
క్వార్టర్స్లో హేమలత
యూత్ ఒలింపిక్స్ ఆర్చరీ
నాన్జింగ్: చైనాలో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్ ఆర్చరీలో... తెలుగు క్రీడాకారిణి బోడ హేమలత క్వార్టర్ ఫైనల్స్కు చేరింది. శనివారం జరిగిన వ్యక్తిగత రికర్వ్ విభాగం ప్రిక్వార్టర్స్లో హేమలత 7-3తో మేయా (ఇజ్రాయిల్)పై గెలిచింది. సోమవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఫ్రాన్స్ క్రీడాకారిణి మెలానీతో హేమలత తలపడుతుంది. పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో భారత క్రీడాకారుడు అతుల్ వర్మ క్వార్టర్స్కు చేరాడు. ప్రి క్వార్టర్స్లో అతుల్ 6-0తో తిహా (మలేసియా)పై నెగ్గాడు.
శ్యామ్కుమార్కు నిరాశ
పురుషుల బాక్సింగ్లో విశాఖపట్నానికి చెందిన కాకర శ్యామ్కుమార్ ప్రిలిమినరీ దశలోనే వెనుదిరిగాడు. శనివారం జరిగిన బౌట్లో శ్యామ్ 1-2తో రుఫత్ (అజర్బైజాన్) చేతిలో ఓడిపోయాడు.