Hyderabad Cricket Association
-
దివ్యాంగుల క్రికెట్ టోర్నీని ప్రారంభించిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ను (Physically Diabled Cricket Tourney) భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (Hyderabad Cricket Association) (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రారంభించారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ... హెచ్సీఏ తరఫున దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తాము మిగిలిన వారిలానే క్రికెట్ ఆడగలమని నిరూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ క్రికెటర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దివ్యాంగ క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ తరహాలో ఒక లీగ్ను నిర్వహించే ఆలోచనను చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ పాల్గొన్నారు. -
ఆర్చర్కు అండగా హెచ్సీఏ చీఫ్.. ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వర్ధమాన ఆర్చర్ తానిపర్తి చికితకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు(Jagan Mohan Rao) ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న చికిత ఆసియా జూనియర్ ఆర్చర్ కప్కు అర్హత సాధించింది. కోల్కతాలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో ఆకట్టుకొని ఆమె క్వాలిఫై అయింది.మున్ముందు ఆమె శిక్షణ, ఇతర సన్నాహాల మొత్తం రూ.10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్ను తన వ్యక్తిగత హోదాలో అందజేస్తానని జగన్మోహన్రావు ప్రకటించారు. రైతు కుటుంబం నుంచి వచ్చి క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చికితకు అన్ని విధాలా సహకరిస్తామని ఆయన చెప్పారు. ముందుగా రూ.50 వేల చెక్ను అందించిన ఆయన ప్రతీ నెలా రూ.15 వేల చొప్పున తమ ‘అక్షర’ విద్యాసంస్థల తరఫున ఇస్తానని ప్రకటించారు. ఇది కూడా చదవండిదుబాయ్: భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఐర్లాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో సత్తా చాటిన స్మృతి తాజా ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. ఐర్లాండ్తో సిరీస్లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సాయంతో 249 పరుగులు చేసిన స్మృతి 738 ర్యాంకింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. ఈ సిరీస్లో స్మృతి కెప్టెన్గానూ ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ (773 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక బ్యాటర్ చమరి అటపట్టు (733 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉంది. భారత జట్టు తరఫున స్మృతి మాత్రమే టాప్–10లో చోటు దక్కించుకుంది. ఐర్లాండ్తో సిరీస్కు దూరమైన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 15వ ర్యాంక్లో ఉండగా... కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్కు చేరింది. ఐర్లాండ్తో సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓపెనర్ ప్రతీక రావల్ 12 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంక్లో నిలిచింది. బౌలర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక స్థానం మెరుగు పరుచుకొని నాలుగో ర్యాంక్లో నిలిచింది. ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి 6వ స్థానంలో కొనసాగుతోంది. -
CT 2025: టీమిండియా మేనేజర్గా హెచ్సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్రాజ్ మేనేజర్గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించే అవకాశం హెచ్సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్గా ఎంపికైన దేవ్రాజ్కు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్లో భాగంగా ఫ్రాన్స్లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ముగింపు పలికింది. హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.ఈ మేరకు మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్ -
ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్రైజర్స్కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్లు, లిఫ్ట్లు, లాంజ్లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
HCA: ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు ఇస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్తో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్లో లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్లో ‘ప్లేట్’ డివిజన్కు పడిపోయాయి. 2022–23 సీజన్లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్లలో తొలి మ్యాచ్ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్కు పడిపోయింది. వచ్చే సీజన్లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు... ‘ప్లేట్’ డివిజన్లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్లో 56 వికెట్లతో టాపర్గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు. దీంతో పాటు వచ్చే సీజన్లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు. -
HCA: అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా?
సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర సీనియర్ మహిళల క్రికెట్ జట్టు కోచ్... టీమ్తో పాటు మ్యాచ్ కోసం బస్సులో ప్రయాణిస్తున్నారు... ఎంతో బాధ్యతగా, హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి కట్టు తప్పారు. బస్సులోనే మద్యం బాటిల్ తీసి దర్జాగా సేవించారు. ఆపై ముందు సీట్లో దానిని పెట్టుకొని అదే కొనసాగించారు! ఈ వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ మహిళల టీమ్కు హెడ్ కోచ్గా ఉన్న విద్యుత్ జైసింహ చేసిన నిర్వాకమిది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వెంటనే స్పందించింది. జైసింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ వేటు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో పాటు విచారణ ముగిసే వరకు హైదరాబాద్ క్రికెట్కు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ఈ ఘటన ఎప్పటిదనే విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. బస్సులోకి ఆల్కహాల్ను ఎవరు తీసుకొచ్చారు, ఎలా అనుమతించారనే దానిపై కూడా విచారణ చేస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రకటించారు. అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా? పాతతరం క్రికెట్ దిగ్గజం ఎంఎల్ జైసింహ కుమారుడైన విద్యుత్ గతంలో హెచ్సీఏలో వేర్వేరు బాధ్యతల్లో పని చేశారు. తండ్రి పేరుతోనే సికింద్రాబాద్లో చాలా ఏళ్లుగా ఒక ప్రైవేట్ క్రికెట్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను విద్యుత్ జైసింహ ఖండించారు. తానెప్పుడూ టీమ్ బస్సులోకి మద్యాన్ని తీసుకురాలేదని, తాగలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు నిరాధారమని... ఒక హైదరాబాద్ మాజీ క్రికెటర్ కుమార్తెను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జైసింహ వివరణ ఇచ్చారు. జై సింహా ప్రవర్తన గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు అప్పట్లోనే లేఖ కోచ్ జై సింహా తాగుడుకు బానిసగా మారారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. తమ ముందు మద్యం తాగొద్దని పలుసార్లు వారించినా వినలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే టీం నుంచి తీసేస్తానని బెదిరించారన్నారు. ఈ క్రమంలో.. మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గత జనవరిలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు జనవరిలో లేఖ కూడా రాశారు. -
HCA: మహిళా క్రికెట్ హెడ్కోచ్పై వేటు
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్తో సహా బస్లో హైదరాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్కోచ్గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
ఉప్పల్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్.. వారికి ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు జగన్మోహన రావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో జగన్మోహన రావు మాట్లాడుతూ.. మేము ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 5 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం. అయితే మ్యాచ్ కి ముందే స్కూల్ నుంచి లెటర్ హెచ్సీఏకు పంపించాల్సి ఉంటుంది. హెచ్సీఏకు పాఠశాల నుంచి లెటర్ అందితే టిక్కెట్లను నేరుగా వారివద్దకే పంపిస్తాం. ఒక స్కూల్ కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తాం. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ గా ఫుడ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లకు ఫ్రీ ఎంట్రీ.. అదే విధంగా ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్కు అనుమతిస్తామని జగన్మోహన రావు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని ఆయన చెప్చుకొచ్చారు. కాగా ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 26వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి జింఖానా మైదానంలో ఫిజికల్ టిక్కెట్లను హెసీఏ విక్రయించనుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!? -
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్లైన్లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
హెచ్సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్కు నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్లో పేర్కొంది. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్లకు నో ఛాన్స్ -
హెచ్సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
హెచ్సీఏ వివాదాన్ని పరిష్కరించండి.. హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు, విశాఖ ఇండస్ట్రీస్కు మధ్య నెలకొన్న వివాదాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా వాణిజ్యకోర్టును హైకోర్టు ఆదేశించింది. అక్కడే సమస్యపై తుది పరిష్కారానికి రావాలని ఇరు పార్టీలకు సూచించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. -
అజారుద్దీన్కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్రావు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్రావు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై ఒక్క ఓట్ తేడాతో జగన్ మోహన్రావు విజయం సాధించారు. అమర్నాథ్కు 62 ఓట్లు పడగా.. జగన్ మోహన్రావు 63 ఓట్లు సొంతం చేసుకున్నారు. అదే విధంగా హెచ్సీఏ ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) గెలుపొందారు. కాగా మొత్తం 6 పదవుల కోసం బరిలో 24 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. మాజీ క్రికెటర్లు వీవియస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్,స్రవంతి సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా హెచ్సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు. -
HCA: ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికల పోలింగ్.. గెలిచేదెవరో?
ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అనేక వివాదాల అనంతరం.. హెచ్సీఏ పీఠం ఎవరు దక్కించుకోనున్నారన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కాగా ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటిగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల అధికారి తొలుత ప్రెసిడెంట్ స్థానానికి ఎన్నికైన అభ్యర్థి పేరునే ప్రకటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హెచ్సీఏ అధ్యక్ష రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హెచ్సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు. బరిలో ఉన్న ప్యానెల్, అభ్యర్థులు వీరే.. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ: ఎ.జగన్మోహన్ రావు, పి.శ్రీధర్, ఆర్.హరినారాయణ రావు, నోయల్ డేవిడ్, సీజే శ్రీనివాస్, అన్సర్ అహ్మద్ ఖాన్. క్రికెట్ ఫస్ట్: అమర్నాథ్, జి.శ్రీనివాస రావు, ఆర్.దేవరాజ్, సి.సంజీవ్ రెడ్డి, చిట్టి శ్రీధర్, సునీల్ కుమార్. ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెచ్సీఏ: పీఎల్ శ్రీనివాస్, సి. బాబూరావు, ఆర్ఎం భాస్కర్, రోహిత్ అగర్వాల్, జెరార్డ్ కార్, డీఏజే వాల్టర్. గుడ్ గవర్నెన్స్: కె. అనిల్కుమార్, దల్జీత్ సింగ్, వి.ఆగమరావు, బసవరాజు, పి.మహేంద్ర, వినోద్ ఇంగ్లే. -
అజారుద్దీన్పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! ఇక మర్చిపోవాల్సిందే!
HCA Elections- Setback for Azhar: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి హెచ్సీఏలో చక్రం తిప్పాలనుకున్న అజారుద్దీన్ ఆశలకు గండిపడింది. కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది. సుప్రీంకు చేరిన పంచాయితీ 2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. అందుకే అనర్హత వేటు ఇదిలా ఉంటే.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నందున(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అజారుద్దీన్పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏకసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంను ఆశ్రయించగా అతడికి నిరాశే ఎదురైంది. ఈసారికి మర్చిపోవాల్సిందే ఈ విషయంపై స్పందించిన అజారుద్దీన్ సన్నిహిత వర్గాలు.. ‘‘ఒకవేళ అక్టోబరు 31 తర్వాత ఓటర్ల లిస్టులో అజర్ పేరును చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినా ఉపయోగం ఉండదు. అయితే, అతడికి వ్యతిరేకంగా కొందరు పన్నిన కుట్రను బయటపెట్టేందుకు... అజారుద్దీన్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అతడికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయం బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాయి. చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మోగిన ఎన్నికల నగారా
-
టీమిండియా మాజీ కెప్టెన్కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్కు భారీ షాక్ తగిలింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్పై అనర్హత వేటు వేసింది. దీంతో అజహార్ రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (అక్టోబర్) 20వ తేదీన ఎన్నికలు నిర్వహరణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్కు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోజే ఫలితాలు ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబరు 14న నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మోగిన ఎన్నికల నగారా కాగా వివాదాల నేపథ్యంలో హెచ్సీఏ ప్రెసిడెంట్గా మహ్మద్ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెచ్సీఏ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయండి.. హెచ్సీఏకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆరువారాల్లో రూ.17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర, చరాస్తులపై థర్డ్ పారీ్టకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్సీఏకు సూచించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్సీఏ అడ్మినిస్టేటర్, జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన ఆ అటాచ్మెంట్లు రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ.శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్సీఏ తరఫున సీనియర్ న్యాయవాది రాజాశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ వేరొక చోట ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిందన్నారు. దాని ఫలితంగా అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున సీనియర్ న్యాయవాది సునీల్ వాదనలు వినిపిస్తూ.. 2016లో మధ్యవర్తిత్వ తీర్మానం ఆమోదించగా, ఏడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని.. విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించకుండా ఉండేందుకు హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విశాఖ ఇండస్ట్రీస్కు అనుకూలంగా ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పులో భాగంగా హెచ్సీఏ రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
ప్రపంచకప్కు ఉప్పల్ స్టేడియం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది. హెచ్సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ కె. దుర్గాప్రసాద్ వరల్డ్ కప్కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు. ‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్ ఫీల్డ్ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ లైట్లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్ చెప్పారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్లు ఉన్నాయి. -
CWC 2023: పాకిస్తాన్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఈనెల 29న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్ను వాయిదా వేయాలని వారు హెచ్సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్సీఏకు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్కప్ టికెటింగ్ పార్డ్నర్ బుక్ మై షోకు సూచించింది. కాగా, వన్డే వరల్డ్కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ డే అండ్ మ్యాచ్లుగా సాగనున్నాయి. సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు) ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) అక్టోబర్ 2: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) అక్టోబర్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి) ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) -
బీసీసీఐకి హెచ్సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్కప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) బీసీసీఐను అభ్యర్దించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్ధన మెరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్ల విక్రయాలకు కూడా బీసీసీఐ సిద్దమైంది. అంంతలోనే హెచ్సీఏ.. భారత క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. కాగా వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే(ఆక్టోబర్) 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్లకు భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్సిఎకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులల అభ్యర్దను పరిగణలోకి తీసుకున్న హెచ్సిఏ.. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసింది. కాగా వాస్తవానికి పాక్-శ్రీలంక మ్యాచ్ ఆక్టోబర్ 12 హైదారాబాద్గా జరగాల్సింది. కానీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో ఆ మ్యాచ్ రెండు రోజులు ముందు వచ్చింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి చదవండి: ODI WC 2023: సంజూ శాంసన్ కాదు.. వన్డే ప్రపంచకప్లో భారత వికెట్ కీపర్ అతడే! -
హెచ్సీఏ ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడింది. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా పని చేసిన వీరవల్లి సుందరం (వీఎస్) సంపత్ హెచ్సీఏ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) లావు నాగేశ్వరరావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్సీఏ ఎన్నికల ప్రక్రియ మొత్తం వీఎస్ సంపత్ నేతృత్వంలోనే జరుగుతుంది. -
హెచ్సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్గా మారిన హెచ్సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు. అయితే మన రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రికెటర్లను హెచ్సీఏ వెనక్కి పంపించింది. ఈ నేపథ్యంలో పద్దతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించలేదని అక్కడికి వచ్చిన యువ క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాదు ఒక యువ క్రికెటర్ దగ్గర హెచ్సీఏ డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. వన్డౌన్ ప్లేయర్గా అవకాశం ఇస్తామంటూ యువ క్రికెటర్ దగ్గర రూ. లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాధితుడు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. కాగా హెచ్సీఏ తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హెచ్ సీయూ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదు. ఈ సెలక్షన్ ఒక్కో జిల్లాకు ఒకరోజు ఇస్తే క్రికెటర్లు ఆ రోజు వచ్చేవారు. కానీ అందరూ ఒకటే రోజు రావడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన పిల్లలు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు'' అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు! ఇక్కడికొచ్చాక.. -
హెచ్సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. హెచ్సీఏలో అవినీతి పెరిగిపోయిందని.. సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ తీరును ప్రభుత్వం గమనిస్తుందని త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ''ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన లీజ్ త్వరలో ముగిసిపోతుంది. ఉప్పల్ స్టేడియం లీజ్పై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. హెచ్సీఏ అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించే యోచనలో ఉన్నాం.'' అని వెల్లడించారు. చదవండి: చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ల్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. రెండు రోజుల లీగ్లో భాగంగా కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆరోన్ వర్గీస్ అనే కుర్రాడు ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. గురువారం జరిగిన మ్యాచ్లో కాంకర్డ్ తరపున ఆడిన ఆరోన్ వర్గీస్ మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. కేవలం 260 బంతుల్లో 50 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు సాధించాడు. ఆరోన్ అద్భుత బ్యాటింగ్కు తోడుగా అయాన్ అహ్మద్(52), రామ్ రేపాల(50) రాణించడంతో కంకార్డ్ 85.5 ఓవర్లలో(నిర్ణీత 90 ఓవర్లు) 560 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు చేసిన 560 పరుగుల్లో 321 పరుగులు ఆరోన్ వర్గీస్వే కావడం విశేషం. చదవండి: కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల చేధన -
హెచ్సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ మరో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లేఆఫ్ చేరే అవకాశాలను కోల్పోయింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ సమయంలో నోబాల్ విషయమై ఎస్ఆర్హెచ్ అభిమానులు కాస్త అతి చేశారు. థర్డ్ అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అభిమానులు లక్నో డగౌట్వైపు బోల్టులు, మేకులతో దాడి చేశారు. ఈ సమయంలో లక్నో ఆటగాళ్లు సహా సిబ్బంది అక్కడ ఉండడంతో కాస్త గందరగోళం నెలకొంది, అయితే డగౌట్కు కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా కేవలం టెంట్లతో ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుని దయ వల్ల మేకులు ఎవరికి గుచ్చుకోకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ హెచ్సీఏ వైఖరిని ఎండగట్టాడు. ''ఐపీఎల్లో ఇతర వేదికల్లో డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్తో ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ స్టేడియంలో మాత్రం డగౌట్లను కేవలం గొడుగుల కింద ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ లక్నోతో మ్యాచ్ సందర్భంగా నోబాల్ ఇవ్వలేదని అభిమానులు మేకులు, బోల్టులు విసరడం మంచి పద్దతి కాదు. దేవుని దయవల్ల ఎవరికి ఏం కాలేదు. అయినా డగౌట్ ఏర్పాటులో ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. హెచ్సీఏ నిర్వహణ లోపం ఏంటనేది మరోసారి బయటపడింది. కనీసం సరైన డగౌట్లు నిర్మించలేని పరిస్థితిలో హెచ్సీఏ ఉండడం దురదృష్టకరం'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్గా వెళ్లింది. క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్జెయింట్స్ అంపైర్ కాల్ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్గా ఉందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్లు షాక్కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. చదవండి: సూపర్ ప్రబ్సిమ్రన్.. ఓపెనర్గా వచ్చి సెంచరీ కొట్టి -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
కథ కంచికి.. హెచ్సీఏకు తగిన శాస్తి
వెంకటపతిరాజు, మహ్మద్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇలా ఆణిముత్యం లాంటి క్రికెటర్లను దేశానికి అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది(హెచ్సీఏ). అలాంటి హెచ్సీఏ ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయింది. ఇంత జరుగుతున్నా బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హెచ్సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ సుప్రీం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్సీఏ వ్యవహరాలను చూసుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హెచ్సీఏ కథ చివరికి ఇలా ముగిసింది. టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టించుకోకుండా ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారినే ఆడించడం హెచ్సీఏలో కామన్గా మారిపోయింది. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలోనూ హైదరాబాద్ జట్టు దారుణ ప్రదర్శనను కనబరిచింది. నాలుగు రోజుల మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి నిండా ఒక్కరోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేక.. సరిగా బౌలింగ్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీలో ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో పరాజయం.. ఒక మ్యాచ్ డ్రాతో ఒక్క పాయింటుతో గ్రూప్-బి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రంజీలో పాల్గొన్న మిగతా రాష్ట్రాల జట్లు ఆటలో ముందుకు వెళుతుంటే.. హెచ్సీఏ మాత్రం మరింత వెనక్కి వెళుతుంది. పాలకుల అవినీతి పరాకాష్టకు చేరడమే హైదరాబాద్ క్రికెట్ దుస్థితికి ప్రధాన కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్కు టికెట్ల అమ్మకంపై జరిగిన రగడ హెచ్సీఏలోని అంతర్గత విబేధాలను మరోసారి బహిర్గతం చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ సహా మిగతా కార్యవర్గ సభ్యులు మధ్య తలెత్తిన విబేధాలతో ఆటను సరిగా పట్టించుకోవడం లేదని భావించిన సుప్రీం కోర్టు పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు జిస్టిస్ కక్రూ, డీజీపీ అంజనీ కుమార్, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్లతో తాత్కాలిక కమిటీని నియమించింది. అయినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా హెచ్సీఏ పరిస్థితి ఉంది. పైగా వంకా ప్రతాప్ కమిటీ బాధ్యతల్లోనే గాకుండా జట్టు సెలక్షన్ కమిటీలోనూ వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హెచ్సీఏ అకాడమీ డైరెక్టర్గా వంకా ప్రతాప్ నెలకు రూ. 3 లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికి.. పర్యవేక్షక కమిటీకి హాజరైనందున తనకు రూ. 5.25 లక్షలు ఇవ్వాలని హెచ్సీఏకు విజ్ఞప్తి చేశాడు. తన స్వప్రయోజనాల కోసం హెచ్సీఏను వంకా ప్రతాప్ భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ఆటగాళ్లు పరిపాలకులుగా ఉంటే హెచ్సీఏ కాస్త గాడిన పడుతుందని భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు సగటు క్రికెట్ అభిమానులను ఆవేదన కలిగించాయి. ఇంత జరుగుతున్నా బీసీసీఐ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది. త్వరలో హెచ్సీఏ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని కొంతమంది హెచ్సీఏ ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కథ కంచికి చేరింది. సుప్రీంకోర్టు హెచ్సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై ఏకసభ్య కమిటీ హెచ్సీఏ వ్యవహారలన్నీ చూసుకుంటుందని సుప్రీం పేర్కొంది. చదవండి: అజారుద్దీన్కు చుక్కెదురు.. హెచ్సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
అజారుద్దీన్కు చుక్కెదురు.. హెచ్సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్ నేతృత్వం వహిస్తున్న హెచ్సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హెచ్సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ అంబుడ్స్మెన్గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్సీఏకు సుప్రీం ఆదేశించింది. -
దీపక్ చహర్ భార్యకు బెదిరింపులు
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ఆల్రౌండర్గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
హైదరాబాద్లో కివీస్తో మ్యాచ్.. ఆ కిక్కే వేరు.. టీమిండియాదే పైచేయి! ఈసారి..
India vs New Zealand, 1st ODI - Hyderabad- Head To Head Records: అనగనగా భారత్, కివీస్... క్రికెట్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ మజానే వేరు. అదీ భాగ్యనగరంలో అయితే మరింత కిక్కే కిక్కు.... వీటి మధ్య ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. అన్నింటా భారత్దే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ జరిగిన పోటీల్లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చిరస్మరణీయమైన గుర్తులకు హైదరాబాద్ వేదిక అయింది. పాలిఉమ్రిగర్ నుంచి మొదలుకుంటే విజయ్ మంజ్రేకర్, ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, ఆబిద్ అలీ, అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, అర్షద్ అయూబ్ , నరేంద్ర హిర్వాణీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ,కోహ్లి , పుజారా, అశ్విన్... రిచర్డ్ హ్యాడ్లీ, మార్క్ గ్రేట్ బ్యాచ్, జాన్రైట్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియఅమ్సన్.. ఇలా ఎందరో టాప్మోస్ట్ ఆటగాళ్లు తమ ఆటతో హైదరాబాద్ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ సైతం భాగ్యనగర ప్రేక్షకులను అలరించనుంది. స్టార్ ప్లేయర్లతో ఇండియా, కివీస్ జట్లు బరిలో దిగనున్నాయి. హైదరాబాదీస్.. లెట్స్ ఎంజాయ్ స్టేడియంలో భారత ఆటగాళ్లు సాక్షి క్రీడా విభాగం: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భాగ్యనగరంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1955లో తొలిపోరు జరిగింది. చివరిసారి ఈ రెండు జట్లు 2012లో ఇక్కడ తలపడ్డాయి. 1955 నుంచి 2012 మధ్య కాలంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్లో (ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం) ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. ఐదు టెస్టుల్లో భారత్ రెండు టెస్టుల్లో గెలిచి, మిగతా మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ఇక రెండు వన్డేల్లో భారత్నే విజయం వరించింది. తద్వారా హైదరాబాద్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇప్పటి వరకు ఓటమి రుచి చూడలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు భాగ్యనగరంలో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. 2012 తర్వాత మళ్లీ హైదరాబాద్లో అంతర్జాతీయ మ్యాచ్ కోసం అడుగుపెట్టిన న్యూజిలాండ్ నేడు ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్తో తొలి వన్డే ఆడనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన న్యూజిలాండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి వన్డే మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్రౌండర్ టిమ్ సౌతీ లేకుండానే భారత్తో వన్డే సిరీస్లో పోటీపడుతున్న న్యూజిలాండ్ తాత్కాలిక కెపె్టన్ టామ్ లాథమ్ సారథ్యంలో ఈసారైనా తమ రికార్డును మెరుగుపర్చుకుంటుందా లేక భారత్కు దాసోహమంటుందా అనే విషయం నేడు తేలిపోతుంది. పిచ్ను పరిశీలిస్తున్న రోహిత్, అజహర్ ఇప్పటి వరకు హైదరాబాద్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఇలా.. ►ఎప్పుడు: 1955, నవంబర్ 19– 24 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 498/4 డిక్లేర్డ్ (పాలీ ఉమ్రిగర్ 223, విజయ్ మంజ్రేకర్ 118, కృపాల్ సింగ్ 100 నాటౌట్); న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్ (జాన్ గయ్ 102, సుభాష్ గుప్తే 7/128); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 212/2 (బెట్ సట్క్లిఫ్ 137 నాటౌట్). ► ఎప్పుడు: 1969, అక్టోబర్ 15–20 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్ (బ్రూస్ ముర్రే 81, ఎరాపల్లి ప్రసన్న 5/51), భారత్ తొలి ఇన్నింగ్స్: 89 ఆలౌట్ (వెంకట్రాఘవన్ 25 నాటౌట్, బిషన్ సింగ్ బేడీ 20, డేల్ హ్యాడ్లీ 4/30, బాబ్ కునిస్ 3/12), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 175/8 డిక్లేర్డ్ (డౌలింగ్ 60, సయ్యద్ ఆబిద్ అలీ 3/47, ప్రసన్న 3/58), భారత్ రెండో ఇన్నింగ్స్: 76/7 (భారత విజయ లక్ష్యం 268). ►ఎప్పుడు: 1988, డిసెంబర్ 2–6 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ 10 వికెట్లతో విజయం సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 254 ఆలౌట్ (మార్క్గ్రేట్బ్యాచ్ 90 నాటౌట్, ఇయాన్ స్మిత్ 79, అర్షద్ అయూబ్ 4/55, సంజీవ్ శర్మ 3/37), భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (కృష్ణమాచారి శ్రీకాంత్ 69, అజహరుద్దీన్ 81, కపిల్ దేవ్ 40, మార్టిన్ స్నెడెన్ 4/69), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124 ఆలౌట్ (జాన్ రైట్ 62, రిచర్డ్ హ్యాడ్లీ 31, కపిల్ దేవ్ 3/21, అర్షద్ అయూబ్ 3/36, నరేంద్ర హిర్వాణీ 3/43), భారత్ రెండో ఇన్నింగ్స్: 22/0 (భారత విజయ లక్ష్యం 21). న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రాక్టీస్ ►ఎప్పుడు: 2010, నవంబర్ 12–16 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 350 ఆలౌట్ (టిమ్ మెకింటోష్ 102, మార్టిన్ గప్టిల్ 85, జెస్సీ రైడర్ 70, జహీర్ ఖాన్ 4/69, హర్భజన్ సింగ్ 4/76), భారత్ తొలి ఇన్నింగ్స్: 472 ఆలౌట్ (వీరేంద్ర సెహ్వాగ్ 96, గౌతమ్ గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, హర్భజన్ సింగ్ 111 నాటౌట్, డానియల్ వెటోరి 5/135), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 448/8 డిక్లేర్డ్ (బ్రెండన్ మెకల్లమ్ 225, కేన్ విలియమ్సన్ 69, శ్రీశాంత్ 3/121, సురేశ్ రైనా 2/38), భారత్ రెండో ఇన్నింగ్స్: 68/0 (భారత విజయ లక్ష్యం 327). ►ఎప్పుడు: 2012, ఆగస్టు 23–26 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (చతేశ్వర్ పుజారా 159, విరాట్ కోహ్లి 58, ఎమ్మెస్ ధోని 73, జీతన్ పటేల్ 4/100), న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 6/31, ప్రజ్ఞాన్ ఓజా 3/44), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 164 ఆలౌట్ (కేన్ విలియమ్సన్ 52, రవిచంద్రన్ అశ్విన్ 6/54, ప్రజ్ఞాన్ ఓజా 3/48). మరుపురాని వన్డే మ్యాచ్ ఎప్పుడు: 1999, నవంబర్ 8 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 174 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 376/2 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 186 నాటౌట్, రాహుల్ ద్రవిడ్ 153), న్యూజిలాండ్: 202 ఆలౌట్ (33.1 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 43, వెంకటేశ్ ప్రసాద్ 2/38, అనిల్ కుంబ్లే 2/39). సచిన్, సెహ్వాగ్ల వీర విహారం ఎప్పుడు: 2003, నవంబర్ 15 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 145 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 353/5 (50 ఓవర్లలో) (వీరేంద్ర సెహ్వాగ్ 130, సచిన్ టెండూల్కర్ 102, రాహుల్ ద్రవిడ్ 50 నాటౌట్), న్యూజిలాండ్: 208 ఆలౌట్ (47 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 54, జహీర్ ఖాన్ 3/30, అజిత్ అగార్కర్ 2/28, అనిల్ కుంబ్లే 2/36, మురళీ కార్తీక్ 2/38). ఉప్పల్లో భారత్ ఇలా.. 2005 నుంచి 2022 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు వివిధ జట్లతో అన్ని ఫార్మాట్లలో కలిపి 13 మ్యాచ్లు (6 వన్డేలు, 5 టెస్టులు, 3 టి20) ఆడింది. 9 మ్యాచ్ల్లో (4 టెస్టులు, 3 వన్డేలు, 2 టి20) గెలుపొంది, 3 మ్యాచ్ల్లో (వన్డేలు) ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’ (టెస్ట్) అయింది. -
హెచ్సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో (హెచ్సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
అజహరుద్దీన్ నిర్ణయాలను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా మొహమ్మద్ అజహరుద్దీన్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేయాలని సూపర్వైజరీ కమిటీ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ (రిటైర్డ్) ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు తన నివేదిక అందించారు. దీని ప్రకారం కార్యదర్శి విజయానంద్ పదవితో పాటు అడ్హాక్ కమిటీ కూడా రద్దయినట్లే. సెప్టెంబర్ 30తోనే అజహర్ పదవీకాలం ముగిసిందని, ఆపై ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి విలువా లేదని కక్రూ పేర్కొన్నారు. ఆయన నివేదిక ప్రకారం సెలక్టర్లు, కోచ్ల ఎంపిక, ఇతర నియామకాలేవీ చెల్లవు. సూపర్వైజరీ కమిటీ పర్యవేక్షణలోనే కొత్త సెలక్టర్లను కూడా ఎంపిక చేయాలని కక్రూ సూచించారు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రెసిడెంట్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజహార్ తండ్రి మహ్మద్ యూసఫ్ ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. యూసఫ్.. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
అజహారుద్దీన్పై సీపీకి ఫిర్యాదు.. ‘తప్పుడు ధ్రువపత్రాలతో..’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ వేదికగా సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి హెచ్సీఏపై వివిధ అంశాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్ పదవీకాలానికి సంబంధించి మరో కేసు నమోదైంది. హెచ్సీఏ అధ్యక్షుడిగా అజహారుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే ముగిసినప్పటికీ.. అతను తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు బృందం రాచకొండ సీపీ మహేష్ భగవత్కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు లిఖితపూర్వరంగా సీపీకి కంప్లైంట్ను అందజేశారు. పదవీకాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్కు హాజరు అయ్యేందుకు అజహారుద్దీన్ తన పదవీకాలాన్ని పొడిగించుకున్నాడని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని సీపీకి కంప్లైంట్ చేశారు. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు
-
Ind Vs Aus: ఫ్యాన్స్ అరుపులు, కేకలతో హోరెత్తిన స్టేడియం.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ!
Ind vs Aus 3rd T20- Hyderabad Uppal- సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: క్రికెట్ ఫీవర్కు నగరం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఆదివారం ఓ వైపు బతుకమ్మ సంబురాలు మొదలవగా.. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ సంబరం ఊపేసింది. ఉరిమే ఉత్సాహంతో అభిమానులు మధ్యాహ్నం నుంచే స్టేడియానికి బారులు తీరారు. స్టేడియం వెలుపల తమ బుగ్గలకు త్రివర్ణాలను వేయించుకున్నారు. చేతుల్లో జెండాలతో సందడి చేశారు. జింఖానా తొక్కిసలాట నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ), రాచకొండ పోలీస్ కమిషనరేట్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ, చెకింగ్ పాయింట్ల వద్ద కాస్త నిరీక్షణ మినహా మిగతా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు, అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇక సూర్యాస్తమయానికి ముందే స్టేడియం దాదాపుగా నిండిపోయింది. అభిమానుల కోలాహలం, చప్పట్లు, అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పటికీ ప్రేక్షకులంతా క్రీడాస్ఫూర్తి చాటారు. ఆటగాళ్లను హుషారెత్తించారు. ప్రతి బౌండరీకి, సిక్సర్కు మైదానం దద్దరిల్లిపోయింది. మొత్తానికి మ్యాచ్ను ఫలితంతో సంబంధం లేకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించారు. గంటల తరబడి ఎదురుచూపులు క్రికెటర్లను చూడటానికి అభిమానులు ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచే నిలబడ్డారు. ఎన్జీఆర్ గేట్–1నుంచి ఉప్పల్ స్టేడియం వద్దకు దాదాపు కిలో మీటరు పొడవునా రోడ్డుపై నిలబడి వేచి చూశారు. స్టేడియానికి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏక్ మినార్ వద్దకు క్రికెటర్లు బస్సులో చేరుకున్నారు. బస్సు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ అభివాదం చేస్తూ ఆల్ది బెస్ట్ చెప్పారు. జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా నడించింది. కొందరు యువకులు స్టేడియం పరిసరాల్లో రూ.850 టికెట్ను దాదాపు రూ.11000 వరకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు టికెట్లు విక్రయించే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆరు టికెట్లు, రెండు సెల్ఫోన్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పజెప్పారు. గతంలో అభిమానులకు టాయిలెట్ సౌకర్యం ఉండేదికాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ అధికారులు దాదాపు ఎనిమిది మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు. భారీ సంఖ్యలో విదేశీయులు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీయులు కూడా భారీ సంఖ్యలో రోడ్లపై కనిపించారు. కొందరు యువకులు వారితో సెల్ఫీలు దిగారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు వివిధ రకాల వేషధారణలతో తరలి వచ్చారు. మరి కొందరు అభిమాన క్రికెటర్ల బొమ్మలున్న టీ షర్టులు ధరించారు. మెట్రో అదనపు ట్రిప్పులు నడపడంతో అందుబాటులో ఉన్న పీఐపీలు కూడా మెట్రో సర్వీస్ను వాడుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా స్టేడియం స్టేషన్ వద్ద వరద లాగా క్రీడాభిమానులు మెట్రో రైలు నుంచి కిందకు దిగడం కనిపించింది. స్టేడియం ప్రాంగణంలో ఆకట్టుకున్న బతుకమ్మ క్రికెట్ స్టేడియం పరిసరాల్లో గేటు నంబర్ – 4 వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేశారు. విదేశీయులు బతుకమ్మలను ఆసక్తిగా తిలకించారు. అంతా గందరగోళం.. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే స్డేడియం వద్దకు పంపుతామన్న పోలీసులు.. అలాంటిదేమీ లేకుండా అందరినీ స్టేడియం గేట్ల వద్దకు పంపడంతో వేలాది మంది క్రికెట్ స్టేడియం ప్రాంగణంలోకి వచ్చారు. ఏక్ మినార్ మజీద్ వద్ద, రామంతాపూర్ నుంచి వచ్చే వారిని ఎల్జీ గోడాన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడుల వద్ద టికెట్లను చెక్ చేయలేదు. దీంతో అందరినీ స్టేడియం వద్దకు పడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. టికెట్ లేని వేలాది అభిమానులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు. దీంతో లోనికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాయపడిన వారితో స్టేడియానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 22న జింఖానాలో టికెట్ క్యూ లైన్లలో తొక్కిసలాట, తదనంతరం లాఠీచార్జిలో గాయపడిన వారిని క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక వాహనంలో ఉచితంగా మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ తీసుకొచ్చారు. ముందుగా రవీంద్రభారతిలో బాధితులను పలకరించిన ఆయన మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వారందరినీ స్వయంగా పోలీసు మినీ బస్సులో ఎక్కించిమరీ స్టేడియం వరకు వెంట వచ్చారు. చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు -
Sakshi Cartoon 24-09-2022
-
ఆన్లైన్ బుకింగ్ చేసినవాళ్లకే జింఖానాలోకి ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇవ్వాలని హెస్సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక హెచ్సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది. అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు. ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? -
భారత్- ఆసీస్ ఉప్పల్ మ్యాచ్.. టికెట్లు అయిపోయాయి : హెచ్సీఏ ప్రకటన
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium- Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉప్పల్ స్టేడియం చుట్టూ.. జింఖానా గ్రౌండ్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రూ. 1200 టికెట్ను బ్లాక్లో 20 వేలకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి ప్రాణాలకు మీదకు తెచ్చుకుని మరీ క్యూలో నిల్చుని ఉంటే ఆఖరికి టికెట్ల అయిపోయాయని ప్రకటించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి గందరగోళమే! సెప్టెంబరు 25న ఉప్పల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మూడో టీ20 జరుగనుంది. ఇందుకు సంబంధించి టికెట్లు ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పినప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్లో అవి అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఆఫ్లైన్లో టికెట్లను విక్రయించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గురువారం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. టికెట్ల కోసం క్యూలో నిల్చున్న మహిళలు, యువతులు ఇబ్బంది పడ్డారు. ఇంత కష్టపడ్డా చాలా మందికి టికెట్లు దొరకలేదు. టికెట్లు అయిపోయాయని ప్రకటించిన హెచ్సీఏ.. జింఖానా గ్రౌండ్స్లో టికెట్ల అమ్మకాన్ని నిలిపివేసింది. క్యూలైన్లో ఉన్నవాళ్లను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు... జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై హెచ్సీఏను వివరణ కోరింది. క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్ష చేపట్టారు. కాగా మిగతా టికెట్లు ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్సీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే! -
హెచ్సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
Ind Vs Aus: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి.. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది!
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాటపై స్పోర్ట్స్ అనలిస్ట్ మలపాక వెంకట్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అన్నారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ... ‘‘మూడేళ్ల తర్వాత మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. కానీ ఇటు ప్రేక్షకులు గానీ.. అటు హెచ్సీఏ గానీ.. ఏదైనా దుర్ఘటన జరిగితే బీసీసీఐ మళ్లీ పదేళ్ల దాకా ఇక్కడ మ్యాచ్ నిర్వహించదు అన్న విషయం గురించి ఆలోచించలేకపోయారు’’ అని వాపోయారు. అది తొందరపాటు చర్యే! ఇక టిక్కెట్ల అమ్మకం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఖరి గురించి చెబుతూ.. ‘‘హెచ్సీఏ ఎలక్షన్ సమయంలో ఓటింగ్కు కేవలం 222 మంది వచ్చినపుడే.. వారం ముందు నుంచీ రెక్కీ చేసేవాళ్లం. క్యూలో ఎలా నిలబడాలి? అన్న అంశం గురించి జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసుకునేవాళ్లం. నిజానికి మ్యాచ్ ఉందంటే.. జనాలు పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదనడం తొందరపాటు చర్యే అవుతుంది. మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! తప్పకుండా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారని తెలుసు. అయినా ఇలా జరగడం దురదృష్టకరం’’ అని మలపాక వెంకట్ పేర్కొన్నారు. మ్యాచ్ను మొత్తంగా బాయ్కాట్ చేస్తే అప్పుడే పరిస్థితి తీవ్రత ఏమిటో నిర్వాహకులకు అర్థమవుతుందన్నారు. వానను కూడా లెక్కచేయక చాలా మంది క్యూలో నిల్చుని ఉన్నారన్న ఆయన.. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరిగితే అప్పుడు నిర్వాహకులకు తెలిసివస్తుందన్నారు. ఇక టిక్కెట్ల విషయంలో స్కామ్ జరిగిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదన్నారు మలపాక వెంకట్. అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి ఒకవేళ జరగరాని ఘటన జరిగితే హైదరాబాద్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట తర్వాత స్పందించే బదులు.. రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రి ఏర్పాట్ల గురించి ముందే ఆలోచించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మూడో టీ20 జరుగనుంది. ఇక ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లను మాత్రమే హెచ్సీఏ అందుబాటులో ఉంచింది. వీటి కోసం పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్కు వెళ్లిన అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: Ind A vs NZ A 1st ODI: అదరగొట్టిన శార్దూల్, కుల్దీప్ సేన్.. 167 పరుగులకే కివీస్ ఆలౌట్ -
హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్లైన్లోకి ఎందుకెళ్లారు?. హెచ్సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ‘ఆఫ్లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉప్పల్లో మూడో టీ20.. హెచ్సీఏకు క్రీడామంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివరాలతో సహా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టేడియం కట్టారన్నది గుర్తుంచుకోవాలన్నారు. పది మంది ఎంజాయ్ చేయడానికి, బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. హెచ్సీఏ మ్యాచ్కు సంబంధించి టికెట్స్ అన్నింటిని సేల్ చేయాలని ఆదేశించారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబరు 25న(ఆదివారం) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: (స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు) -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్సీఏలో టికెట్ల రగడ
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్య వైఖరిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ– 20 క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. స్టేడియానికి నిత్యం వచ్చిపోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇక్కడ లభించవు జింఖానా గ్రౌండ్లో ఇస్తారని చెప్పి పంపిస్తున్నారు. అక్కడికి వెళితే ఉప్పల్ స్టేడియం వద్దే ఇస్తారంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా అక్కడికీ.. ఇక్కడికీ తిప్పించుకోవడమే తప్ప టికెట్లు మాత్రం ఇవ్వడంలేదని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టికెట్లు విక్రయించకుండా తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అరగంటలోనే అమ్ముడుపోయాయట.. ►టికెట్ల విక్రయం కోసం ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెబుతున్నప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్లో అవి అందుబాటులో లేకపోవడంతో హెచ్సీఏ పరువు దిగజార్చుకుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయినా ఆఫ్లైన్లో అవి లభిస్తాయనే ఆశతో అభిమానులు ఉప్పల్ స్టేడియం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ►ఉప్పల్, రామంతాపూర్, నాచారం, సికింద్రాబాద్, అంబర్పేట, మెహిదీపట్నం, యాదగిరి గుట్ట, ఘట్కేసర్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉదయం నుంచే స్టేడియం గేటు వద్ద తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ఒకానొక దశలో గేట్ దూకి వెళ్లడానికి ప్రయత్నించి.. పోలీసులు అడ్డుకోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. టికెట్లు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానం రాక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్ వద్ద గందరగోళం.. గేటుకు తాళం.. రసూల్పుర: క్రికెట్ మ్యాచ్ టికెట్లు ఇస్తున్నారనే వదంతులతో మంగళవారం సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్ వద్దకు వేలాది మంది క్రీడాభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మైదానం గేటుకు తాళం వేశారు. ఆగ్రహానికి గురైన అభిమానులు గోడ దూకి లోనికి వెళ్లారు. దీంతో సిబ్బంది లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వెళ్లిపోయారు. దీంతో జింఖానా మైదానం పరిసర రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ ఉన్న కొందరు అభిమానులను పంపించివేశారు. గేట్ తీసే వరకు కదిలేది లేదని.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 14 నుంచి టికెట్ల కోసం జింఖానా మైదానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, ఇప్పటికే అవి అమ్ముడుపోయాయని సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. జింఖానా మైదానంలో టికెట్లు ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పడం లేదని విరుచుకుపడ్డారు. చదవండి: మ్యాచ్కు హాజరైన యువరాజ్.. కోహ్లితో మాటామంతీ Situation at hyderabad gymkhana grounds for australia vs india match tickets. #hca #cricket #india #t20 pic.twitter.com/a6FZLy6IuM — Poley_Adiripoley (@poleyadiripoley) September 21, 2022 -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మళ్ళీ రచ్చకెక్కిన విభేదాలు
-
IPL 2022: హైదరాబాద్ మాజీ క్రికెటర్కు బంపర్ ఆఫర్
ఈనెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆరుగురు రిఫరీల ప్యానెల్లో హైదరాబాద్ మాజీ రంజీ ఆటగాడు డేనియల్ మనోహర్కు చోటు దక్కింది. ఈ ప్యానెల్లో మనోహర్.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్తో కలిసి పని చేయనున్నాడు. మనోహర్.. ఐపీఎల్లో రిఫరీగా వ్యవహరించబోయే తొలి హైదరాబాదీగా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. గతంలో శివరాం, షంషుద్దీన్, నంద కిషోర్లు ఐపీఎల్లో హైదరాబాద్ నుంచి అంపైర్లుగా వ్యవహరించారు. మనోహర్.. 73 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 4009 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 65 వికెట్లు పడగొట్టాడు. 2007-08 సీజన్ అనంతరం అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 48 ఏళ్ల మనోహర్ భారత ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. చదవండి: Maxwell: ప్రత్యర్ధులు బహు పరాక్.. కెప్టెన్సీ భారం లేని కోహ్లి ఉప్పెనలా విరుచుకుపడతాడు.. -
Noel David: దయనీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్.. భరోసా కల్పించిన హెచ్సీఏ
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ ఆల్రౌండర్ నోయెల్ డేవిడ్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా నోయెల్ ఆరోగ్యం గురించి వైద్యుల వద్ద ఆరా తీసిన అజహార్.. నోయెల్ కిడ్నీ ఆపరేషన్కు అయ్యే ఖర్చునంతా హెచ్సీఏనే భరిస్తుందని భరోసా ఇచ్చాడు. Team India player was suffering in hospital for years, now Mohammad Azharuddin came forward to help, career was over after 4 matches! https://t.co/zucux7ioUR — News NCR (@NewsNCR2) February 28, 2022 అలాగే నోయెల్కు వ్యక్తిగత ఆర్ధిక సాయాన్ని కూడా చేస్తామని అజహార్ హామీ ఇచ్చాడు. ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన 51 ఏళ్ల నోయెల్.. 1997లో వెస్టిండీస్లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా తరఫున 1997లో నాలుగు వన్డేలు ఆడిన నోయెల్.. బ్యాటింగ్లో తన సామర్ధ్యానికి తగ్గ ప్రదర్శన చేయనప్పటికీ, బౌలంగ్లో పర్వాలేదనిపించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్ -
షేక్ రషీద్కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్లో భారత జట్టుకు స్టాండ్బై ప్లేయర్గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్/సనత్నగర్: హెచ్సీఏ నుంచి సస్పెండ్ అయిన కొంత మంది సభ్యులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజారుద్దీన్ గురువారం బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ మనోన్, విజయానంద్, నరేష్ శర్మలు జింఖానా గ్రౌండ్లోని హెచ్సీఏ కార్యాలయానికి వచ్చిఅక్కడ ఉండే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని బేగంపేట ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Rishi Dhawan: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..? -
హెచ్సీఏ అండర్–16 టోర్నీ విజేత గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–16 స్కూల్, కాలేజీ టోర్నమెంట్లో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో గౌతమ్ కాలేజి 71 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ జట్టుపై గెలిచింది. తొలుత గౌతమ్ కాలేజి 50 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి (74 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. బిడిగుల బాలాజీ (46; 5 ఫోర్లు), రిషభ్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ వఫీ కచ్చి (119 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. గౌతమ్ కాలేజీ బౌలర్లలో బాలాజీ మూడు, రుతీష్ రెడ్డి రెండు, రవికుమార్ రెండు వికెట్లు తీశారు. గౌతమ్ కాలేజి జట్టు లెగ్ స్పిన్నర్ డి.మనీశ్ ఓవరాల్గా 14 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు. -
హెచ్సీఏ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తాం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం మాజీ క్రీడాకారులు, న్యాయమూర్తుల పేర్లు ప్రతిపాదించాలని పిటిషనర్లకు సూచించింది. హెచ్సీఏ అంబుడ్స్మెన్ జస్టిస్ దీపక్వర్మ నియామకంపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్సీఏ , బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్లు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. -
సుప్రీంకోర్టు: హెచ్సీఏ రోజువారీ కార్యకలాపాలకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కారణంగా రోజూవారీ క్రికెట్ వ్యవహారాలకు అంతరాయం కలిగించవద్దని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఇకపై ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చెక్లపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్ సంయుక్తంగా సంతకాలు చేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన బెంచ్ చెక్ల విషయంలో ఈ తాత్కాలిక ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను దీపావళి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ..
World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్ ఉడ్తో తయారు చేసిన ఈ బ్యాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు విషెస్ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్ను ట్యాంక్ బండ్పై ఉంచారు. ఈ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే -
హైదరాబాద్ మహిళల వన్డే క్రికెట్ జట్టు ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 27 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు డి. రమ్య కెప్టెన్గా వ్యవహరించనుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తెలిపింది. జట్టులో ఐదుగురు స్టాండ్బైగా ఉన్నారు. బెంగళూరులో శనివారం నుంచి ఈ టోర్నీ మొదలయింది. టీమ్ ఇదే.. డి. రమ్య (కెప్టెన్), ప్రణవి చంద్ర (వైస్ కెప్టెన్), అనూరాధ నాయక్, ఎం.మమత (వికెట్ కీపర్లు), కీర్తి రెడ్డి, కె.అనిత, జి.త్రిష, యశశ్రీ, త్రిషా పూజిత, బి.శ్రావణి, బి.అంజలి, తెహ్నియాత్ ఫాతిమా, పి.పార్వతి, సాయిలేహ, క్రాంతి రెడ్డి, ప్రణతి రెడ్డి, వంకా పూజ, కోడూరి ఇషిత, ఆలపాటి ప్రణతి, పూజాశ్రీ, ఆశ్రిత రెడ్డి, సి.ఎస్.సాధ్వి. స్టాండ్బై: ఎం.అనిత, జి.కె.శ్రావ్య, టి.చందన, శివాని గౌడ్, మెర్లిన్ జాన్. విద్యుత్ జైసింహ (కోచ్), హర్ష హరినారాయణ (అసిస్టెంట్ కోచ్), స్రవంతి నాయుడు (ఫీల్డింగ్ కోచ్), గజానంద్ రెడ్డి, సునీతా ఆనంద్ (ట్రైనర్), హర్ష గంగ్వాల్ (ఫిజియో), మానస (మేనేజర్). -
‘హెచ్సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్సీఏ అంబుడ్స్మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్సీఏ, బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
హెచ్సీఏ వివాదం: హైకోర్టులో అజారుద్దీన్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్, జస్టిస్ దీపక్ వర్మ జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్రావు, జస్టిస్ కె.లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం విచారించింది. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు కె.జాన్ మనోజ్తోపాటు పలువురు ఎగ్జిక్యూటివ్ సభ్యులను సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ వర్మ గత నెల జూలై 4న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ షమీమ్ అఖ్తర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో అప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అజారుద్దీన్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. -
స్పోర్ట్స్మెన్గా అజహార్కు మర్యాదిస్తాం.. అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తూ అంబుడ్స్మెన్ జస్టిస్ దీపక్వర్మ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ఇతర కౌన్సిల్ సభ్యులు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ను తిరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్మన్కు అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేసే అధికారం లేదని కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ పేర్కొన్నారు. అంబుడ్స్మెన్ ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించామని, దానిపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్మెన్గా అజహార్కు రెస్పెక్ట్ ఇస్తాం.. కానీ, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదని చురకలంటించారు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్కు అజహార్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అసోసియేషన్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అంబుడ్స్మెన్గా దీపక్వర్మ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. అతన్ని అంబుడ్స్మెన్గా తాము ఎన్నికొలేదని పేర్కొన్నారు. ఏప్రిల్లో జరిగిన ఏజీఎమ్ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్ నిస్సార్ అహ్మద్ ఖక్రూను అంబుడ్స్మన్గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ నెల 18న అజహార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్పై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ స్పోర్ట్స్ రూంను లాక్ చేశారని, రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై రేపు లీగ్స్ ప్రారంభించడానికి వచ్చే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్గౌడ్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడిందని తెలిపారు. -
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హెటెన్షన్
-
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్మీట్కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు అంబుడ్స్మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్మన్గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్వర్మకు లేదని పేర్కొంది. దీపక్వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
HCA లో కీలకపరిణామం అపెక్స్ కౌన్సిల్ రద్దు
-
హెచ్సీఏలో కొత్త ట్విస్ట్; అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేసిన అంబుడ్స్మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్మన్ తెలిపింది. కాగా ఇటీవలే హెచ్సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అజహర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్మన్ అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్మన్ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్మన్గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ముదురుతున్న వివాదం
-
హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్సీఏ ఇంకా గాడిన పడలేదు. చదవండి: అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు -
'వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్(హెచ్సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ను నాటకీయ పరిణామాల మధ్య తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అజారుద్దీన్ మాట్లాడుతూ.. 'ఉద్దేశపూర్వకంగానే నాకు నోటీసులు ఇచ్చారు. హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగేలా నేనెప్పుడూ పనిచేయలేదు. అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా?. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్మన్ను నియమిస్తే అడ్డుకున్నారు... వాళ్ల అవినీతి బయటపడుతుందనే నాపై కుట్రలు పన్నారు' అంటూ చెప్పుకొచ్చారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్పైనే హెచ్సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. చదవండి: అజహరుద్దీన్పై వేటు! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ట్విస్ట్
-
అజహరుద్దీన్పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్జీఎంలో కూడా హెచ్సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
కిరాణా కొట్టులా హెచ్సీఏ: తీవ్ర స్థాయికి వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రస్తుతం పరిస్థితులు సక్రమంగా లేవు. ఎన్నో వివాదాలతో హెచ్సీఏ సతమతమవుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. హెచ్సీఏ సీఈఓ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. హెచ్సీఏ సీఈఓగా సునీల్ కాంతేను నియమించినట్లు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. అయితే ఆ నియామాకం చెల్లదంటూ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ ఖండించాడు. నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఈఓ నియామకం చెల్లదంటూ వాదించారు. సభ్యుల తీరుతో హెచ్సీఏను ‘కిరాణా కొట్టులా మార్ఛారు’ అంటూ తీవ్రస్థాయిలో అజార్ ధ్వజమెత్తారు. ఈ విధంగా హెచ్సీఏ ప్రస్తుతం తీవ్ర విబేధాల మధ్య నడుస్తోంది. పాలకవర్గంలో తారస్థాయికి విబేధాలు జరుగుతున్నాయి. వీటితో హెచ్సీఏ చరిత్ర మసకబారుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం! చదవండి: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నా చేతుల్లో మంత్రదండం లేదు -
హెచ్సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది
-
ఐపీఎల్ మ్యాచ్: నా చేతుల్లో మంత్రదండం లేదు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2021 మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించే అవకాశం రాకపోవడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ వివరణ ఇచ్చారు. హెచ్సీఏ సీనియర్ సభ్యులు ఈ విషయంపై తనను తప్పుపట్టడంలో అర్థం లేదన్న అజహర్... చివరి వరకు తాను ప్రయత్నించానని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్ను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్లలో మాత్రమే నిర్వహించనున్నారు. ‘అజహర్ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్ కౌన్సిల్ వేదికలను ఖరారు చేశాయి. ఉప్పల్ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది’ అని అజహర్ వ్యాఖ్యానించారు. కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్ అన్నారు. ‘ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ అయినా తీసుకొచ్చారా’ అని ఆయన ప్రశ్నించారు. -
లీగ్ మ్యాచ్లు ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. లీగ్ మ్యాచ్లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్ కోటాలో తమ బ్యాంక్లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్ మ్యాచ్లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులను గుర్తించడానికి తాము లీగ్ మ్యాచ్లలో పాల్గొంటామని, ఈ మేరకు గతంలో హైకోర్టు ఆదేశించినా తమను లీగ్ మ్యాచ్లు ఆడనివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు.(చదవండి: ఓపెనర్గానే రోహిత్ శర్మ! ) ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి... హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని హెచ్సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇటీవలే యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే హెచ్సీఏ లీగ్లో ఆంధ్రా బ్యాంక్ పేరుతో ప్రత్యేక జట్టు ఉంది. అయితే యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తమను ప్రత్యేక జట్టుగా గుర్తించి మ్యాచ్ల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని హెచ్సీఏను కోరింది.