జింఖానా, న్యూస్లైన్: హైదరాబాద్ తరఫున సౌత్ జోన్ టోర్నమెంట్లో పాల్గొనే అండర్-14 క్రికెట్ జట్టు వివరాలను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వెల్లడించింది. జట్టు కెప్టెన్గా సమిత్ రెడ్డి వ్యవహరించనున్నాడు. ఈ టోర్నీ వచ్చే నెల 6 నుంచి గోవాలో జరగనుంది. జట్టు కోచ్గా చేతన్ ఆనంద్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. జట్టుకు ఎంపికైన ఆటగాళ్ళు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జింఖానా మైదానంలో హాజరు కావాలని హెచ్సీఏ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు.
జట్టు: సూర్య తేజ, ప్రత్యూష్, వరుణ్ గౌడ్, రేవంత్, నిహాంత్ రెడ్డి, ప్రగ్యున్ దూబే, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, అజయ్దేవ్ గౌడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, అలంక్రిత్ అగర్వాల్, అంకిత్ రెడ్డి, కమల్ కుమార్, రిషబ్, సాయిపూర్ణా రావు, మన్నాస్.
హైదరాబాద్ జట్టు ఇదే...
Published Fri, Dec 27 2013 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM
Advertisement
Advertisement