చెన్నైపై హైదరాబాద్‌ స్కై గెలుపు | hyderabad beats chennai in UBA basketball league | Sakshi
Sakshi News home page

చెన్నైపై హైదరాబాద్‌ స్కై గెలుపు

Published Wed, Feb 22 2017 4:31 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

చెన్నైపై హైదరాబాద్‌ స్కై గెలుపు - Sakshi

చెన్నై: యూబీఏ బాస్కెట్‌బాల్‌ లీగ్‌ నాలుగో సీజన్‌లో హైదరాబాద్‌ స్కై విజయం సాధించింది. చెన్నై స్లామ్స్‌తో జరిగిన హోరాహోరి పోరులో హైదరాబాద్‌ జట్టు 93–84 స్కోరుతో జయభేరి  మోగించింది. ఆఖర్లో ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు తలపడడంతో ఉత్కంఠ పెరిగింది. క్రమం తప్పకుండా పాయింట్లు సాధించడంలో స్కై ఆటగాళ్లు సఫలమయ్యారు. ఆట ఆరంభంలో హైదరాబాద్‌ ఆటగాళ్లు దూకుడు కనబరిచారు. దీంతో తొలి క్వార్టర్‌ ముగిసేసరికి హైదరాబాద్‌ 29–18తో ఆధిక్యంలో నిలిచింది.

అనంతరం  రెండో క్వార్టర్‌ను కూడా స్కై జట్టు 31–20 స్కోరుతో ముగించింది. మూడో క్వార్టర్‌లో చెన్నై ఆటగాళ్లు గట్టిపోటీనిచ్చారు. అయితే హైదరాబాద్‌ ఆధిక్యాన్ని మాత్రం తగ్గించలేకపోయారు. ఈ క్వార్టర్‌ను స్కై 71–58తో ముగించింది. హైదరాబాద్‌ స్కై తరఫున టెవిన్‌ కెల్లీ (39) అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మహేశ్‌ పద్మనాభన్‌ 29, మాక్‌ బస్కాయిలో 10 పాయింట్లు సాధించారు. చెన్నై స్లామ్స్‌ జట్టులో రామ్‌కుమార్‌ (26), అగు చుక్వునను (23) చక్కని ఆటతీరు  కనబరిచారు. కామీ 13 పాయింట్లు చేశాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement