగా, ప్రదీప్ 6-0తో సన్‌షిరో (జపాన్)ను చిత్తు చేశాడు. 100 కేజీల ఫ్రీస్టైల్‌లో నాసిర్ హుస్సేన్‌కు రజతం దక్కింది. మహిళల 40 కేజీల ఫ్రీ స్టైల్‌లో అన్నూదేవి రజత పతకం, 35 కేజీల ఫ్రీస్టైల్‌లో అంకుశ్ కాంస్యం గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement