Indian wrestlers
-
భారత రెజ్లర్లకు ఊరట
న్యూఢిల్లీ: భారత రెజ్లర్లకు మేలు చేసే కీలక నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై విధించిన సస్పెన్షన్ను క్రీడా శాఖ ఎత్తేసింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై స్టార్ రెజ్లర్ల లైంగిక ఆరోపణలు దరిమిలా చుట్టుముట్టిన వివాదాలు, కోర్టు కేసుల అనంతరం 15 నెలల క్రితం కొత్త కార్యవర్గం కొలువు దీరింది. కానీ రోజుల వ్యవధిలోనే కేంద్ర క్రీడా శాఖ ఆగ్రహానికి గురైంది. దీంతో పలు అంతర్జాతీయ ఈవెంట్లలో భారత రెజ్లర్లు పాల్గొనేందుకు ఇబ్బందులెదురవుతున్నాయి. రెజ్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు నిషేధాన్ని ఎత్తేసింది. కేంద్ర క్రీడా శాఖ మార్గదర్శకాలను డబ్ల్యూఎఫ్ఐ పాటించడంతో పాటు రెజ్లర్ల విస్తృత ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. క్రీడాపాలసీ ప్రకారం డబ్ల్యూఎఫ్ఐ నడచుకోవాలని, వివాదాస్పద, కళంకిత అధికారులు, పాత కార్యవర్గ సభ్యులకు దూరంగా ఉండాలని, లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని క్రీడా శాఖ హెచ్చరించినట్లు తెలిసింది. డబ్ల్యూఎఫ్ఐ కార్యకలాపాలు మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ ఇంటినుంచే నిర్వహిస్తున్నారనే విమర్శలపై క్రీడాశాఖ పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచి్చన నివేదికను బట్టే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏషియాడ్ (2026), లాస్ ఏంజెలెస్ (2028) ఒలింపిక్స్కు అర్హత సాధించాలనుకునే రెజ్లర్లకు కొండంత ఆత్మవిశ్వాసం లభించినట్లయ్యింది. క్రీడాశాఖ నిర్ణయంపై డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు సంజయ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రభుత్వానికి కృతజ్ఞతలు. సస్పెన్షన్ తొలగిపోవడంతో ఇక మా కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు అవకాశం లభించింది. రెజ్లింగ్ క్రీడ అభ్యున్నతికి ఇలాంటి నిర్ణయం ఎంతో అవసరం కూడా! ఇప్పటికే ప్రతిభావంతులైన రెజ్లర్లు పలు అంతర్జాతీయ ఈవెంట్లకు దూరమయ్యారు. ఇకనుంచి వారంతా పతకాల కోసం పోటీపడొచ్చు’ అని అన్నారు. క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ సస్పెన్షన్ను ఇంకా కొనసాగిస్తే రెజ్లర్లకు అన్యాయం చేసిన వారమవుతామని చెప్పారు. రెజ్లర్లు అంతర్జాతీయ క్రీడావేదికలపై రాణించాలనే సదుద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ మాట్లాడుతూ తనపై చేసిన తప్పుడు ఆరోపణలేవీ నిలబడలేదని చెప్పుకొచ్చారు. -
మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!
కేంద్ర క్రీడా శాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya)ను కలిసేందుకు భారత రెజ్లర్లు శనివారం ఆయన నివాసం వద్దకు వెళ్లారు. అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు తమను పంపేలా ఏర్పాట్లు చేయించాలని విజ్ఞప్తి చేయాలని భావించారు. అయితే, మంత్రి ఇంట్లో లేకపోవడంతో వారికి నిరాశే మిగిలింది.కాగా కేంద్ర క్రీడాశాఖ, భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI)ల మధ్య కొరవడిన సమన్వయంతో రెజ్లర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సీజన్లో తొలి ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్కు దూరమైన భారత రెజ్లర్లు... మళ్లీ ఇప్పుడు రెండో ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి వెళ్లలేని పరిస్థితి వచ్చింది. డబ్ల్యూఎఫ్ఐ నిర్ణీత సమయంలోగా అవసరమైన డాక్యుమెంట్లు సమకూర్చకపోవడంతో అల్బేనియాలో జరగనున్న అంతర్జాతీయ రెజ్లింగ్ ర్యాంకింగ్ సిరీస్కు రెజ్లర్లను పంపలేక పోతున్నామని క్రీడాశాఖ ... సమాఖ్య తీరుపై విమర్శించింది.సమాఖ్య నిర్వాకం వల్లే‘డబ్ల్యూఎఫ్ఐ ప్రతిపాదిత జాబితాను గడువులోగా పంపడంలో తాత్సారం చేసింది. భారత స్పోర్ట్స్ అథారిటీ (SAI)కి చాలా ఆలస్యంగా జాబితా చేరడంతో తదుపరి ప్రక్రియను చేపట్టలేకపోయాం. ఏదైనా అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లాలంటే ఓ పద్ధతి ఉంటుంది. ముందస్తు ప్రతిపాదన, తదుపరి డాక్యుమెంట్ల పరిశీలన తదనంతరం తుది జాబితా ఆమోదించబడాలి. కానీ సమాఖ్య నిర్వాకం వల్లే జాబితా ఆలస్యమైంది. ఆమోదానికి దూరమైంది. దీంతో అథ్లెట్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు’ అని క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ విషయంలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ జోక్యం కోరుతూ.. ఆసియా చాంపియన్ సునిల్ కుమార్, అండర్-23 ఆసియా చాంపియన్షిప్ స్వర్ణ పతక విజేత మీనాక్షితో పలువురు రెజ్లర్లు న్యూఢిల్లీలోని ఆయన ఇంటికి వెళ్లారు.మంత్రి గారూ.. జోక్యం చేసుకోండి!ఈ సందర్భంగా సునిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘మా తప్పు లేకపోయినా ర్యాంకింగ్ సిరీస్కు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. మంత్రిగారి జోక్యంతోనైనా మాకు మేలు జరుగుతుందని ఇక్కడకు వచ్చాం. ఈ సిరీస్లో పాల్గొనడంవల్లమార్చిలో జరుగబోయే డ్రా, తొలి దశ బౌట్లలో మాకు కాస్త వెసలుబాటు కలుగుతుంది.అందుకే మా సమస్యను మంత్రిగారి దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నాం’’ అని తెలిపాడు. అయితే, మధ్యాహ్నం రెండు గంటల వరకు దాదాపు పది మంది రెజ్లర్లు మాండవీయ నివాసం వద్ద పడిగాపులు కాసినా ఫలితం లేకపోయింది. ఆయన అందుబాటులోకి రాకపోవడంతో రెజ్లర్లు నిరాశగా తిరిగి వెళ్లిపోయారు. కాగా గతంలో క్రీడాశాఖ సస్పెన్షన్ వల్ల జాగ్రేబ్ ర్యాంకింగ్ సిరీస్కు భారత జట్టు దూరమైంది. ఇప్పుడు ఇరు సమాఖ్యల మధ్య సమన్వయలేమి వల్ల ఈ నెల 26 నుంచి మార్చి 2 వరకు టిరానాలో జరిగే ఈవెంట్కూ గైర్హాజరు అవుతోంది. ఇక భారత రెజ్లర్లు సీనియర్ ఆసియా చాంపియన్షిప్పైనే ఆశలు పెట్టుకున్నారు. జోర్డాన్లో మార్చి 25 నుంచి 30 వరకు ఆసియా ఈవెంట్ జరుగుతుంది. -
భారత్ ‘పసిడి పట్టు’
అమ్మాన్ (జోర్డాన్): సీనియర్ స్థాయిలోనే కాకుండా జూనియర్ స్థాయిలోనూ అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లర్లు తమ పట్టు నిరూపించుకుంటున్నారు. ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్షిప్లో భాగంగా మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్కు నాలుగు స్వర్ణ పతకాలు లభించాయి. గురువారం జరిగిన నాలుగు ఫైనల్స్లో బరిలోకి దిగిన భారత అమ్మాయిలు ఎదురులేని విజయాలు సాధించి బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. అదితి కుమారి (43 కేజీలు), నేహా (57 కేజీలు), పుల్కిత్ (65 కేజీలు), మాన్సీ లాథెర్ (73 కేజీలు) ప్రపంచ చాంపియన్లుగా అవతరించారు. శుక్రవారం భారత్ ఖాతాలో మరో రెండు స్వర్ణ పతకాలు చేరే అవకాశముంది. కాజల్ (69 కేజీలు), శ్రుతిక శివాజీ పాటిల్ (46 కేజీలు) నేడు జరిగే ఫైనల్లో స్వర్ణ–రజత పతకాల కోసం పోటీపడతారు. రాజ్బాలా (40 కేజీలు), ముస్కాన్ (53 కేజీలు), రజీ్నత (61 కేజీలు) కాంస్య పతకాల రేసులో ఉన్నారు. 49 కేజీల విభాగంలో భారత్ నుంచి ఎవరూ బరిలోకి దిగలేదు. ఓవరాల్గా భారత అమ్మాయిల జట్టకు టీమ్ ట్రోఫీ టైటిల్ లభించే అవకాశం కూడా ఉంది. 43 కేజీల ఫైనల్లో అదితి 7–0తో మరియా లుజా జికికా (గ్రీస్)పై గెలుపొందగా... 57 కేజీల ఫైనల్లో నేహా ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో 10–0తో జపాన్ రెజ్లర్ సో సుత్సుయ్ను చిత్తు చేయడం విశేషం. 3 నిమిషాల 59 సెకన్లలో నేహా జపాన్ రెజ్లర్పై పది పాయింట్ల ఆధిక్యాన్ని సంపాదించింది. నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. 65 కేజీల ఫైనల్లో పుల్కిత్ 6–3తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ దరియా ఫ్రోలోవాపై నెగ్గింది. 73 కేజీల ఫైనల్లో మాన్సీ 5–0తో అంతర్జాతీయ తటస్థ రెజ్లర్ హనా పిర్స్కాయాపై గెలిచింది. -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
బిష్క్క్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తొలి రోజు భారత ఫ్రీస్టయిల్ రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఉదిత్ (57 కేజీలు) రజతం నెగ్గగా... అభిమన్యు (70 కేజీలు), విక్కీ (97 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఉదిత్ 4–5తో కెంటో యుమియా (జపాన్) చేతిలో ఓడిపోయాడు. బౌట్ చివరి సెకన్లలో ఉదిత్ ప్రత్యర్థికి ఒక పాయింట్ కోల్పోయాడు. 2020 నుంచి 2023 వరకు ఈ విభాగంలో భారత్కు స్వర్ణ పతకాలు లభించాయి. రవి కుమార్ దహియా వరుసగా మూడేళ్లు (2020, 2021, 2022)... గత ఏడాది అమన్ ఈ విభాగంలో పసిడి పతకాలు నెగ్గారు. మరోవైపు కాంస్య పతకాల బౌట్లలో అభిమన్యు 6–5తో కుల్దాòÙవ్ (ఉజ్బెకిస్తాన్)పై, విక్కీ 10–1తో అరోనోవ్ (కిర్గిస్తాన్)పై గెలుపొందారు. -
బ్రిజ్ భూషణ్ తరపున నిర్భయ లాయర్
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో.. బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ తరపున వాదిస్తోంది ఎవరో తెలుసా? నిర్భయ కేసు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్ డిఫెన్స్ న్యాయవాదిగా వ్యవహరించనున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరి శిక్ష పడేలా చేశారు ప్రాసిక్యూటర్ రాజీవ్ మోహన్. 2012లో జరిగిన ఆ సంఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. నలుగురు నిందితులకు ఎనిమిదేళ్ల తర్వాత 2020 మార్చిలో శిక్ష పడేంతవరకు అవిశ్రాంత పోరాటం చేసి న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చేశారు రాజీవ్. నాడు న్యాయాన్ని గెలిపించారు.. మరి నేడు..? నిర్భయ కేసులో అద్భుతంగా వాదనలు వినిపించి బాధితురాలికి న్యాయం జరగడంలో తనదైన పాత్ర పోషించిన రాజీవ్ ఇప్పుడు మాత్రం ఎంపీ బ్రిజ్ భూషణ్ తరపున కోర్టుకు వాదనలు వినిపించనున్నారు. నాడు నిర్భయ కేసులో నిందితులకు శిక్ష పడేలా చేసిన అయన ఇప్పుడు వేధింపులకు గురైన రెజ్లర్లకు వ్యతిరేకంగా తన క్లయింట్ తరపున డిఫెన్స్ చేస్తుండటంతో చర్చనీయాంశమైంది. భారత రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ బెయిల్ పై ఈ నెల 20న ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు విచారణ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్ మోహన్ బ్రిజ్ భూషణ్ కు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి మరి. ఇది కూడా చదవండి: యూట్యూబర్ ఎఫెక్ట్.. కేదార్నాథ్ ఆలయంలో మొబైల్ ఫోన్లు నిషేదం.. -
న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు
న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాప్ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్ బజరంగ్ పూనియా తెలిపాడు. దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్ ‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గంగూలీ ఏమన్నాడంటే... భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
Wrestlers Protest: బ్రిజ్భూషణ్ను అరెస్టు చేసే వరకు బరిలోకి దిగేది లేదు..
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సింగ్ ను అరెస్టు చేసే వరకు... తాము విదేశీ టోర్నీల్లో పాల్గొనేది లేదని భారత స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్ తెలిపారు. ‘రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినా ఇంకా బ్రిజ్భూషణ్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్ల నుంచి ఢిల్లీ పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. విచారణకు రావాలని ఇంకా బ్రిజ్ భూషణ్కు నోటీసులు కూడా జారీ చేయలేదు. కొన్నేళ్లుగా మా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రయత్నించాం. కానీ ఎవరూ పట్టించు కోలేదు. గత జనవరిలో కేంద్ర క్రీడల మంత్రి అను రాగ్ ఠాకూర్ పర్యవేక్షక కమిటీని నియమించి ఈ వివాదాన్ని ముగించాలని చూశారు. అంతే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఆసక్తి చూపలేదు’ అని వినేశ్ వ్యాఖ్యానించింది. జూన్ 1 నుంచి 4 వరకు కిర్గి స్తాన్లో జరిగే ర్యాంకింగ్ సిరీస్ టోరీ్నకి దూరంగా ఉన్నామని వినేశ్, బజరంగ్, సాక్షి తెలిపారు. -
కొనసాగుతున్న రెజ్లర్ల నిరసన.. ప్రియాంక గాంధీ సంఘీభావం
న్యూఢిల్లీ: భారత్ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా... తమ నిరసనను ముగించేందుకు రెజ్లర్లు ఇష్టపడటం లేదు. జంతర్మంతర్ వద్ద శనివారం కూడా ఈ నిరసన కొనసాగింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు రాజకీయ నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆటగాళ్లకు తమ సంఘీభావం ప్రకటించారు. అయితే కొందరు బయటి వ్యక్తులు నిరసన వేదిక వద్ద వచ్చి దుష్ప్రచారం చేస్తున్నారని రెజ్లర్ బజరంగ్ పూనియా ఆరోపించాడు. తమ ఉద్యమం రెజ్లర్ల సమస్యలకే పరిమితమని, ఇతర రాజకీయ అంశాల జోలికి తాము వెళ్లడం లేదని అతను అన్నాడు. మరో వైపు తాజా అంశంపై ‘ఫొగాట్’ సోదరీమణుల మధ్య విభేదాలు తలెత్తాయి. నిరసనలోకి రాజకీయ నాయకులను రానివ్వొద్దంటూ బబిత ఫొగాట్ విమర్శించగా... మహిళా రెజ్లర్ల తరఫున నిలవడం ఇష్టం లేకపోతే, కనీసం నిరసనను బలహీనపర్చవద్దని వినేశ్ జవాబిచ్చింది. -
రెజ్లర్లపై లైంగిక ఆరోపణలు.. బ్రిజ్భూషణ్పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు స్పందించారు. శుక్రవారం సుప్రీంకోర్టులో వాదనల సందర్భంగా బ్రిజ్భూషణ్పై ‘ఎఫ్ఐఆర్’ నమోదు చేస్తామని ఇచి్చన హామీని పూర్తి చేశారు. బ్రిజ్భూషణ్పై కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్లో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మైనర్ రెజ్లర్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటూ ‘పోక్సో యాక్ట్’ ప్రకారం ఒక ఎఫ్ఐఆర్... ఇతర రెజ్లర్లు చేసిన ఫిర్యాదుల ప్రకారం మరో ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. రెండింటిపై సత్వర విచారణ చేపడతామని పోలీసులు చెప్పారు. ఈ అంశంపై మే 5న మరోసారి విచారిస్తామని, ఆలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసన చేస్తున్న రెజ్లర్లు, ఫిర్యాదు చేసిన వారి జాబితాలో ఉన్న ఒక మైనర్ రెజ్లర్ భద్రతకు సంబంధించి కూడా ఢిల్లీ పోలీసులు బాధ్యత తీసుకోవాలని కూడా సుప్రీం సూచించింది. ‘మైనర్ రెజ్లర్కు ఉన్న ముప్పును దృష్టిలో పెట్టుకుంటూ తగినంత భద్రత కల్పించాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను ఆదేశిస్తున్నాం. ఇతర రెజ్లర భద్రతను కూడా ఆయన సమీక్షించాలి. దర్యాప్తునకు సంబంధించిన డాక్యుమెంట్ల విషయంపై గోప్యత కూడా పాటించాలి’ అని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడా బెంచీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బజరంగ్, వినేశ్, సాక్షి తదితర రెజ్లర్లు జంతర్మంతర్ వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు. బ్రిజ్భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు నిర్ణయించడం పట్ల రెజ్లర్లు సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎఫ్ఐఆర్ మాత్రమే కాదు, బ్రిజ్భూషణ్ అరెస్ట్ అయ్యే వరకు ఇది కొనసాగుతుందని బజరంగ్ స్పష్టం చేశాడు. ‘విజయం దిశగా ఇది మొదటి అడుగు మాత్రమే. అయితే మా నిరసన ఇకపైనా కొనసాగుతుంది. ఆయనను అన్ని పదవుల నుంచి తప్పించడంతో పాటు జైలుకు పంపాల్సిందే. లేదంటే విచారణను ప్రభావితం చేస్తాడు’ అని రెజ్లర్ సాక్షి మలిక్ పేర్కొంది. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా..? : రెజ్లర్ సాక్షి మాలిక్ ‘ఢిల్లీ పోలీసులు మా పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి నిరసన ముగించమని ఒత్తిడి తెస్తున్నారు. కరెంట్ కట్ చేసి గేట్లు మూసేశారు. భోజనం, నీళ్లు కూడా లోపలికి రానివ్వడం లేదు. నేను ఏసీపీతో మాట్లాడాను. ఏం చేస్తారో చేసుకోండి అని ఆయన జవాబిచ్చాడు. వారు ఏం చేసినా మా ఆందోళన కొనసాగిస్తాం. మీ ఇంటి ఆడపిల్లలైతే ఇలాగే చేస్తారా. బ్రిజ్భూషణ్ చట్టంకంటే పెద్దవాడిగా మారిపోయాడు’. సుప్రీం కోర్టు ఆదేశాలను నేను స్వాగతిస్తున్నా: బ్రిజ్భూషణ్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం నాకూ మంచిదే. విచారణలో వారికి అన్ని విధాలా సహకరిస్తా. విచారణ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ప్రశి్నంచలేదు. రెజ్లర్లు మరికొంత సమయం ఆగాల్సింది. కానీ వారు కోర్టుకు వెళ్లారు. ఎవరి పట్లా తప్పుగా వ్యవహరించలేదు. నాకు నాపై నమ్మకముంది. -
సుప్రీంకోర్టులో తేల్చుకుంటాం!
న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని... వెంటనే ఆయనను అరెస్టు చేయాలని భారత స్టార్ రెజ్లర్లు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. ఒకవేళ పోలీసులు బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయకపోతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు వెళ్తామని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న ఈ స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. కొందరు మహిళా రెజ్లర్లను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని తాము చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలితే తమపైనే కేసు నమోదు చేయాలని 2016 రియో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన సాక్షి వ్యాఖ్యానించింది. మూడు నెలల క్రితం చేపట్టిన నిరసనను విరమించి తప్పు చేశామని... ఈ విషయంలో తమను కొందరు తప్పుదోవ పట్టించారని సాక్షి, వినేశ్, బజరంగ్ విచారం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తుల మాటలు వినబోమని, రెజ్లింగ్ శ్రేయోభిలాషుల సూచనలు స్వీకరిస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు కన్నౌట్ ప్లేస్ పోలీసు స్టేషన్కు తాము వెళ్లినా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారని టోక్యో ఒలింపిక్స్లో కాంస్యం నెగ్గిన బజరంగ్ పూనియా తెలిపాడు. ‘అంతర్జాతీయ టోర్నీల్లో దేశం కోసం పతకాలు సాధించినపుడు కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. కానీ మా సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే మాత్రం ఇదే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని బజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ నేతృత్వంలో కేంద్ర క్రీడా శాఖ నియమించిన పర్యవేక్షక కమిటీ మా పట్ల పక్షపాతంగా వ్యవహరించింది. కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే లైంగిక వేధింపులకు గురైన బాధితుల వివరాలు తెలుస్తాయి. బ్రిజ్ భూషణ్ బీజేపీ ఎంపీ కావడం, ఆ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నట్లు అనిపిస్తోంది’ అని ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ విజేత వినేశ్ వ్యాఖ్యానించింది. మరోవైపు మే 7వ తేదీన జరగాల్సిన డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికలకు గుర్తింపు లేదని... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటయ్యే అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో 45 రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని కేంద్ర క్రీడా శాఖ ప్రకటించింది. మేరీకోమ్ సారథ్యంలోని పర్యవేక్షక కమిటీ తమ నివేదిక అందించిందని... నివేదికను పరిశీలిస్తున్నామని ఈ సందర్భంగా క్రీడా శాఖ వివరించింది. పర్యవేక్షక కమిటీ నివేదిక ప్రకారం డబ్ల్యూఎఫ్ఐలో పారదర్శకత కొరవడిందని... రెజ్లర్ల సమస్యలు వినేందుకు, పరిష్కరించేందుకు ఎలాంటి వ్యవస్థ లేదని తాము గుర్తించినట్లు తెలిపింది. విచా రణ పూర్తి చేసి నివేదిక అందించడంతో పర్యవేక్షక కమిటీ పని ముగిసిందని క్రీడా శాఖ తెలిపింది. -
‘హింద్ కేసరి’ అభిజీత్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ‘హింద్ కేసరి’ జాతీయ సీనియర్ ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో పురుషుల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ అభిజీత్ కాట్కే చాంపియన్గా నిలిచాడు. ఆదివారం రాత్రి ఎల్బీ స్టేడియంలో జరిగిన పురుషుల ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్ ఫైనల్లో అభిజీత్ 5–0తో హరియాణాకు చెందిన సోమ్వీర్పై విజయం సాధించాడు. విజేత అభిజీత్ తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా మూడు కిలోల వెండి గదను అందుకున్నాడు. ఫైనల్స్కు ముఖ్య అతిథిగా హాజరైన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రెజ్లింగ్ అకాడమీలను స్థాపించేందుకు ప్రయత్నిస్తామని, కుస్తీ క్రీడకు పూర్వ వైభవం లభించేలా కృషి చేస్తామని తెలిపారు. ‘మహిళా హింద్ కేసరి’ టైటిల్ హరియాణాకు చెందిన పుష్ప సొంతం చేసుకుంది. ఫైనల్లో పుష్ప ఢిల్లీకి చెందిన మోహినిపై గెలుపొంది చాంపియన్గా నిలిచింది. పుష్ప, మోహిని మధ్య జరిగిన టైటిల్ బౌట్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వీక్షించారు. అనంతరం విజేత పుష్పను కవిత అభినందించారు. మెరిసిన తెలంగాణ రెజ్లర్లు... ‘హింద్ కేసరి’ టైటిల్ బౌట్స్ కాకుండా మిగతా వెయిట్ కేటగిరీలలో తెలంగాణ రెజ్లర్లు ఆకట్టుకున్నారు. మహిళల 62 కేజీల విభాగంలో సాహిర్ ఇబ్రహీమ్.. 48 కేజీల విభాగంలో బాలమణి.. 56 కేజీల విభాగంలో శ్రావణి తెలంగాణకు కాంస్య పతకాలు అందించారు. పురుషుల 60 కేజీల విభాగంలో తెలంగాణ రెజ్లర్లు నితీశ్, సయ్యద్ అబ్దుల్... 65 కేజీల విభాగంలో విజయ్ కుమార్... 70 కేజీల విభాగంలో దినేశ్, విజయ్... 75 కేజీల విభాగంలో హంజా బామస్, సయ్యద్ బిన్ అబ్దుల్లా... 80 కేజీల విభాగంలో సందీప్ యాదవ్ కాంస్య పతకాలు సాధించారు. -
వీసా తిరస్కరణ.. వరల్డ్ చాంపియన్షిప్కు భారత రెజ్లర్లు దూరం
స్పెయిన్లోని పొంటెవెడ్రాలో జరగనున్న అండర్-23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియనషిప్కు 21 మంది భారతీయ రెజ్లర్లు దూరమయ్యారు. వీసా గడువు ముగియడంతో స్పెయిన్ ఎంబసీ 21 మందికి వీసాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలిసింది. కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) సోమవారం ప్రారంభమైన ఛాంపియన్షిప్ కోసం 30 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. అందులో కేవలం తొమ్మిది మందికి మాత్రమే వీసాలు మంజూరయ్యాయి. చాంపియన్షిప్కు మిస్ అయిన 21 మందిలో అండర్-20 మహిళా ప్రపంచ ఛాంపియన్ యాంటిమ్ పంఘల్ ఉండడం గమనార్హం. ''ఇంతకముందెన్నడూ ఇలా జరగలేదు. భారత ప్రభుత్వ క్లియరెన్స్తో పాటు ప్రపంచ పాలక సంస్థ (UWW) నుంచి ఆహ్వానం అందించినప్పటికి మా రెజ్లర్లకు వీసాలు నిరాకరించబడ్డాయి. సాధ్యమైనంత త్వరగా పాస్పోర్ట్లను విడుదల చేయమని అభ్యర్థన చేసిన తర్వాత లేఖలు తిరస్కరణకు గురయ్యాయి. ఇది నిజంగా విచిత్రం.'' అని భారత రెజ్లింగ్ సమాఖ్య సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ పీటీఐకి తెలిపారు. -
Commonwealth Games 2022: భారత్ పతకాల మోత
కామన్వెల్త్ గేమ్స్లో శనివారం భారత క్రీడాకారులు పతకాల మోత మోగించారు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 11 పతకాలతో అదరగొట్టారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉండటం విశేషం. బాక్సింగ్, టేబుల్ టెన్నిస్, మహిళల టి20 క్రికెట్, బ్యాడ్మింటన్, హాకీ క్రీడాంశాల్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల రేసులో నిలిచారు. బర్మింగ్హామ్: ఊహించినట్టే భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్లో శనివారం ఆరు పతకాలతో అద్భుత ప్రదర్శన చేశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో రవి దహియా (57 కేజీలు), నవీన్ (74 కేజీలు)... మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో వినేశ్ ఫొగాట్ (53 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. దీపక్ నెహ్రా (97 కేజీలు), పూజా సిహాగ్ (76 కేజీలు), పూజా గెహ్లోత్ (50 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. ఫైనల్స్లో రవి దహియా 10–0తో వెల్సన్ (నైజీరియా)పై, నవీన్ 9–0తో షరీఫ్ తాహిర్ (పాకిస్తాన్)పై గెలుపొందారు. మహిళల 53 కేజీల విభాగంలో నలుగురు రెజ్లర్లు మాత్రమే బరిలో ఉండటంతో రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో బౌట్లు నిర్వహించారు. వినేశ్ ఆడిన మూడు బౌట్లలోనూ గెలిచి విజేతగా నిలిచింది. వినేశ్ తొలి రౌండ్లో సమంతా స్టీవర్ట్ (కెనడా)పై, రెండో రౌండ్లో మెర్సీ (నైజీరియా)పై, మూడో రౌండ్లో చమోదయ కేశని (శ్రీలంక)పై గెలిచింది. కాంస్య పతక బౌట్లలో పూజా సిహాగ్ 11–0తో నయోమి బ్రున్ (ఆస్ట్రేలియా)పై, పూజా గెహ్లోత్ 12–2తో క్రిస్టెల్లీ (స్కాట్లాండ్)పై, దీపక్ 10–2తో తయ్యబ్ రజా (పాకిస్తాన్)పై నెగ్గారు. హాకీలో మూడోసారి... పురుషుల హాకీ ఈవెంట్లో భారత జట్టు ఫైనల్ చేరింది. సెమీఫైనల్లో భారత్ 3–2తో దక్షిణాఫ్రికాపై గెలిచింది. కామన్వెల్త్ గేమ్స్ హాకీలో భారత్ ఫైనల్ చేరడం ఇది మూడోసారి. గతంలో టీమిండియా రెండుసార్లు ఫైనల్ (2010, 2014) చేరి రన్నరప్గా నిలిచింది. 2018లో భారత్ కాంస్య పతకాన్ని సాధించింది. అవినాష్, ప్రియాంక అద్భుతం అథ్లెటిక్స్ పురుషుల 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో మహారాష్ట్రకు చెందిన 27 ఏళ్ల అవినాష్ సాబ్లే రజత పతకం సాధించాడు. అవినాష్ 8 నిమిషాల 11.20 సెకన్లలో రేసును ముగించి రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 8 నిమిషాల 12.48 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అవినాష్ బద్దలు కొట్టాడు. ఓవరాల్గా జాతీయ రికార్డును తిరగరాయడం అవినాష్కిది తొమ్మిదోసారి కావడం విశేషం. తాజా ప్రదర్శనతో అవినాష్ కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో 3000 మీటర్ల స్టీపుల్చేజ్ ఈవెంట్లో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్గా ఘనత వహించాడు. మహిళల 10,000 మీటర్ల నడకలో ప్రియాంక గోస్వామి రజత పతకం సాధించింది. తద్వారా కామన్వెల్త్ గేమ్స్ క్రీడల చరిత్రలో రేస్ వాకింగ్లో పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా అథ్లెట్గా ప్రియాంక గుర్తింపు పొందింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన 26 ఏళ్ల ప్రియాంక 43 నిమిషాల 38.83 సెకన్లలో గమ్యానికి చేరి రెండో స్థానంలో నిలిచింది. లాన్ బౌల్స్లో రజతం లాన్ బౌల్స్ క్రీడాంశంలో పురుషుల ‘ఫోర్స్’ ఈవెంట్లో భారత జట్టు రజతం సొంతం చేసుకుంది. సునీల్ బహదూర్, నవనీత్ సింగ్, చందన్ కుమార్ సింగ్, దినేశ్ కుమార్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–18తో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడిపోయింది. -
CWG 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు
అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ గేమ్స్లో శుక్రవారం ఆరు పతకాలతో అదరగొట్టారు. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, దీపక్ పూనియా, సాక్షి మలిక్ స్వర్ణ పతకాలతో సాధించగా... అన్షు మలిక్ రజతం... దివ్య కక్రాన్, మోహిత్ గ్రెవాల్ కాంస్య పతకాలు సంపాదించారు. బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఈవెంట్స్లోనూ భారత క్రీడాకారులు రాణించి పతకాల దిశగా మరో అడుగు ముందుకేశారు. బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ‘పట్టు’ చాటుకున్నారు. రెజ్లింగ్ ఈవెంట్ తొలి రోజు బరిలో దిగిన ఆరు వెయిట్ కేటగిరీల్లోనూ పతకాలతో మెరిశారు. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) పసిడి పతకాలు సాధించగా... మోహిత్ గ్రెవాల్ (125 కేజీలు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ (62 కేజీలు) మూడో ప్రయత్నంలో కామన్వెల్త్ గేమ్స్లో బంగారు పతకాన్ని సాధించగా... అన్షు (57 కేజీలు) రజతం... దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం సొంతం చేసుకున్నారు. కేవలం రెండు పాయింట్లు ఇచ్చి... పురుషుల 65 కేజీల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ బజరంగ్కు ఏదశలోనూ పోటీ ఎదురుకాలేదు. లాచ్లాన్ మౌరిస్ మెక్నీల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 9–2తో గెలిచి స్వర్ణం దక్కించుకున్నాడు. తొలి రౌండ్లో లోవీ బింగామ్ (నౌరూ)పై, క్వార్టర్ ఫైనల్లో జీన్ గలియాన్ (మారిషస్)పై, సెమీఫైనల్లో జార్జి రామ్ (ఇంగ్లండ్)పై బజరంగ్ గెలిచాడు. స్వర్ణం గెలిచే క్రమంలో బజరంగ్ తన ప్రత్యర్థులకు కేవలం రెండు పాయింట్లు మాత్రమే ఇవ్వడం విశేషం. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొన్న దీపక్ పూనియా ఫైనల్లో 3–0తో మొహమ్మద్ ఇనామ్ (పాకిస్తాన్)పై గెలిచాడు. సెమీఫైనల్లో దీపక్ 3–1తో అలెగ్జాండర్ మూర్ (కెనడా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో కసెబామా (సియరీ లియోన్)పై, తొలి రౌండ్లో 10–0తో మాథ్యూ ఒక్జెనామ్ (న్యూజిలాండ్)పై విజయం సాధించాడు. 125 కేజీల కాంస్య పతక పోరులో మోహిత్ గ్రెవాల్ ‘బై ఫాల్’ పద్ధతిలో ఆరోన్ జాన్సన్ (జమైకా)పై గెలుపొందాడు. సూపర్ సాక్షి... మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి మలిక్ ‘బై ఫాల్’ పద్ధతిలో కెనడా రెజ్లర్ అనా పౌలా గోడినెజ్ను ఓడించి తొలిసారి ఈ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 2014 గ్లాస్గో గేమ్స్లో రజతం, 2018 గోల్డ్కోస్ట్ గేమ్స్లో కాంస్యం నెగ్గిన సాక్షి మూడో ప్రయత్నంలో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఫైనల్లో ఒకదశలో సాక్షి 0–4తో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకొని అనా పౌలా భుజాన్ని కొన్ని సెకన్లపాటు మ్యాట్కు అట్టిపెట్టి ‘బై ఫాల్’ పద్ధతిలో విజయాన్ని అందుకుంది. 57 కేజీల ఫైనల్లో అన్షు మలిక్ 3–7తో ఒడునాయో అడెకురోయె (నైజీరియా) చేతిలో ఓడిపోయింది. 68 కేజీల విభాగం కాంస్య పతక పోరులో దివ్య కక్రాన్ కేవలం 20 సెకన్లలో తన ప్రత్యర్థి టైగర్ లిలీ లెమాలి (టోంగా)పై గెలిచింది. -
పసిడి ‘పట్టు’ చిక్కలేదు కానీ...
వుఫా (రష్యా): జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత్ పతకాల పంట పండింది కానీ... పసిడి పట్టు ఎవరికీ చిక్కలేదు. అటు పురుషుల ఈవెంట్లో, ఇటు మహిళల విభాగంలో ఫైనల్ చేరిన భారత రెజ్లర్లు రన్నరప్తోనే సరిపెట్టుకున్నారు. శుక్రవారం స్వర్ణం కోసం తలపడిన మహిళా రెజ్లర్లు సంజూ దేవి, భటేరిలు రజతాలతో సంతృప్తి చెందారు. 62 కేజీల కేటగిరీలో సెమీస్ దాకా ప్రత్యర్థులందరిపై ఆధిపత్యం చలాయించిన సంజూ దేవి తీరా ఫైనల్కొచ్చేసరికి పట్టు సడలించింది. రష్యా రెజ్లర్ ఎలీనా కసబియెవా 10–0 పాయింట్ల తేడాతో సంజూ ‘పసిడి’కలను కలగానే మిగిల్చింది. బౌట్లో సంజూకు ఏమాత్రం అవకాశమివ్వకుండా ఎలీనా తేలిగ్గా పడేసింది. 65 కేజీల ఫైనల్లో భటేరికి మాల్డొవా రెజ్లర్ ఇరినా రింగాసి చెక్ పెట్టింది. 12–2 తేడాతో భటేరిని ఓడించింది. కాంస్య పతక పోరులో నిలిచిన సనేహ్ (72 కేజీలు) గాయంతో విలవిలాడుతూ బౌట్ మధ్యలోనే వైదొలగింది. మరియమ్ గుసెనొవా (రష్యా) 3–0తో ఆధిక్యంలో ఉన్న సమయంలో మోకాలి గాయాన్ని భరించలేక సనేహ్ ఆటను కొనసాగించలేకపోయింది. ఈ టోర్నమెంట్లో మహిళా రెజ్లర్లు పురుషుల కంటే మెరుగైన ప్రదర్శనే ఇచ్చారు. 3 రజతాలు, 2 కాంస్యాలతో మొత్తం 5 పతకాలు సాధించారు. పురుషుల కేటగిరీలో భారత్ 6 పతకాలు సాధించినప్పటికీ ఒక్కటి (రజతం) మినహా అన్నీ కాంస్యాలే ఉన్నాయి. గ్రీకో రోమన్ రెజ్లర్లు అంతా క్వార్టర్స్లోనే నిష్క్రమించారు. శుక్రవారం బరిలోకి దిగిన ఐదుగురు రెజ్లర్లలో ఏ ఒక్కరు సెమీస్ అయినా చేరలేకపోయారు. -
భారత రెజ్లర్లకు ఆఖరి అవకాశం
సోఫియా (బల్గేరియా): టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించేందుకు భారత రెజ్లర్లు చివరి ప్రయత్నం చేయనున్నారు. నేటి నుంచి బల్గేరియా రాజధాని సోఫియాలో జరగనున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో మొత్తం 12 బెర్త్ల కోసం భారత రెజ్లర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నీలో పురుషుల ఫ్రీస్టయిల్, గ్రీకో రోమన్... మహిళల ఫ్రీస్టయిల్ విభాగాలలో 84 దేశాల నుంచి 400 మందికిపైగా రెజ్లర్లు 18 వెయిట్ కేటగిరీలలో బరిలోకి దిగనున్నారు. ప్రతి వెయిట్ కేటగిరీలో ఫైనల్కు చేరిన ఇద్దరు రెజ్లర్లకు టోక్యో ఒలింపిక్స్ బెర్త్లు ఖరారవుతాయి. ► తొలి రోజు పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో 57, 65, 74, 86, 97, 125 కేజీల విభాగాల్లో పోటీలుంటాయి. ఇప్పటికే భారత్ నుంచి ఫ్రీస్టయిల్ విభాగంలో రవి (57 కేజీలు), బజరంగ్ పూనియా (65 కేజీలు), దీపక్ పూనియా (86 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందారు. ► చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో భారత్ నుంచి ఫ్రీస్టయిల్లో మిగిలిన మూడు బెర్త్ల కోసం అమిత్ ధన్కర్ (74 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు), సుమిత్ మలిక్ (125 కేజీలు) పోటీపడనున్నారు. ► పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో ఆరు వెయిట్ కేటగిరీలలో ఇప్పటి వరకు భారత్ నుంచి ఒక్కరు కూడా టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించలేకపోయారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు సచిన్ రాణా (60 కేజీలు), ఆశు (67 కేజీలు), గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు), దీపాంశు (97 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో ఉన్నారు. ► మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత్ నుంచి వినేశ్ ఫొగాట్ (53 కేజీలు), అన్షు మలిక్ (57 కేజీలు), సోనమ్ మలిక్ (62 కేజీలు) టోక్యో ఒలింపిక్స్కు అర్హత పొందారు. మిగిలిన మూడు బెర్త్ల కోసం ఆఖరి క్వాలిఫయింగ్ టోర్నీలో సీమా బిస్లా (50 కేజీలు), నిషా (68 కేజీలు), పూజా (76 కేజీలు) రేసులో ఉన్నారు. -
ఆసియా సీనియర్ రెజ్లింగ్: భారత్కు ఐదు పతకాలు
అల్మాటీ (కజకిస్తాన్): మరోసారి తమ ఆధిపత్యం చాటుకుంటూ ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్లు అదరగొట్టారు. శనివారం బరిలోకి దిగిన ఐదు వెయిట్ కేటగిరీల్లోనూ భారత్కు పతకాలు వచ్చాయి. రవి కుమార్ దహియా (57 కేజీలు) తన టైటిల్ను నిలబెట్టుకోగా... బజరంగ్ పూనియా (65) రజతం సాధించాడు. కరణ్ (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (79 కేజీలు), సత్యవర్త్ కడియాన్ (97 కేజీలు) కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధిం చిన రవి కుమార్ ఆసియా చాంపియన్షిప్లో తన జోరు కనబరిచాడు. అలీరెజా (ఇరాన్)తో జరిగిన ఫైనల్లో ఢిల్లీకి చెందిన రవి కుమార్ 9–4తో గెలిచాడు. సెమీఫైనల్లో రవి 11–0తో అబురుమైలా (పాలస్తీనా)పై, క్వార్టర్ ఫైనల్లో 9–2తో సఫరోవ్ (ఉజ్బెకిస్తాన్)పై విజయం సాధించాడు. గతేడాది న్యూఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్షిప్లోనూ రవి కుమార్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. బజరంగ్కు గాయం ఆసియా చాంపియన్షిప్లో మూడో స్వర్ణం సాధించాలని ఆశించిన భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు నిరాశ ఎదురైంది. జపాన్ రెజ్లర్ టకుటో ఒటుగురోతో ఫైనల్ తలపడాల్సిన బజరంగ్ మోచేతి గాయం కారణంగా బరిలోకి దిగలేదు. దాంతో బజరంగ్కు రజతం... ఒటుగురోకు స్వర్ణం దక్కాయి. ఓవరాల్గా ఆసియా చాంపియన్షిప్లో బజరంగ్కిది ఏడో పతకం. ఇందులో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలున్నాయి. ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో బజరంగ్ 3–0తో జియోంగ్ యోంగ్సియోక్ (కొరియా)పై, సెమీఫైనల్లో 7–0తో బిల్గున్ సర్మన్డక్ (మంగోలియా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్లలో కరణ్ 3–1తో సీంగ్బోంగ్ లీ (కొరియా)పై, నర్సింగ్ యాదవ్ 8–2తో అహ్మద్ మోసిన్ (ఇరాక్)పై, సత్యవర్త్ 5–2తో మిన్వన్ సియో (కొరియా)పై విజయం సాధించారు. -
‘రజత’ సరిత
రోమ్: యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తమ సత్తా చాటుకున్నారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సరిత మోర్ (57 కేజీలు) రజతం పతకం దక్కించుకోగా... పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో అర్జున్ (55 కేజీలు), నీరజ్ (63 కేజీలు), నవీన్ (130 కేజీలు), కుల్దీప్ మలిక్ (72 కేజీలు) కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. గిలియా రోడ్రిగ్స్ (బ్రెజిల్)తో జరిగిన ఫైనల్లో సరిత 2–4 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. చివరి నిమిషం వరకు 2–0తో ఆధిక్యంలో నిలిచిన సరిత ఆ తర్వాత నాలుగు పాయింట్లు సమర్పించుకొని రజతంతో సరిపెట్టుకుంది. పురుషుల గ్రీకో రోమన్ కాంస్య పతక బౌట్లలో అర్జున్ 8–0తో రికార్డో (పోర్చుగల్)పై, నీరజ్ 6–4తో శామ్యూల్ జోన్స్ (అమెరికా)పై, నవీన్ 3–1తో స్టీఫెన్ డేవిడ్ (చెక్ రిపబ్లిక్)పై, కుల్దీప్ 10–9 తో లబజనోవ్ (రష్యా)పై గెలుపొందారు. -
భారత రెజ్లర్ల తీన్మార్...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో రెండో రోజు బుధవారం గ్రీకో రోమన్ శైలిలో అశు (67 కేజీలు), ఆదిత్య కుందు (72 కేజీలు), హర్దీప్ (97 కేజీలు) భారత్కు మూడు కాంస్య పతకాలను అందించారు. జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. కాంస్యం కోసం జరిగిన బౌట్లలో అశు 8–1తో అబ్దుల్ కరీమ్ మొహమ్మద్ అల్ హసన్ (సిరియా)ను ఓడించగా... ఆదిత్య 8–0తో నవో కుసాకా (జపాన్)పై, హర్దీప్ 3–1తో బెక్సుల్తాన్ (కిర్గిస్తాన్)పై విజయం సాధించారు. జ్ఞానేందర్ 0–6తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. ఓవరాల్గా భారత్కు గ్రీకో రోమన్ విభాగంలో ఐదు పతకాలు లభించాయి. నేడు, రేపు మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత శని, ఆదివారాల్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీలుంటాయి. -
భారత రెజ్లర్లకు మళ్లీ నిరాశ
నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో భారత రెజ్లర్ల కథ మారలేదు. తొలి రోజు పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచిన భారత రెజ్లర్లు రెండో రోజూ దానిని కొనసాగించారు. ఆదివారం గ్రీకో–రోమన్ విభాగంలో బరిలో నిలిచిన మనీశ్ (67 కేజీలు), సునీల్ కుమార్ (87 కేజీలు) తొలి రౌండ్లో నిష్క్రమించగా... రవి (97 కేజీలు) రెండో రౌండ్లో ఓడాడు. మొదటి రౌండ్లో రవి 5–0తో చెంగ్ హో చెన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో రవి 0–7తో ఆర్టర్ ఒమరొవ్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడాడు. అంతకుముందు జరిగిన 67 కేజీల విభాగం తొలి రౌండ్లో మనీశ్ 1–10తో డేవిడ్ తిహోమిరొవ్ దిమిత్రోవ్ (బల్గేరియా) చేతిలో, 87 కేజీల విభాగంలో సునీల్ 0–6తో జోసెఫ్ పాట్రిక్ (అమెరికా) చేతిలో ఓడారు. నేడు గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), మనీశ్ (60 కేజీలు), నవీన్ (130 కేజీలు) బరిలో దిగుతారు. -
మెరిసిన భారత రెజ్లర్లు
సోఫియా (బల్గేరియా): ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఫ్రీస్టయిల్ బాలుర విభాగంలో ఉదిత్ (48 కేజీలు), అమన్ (55 కేజీలు), మనీశ్ గోస్వామి (65 కేజీలు), అనిరుధ్ కుమార్ (110 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. గ్రీకో రోమన్ బాలుర విభాగంలో రూపిన్ (48 కేజీలు) కాంస్యం నెగ్గగా... ప్రవీణ్ పాండురంగ పాటిల్ (55 కేజీలు) రజతం సొంతం చేసుకున్నాడు. భారత గ్రీకో రోమన్ జట్టుకు తెలంగాణకు చెందిన జి.అశోక్ కుమార్ కోచ్గా వ్యవహరించడం విశేషం. ఫ్రీస్టయిల్ బాలికల విభాగంలో కోమల్ (40 కేజీలు), సోనమ్ (65 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకోగా... హనీ కుమారి (46 కేజీలు) కాంస్యం గెల్చుకుంది. -
భారత రెజ్లర్లకు తొమ్మిది పతకాలు
న్యూఢిల్లీ: ససారీ సిటీ మాటియో పెలికోన్ స్మారక అంతర్జాతీయ ర్యాంకింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఇటలీలో జరిగిన ఈ టోర్నమెంట్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ సోన్బా గొంగాణే (65 కేజీలు) స్వర్ణం గెలుపొందగా... రాహుల్ అవారే (61 కేజీలు) రజతం, దీపక్ పూనియా (86 కేజీలు) కాంస్యం నెగ్గారు. ఫైనల్లో సోన్బా గొంగాణే 9–8తో ఇద్రిసోవ్ (రష్యా)పై గెలిచాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత్కు రెండు పతకాలు వచ్చాయి. గుర్ప్రీత్ సింగ్ (82 కేజీలు) స్వర్ణం, జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్యం గెలిచారు. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో సీమా (50 కేజీలు) స్వర్ణం, పూజా ధండా (57 కేజీలు), మంజు (59 కేజీలు) రజతాలు, దివ్య కక్రాన్ (68 కేజీలు) కాంస్యం కైవసం చేసుకున్నారు. -
మళ్లీ మెరిసిన హర్ప్రీత్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో చివరి రోజు కూడా భారత రెజ్లర్లు పతకాలతో మెరిశారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో హర్ప్రీత్ సింగ్ (82 కేజీలు) రజతం నెగ్గగా... జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో హర్ప్రీత్ 0–8తో అబ్దావలి (ఇరాన్) చేతిలో ఓడిపోగా... కాంస్య పతక పోరులో జ్ఞానేందర్ 9–0తో హువాంగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. ఆసియా చాంపియన్షిప్లో హర్ప్రీత్కిది వరుసగా నాలుగో పతకం కావడం విశేషం. అతను 2016, 2017, 2018లలో కాంస్య పతకాలు నెగ్గగా... ఈసారి రజతం దక్కించుకున్నాడు. -
రజతాలు నెగ్గిన గుర్ప్రీత్, సునీల్
జియాన్ (చైనా): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ల పతకాల వేట కొనసాగుతోంది. శనివారం జరిగిన పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో గుర్ప్రీత్ సింగ్ (77 కేజీలు), సునీల్ (87 కేజీలు) రజత పతకాలు గెల్చుకున్నారు. ఫైనల్లో గుర్ప్రీత్ 0–8తో హైనోవూ కిమ్ (కొరియా) చేతిలో... సునీల్ 0–2తో హుస్సేన్ అహ్మద్ నూరీ (ఇరాన్) చేతిలో ఓడిపోయారు. అంతకుముందు సెమీఫైనల్స్లో గుర్ప్రీత్ 6–5తో షదుకయెవ్ (కజకిస్తాన్)పై, అజామత్ (కజకిస్తాన్)పై సునీల్ గెలుపొందారు. క్వార్టర్ ఫైనల్స్లో గుర్ప్రీత్ 10–0తో షరీఫ్ బాదర్ (ఖతర్)పై, సునీల్ 14–7తో ఒఖోనోవ్ (తజికిస్తాన్)పై నెగ్గారు. మరోవైపు 130 కేజీల విభాగం కాంస్య పతక పోరులో ప్రేమ్ కుమార్ 0–5తో దామిర్ కుజుమ్బయేవ్ (కజకిస్తాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. 55 కేజీల విభాగం క్వార్టర్ ఫైనల్లో మంజీత్ 3–5తో సులైమనోవ్ (కిర్గిస్తాన్) చేతిలో... 63 కేజీల క్వార్టర్ ఫైనల్లో విక్రమ్ 0–8తో జిన్వూంగ్ జంగ్ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. -
భారత రెజ్లర్లకూ సెంట్రల్ కాంట్రాక్ట్లు
న్యూఢిల్లీ: వివిధ వేదికలపై పతకాలతో సత్తా చాటుతూ, భారత కీర్తి పతాకను ఎగురేస్తున్న రెజర్లకు తీపి కబురు. ఇప్పటి వరకు క్రికెట్ వంటి క్రీడల్లోనే ఉన్న వార్షిక సెంట్రల్ కాంట్రాక్టును త్వరలో వీరికీ వర్తింపజేయాలని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఉన్న 150 మంది రెజ్లర్లు ఈ కాంట్రాక్టు పరిధిలోకి రానున్నారు. ‘ఎ’ నుంచి ‘ఐ’ వరకు కేటగిరీలుగా విభజించి వర్తింపజేయనున్న కాంట్రాక్టులో రెజ్లర్లకు ఏడాదికి గరిష్ఠంగా రూ.30 లక్షలు, కనిష్టంగా రూ.30 వేలు ఇస్తారు. మంగళవారం ఢిల్లీలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 2తో ముగియనున్న జాతీయ సీనియర్ పోటీల అనంతరం కాంట్రాక్టు అమలు చేయనున్నారు. రెజ్లర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడంతో పాటు మున్ముందు మరికొందరు ఈ క్రీడ పట్ల మొగ్గుచూపేందుకు ఇది ఉప యోగపడుతుందని సమాఖ్య భావిస్తోంది. -
ఘనంగా ఆసియా క్రీడల ప్రారంభోత్సవం
-
అంగరంగ వైభవంగా...
పచ్చటి ప్రకృతిని తలపించే పర్వతం నేపథ్యంతో... వారసత్వ ఘన చరితకు ప్రతీకైన సమన్ నృత్యంతో... గాయని అన్గున్ సిప్టా సస్మి బృందం పాటతో... సంగీత హోరు నడుమ... కిక్కిరిసిన ప్రేక్షకాభిమాన ఆనంద పరవశంతో... మహామహులైన ప్రతినిధుల సమక్షాన... ఆసియా అతిపెద్ద క్రీడా సంబరానికి తెరలేచింది. జకార్తా: ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు పద్దెనిమిదో ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆ దేశ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, 1992 బార్సిలోనా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత సుశీ సుశాంతి... జ్యోతి ప్రజ్వలనతో ఏషియాడ్ సమర భేరి మోగినట్లైంది. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడొడొ, ఆసియా ఒలింపిక్ సమాఖ్య (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫదా అల్ సబా, ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎరిక్ తొహిర్... ప్రాతినిధ్య దేశాల ప్రతినిధులకు సాదర ఆహ్వానం పలికారు. ►ప్రారంభ వేడుకలు రెండున్నర గంటల పాటు సాగాయి. ఈ సందర్భంగా ఇటీవల ఇండోనేసియాలోని లంబొక్ ద్వీపంలో భూకంపంతో మృతి చెందిన 460 మందికి నివాళులర్పించారు. ►600 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 30 మీటర్ల వైశాల్యంతో కూడిన వేదికపై 44 దేశాలకు చెందిన 6 వేల మంది అథ్లెట్లు తమతమ దేశాల పతకాలతో మార్చ్పాస్ట్ నిర్వహించారు. ఉత్తర, దక్షిణ కొరియాల అథ్లెట్లు ఉభయ కొరియా పతాకం కింద పాల్గొనడం విశేషం. ► ఇండోనేసియా దేశ అధికార చిహ్నమైన గరుడ పక్షి వేషధారి ముందు నడుస్తుండగా... ఆయా దేశాల క్రీడా బృందాలు వెనుక అనుసరించాయి. ► ఇండోనేసియా స్వాతంత్య్ర దినం 1945 ఆగస్టు 17. ఈ వేడుక సందర్భంగా 70 మంది విద్యార్థుల బృందం పతాకావిష్కరణ చేసింది. ఇందులో 17 మంది అబ్బాయిలు రక్షకులుగా, 8 మంది పతాకధారులుగా, 45 మంది సహాయకులుగా వ్యవహరించడం విశేషం. ►18 మంది ఇండోనేసియా ప్రముఖ గాయకులు... మూడుసార్లు గ్రామీ అవార్డు నామినీ జాయ్ అలెగ్జాండర్, ప్రఖ్యాత గాయని అన్గున్ సస్మి తదితరులు గానంతో అలరించారు. 3,600 మంది నృత్యకారులు ప్రదర్శనలిచ్చారు. ► 50 వేల మంది పైగా ఆహ్వానిత అతిథులతో పాటు అథ్లెట్లు, అధికారులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలతో స్టేడియం నిండిపోయింది. ► ‘మనందరం ఇక్కడకు చేరింది వైవిధ్యాన్ని చాటేందుకు..., విభిన్నతను చూపేందుకు, మానవత్వాన్ని ప్రదర్శించేందుకు’ అని ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎరిక్ తొహిర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ► సరిగ్గా 48 గంటల ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో కువైట్ అథ్లెట్లు తమ సొంత జెండాతో మార్చ్పాస్ట్లో పాల్గొనడం విశేషం. ► ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ ఆల్ సబా... ఉత్తర, దక్షిణ కొరియాల ఉమ్మడి మార్చ్పాస్ట్ను ప్రస్తుతించారు. ► ఈ క్రీడల నిర్వహణకు మరో వేదికైన పాలెంబాంగ్ నగరంలో... భారీ తెరలపై ప్రారంభ వేడుకలను ప్రసారం చేశారు. ► సమన్ నృత్య ప్రదర్శనలో 2200 మంది పాఠశాల విద్యార్థులు పాలు పంచుకున్నారు. ► జూలై 15న భారత రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి ప్రారంభమై 53 నగరాలను చుట్టివచ్చిన ఆసియా క్రీడల టార్చ్ను ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత అథ్లెట్లు... ఏషియాడ్ ప్రారంభ వేడుకల వద్దకు తీసుకొచ్చారు. ►మార్చ్పాస్ట్లో భారత బృందానికి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సారథ్యం వహించాడు. విడొడొ... విభిన్నంగా? ఆసియా క్రీడల ప్రారంభోత్సవానికి ముందు... టీవీల్లో ఓ వీడియో ప్రసారమైంది. బైక్లకు సంబంధించిన సాధారణ వాణిజ్య ప్రకటన తరహాలో కనిపించినా ఇది సుదీర్ఘంగా సాగింది. అందులో... ట్రాఫిక్లో చిక్కుకున్న తన కాన్వాయ్ నుంచి ఓ ప్రముఖుడు కిందకు దిగి, ద్విచక్ర వాహనాన్ని తీసుకుని, హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అనుసరిస్తూ... ఏషియాడ్ ప్రారంభ వేడుకల వేదికైన జలోరా బంగ్ కర్నొ స్టేడియానికి సురక్షితంగా చేరుకుంటాడు. తీరా చూస్తే... అతడు ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడొడొ. ఇదే వీడియో స్టేడియం బయట ఉన్న భారీ తెరల పైనా ప్రసారమైంది. దీని నేపథ్యాన్ని విడొడొనే వివరించి చెప్పడంతో వేడుకలకు హాజరైన ప్రతినిధులంతా హర్షాతిరేకం వ్యక్తం చేశారు. అయితే, ఇది పూర్తిస్థాయి అధికారికంగా ప్రకటితం కాలేదు. ఏషియాడ్లో నేటి భారతీయం (సమయం భారత కాలమానం ప్రకారం) షూటింగ్: పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 6.30 నుంచి; లక్షయ్, మానవ్జిత్ సింగ్); మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 7 నుంచి; శ్రేయసి సింగ్, అల్కా తోమర్). ► 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 8 నుంచి; రవి కుమార్, అపూర్వీ చండేలా); 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 10 నుంచి; అభిషేక్ వర్మ, మనూ భాకర్). ► 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్ (మ.గం. 12 నుంచి); 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఫైనల్స్ (మ.గం. 3.20 నుంచి). కబడ్డీ: భారత్(vs)జపాన్ (మహిళల విభాగం లీగ్ మ్యాచ్, ఉ.గం. 7.30 నుంచి) ►భారత్(vs)శ్రీలంక (పురుషుల విభాగం లీగ్ మ్యాచ్, సా.గం. 5.30 నుంచి) ►బ్యాడ్మింటన్: పురుషుల టీమ్ తొలి రౌండ్ మ్యాచ్ (భారత్(vs)మాల్దీవులు; మ.గం. 1 నుంచి) ►మహిళల హాకీ: భారత్(vs)ఇండోనేసియా (లీగ్ మ్యాచ్; రా.గం. 7 నుంచి) ►పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (మ.గం. 12 నుంచి రాత్రి 9 వరకు) ►సందీప్ తోమర్ (57 కేజీలు); బజరంగ్ పూనియా (65 కేజీలు); సుశీల్ కుమార్ (74 కేజీలు); పవన్ కుమార్ (86 కేజీలు); మౌజమ్ ఖత్రి (97 కేజీలు). -
భారత రెజ్లర్లకు మూడు రజతాలు
ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు మూడు రజతాలు, ఒక కాంస్యం సాధించారు. శనివారం న్యూఢిల్లీలో జరిగిన ఫ్రీస్టయిల్ పోటీల్లో విశాల్ కాళిరామన్ (70 కేజీలు), సచిన్ గిరి (79 కేజీలు), నవీన్ (57 కేజీలు) రజత పతకాలు గెలిచారు. ఫైనల్స్లో విశాల్ 7–10తో అమీర్ హుస్సేన్ (ఇరాన్) చేతిలో... సచిన్ 0–10తో సజ్జాద్ సాబిర్అలీ (ఇరాన్) చేతిలో... నవీన్ 1–7తో అబ్దుల్లాయేవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయారు. 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో కరణ్ 4–0తో పెర్మాన్ హోమదోవ్ (తుర్క్మెనిస్తాన్)పై గెలుపొందాడు. -
చివరి రోజు నిరాశే
బిష్కెక్ (కిర్గిస్తాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్షిప్ చివరి రోజు భారత రెజ్లర్లకు నిరాశే మిగిలింది. ఆదివారం పతకం కోసం పోటీ పడ్డ ఇద్దరు రెజ్లర్లు ఓటమి పాలవడంతో భారత్ ఖాతాలో మరో పతకం చేరలేదు. ఈ టోర్నీని భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలతో ముగించింది. చివరి రోజు పతకం కోసం పోటీ పడ్డ శ్రవణ్ తోమర్, దీపక్ పూనియా నిరాశపరిచారు. 61 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత రెజ్లర్ శ్రవణ్ 0–10తో కజుయ కోయాంగి (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. తన ప్రత్యర్థి ఫైనల్ చేరడంతో మరో అవకాశం దక్కించుకున్న శ్రవణ్ కాంస్యం కోసం జరిగిన పోరులో అబ్బాస్ రఖ్మోనొవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడాడు. దీపక్ పునియా (86 కేజీలు) క్వార్టర్స్లో 0–7తో ఉతుమెన్ ఉర్గోడొల్ (మంగోలియా) చేతిలో ఓడినా రెప్చేజ్ రౌండ్లో ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడ 7–2తో శోతె షిరాయి (జపాన్)పై గెలుపొంది కాంస్య పోరుకు అర్హత సాధించాడు. పతక పోరులో 0–10తో షెంగ్ఫెంగ్ బి (చైనా) చేతిలో ఓడిపోయాడు. -
పూజకు స్వర్ణం
న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు సత్తా చాటారు. తైవాన్లో జరిగిన ఈ చాంపియన్షిప్లో ఐదు పతకాలు కొల్లగొట్టారు. మహిళల 51 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో పూజ స్వర్ణం సాధించింది. సోను 44 కేజీల విభాగంలో రజతం గెలవగా.. 59 కేజీల విభాగంలో మను కాంస్యం అందుకుంది. పురుషుల విభాగంలో సతీశ్ 120 కేజీల గ్రీకోరోమన్ స్టయిల్లో రజతం సాధించగా.. 50 కేజీల విభాగంలో మనీశ్ కాంస్యం సాధించాడు. -
భారత రెజ్లర్ల పసిడి పట్టు
న్యూఢిల్లీ: కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. సింగపూర్లో ఆదివారం ముగిసిన ఈ ఈవెంట్లో చివరిరోజు భారత కుస్తీ వీరులు 8 స్వర్ణాలు, 8 రజతాలు సొంతం చేసుకున్నారు. పురుషుల ఫ్రీస్టరుుల్ విభాగంలో హర్ఫుల్ (61 కేజీలు), బజరంగ్ (65 కేజీలు), జితేందర్ (74 కేజీలు), దీపక్ (86 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. వికాస్ (61 కేజీలు), రాహుల్ మాన్ (65 కేజీలు), సందీప్ (74 కేజీలు), అరుణ్ (86 కేజీలు), కృషన్ (125 కేజీలు) రజత పతకాలు గెలిచారు. పురుషుల గ్రీకో రోమన్ విభాగంలో రవీందర్ (59 కేజీలు), దీపక్ (71 కేజీలు), హర్దీప్ (98 కేజీలు) పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. కృషన్ (59 కేజీలు), రఫీక్ (71 కేజీలు), సచిన్ (98 కేజీలు) రజత పతకాలను సాధించారు. -
సందీప్ తోమర్కు రజతం
మాడ్రిడ్ (స్పెయిన్): స్పానిష్ గ్రాండ్ ప్రి రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు రెండు పతకాలు సాధించారు. 57 కేజీల విభాగంలో సందీప్ తోమర్ రజతం సాధించగా... 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ కాంస్యం గెలిచాడు. 65 కేజీల విభాగంలో యోగేశ్వర్ దత్ పతకం సాధించడంలో విఫలమయ్యాడు. -
భారత జట్లకు నిరాశ
న్యూఢిల్లీ: ప్రపంచకప్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీ ఫ్రీస్టయిల్ గ్రూప్ ‘బి’ విభాగంలో భారత జట్టు 1-7తో అమెరికా చేతిలో; 0-8తో ఇరాన్ చేతిలో ఓడింది. అమెరికాతో జరిగిన ఎని మిది బౌట్లలో కేవలం 74 కేజీ విభాగంలో మాత్రమే టీమిండియా రెజ్లర్ ప్రవీణ్ రాణా 5-4తో అలెగ్జాండర్ డేవిడ్ డైరింగర్పై నెగ్గాడు. -
నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్
లాస్ వెగాస్: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్కు రంగం సిద్ధమైంది. నేటి (మంగళవారం) నుంచి జరిగే ఈ పోటీల్లో మెరుగైన ప్రదర్శనతో తమ ఒలింపిక్ బెర్త్లను ఖాయం చేసుకునేందుకు భారత రెజ్లర్లు సిద్ధమవుతున్నారు. గాయంతో బాధపడుతున్న స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ ఈ పోటీలకు దూరమవుతుండగా.. యోగేశ్వర్ దత్, నర్సింగ్ యాదవ్, అమిత్, మౌసమ్ తదితరులు ఈ మెగా ఈవెంట్ బరిలోకి దిగుతున్నారు. పురుషుల 74కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో తలపడుతున్న 26 ఏళ్ల నర్సింగ్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఏడాది కాలంగా ఈ విభాగంలో సుశీల్ కుమార్ గాయంతో పాల్గొనకున్నా నర్సింగ్ పలు విజయాలు సాధించాడు. ప్రతీ కేటగిరీలో టాప్-6 స్థానాల్లో వచ్చిన వారు ఒలింపిక్ బెర్త్ దక్కించుకుంటారు. లండన్ గేమ్స్లో కాంస్యం సాధించిన యోగేశ్వర్ (65కేజీ ఫ్రీస్టయిల్ ), అమిత్ కుమార్ (57కేజీ), మౌసమ్ ఖత్రి (97కేజీ).. మహిళల ఫ్రీస్టయిల్లో వెటరన్ గీతా ఫోగట్, బబిత, వినేశ్లపై పతకంతో పాటు బెర్త్ ఆశలున్నాయి. -
భారత్కు రెండో స్థానం
న్యూఢిల్లీ : చివరి రోజు కూడా పతకాల వేట కొనసాగించిన భారత రెజ్లర్లు ఆసియా క్యాడెట్ చాంపియన్షిప్లో రెండో స్థానంలో నిలిచారు. ఆదివారం ముగిసిన ఈ పోటీల్లో ఆఖరి రోజు భారత్ ఖాతాలో నాలుగు పతకాలు చేరాయి. బాలికల 70 కేజీల విభాగం ఫైనల్లో దివ్య కక్రాన్ 3-2తో బ్యామ్బదోర్జ్ సెట్సెబాయెర్ (మంగోలియా)పై విజయం సాధించి భారత్కు స్వర్ణ పతకాన్ని అందించింది. బాలుర గ్రీకో రోమన్ విభాగంలో దీపక్ (85 కేజీలు), సుమీత్ (100 కేజీలు)... ఫ్రీస్టయిల్ విభాగంలో మోను (46 కేజీలు) కాంస్య పతకాలను గెల్చుకున్నారు. బాలుర ఫ్రీస్టయిల్ విభాగంలో 74 పాయింట్లతో, బాలికల విభాగంలో 80 పాయిం ట్లతో భారత జట్లు రన్నరప్గా నిలిచాయి. -
భారత్కు ఐదు పతకాలు
న్యూఢిల్లీ : ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. గురువారం తొలి రోజు భారత్కు మొత్తం 5 పతకాలు దక్కాయి. 85 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో అరుణ్ కుమార్, 50 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ప్రదీప్ స్వర్ణాలు గెలుచుకున్నారు. అరుణ్ 7-6తో హషిమిజుబర్ (ఇరాన్)పై విజయం సాధించగా, ప్రదీప్ 6-0తో సన్షిరో (జపాన్)ను చిత్తు చేశాడు. 100 కేజీల ఫ్రీస్టైల్లో నాసిర్ హుస్సేన్కు రజతం దక్కింది. మహిళల 40 కేజీల ఫ్రీ స్టైల్లో అన్నూదేవి రజత పతకం, 35 కేజీల ఫ్రీస్టైల్లో అంకుశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెజ్లర్ల ‘పసిడి పట్టు’
న్యూఢిల్లీ: ఇటలీలో జరిగిన ససారీ అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఇందులో ఎనిమిది స్వర్ణ పతకాలున్నాయి. తొలి రోజున అమిత్ (57 కేజీలు), యోగేశ్వర్ దత్ (65 కేజీలు), ప్రవీణ్ రాణా (70 కేజీలు), నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) పసిడి పతకాలు గెలుపొందగా... రెండో రోజు సోనూ (60 కేజీలు), సోమ్వీర్ (86 కేజీలు), మౌజమ్ ఖత్రీ (97 కేజీలు), హితేందర్ (125 కేజీలు) స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. రజనీష్ (65 కేజీలు) కాంస్య పతకం నెగ్గాడు. -
రెజ్లింగ్లో నిరాశ
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో బుధవారం భారత క్రీడాకారులు బాక్సింగ్, అథ్లెటిక్స్, హాకీ ఈవెంట్స్లో పతకాలతో మెరిసినా... మిగతా క్రీడాంశాల్లో మాత్రం మనోళ్లు పూర్తిగా నిరాశపర్చారు. ఫ్రీస్టయిల్ రెజ్లింగ్తో పోలిస్తే గ్రీకో రోమన్ విభాగంలో ఒక్కరు కూడా కనీసం కాంస్య పతక పోరుకు కూడా అర్హత సాధించలేపోయారు. రెజ్లింగ్: గ్రీకో రోమన్ రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్లు నిరాశపర్చారు. 75 కేజీల విభాగంలో గురుప్రీత్ సింగ్ 1-3తో పయ్యమ్ పయాని (ఇరాన్) చేతిలో; 85 కేజీల ఈవెంట్లో మనోజ్ కుమార్ 0-3తో ఫె పెంగ్ (చైనా) చేతిలో; 130 కేజీల బౌట్లో ధర్మేందర్ దలాల్ 0-4తో బషీర్ డార్జి (ఇరాన్) చేతిలో; 66 కేజీల ఈవెంట్లో సందీప్ యాదవ్ 0-4తో కుశ్రావ్ ఓబ్లోబెర్డివ్ (తజికిస్థాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. టేబుల్ టెన్నిస్: స్టార్ ప్లేయర్ శరత్ కమల్ నిరాశపర్చినా... సౌమ్యజిత్ ఘోష్ ప్రిక్వార్టర్స్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ తొలి మ్యాచ్లో ఘోష్ 11-5, 11-7, 11-5, 11-4తో పతాఫోన్ తవిసాక్ (లావోస్)పై నెగ్గాడు. మరో మ్యాచ్లో ప్రపంచ 46వ ర్యాంకర్ శరత్ 11-6, 10-12, 11-5, 9-11, 11-6, 10-12, 9-11తో ప్రపంచ 26వ ర్యాంకర్ తన్విరివెంచకుల్ (థాయ్లాండ్) చేతిలో ఓడాడు. తైక్వాండో: 57 కేజీల విభాగంలో ఆర్తీ ఖకల్ 8-15తో గనియా అల్జాక్ (కజకిస్థాన్) చేతిలో; పురుషుల 80 కేజీల విభాగంలో రాజన్ పండియా ఆనంద్ 1-7తో యోంగ్యున్ పార్క్ (కొరియా) చేతిలో ఓడారు. బాస్కెట్బాల్: ఐదు, ఆరు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత మహిళల జట్టు నిరాశపర్చింది. 47-68తో కజకిస్థాన్ చేతిలో ఓడి ఆరో స్థానంతో సంతృప్తి చెందింది. -
తొలిరోజు భారత్కు నిరాశ
రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్షిప్ తాష్కెంట్: ప్రపంచ చాంపియన్షిప్ అర్హత రౌండ్లో తొలి రోజు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. సోమవారం ప్రారంభమైన ఈ పోటీల్లో... కామన్వెల్త్ గేమ్స్లో రజతం సాధించిన రాజీవ్ తోమర్ 125కేజీల ఫ్రీస్టయిల్లో 1-3 తేడాతో కొరియాకు చెందిన ర్యోంగ్ సంగ్ చేతిలో ఓడాడు. అలాగే 70కేజీల ఫ్రీస్టయిల్లోనూ అరుణ్ 0-4 తేడాతో క్లియోపస్ క్యూబ్ (కెనడా) చేతిలో పరాజయం పాలయ్యాడు. అంతకుముందు జరిగిన తొలి రౌండ్లో మరో ఇద్దరు భారత రెజ్లర్లు రాహుల్ బాలాసాహెబ్ అవారే, నరేశ్ కుమార్ తమ ప్రత్యర్థుల చేతిలో మట్టికరిచారు. ఆసియా గేమ్స్ను దృష్టిలో పెట్టుకుని భారత్ తరఫున ద్వితీయ శ్రేణి రెజ్లర్లు బరిలోకి దిగారు. -
పట్టర పసిడి హైస్సా...
భారత రెజ్లర్లకు మరో రెండు స్వర్ణాలు ఒక రజతం, ఓ కాంస్యం కూడా తొలి రోజు లభించిన ‘పసిడి’ పట్టును రెండో రోజు నిలుపుకోవడంలో విఫలమైన భారత రెజ్లర్లు ఆఖరి రోజు మాత్రం దుమ్ముదులిపారు. ఉడుంపట్టుతో కనక వర్షం కురిపించారు. ఈసారి గేమ్స్లో పోటీ పడిన ప్రతి విభాగంలో ఏదో ఓ పతకం సాధించి భవిష్యత్పై ఆశలను రేకెత్తించారు. గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో తన ట్రేడ్ మార్క్ ‘ఫిటిల్’ (లెగ్ ట్విస్టింగ్) టెక్నిక్తో అలరించిన ఒలింపిక్స్ కాంస్య పతక విజేత యోగేశ్వర్ దత్తో పాటు బబిత కుమారి ఫైనల్లోనూ ‘పసిడి’ పట్టును నిలుపుకున్నారు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టయిల్ విభాగంలో యోగేశ్వర్ 10-0తో జీవోన్ బాల్ఫోర్ (కెనడా)పై గెలిస్తే... మహిళల 55 కేజీల కేటగిరీలో బబిత 9-2తో బ్రిటాని లావెర్డుర్ (కెనడా)ను ఓడించి స్వర్ణాలను కైవసం చేసుకున్నారు. అయితే మహిళల 63 కేజీల విభాగంలో గీతికా జకార్ రజతంతో సరిపెట్టుకుంది. ఏకపక్షంగా సాగిన ఈ బౌట్లో గీతికా 0-7తో డానియెల్లి లాపాగే (కెనడా) చేతిలో ఓడింది. రెండుసార్లు రిఫరీ నుంచి హెచ్చరికలు ఎదుర్కొన్న భారత రెజ్లర్ టెక్నికల్ పాయింట్లు సంపాదించడంలో విఫలమైంది. పురుషుల 86 కేజీల కాంస్య పతక పోరులో పవన్ కుమార్ విజేతగా నిలిచాడు. మహ్మద్ ఇనామ్ (పాకిస్థాన్) జరిగిన బౌట్లో ఇద్దరు రెజ్లర్లు చెరో 6 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే పవన్ ఒక టెక్నికల్ పాయింట్తో కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. ఓవరాల్గా గురువారంతో ముగిసిన రెజ్లింగ్లో భారత్ 5 స్వర్ణాలు, 6 రజతాలు, రెండు కాంస్యాలు గెలిచింది. 1 నిమిషం 53 సెకన్లలోనే... బాల్ఫోర్తో జరిగిన బౌట్లో యోగేశ్వర్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. ఆరంభంలోనే పట్టు దొరికించుకుని 1:53 సెకన్లలోనే ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి రౌండ్లోనే బాల్ఫోర్ను కిందపడేసిన యోగేశ్వర్ పట్టు జారకుండా జాగ్రత్తపడటంతో చకచకా 10 పాయింట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్ లేకుండా బౌట్ను నిలిపేయడంతో భారత రెజ్లర్ పసిడిని సొంతం చేసుకున్నాడు. లావెర్డుర్తో జరిగిన బౌట్లో బబితా పాయింట్ల వర్షం కురిపించింది. తొలి రౌండ్లోనే ఐదు పాయింట్లు నెగ్గిన ఆమె రెండో రౌండ్లో 4 పాయింట్లు గెలిచింది. ప్రత్యర్థి కేవలం రెండు పాయింట్లతోనే సరిపెట్టుకుంది. కామన్వెల్త్లో భారత్ రౌండప్ బ్యాడ్మింటన్ క్వార్టర్స్లో కశ్యప్ బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగాల్లో భారత షట్లర్లు దూసుకెళ్తున్నారు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ఫైనల్లో పారుపల్లి కశ్యప్ 21-7, 21-8తో జెఫ్ తో (ఆస్ట్రేలియా)పై , గురుసాయిదత్ 21-13, 21-9తో ఆండ్రూ డిసౌజా (కెనడా)పై గెలిచి క్వార్టర్స్కు చేరుకున్నారు. శ్రీకాంత్ కూడా ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్లో పి.సి.తులసి, మహిళల డబుల్స్లో జ్వాల-అశ్విని జోడి క్వార్టర్స్కు చేరారు. బాక్సింగ్ విజేందర్కు పతకం ఖాయం కామన్వెల్త్ బాక్సింగ్లో భారత్కు మరో పతకం ఖాయమైంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన మిడిల్ వెయిట్ (75 కేజీలు) విభాగంలో క్వార్టర్ఫైనల్లో విజేందర్ 3-0తో ఆరోన్ ప్రిన్స్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో)పై విజయం సాధించి సెమీస్లోకి ప్రవేశించాడు. కాబట్టి కనీసం కాంస్య పతకమైనా దక్కుతుంది టేబుల్ టెన్నిస్ సెమీస్లో శరత్ జోడి పురుషుల డబుల్స్లో భారత జోడి శరత్ కమల్-ఆంథోని అమల్రాజ్ సెమీఫైనల్కు చేరుకున్నారు. క్వార్టర్ ఫైనల్లో శరత్-ఆంథోని జంట 12-10, 11-6, 7-11, 11-8తో ఇంగ్లండ్కు చెందిన డానీ రీడ్-శామ్ వాకర్ ద్వయంపై గెలుపొందింది. అయితే మరో పురుషుల డబుల్స్ జోడి హర్మీత్ దేశాయ్-సౌమ్యజిత్ ఘోష్ క్వార్టర్స్లో సింగపూర్ జంట చేతిలో ఓటమిపాలైంది. ఇక మిక్స్డ్ డబుల్స్లోనూ శరత్ కమల్- షామిని కుమరేశన్ జోడి క్వార్టర్స్లో ఓడిపోయింది. మహిళల సింగిల్స్లో పతకంపై ఆశలున్న మానికా బాత్రా కూడా క్వార్టర్స్లో ఓడింది. స్వర్ణ ‘వికాసం పురుషుల డిస్కస్ త్రోలో భారత అథ్లెట్ వికాస్ గౌడ స్వర్ణం గెలిచాడు. గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో అతను డిస్క్ను 63.64 మీటర్ల దూరం విసిరాడు. తొలి ప్రయత్నంలో 60.63 మీటర్లు మాత్రమే విసిరిన వికాస్ క్రమంగా దూరాన్ని పెంచాడు. రెండో ప్రయత్నంలో 62.09 మీటర్లు, మూడో ప్రయత్నంలో 63.64 మీటర్లు నమోదు చేశాడు. తర్వాతి మూడు ప్రయత్నాల్లో కాస్త నిరాశపరిచినా... 63.64 మీటర్లకు స్వర్ణం దక్కింది. అపోస్టోలస్ పారెల్లిస్ (సైప్రస్-63.32 మీటర్లు), జాసన్ మోర్గాన్ (జమైకా-62.34 మీటర్లు) వరుసగా రజతం, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. మహిళల 800 మీటర్ల పరుగులో టింటూ లుకా ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయింది. సెమీస్లో ఆమె 2:03.35 సెకన్లలో లక్ష్యాన్ని చేరి ఏడో స్థానంలో నిలిచింది. -
‘పట్టు’ సడలింది
పసిడి నెగ్గలేకపోయిన భారత రెజ్లర్లు - ఫైనల్స్కు చేరిన అన్ని విభాగాల్లోనూ ఓటమి - నాలుగు రజతాలు, కాంస్యంతో సరి రెజ్లింగ్ తొలి రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు... రెండో రోజు నాలుగు విభాగాల్లో ఫైనల్కు... ఇక స్వర్ణాలు లెక్కబెట్టుకోవడమే అనుకున్నారంతా! కానీ సగటు భారత క్రీడాభిమాని ఆశ ఆవిరైపోయింది. రెండో రోజు ఫైనల్కు చేరిన నాలుగు విభాగాల్లోనూ ఓటములతో భారత రెజ్లర్లు రజతాలతో సరిపెట్టుకున్నారు. అయితే నాలుగు రజతాలతో పాటు ఓ కాంస్యం కూడా సాధించి మొత్తం ఐదు పతకాలతో భారత్ పతకాల సంఖ్యను రెజ్లర్లు పెంచారు. గ్లాస్గో: పసిడి పంట పండిస్తారనుకున్న వేదికపై భారత రెజ్లర్లు ‘పట్టు’ సడలించారు. ప్రత్యర్థి పట్టు పట్టాల్సిన చోట తాము పట్టు కోల్పోయారు. నమ్మశక్యంకాని పద్ధతిలో తడబాటుకు లోనై పరాజయాల మూట గట్టుకున్నారు. ఫైనల్లో పురుష రెజ్లర్లకు కెనడా కుస్తీ వీరులు ‘షాక్’ ఇవ్వగా... మహిళల రెజ్లర్లకు నైజీరియా అమ్మాయిలు ‘చెక్’ పెట్టారు. కామన్వెల్త్ గేమ్స్ ప్రమాణాలతో పోలిస్తే ఎంతో పటిష్టమైన ప్రత్యర్థులు ఉండే ప్రపంచ చాంపియన్షిప్లో గతేడాది కాంస్యం నెగ్గిన బజరంగ్ (61 కేజీల)... ఈ ఏడాది ఆసియా చాంపియన్షిప్లో కాంస్యం సాధించిన సత్యవర్త్ (97 కేజీలు) ‘గ్లాస్గో’లో మాత్రం పసిడి మెట్టుపై బోల్తా పడ్డారు. తేరుకునేలోపే... డేవిడ్ ట్రెమ్బ్లే (కెనడా)తో జరిగి 61 కేజీల ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బజరంగ్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పటిష్ట శరీర నిర్మాణంతో ఉన్న ట్రెమ్బ్లే తన శక్తినంతా కూడదీసుకొని బజరంగ్పై మొదట్లోనే నియంత్రణ సంపాదించాడు. బజరంగ్ను ఒక్కసారి మ్యాట్పై కిందపడేశాక ట్రెమ్బ్లే పూర్తిగా పట్టుబిగించాడు. బజరంగ్ కాళ్లను కదలనీయకుండా తానే ఆధిపత్యం చలాయిస్తూ వెంటవెంటనే పాయింట్లు గెల్చుకున్నాడు. 3 నిమిషాల వ్యవధిగల తొలి అర్ధభాగంలో 84 సెకన్లు ముగిసే సమయానికి ట్రెమ్బ్లే 12-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. దాంతో నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై ఎవరైనా కనీసం 10 పాయింట్లు ఆధిక్యం సంపాదిస్తే బౌట్ను నిలిపివేయాలి. ఫలితంగా ట్రెమ్బ్లే విజేతగా అవతరించాడు. అతి జాగ్రత్తకు మూల్యం. వరుసగా మూడు బౌట్లలో నెగ్గి 97 కేజీల విభాగంలో ఫైనల్ చేరుకున్న 20 ఏళ్ల సత్యవర్త్ కడియాన్ టైటిల్ పోరులో అతి జాగ్రత్తకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. అర్జున్ గిల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో సత్యవర్త్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 2-0తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే రెండో అర్ధభాగంలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకునే క్రమంలో జోరు తగ్గించి రక్షణాత్మకంగా వ్యవహరించాడు. ఇదే అదునుతో అర్జున్ గిల్ జోరు పెంచి 2-2తో స్కోరును సమం చేశాడు. రిఫరీ హెచ్చరించినా దూకుడు పెంచని సత్యవర్త్కు 30 సెకన్ల ‘కాషన్’ ఇచ్చారు. ఈ సమయంలో అతను పాయింట్ సంపాదించకపోవడంతో అర్జున్కు అదనంగా పాయింట్ వచ్చింది. ఆ తర్వాత తేరుకున్న సత్యవర్త్ పాయింట్ సాధించి 4-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని అర్జున్ గిల్ తన బలాన్నంతా కూడదీసుకొని చివరి సెకన్లలో సత్యవర్త్ను ఎరీనా బయటకు పంపించి నిర్ణీత సమయానికి స్కోరును 4-4తో సమం చేశాడు. దాంతో బౌట్ సందర్భంగా సత్యవర్త్ ‘కాషన్’ పొందడం... చివరగా అర్జున్ గిల్ పాయింట్ సంపాదించడంతో నిబంధనల ప్రకారం అర్జున్ గిల్ను విజేతగా ప్రకటించారు. చేతులెత్తేశారు... మహిళల 53 కేజీల ఫైనల్లో ఒడునాయో అడెకురోయి (నైజీరియా) కేవలం 31 సెకన్లలో లలిత (భారత్)ను చిత్తు చేసింది. ఆరంభంలోనే లలితను ఒడిసిపట్టుకున్న ఒడునాయో ఆమెను మ్యాట్పై పడేసింది. అదే జోరులో లలిత భుజాన్ని ఈ నైజీరియా రెజ్లర్ కొన్ని సెకన్లపాటు మ్యాట్కు ఆనించడంతో రిఫరీ ‘బై ఫాల్’ పద్ధతిలో ఒడునాయోను విజేతగా ప్రకటించారు. 58 కేజీల విభాగంలో అమినాత్ అడెనియి 2 నిమిషాల 43 సెకన్లలో సాక్షి మలిక్ (భారత్) ఆట కట్టించింది. బౌట్ మొదలైన క్షణం నుంచే దూకుడుగా వ్యవహరించి మంచి టెక్నిక్తో అడెనియి వరుసగా పాయింట్లు సంపాదించింది. ఈ క్రమంలో అడెనియ 10-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లడంతో రిఫరీ బౌట్ను ముగించారు. ఇక 69 కేజీల కాంస్య పతక పోరులో నవజ్యోత్ కౌర్ 13-0తో సారా జోన్స్ (స్కాట్లాండ్)ను ఓడించింది. -
భారత రెజ్లర్లకు మూడు పతకాలు
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో పోటీపడిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లోనే భారత రెజ్లర్లు సత్తా చాటుకున్నారు. అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్లో జరిగిన డేవ్ షుల్జ్ స్మారక టోర్నమెంట్లో భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఇందులో ఒక్కో స్వర్ణ, రజత, కాంస్య పతకాలున్నాయి. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో ప్రవీణ్ రాణా (74 కేజీలు) స్వర్ణం సాధించగా... అమిత్ కుమార్ (61 కేజీలు) రజతం... సందీప్ తోమర్ (57 కేజీలు) కాంస్యం నెగ్గారు. ఫైనల్లో ప్రవీణ్ రాణా 5-0తో డాన్ వాలిమోంట్ (అమెరికా)పై నెగ్గగా... అమిత్ 0-11తో బొగోమొయెవ్ (రష్యా) చేతిలో ఓడిపోయాడు. కాంస్య పతక బౌట్లో సందీప్ తోమర్ 10-0తో స్టీవ్ మిచ్ (అమెరికా)పై గెలుపొందాడు. 65 కేజీల విభాగం కాంస్య పతక పోరులో బజరంగ్ (భారత్) 1-11తో నొవాచ్కోవ్ (బల్గేరియా) చేతిలో ఓడిపోయాడు. -
కామన్వెల్త్ రెజ్లింగ్ లో భారత్ క్లీన్స్వీప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తూ భారత రెజ్లర్లు కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ పోటీల్లోని గ్రీకో రోమన్ కేటగిరిలో అందుబాటులో ఉన్న ఏడు స్వర్ణ పతకాలనూ సొంతం చేసుకొని టీమ్ చాంపియన్షిప్ను సాధించారు. గౌరవ్ శర్మ (55 కేజీలు), రవీందర్ సింగ్ (60 కేజీలు), ఆనంద్ (66 కేజీలు), రాజ్బీర్ చికారా (74 కేజీలు), మనోజ్ (84 కేజీలు), హర్దీప్ (96 కేజీలు), నవీన్ (120 కేజీలు) స్వర్ణ పతకాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో భారత్ రన్నరప్గా నిలిచింది. పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలోనూ భారత్కు టీమ్ టైటిల్ దక్కింది. ఓవరాల్గా భారత్కు 38 పతకాలు వచ్చాయి.