Hyderabad Cricket Association
-
హెచ్సీఏకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ షాక్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు కంటోన్మెంట్ బోర్డు అధికారులు షాక్ ఇచ్చారు. బోర్డుకు ఎలాంటి లీజు చెల్లించకుండానే సుమారు రూ.వెయ్యి కోట్ల విలువైన స్థలాన్ని 30 ఏళ్లుగా ఆక్రమించడాన్ని అధికారులు సీరియస్గా పరిగణించారు. తక్షణమే ఆ స్థలాన్ని ఖాళీ చేయడంతోపాటు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లోనే హెచ్సీఏ నుంచి స్థలం స్వాధీనానికి ఏర్పాట్లు చేస్తున్నామని బోర్డు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ జనరల్ ల్యాండ్ రికార్డ్స్(జీఎల్ఆర్) సర్వే నెంబర్ 713లోని 23 ఎకరాల సీ కేటగిరీకి చెందిన జింఖానా మైదానం (gymkhana ground) ఉంది. 1992లో ఈ స్థలంలోని 7.9 ఎకరాలను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(సాప్)కు, 5.71 ఎకరాల స్థలాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు లీజు కింద కేటాయించారు. మిగిలిన 9.59 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. 1996 ఫిబ్రవరి 23న కేంద్ర ప్రభుత్వం హెచ్సీఏ లీజును రద్దు చేసింది. అయితే ఆ స్థలాన్ని మాత్రం కేంద్రం స్వాధీనం చేసుకోలేదు. తిరిగి 2010లో సికింద్రాబాద్ సర్కిల్ డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీసర్ తన అధికార పరిధిని దాటి మరో ఏడు ఎకరాల స్థలాన్ని హెచ్సీఏకు లీజు కింద ఇచ్చారు. ఈ లీజు కూడా చెల్లదంటూ 2013లో రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.హెచ్సీఏ రక్షణ శాఖకు ఎలాంటి లీజు రుసుం చెల్లించకుండానే సుమారు 14 ఎకరాల స్థలాన్ని వినియోగించుకుంటోంది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన కంటోన్మెంట్ అధికారులు 2021లో తొలిసారిగా పబ్లిక్ ప్రిమిసెస్ (ఎవిక్షన్ ఆఫ్ అనాథరైజ్డ్ ఆక్యుపెంట్స్) యాక్ట్, 1971 ప్రకారం హెచ్సీఏకు నోటీసులు జారీ చేశారు. 5.71 ఎకరాల లీజుకు సంబంధించిన స్థలంపై తమకు అనుకూలంగా హైకోర్టు స్టే ఇచ్చినట్లు హెచ్సీఏ స్పందించింది. అయితే మిగిలిన 9.59 ఎకరాలకు మాత్రం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ కంటోన్మెంట్ అధికారులు పీపీ(ఈ) యాక్ట్ 1971, సెక్షన్ 4(1) ప్రకారం మరోసారి నోటీసు జారీ చేశారు.చదవండి: ఇక RRR వరకు హెచ్ఎండీ అనుమతులే!హెచ్సీఏ నుంచి స్పందన లేకపోవడంతో తాజాగా స్వాధీనానికి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. దాదాపు 30 ఏళ్లుగా హెచ్సీఏ తమ స్థలాన్ని కబ్జాలోకి తీసుకుని వినియోగించుకున్నందుకు రూ.100 కోట్ల పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ నోటీసు (Demand Notice) కూడా పంపారు. ఆక్రమిత స్థలంలోనే గ్రౌండ్.. లీజు ద్వారా పొందామని పేర్కొంటున్న హెచ్సీఏ జింఖానా మైదానంలోని 5.71 ఎకరాల స్థలాన్ని మాత్రం ఖాళీగానే ఉంచింది. మిగిలిన 9.59 ఎకరాల స్థలంలోనే హెచ్సీఏ (HCA) కార్యాలయ నిర్మాణంతోపాటు క్రికెట్ గ్రౌండ్, నెట్స్ వేశారు. ఈ మైదానంలోనే క్రీడాకారులు శిక్షణతోపాటు ప్రాక్టీస్ చేస్తుంటారు. -
HCA: నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) గత అపెక్స్ కౌన్సిల్ నిధుల గోల్మాల్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంట్రాక్టుల పేరుతో క్విడ్ ప్రో కో జరిగినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ మాజీ కోశాధికారి సురేందర్ అగర్వాల్పై పలు అభియోగాలు నమోదయ్యాయి.క్రికెట్ బాల్స్, బకెట్ చైర్స్, జిమ్ ఎక్విప్మెంట్ పేరుతో హెచ్సీఏ చేపట్టిన సబ్ కాంట్రాక్టుల విషయంలో.. సురేందర్ అగర్వాల్కు క్విడ్ ప్రో కో కింద మూడు కంపెనీలు 90 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అగర్వాల్తో పాటు అతడి కుటుంబ సభ్యుల ఖాతాలకు ఈ మొత్తాన్ని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.ఇందులో భాగంగా అగర్వాల్ భార్య, కొడుకు , కోడలు అకౌంట్లకు నగదు బదిలీ జరిగిందని.. సురేందర్ అగర్వాల్ భార్యకు చెందిన కేబీ జ్యువెలర్స్ ఖాతాకు ఈ మేర చెల్లింపులు జరిగాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ 90 లక్షల రూపాయలలో 51.29 లక్షల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
SRH: హైదరాబాదీలకు పండుగే.. సన్రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)-2025 నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం కొత్త హంగులతో సిద్ధం కానుంది. రెండు వారాల్లోపు పునరుద్ధరణ పనులు పూర్తి కానున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. అదే విధంగా సన్రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రాక్టీస్ సెషన్ తేదీని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగాకాగా గతేడాది ఐపీఎల్లో సన్రైజర్స్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడేళ్లుగా ఎదురైన వైఫల్యాలను అధిగమించి.. వరుస విజయాలతో ఫైనల్కు దూసుకువెళ్లింది. కమిన్స్ సారథ్యంలో.. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరుగా మారి రికార్డులు కొల్లగొట్టింది. అయితే, ఆఖరి పోరులో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైన రైజర్స్ రన్నరప్తో సరిపెట్టుకుంది.అయితే, టైటిల్ చేజారినా టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని ఆరెంజ్ ఆర్మీ మనసులు గెలుచుకుంది. ఇక ఈ ఏడాది సన్రైజర్స్ సరికొత్తగా అభిమానుల ముందుకు రానుంది. ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను రీటైన్ చేసుకున్న రైజర్స్ యాజమాన్యం.. హెన్రిచ్ క్లాసెన్(దక్షిణాఫ్రికా) కోసం అత్యధికంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది.కమిన్స్ సారథ్యంలోనేఅదే విధంగా ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా)ను రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మ(భారత్)ను రూ. 14 కోట్లు, ట్రావిస్ హెడ్(ఆస్ట్రేలియా)ను రూ. 14 కోట్లు, నితీశ్ రెడ్డి(భారత్)ని రూ. 6 కోట్లకు అట్టిపెట్టుకుంది. ఇక వేలంపాటలో భాగంగా టీమిండియా స్టార్లు ఇషాన్ కిషన్, మహ్మద్ షమీలను కొనుగోలు చేసిన సన్రైజర్స్ కమిన్స్ సారథ్యంలోనే తాము ఈసారీ బరిలోకి దిగుతామని ప్రకటించింది.ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ పద్దెమినిదవ సీజన్ మొదలుకానుంది. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్తో ఈ క్యాష్ రిచ్ లీగ్ 2025 ఎడిషన్కు తెరలేవనుంది. ఈ క్రమంలో మార్చి 23న సన్రైజర్స్ హైదరాబాద్ తమ సొంత మైదానం ఉప్పల్లో రాజస్తాన్తో తొలి మ్యాచ్ ఆడనుంది.హైదరాబాదీలకు పండుగే.. సన్రైజర్స్ ప్రాక్టీస్ ఆరోజే మొదలుఈ నేపథ్యంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పునరుద్ధరణ పనులు వేగవంతం చేశామని HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తాజాగా వెల్లడించారు. వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ఈసారి హైదరాబాద్ ప్రజలకు పండుగే. మనకు ఇక్కడ తొమ్మిది మ్యాచ్లు జరుగబోతున్నాయి.ప్రేక్షకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు రెనోవేషన్ చేస్తున్నాం. గతంలో అద్భుతమైన పిచ్లు రూపొందించినందుకు గానూ అవార్డు అందుకున్నాం. రానున్న పదిహేను రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తవుతాయి. ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు మైదానం సిద్ధమవుతుంది. మార్చి 2 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక్కడ ప్రాక్టీస్ మ్యాచ్లు మొదలుపెడుతుంది’’అని జగన్ మోహన్ రావు తెలిపారు.ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్👉మార్చి 23- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ (హైదరాబాద్)👉మార్చి 27 - సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ (హైదరాబాద్)👉మార్చి 30- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (వైజాగ్)👉ఏప్రిల్ 3- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (కోల్కతా)👉ఏప్రిల్ 6- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 12 - సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 17- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (ముంబై)👉ఏప్రిల్ 23- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ (హైదరాబాద్)👉ఏప్రిల్ 25- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ సీఎస్కే (చెన్నై)👉మే 2- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్)👉మే 5- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (హైదరాబాద్)👉మే 10- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కేకేఆర్ (హైదరాబాద్)👉మే 13- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఆర్సీబీ (బెంగళూరు)👉మే 18- సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ లక్నో (లక్నో)ఐపీఎల్ 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుఅథర్వ తైడే, అభినవ్ మనోహర్, అనికేత్ వర్మ, సచిన్ బేబి, ట్రవిస్ హెడ్, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, కమిందు మెండిస్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జీషన్ అన్సారీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, సిమ్రన్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, ఆడమ్ జంపా, జయదేశ్ ఉనాద్కట్, బ్రైడన్ కార్సే.చదవండి: ఆస్ట్రేలియానూ వదలకండి: అఫ్గనిస్తాన్ జట్టుపై పాక్ మాజీ క్రికెటర్ ప్రశంసలు #WATCH | Hyderabad, Telangana: Rajiv Gandhi International Cricket Stadium being renovated for upcoming IPL matchesJagan Mohan Rao, President, Hyderabad Cricket Association, says, " There is good news for Hyderabad people, this time we are getting 9 matches (of IPL)...for that… pic.twitter.com/qyQ3CKOd44— ANI (@ANI) February 27, 2025 -
దివ్యాంగుల క్రికెట్ టోర్నీని ప్రారంభించిన తిలక్ వర్మ
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్ను (Physically Diabled Cricket Tourney) భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మతో (Tilak Varma) కలిసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (Hyderabad Cricket Association) (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రారంభించారు. సోమవారం ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ... హెచ్సీఏ తరఫున దివ్యాంగ క్రికెటర్లను ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తాము మిగిలిన వారిలానే క్రికెట్ ఆడగలమని నిరూపించడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దివ్యాంగ క్రికెటర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. దివ్యాంగ క్రికెటర్ల కోసం కూడా ఐపీఎల్ తరహాలో ఒక లీగ్ను నిర్వహించే ఆలోచనను చేయాలని డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్కు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఏసీహెచ్ అధ్యక్షుడు సురేందర్ అగర్వాల్, హెచ్సీఏ మాజీ కార్యదర్శి జాన్ మనోజ్, మాజీ ఉపాధ్యక్షుడు మొయిజ్ పాల్గొన్నారు. -
ఆర్చర్కు అండగా హెచ్సీఏ చీఫ్.. ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వర్ధమాన ఆర్చర్ తానిపర్తి చికితకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్రావు(Jagan Mohan Rao) ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న చికిత ఆసియా జూనియర్ ఆర్చర్ కప్కు అర్హత సాధించింది. కోల్కతాలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్లో ఆకట్టుకొని ఆమె క్వాలిఫై అయింది.మున్ముందు ఆమె శిక్షణ, ఇతర సన్నాహాల మొత్తం రూ.10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్ను తన వ్యక్తిగత హోదాలో అందజేస్తానని జగన్మోహన్రావు ప్రకటించారు. రైతు కుటుంబం నుంచి వచ్చి క్రీడాకారిణిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న చికితకు అన్ని విధాలా సహకరిస్తామని ఆయన చెప్పారు. ముందుగా రూ.50 వేల చెక్ను అందించిన ఆయన ప్రతీ నెలా రూ.15 వేల చొప్పున తమ ‘అక్షర’ విద్యాసంస్థల తరఫున ఇస్తానని ప్రకటించారు. ఇది కూడా చదవండిదుబాయ్: భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకింది. ఇటీవల ఐర్లాండ్తో సొంతగడ్డపై జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో సత్తా చాటిన స్మృతి తాజా ర్యాంకింగ్స్లో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. ఐర్లాండ్తో సిరీస్లో ఒక సెంచరీ, ఒక అర్ధసెంచరీ సాయంతో 249 పరుగులు చేసిన స్మృతి 738 ర్యాంకింగ్ పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. ఈ సిరీస్లో స్మృతి కెప్టెన్గానూ ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికా స్టార్ లౌరా వాల్వర్ట్ (773 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక బ్యాటర్ చమరి అటపట్టు (733 పాయింట్లు) మూడో ర్యాంక్లో ఉంది. భారత జట్టు తరఫున స్మృతి మాత్రమే టాప్–10లో చోటు దక్కించుకుంది. ఐర్లాండ్తో సిరీస్కు దూరమైన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 15వ ర్యాంక్లో ఉండగా... కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేసుకున్న జెమీమా రోడ్రిగ్స్ రెండు స్థానాలు మెరుగు పరుచుకొని 17వ ర్యాంక్కు చేరింది. ఐర్లాండ్తో సిరీస్లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఓపెనర్ ప్రతీక రావల్ 12 స్థానాలు ఎగబాకి 53వ ర్యాంక్లో నిలిచింది. బౌలర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక స్థానం మెరుగు పరుచుకొని నాలుగో ర్యాంక్లో నిలిచింది. ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి 6వ స్థానంలో కొనసాగుతోంది. -
CT 2025: టీమిండియా మేనేజర్గా హెచ్సీఏ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కార్యదర్శి ఆర్. దేవ్రాజ్ మేనేజర్గా ఎంపికయ్యారు. వచ్చే నెల 19 నుంచి జరగనున్న ఈ టోర్నీలో రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు బరిలోకి దిగనుంది. పాకిస్తాన్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో టీమిండియా ఆడే మ్యాచ్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో నిర్వహించనున్నారు.ఇదో గొప్ప గౌరవం‘టీమిండియాకు నన్ను మేనేజర్గా నియమించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆఫీస్ బేరర్లకు ధన్యవాదాలు. చాలా కాలం తర్వాత భారత జట్టుకు మేనేజర్గా వ్యవహరించే అవకాశం హెచ్సీఏ అధికారికి లభించింది. ఇదో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని దేవ్రాజ్ అన్నారు. టీమిండియా మేనేజర్గా ఎంపికైన దేవ్రాజ్కు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతోపాటు ఇతర సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. అయితే, అంతకంటే ముందు రోహిత్ సేన సొంతగడ్డపై ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. ఇండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి. ఆ తర్వాత.. ఫిబ్రవరి 6, 9, 12 తేదీల్లో మూడు వన్డేలు నిర్వహిస్తారు. తద్వారా మెగా టోర్నికి ముందు ఇరుజట్లకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్మన్ గిల్(వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా(ఫిట్నెస్ ఆధారంగా) మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్.ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డిచాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు ఇవేగ్రూప్-‘ఎ’: ఇండియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికాగ్రూప్-‘బి’: ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా షెడ్యూల్ఫిబ్రవరి 20, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫిబ్రవరి 23, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ పాకిస్తాన్మార్చి 2, 2025 (దుబాయ్)- ఇండియా వర్సెస్ న్యూజిలాండ్రజతం నెగ్గిన జ్యోతి సురేఖ సాక్షి, హైదరాబాద్: ఇండోర్ వరల్డ్ కప్ సిరీస్లో భాగంగా ఫ్రాన్స్లో జరిగిన నిమెస్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ వెన్నం జ్యోతి సురేఖ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో విజయవాడకు చెందిన జ్యోతి సురేఖ 146–147తో అలెజాంద్రా ఉస్కియానో (కొలంబియా) చేతిలో ఓడిపోయింది. క్వాలిఫయింగ్లో జ్యోతి సురేఖ 600 పాయింట్లకుగాను 592 పాయింట్లు స్కోరు చేసి ఆరో స్థానంలో నిలిచింది. -
HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ముగింపు పలికింది. హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.ఈ మేరకు మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. విద్యుత్ బిల్లు పెండింగ్లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్ -
ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ మీడియా సమావేశం
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఇవాళ (ఏప్రిల్ 10) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, సెక్రెటరీ దేవ్ రాజ్, జాయింట్ సెక్రెటరీ బసవరాజు, ట్రెజరర్ సీజే శ్రీనివాస్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. ఇటీవల సన్రైజర్స్ ఐపీఎల్ మ్యాచ్కు ముందు తలెత్తిన పవర్ కట్ సమస్య, బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయం తదితర విషయాలపై వివరణ ఇచ్చారు. స్టేడియంకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై మాట్లాడుతూ..ఈ సమస్య ఇప్పటిది కాదని, 2015 నుంచి ఉందని తెలిపారు. తమ ప్యానెల్ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంతో మాట్లాడి విద్యుత్ బకాయిల విడతల వారీగా కడుతున్నామని, ఇప్పటికే మొదటి ఇన్స్టాల్మెంట్ కూడా చెల్లించామని చెప్పారు. బ్లాక్లో ఐపీఎల్ టికెట్ల విక్రయంపై మాట్లాడుతూ.. టికెట్ల విక్రయం అనేది పూర్తిగా సన్రైజర్స్కి సంబంధించిందని, ఈ విషయంలో తమకెలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్కు రెండు లక్షల టికెట్ల డిమాండ్ ఉందని.. స్టేడియం కెపాసిటీ కేవలం 38 వేలు మాత్రమేనని తెలిపారు. ఇదే సందర్భంగా జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. తమ ప్యానెల్ వచ్చాక టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించామని, ఐపీఎల్ మ్యాచ్లు కూడా సజావుగా నిర్వహిస్తున్నామని తెలిపారు.స్టేడియంలో కొత్తగా టీవీలు, ఏసీలు పెడుతున్నామని.. వాష్ రూమ్లు, లిఫ్ట్లు, లాంజ్లు రేనోవేట్ చేసామని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్కు సీఎంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు రావడంతో పార్కింగ్ సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి తమ ద్యేయమని.. ఏప్రిల్ 20 నుంచి అన్ని ఉమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాద్లో సమ్మర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నామని వెల్లడించారు. భవిషత్లో లక్ష సీటింగ్ కెపాసిటీ గల స్టేడియం నిర్మిస్తామని.. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపిందని అన్నారు. స్టేడియం లీజ్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడామని.. అందుకు సీఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. -
HCA: ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు ఇస్తాం!
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ చాంపియన్గా హైదరాబాద్ జట్టు అవతరించింది. ఉప్పల్ స్టేడియంలో మేఘాలయ జట్టుతో జరిగిన ఫైనల్లో తిలక్ వర్మ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 71/1తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ 34.2 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ తిలక్ వర్మ (64; 6 ఫోర్లు, 2 సిక్స్లు), రాహుల్ సింగ్ (62; 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా... రోహిత్ రాయుడు (34; 1 ఫోర్, 2 సిక్స్లు) కీలక పరుగులు సాధించాడు. తిలక్, రోహిత్ నాలుగో వికెట్కు 82 పరుగులు జోడించారు. అయితే విజయానికి 7 పరుగుల దూరంలో తిలక్, 5 పరుగుల దూరంలో రోహిత్ అవుటయ్యాడు. చివరకు ఆర్యన్ బౌలింగ్లో చందన్ సహానీ కొట్టిన భారీ సిక్సర్తో హైదరాబాద్ విజయం ఖాయమైంది. ఆరు జట్లున్న ప్లేట్ గ్రూప్లో లీగ్ దశలో ఐదు మ్యాచ్ల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లో గెలిచి హైదరాబాద్ అజేయంగా నిలిచింది. హైదరాబాద్తోపాటు రన్నరప్ మేఘాలయ జట్టు కూడా వచ్చే రంజీ ట్రోఫీ సీజన్లో అగ్రశ్రేణి జట్లు పోటీపడే ‘ఎలైట్’ డివిజన్కు అర్హత సాధించగా... ఈ సీజన్ ‘ఎలైట్’ డివిజన్లో పోటీపడ్డ 32 జట్లలో ఓవరాల్గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన గోవా, మణిపూర్ జట్లు వచ్చే సీజన్లో ‘ప్లేట్’ డివిజన్కు పడిపోయాయి. 2022–23 సీజన్లో ఎలైట్ గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ ఆడింది. 7 మ్యాచ్లలో తొలి మ్యాచ్ను తమిళనాడుతో ‘డ్రా’ చేసుకున్న టీమ్ ఆ తర్వాత వరుస ఆరు వరుస పరాజయాలతో (ముంబై, అస్సాం, ఆంధ్ర, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, ఢిల్లీ చేతుల్లో) నిష్క్రమించి ప్లేట్ డివిజన్కు పడిపోయింది. వచ్చే సీజన్లో హైదరాబాద్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో వేచి చూడాలి. ‘ఎలైట్’ రంజీ ట్రోఫీ గెలిస్తే బీఎండబ్ల్యూ కార్లు... ‘ప్లేట్’ డివిజన్లో విజేతగా నిలిచిన తమ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) 10 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ నితేశ్ రెడ్డి... సెంచరీ సాధించిన ప్రజ్ఞయ్ రెడ్డి... ‘ప్లేట్’ డివిజన్లో 56 వికెట్లతో టాపర్గా నిలిచిన బౌలర్ తనయ్ త్యాగరాజన్... కెప్టెన్ తిలక్ వర్మ... 7 మ్యాచ్ల్లో కలిపి 765 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచిన ఓపెనర్ తన్మయ్ అగర్వాల్లకు ప్రత్యేకంగా తలా రూ.50 వేల ప్రోత్సాహక బహుమతిని కూడా అందజేశారు. దీంతో పాటు వచ్చే సీజన్లో జట్టుకు ప్రేరణ అందించేందుకు హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు మరింత భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. రాబోయే మూడేళ్లలో సత్తా చాటి హైదరాబాద్ రంజీ ట్రోఫీ టైటిల్ సాధిస్తే జట్టుకు రూ. 1 కోటి నగదు బహుమతిని, దాంతోపాటు జట్టులోని ఒక్కొక్కరికి బీఎండబ్ల్యూ కార్లను అందజేస్తామని ఆయన తెలిపారు. -
HCA: అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా?
సాక్షి, హైదరాబాద్: ఆయన రాష్ట్ర సీనియర్ మహిళల క్రికెట్ జట్టు కోచ్... టీమ్తో పాటు మ్యాచ్ కోసం బస్సులో ప్రయాణిస్తున్నారు... ఎంతో బాధ్యతగా, హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి కట్టు తప్పారు. బస్సులోనే మద్యం బాటిల్ తీసి దర్జాగా సేవించారు. ఆపై ముందు సీట్లో దానిని పెట్టుకొని అదే కొనసాగించారు! ఈ వీడియో వెలుగులోకి రావడంతో వ్యవహారం బయటపడింది. హైదరాబాద్ మహిళల టీమ్కు హెడ్ కోచ్గా ఉన్న విద్యుత్ జైసింహ చేసిన నిర్వాకమిది. ఈ ఘటనపై హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వెంటనే స్పందించింది. జైసింహను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సస్పెన్షన్ వేటు పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడంతో పాటు విచారణ ముగిసే వరకు హైదరాబాద్ క్రికెట్కు సంబంధించిన ఎలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకోరాదని ఆదేశించింది. ఈ ఘటన ఎప్పటిదనే విషయంపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే.. బస్సులోకి ఆల్కహాల్ను ఎవరు తీసుకొచ్చారు, ఎలా అనుమతించారనే దానిపై కూడా విచారణ చేస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ప్రకటించారు. అంతా అబద్ధం.. అసలు కారణం ఇదే! అవునా? పాతతరం క్రికెట్ దిగ్గజం ఎంఎల్ జైసింహ కుమారుడైన విద్యుత్ గతంలో హెచ్సీఏలో వేర్వేరు బాధ్యతల్లో పని చేశారు. తండ్రి పేరుతోనే సికింద్రాబాద్లో చాలా ఏళ్లుగా ఒక ప్రైవేట్ క్రికెట్ అకాడమీని కూడా నిర్వహిస్తున్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను విద్యుత్ జైసింహ ఖండించారు. తానెప్పుడూ టీమ్ బస్సులోకి మద్యాన్ని తీసుకురాలేదని, తాగలేదని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు నిరాధారమని... ఒక హైదరాబాద్ మాజీ క్రికెటర్ కుమార్తెను జట్టులోకి ఎంపిక చేయకపోవడంతో ఉద్దేశపూర్వకంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జైసింహ వివరణ ఇచ్చారు. జై సింహా ప్రవర్తన గురించి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు అప్పట్లోనే లేఖ కోచ్ జై సింహా తాగుడుకు బానిసగా మారారని మహిళా క్రికెటర్లు ఆరోపించారు. తమ ముందు మద్యం తాగొద్దని పలుసార్లు వారించినా వినలేదని, ఇదేంటని ప్రశ్నిస్తే టీం నుంచి తీసేస్తానని బెదిరించారన్నారు. ఈ క్రమంలో.. మహిళా క్రికెటర్ల తల్లిదండ్రులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు.. గత జనవరిలో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు జనవరిలో లేఖ కూడా రాశారు. -
HCA: మహిళా క్రికెట్ హెడ్కోచ్పై వేటు
మహిళా క్రికెట్ హెడ్ కోచ్ జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు అతడిని సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు. కాగా విజయవాడలో మ్యాచ్ ముగించుకుని హైదరాబాద్కు తిరిగి వస్తున్న క్రమంలో జై సింహా మహిళా క్రికెటర్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. బస్లో వారి ముందే మద్యం సేవిస్తూ.. అడ్డు చెప్పినందుకు బూతులు తిట్టాడు. ఈ క్రమంలో మహిళా క్రికెటర్లు కోచ్ వ్యవహారశైలిపై హెచ్సీఏకు నాలుగు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. జై సింహాతో పాటు అతడికి సహకరించారంటూ సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమారావుపై కూడా కంప్లైంట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో హెచ్సీఏ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా.. కోచ్ పదవి నుంచి జై సింహాను తక్షణమే తప్పిస్తూ అధ్యక్షుడు జగన్మోహన్ రావు నిర్ణయం తీసుకున్నారు. ‘‘మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు పెడతాం. పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతాం’’ అని జై సింహా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా.. మహిళా క్రికెటర్లకు హెచ్సీఏ ఎల్లపుడూ అండగా ఉంటుందని జగన్మోహన్ రావు భరోసా ఇచ్చారు. విచారణ ముగిసే వరకు జై సింహాను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: BCCI: సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్లకు జై షా వార్నింగ్.. ఇకపై -
HCA: మద్యం సేవిస్తూ.. మహిళా క్రికెటర్లను బూతులు తిడుతూ!
Hyderabad Cricket Association: హైదరాబాద్ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్ జై సింహా అసభ్య ప్రవర్తన కారణంగా వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన జై సింహా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. కాగా మ్యాచ్ ఆడే నిమిత్తం ఉమెన్ టీమ్ హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో విమానంలో రావాల్సి ఉండగా.. కోచ్ జై సింహా ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశాడు. ఫ్లైట్ మిస్ అవడంతో టీమ్తో సహా బస్లో హైదరాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో బస్లో మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించగా.. వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కోపోద్రిక్తుడైన జై సింహా మహిళా క్రికెటర్లను బూతులు తిట్టాడు. ఆ సమయంలో సెలక్షన్ కమిటీ మెంబర్ పూర్ణిమరావు జై సింహాకు అడ్డు చెప్పలేదు. పైగా అతడిని ఎంకరేజ్ చేశారు. ఈ మేరకు ఆరోపణలు చేస్తూ.. జై సింహా, పూర్ణిమరావుపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కి ఫిర్యాదు చేశారు. వేటు పడింది ఈ నేపథ్యంలో.. తమను జట్టు నుంచి తప్పిస్తామని కోచ్ బెదిరింపులకు గురిచేస్తున్నాడంటు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు మీడియాలో ప్రచారం కావడంతో హెచ్సీఏ చర్యలకు పూనుకుంది. మహిళల హెడ్కోచ్గా జై సింహాను తప్పిస్తూ వేటు వేసింది. ఈ విషయంపై హెచ్సీఏ అధ్యక్షుడు స్పందిస్తూ.. ‘‘కోచ్ జై సింహ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ చేస్తున్నాము. విచారణ ముగిసే వరకు అతడిని సస్పెండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు, -
ఉప్పల్ స్టేడియంలో భారత్- ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్.. వారికి ఫ్రీ ఎంట్రీ
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐదేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టుకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. జనవరి 25 నుంచి 29 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు జగన్మోహన రావు తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో జగన్మోహన రావు మాట్లాడుతూ.. మేము ఎన్నికైన తర్వాత జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ కోసం భారీ ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు రోజుకు 5 వేల మంది విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నాం. అయితే మ్యాచ్ కి ముందే స్కూల్ నుంచి లెటర్ హెచ్సీఏకు పంపించాల్సి ఉంటుంది. హెచ్సీఏకు పాఠశాల నుంచి లెటర్ అందితే టిక్కెట్లను నేరుగా వారివద్దకే పంపిస్తాం. ఒక స్కూల్ కి ఒకరోజు మాత్రమే అవకాశం కల్పిస్తాం. అదే విధంగా విద్యార్థులకు ఫ్రీ గా ఫుడ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. ఆర్మీ జవాన్లకు ఫ్రీ ఎంట్రీ.. అదే విధంగా ఈ మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ ఆసోషియేషన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ జవాన్లకు, వారి కుటుంబ సభ్యులకు ఉచితంగా మ్యాచ్కు అనుమతిస్తామని జగన్మోహన రావు వెల్లడించారు. ఆసక్తి గల వారు ఈ నెల 18వ తేదీలోపు తమ విభాగాధిపతితో సంతకం చేయించిన లేఖను, కుటుంబ సభ్యుల వివరాలను హెచ్సీఏ సీఈవోకు మెయిల్ చేయాలని ఆయన చెప్చుకొచ్చారు. కాగా ఈ మ్యాచ్కు సంబంధించిన టిక్కెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు 26వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి జింఖానా మైదానంలో ఫిజికల్ టిక్కెట్లను హెసీఏ విక్రయించనుంది. చదవండి: పాకిస్తాన్ క్రికెట్కు భారీ షాక్.. దేశాన్ని వీడనున్న స్టార్ ఆటగాడు!? -
India vs England test: 18 నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఈనెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే తొలి టెస్టు మ్యాచ్కు సంబంధించిన టికెట్లను ఈనెల 18 నుంచి ఆన్లైన్లో విక్రయిస్తారు. పేటీఎం ఇన్సైడర్ యాప్లో, www.insider.in వెబ్సైట్లో రాత్రి 7 గంటల నుంచి టికెట్లు లభిస్తాయని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు ఆదివారం ప్రకటించారు. మిగిలిన టికెట్లను ఈనెల 22 నుంచి ఆఫ్లైన్లో సికింద్రాబాద్ జింఖానా మైదానంలో విక్రయిస్తామని ఆయన వివరించారు. టికెట్ల ధరలను ఒక్కో రోజుకు రూ. 200, రూ. 499, రూ. 750, రూ. 1250, రూ. 3000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 4000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)గా నిర్ణయించారు. ఐదు రోజుల సీజన్ టికెట్ల ధరలను రూ. 600, రూ. 1500, రూ. 2250, రూ. 3750, రూ. 12000 (కార్పొరేట్ బాక్స్ నార్త్), రూ. 16000 (కార్పొరేట్ బాక్స్ సౌత్)లుగా నిర్ణయించారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి 22వ తేదీ నుంచి జింఖానా మైదానంలో టికెట్లను రీడీమ్ చేసుకోవాలి. -
హెచ్సీఏ అక్రమాలపై ఈడీ విచారణ.. మాజీ అధ్యక్షుడు వినోద్కు నోటీసులు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్) విచారణ చేపట్టింది. ఉప్పల్ క్రికెట్ స్టేడియం నిర్మాణంలో రూ.20 కోట్ల మేర జరిగిన అవకతవకలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం హెచ్సీఏ మాజీ అధ్యక్షులు, కార్యదర్శులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్లను కూడా ఈడీ ప్రశ్నించింది. హెచ్సీఎ మాజీ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వినోద్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో హాజరుకావాలని వినోద్ కు నోటీస్లో పేర్కొంది. చదవండి: Test team of the year 2023: అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే.. కోహ్లి, రోహిత్లకు నో ఛాన్స్ -
హెచ్సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్ధి జి వినోద్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్, హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్, వినోద్ దివంగత కాంగ్రెస్ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు. -
హెచ్సీఏ వివాదాన్ని పరిష్కరించండి.. హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు, విశాఖ ఇండస్ట్రీస్కు మధ్య నెలకొన్న వివాదాన్ని నాలుగు వారాల్లో పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా వాణిజ్యకోర్టును హైకోర్టు ఆదేశించింది. అక్కడే సమస్యపై తుది పరిష్కారానికి రావాలని ఇరు పార్టీలకు సూచించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్సీఏ అడ్మినిస్ట్రేటర్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. -
అజారుద్దీన్కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
హెచ్సీఏ అధ్యక్షుడిగా జగన్ మోహన్రావు..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నూతన కార్యవర్గం కొలువు దీరింది. హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ ప్యానెల్ అభ్యర్థి జగన్ మోహన్రావు అర్శనపల్లి జగన్ మోహన్ రావు ఎన్నికయ్యారు. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి అమర్నాథ్పై ఒక్క ఓట్ తేడాతో జగన్ మోహన్రావు విజయం సాధించారు. అమర్నాథ్కు 62 ఓట్లు పడగా.. జగన్ మోహన్రావు 63 ఓట్లు సొంతం చేసుకున్నారు. అదే విధంగా హెచ్సీఏ ఉపాధ్యక్షుడిగా దళ్జిత్ సింగ్ (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), సెక్రటరీగా దేవరాజు (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్), జాయింట్ సెక్రటరీగా బసవరాజు (గుడ్ గవర్నెన్స్ ప్యానెల్), కోశాధికారిగా సీజే శ్రీనివాసరావు, (యునైటెడ్ మెంబర్స్ ప్యానెల్), కౌన్సిలర్గా సునీల్ అగర్వాల్ (క్రికెట్ ఫస్ట్ ప్యానెల్) గెలుపొందారు. కాగా మొత్తం 6 పదవుల కోసం బరిలో 24 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 173 ఓట్లకు గాను 169 ఓట్లు పోలయ్యాయి. మాజీ క్రికెటర్లు వీవియస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, మిథాలిరాజ్,స్రవంతి సహా పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా హెచ్సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు. -
HCA: ప్రశాంతంగా ముగిసిన హెచ్సీఏ ఎన్నికల పోలింగ్.. గెలిచేదెవరో?
ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం ఆరు స్థానాలకు గాను శుక్రవారం ఎన్నికలు జరగగా.. మొత్తం 173కు గానూ.. 169 ఓట్లు పోలయ్యాయి. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అనేక వివాదాల అనంతరం.. హెచ్సీఏ పీఠం ఎవరు దక్కించుకోనున్నారన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. కాగా ప్రెసిడెంట్ ఓట్ల లెక్కింపుతో కౌంటిగ్ ప్రారంభం కానుండగా.. ఎన్నికల అధికారి తొలుత ప్రెసిడెంట్ స్థానానికి ఎన్నికైన అభ్యర్థి పేరునే ప్రకటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హెచ్సీఏ అధ్యక్ష రేసులో అర్శనపల్లి జగన్ మోహన్ రావు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా హెచ్సీఏ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ వ్యవహరించారు. బరిలో ఉన్న ప్యానెల్, అభ్యర్థులు వీరే.. యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్సీఏ: ఎ.జగన్మోహన్ రావు, పి.శ్రీధర్, ఆర్.హరినారాయణ రావు, నోయల్ డేవిడ్, సీజే శ్రీనివాస్, అన్సర్ అహ్మద్ ఖాన్. క్రికెట్ ఫస్ట్: అమర్నాథ్, జి.శ్రీనివాస రావు, ఆర్.దేవరాజ్, సి.సంజీవ్ రెడ్డి, చిట్టి శ్రీధర్, సునీల్ కుమార్. ఆనెస్ట్ హార్డ్ వర్కింగ్ హెచ్సీఏ: పీఎల్ శ్రీనివాస్, సి. బాబూరావు, ఆర్ఎం భాస్కర్, రోహిత్ అగర్వాల్, జెరార్డ్ కార్, డీఏజే వాల్టర్. గుడ్ గవర్నెన్స్: కె. అనిల్కుమార్, దల్జీత్ సింగ్, వి.ఆగమరావు, బసవరాజు, పి.మహేంద్ర, వినోద్ ఇంగ్లే. -
అజారుద్దీన్పై మరో కేసు నమోదు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్పై మరో కేసు నమోదైంది. అజహార్ నేతృత్వంలోని గత హెచ్సీఏ పాలకవర్గం అవినీతికి పాల్పడిందని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) సీఈఓ సునీల్ కాంతే ఇవాళ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అజహార్ అండ్ టీమ్.. 2020-2023 మధ్యలో జిమ్ వస్తువుల కొనుగోలు, క్రికెట్ బాల్స్ కొనుగోలు, అగ్ని ప్రమాద సామాగ్రి కొనుగోలు, బకెట్ చైర్స్ కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడిందని సునీల్ కాంతే ఫిర్యాదులో పేర్కొన్నారు. టెండర్ల కేటాయింపులో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్లో నిర్ధారణ అయినట్లు ప్రస్తావించారు. ఫిర్యాదును పరిశీలించిన ఉప్పల్ పోలీసులు అజార్ అండ్ టీమ్పై కేసు నమోదు చేశారు. కాగా, కొద్ది రోజుల కిందట జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు అజారుద్దీన్పై అనర్హత వేటు పడింది. దీంతో అజహార్ రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
అజారుద్దీన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ! ఇక మర్చిపోవాల్సిందే!
HCA Elections- Setback for Azhar: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి మహ్మద్ అజారుద్దీన్కు సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగలింది. హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ ఈ వ్యవహారంపై విచారణను అక్టోబరు 31కి వాయిదా వేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలుకావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి హెచ్సీఏలో చక్రం తిప్పాలనుకున్న అజారుద్దీన్ ఆశలకు గండిపడింది. కాగా అక్టోబరు 20న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా నుంచి తన పేరు తొలగించడంపై అజారుద్దీన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా అతడికి భంగపాటు ఎదురైంది. సుప్రీంకు చేరిన పంచాయితీ 2019లో అజారుద్దీన్ నేతృత్వంలో అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే, అజారుద్దీన్, ఇతర కార్యవర్గ సభ్యుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో హెచ్సీఏ కమిటీని రద్దు చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆదేశాలు జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. రిటైర్డ్ జడ్జి లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఈ క్రమంలో సెప్టెంబరు 30న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. రిటైర్డ్ ఐఏఎస్ విఎస్ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ జరుగనుంది. అందుకే అనర్హత వేటు ఇదిలా ఉంటే.. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే.. డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నందున(కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్) అజారుద్దీన్పై అనర్హత వేటు పడింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో కూడిన ఏకసభ్య కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో హెచ్సీఏ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో వెంటనే జోక్యం చేసుకోవాలని సుప్రీంను ఆశ్రయించగా అతడికి నిరాశే ఎదురైంది. ఈసారికి మర్చిపోవాల్సిందే ఈ విషయంపై స్పందించిన అజారుద్దీన్ సన్నిహిత వర్గాలు.. ‘‘ఒకవేళ అక్టోబరు 31 తర్వాత ఓటర్ల లిస్టులో అజర్ పేరును చేర్చాలని న్యాయస్థానం ఆదేశించినా ఉపయోగం ఉండదు. అయితే, అతడికి వ్యతిరేకంగా కొందరు పన్నిన కుట్రను బయటపెట్టేందుకు... అజారుద్దీన్ ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకునేందుకు అవకాశం దొరుకుతుంది. అతడికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయం బయటకు వస్తుంది’’ అని పేర్కొన్నాయి. చదవండి: #Shubman Gill: టీమిండియాకు భారీ షాక్! వాళ్లలో ఒకరికి గోల్డెన్ ఛాన్స్.. వరల్డ్కప్ జట్టులో! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు మోగిన ఎన్నికల నగారా
-
టీమిండియా మాజీ కెప్టెన్కు భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్కు భారీ షాక్ తగిలింది. హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా కొనసాగినందుకు జస్టిస్ లావు నాగేశ్వర్రావు కమిటీ అజారుద్దీన్పై అనర్హత వేటు వేసింది. దీంతో అజహార్ రానున్న హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ కమిటీ అజారుద్దీన్ పేరును హెచ్సీఏ ఓటర్ల జాబితా నుంచి కూడా తొలగించింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ విడుదలైంది. వచ్చే నెల (అక్టోబర్) 20వ తేదీన ఎన్నికలు నిర్వహరణకు ముహూర్తం ఖరారైంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఈసీ మెంబర్స్కు ఎన్నికలు జరుగనున్నాయి. ఆరోజే ఫలితాలు ఈ నేపథ్యంలో 173 మందితో కూడిన ఓటర్ల జాబితాను కూడా విడుదల చేశారు. వచ్చే నెల 4 నుంచి 7వ తేదీ వరకు ఎన్నికల అధికారి వి.సంపత్ కుమార్ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబరు 14న నామినేషన్లను స్క్రూటినీ చేయనున్నారు. ఇక నామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీని ఆఖరి రోజుగా నిర్ణయించారు. అక్టోబరు 20న ఎన్నికలు నిర్వహించడం సహా అదే రోజు ఫలితాలను కూడా ప్రకటించనున్నారు. మోగిన ఎన్నికల నగారా కాగా వివాదాల నేపథ్యంలో హెచ్సీఏ ప్రెసిడెంట్గా మహ్మద్ అజారుద్దీన్ పదవీకాలం పూర్తైన తర్వాత.. సుప్రీంకోర్టు.. మాజీ జస్టిస్ లావు నాగేశ్వర్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు హెచ్సీఏ బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్నికల నగారా మోగింది. చదవండి: WC2023: అతడి ఆట అద్భుతం.. గేమ్ ఛేంజర్ తనే: యువరాజ్ సింగ్ -
రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయండి.. హెచ్సీఏకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆరువారాల్లో రూ.17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర, చరాస్తులపై థర్డ్ పారీ్టకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్సీఏకు సూచించింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సీఏ బ్యాంక్ అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్సీఏ అడ్మినిస్టేటర్, జస్టిస్ ఎల్.నాగేశ్వర్రావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన ఆ అటాచ్మెంట్లు రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ.శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్సీఏ తరఫున సీనియర్ న్యాయవాది రాజాశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ వేరొక చోట ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసిందన్నారు. దాని ఫలితంగా అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చిందని చెప్పారు. విశాఖ ఇండస్ట్రీస్ తరఫున సీనియర్ న్యాయవాది సునీల్ వాదనలు వినిపిస్తూ.. 2016లో మధ్యవర్తిత్వ తీర్మానం ఆమోదించగా, ఏడేళ్లుగా ఈ తతంగం కొనసాగుతోందని.. విశాఖ ఇండస్ట్రీస్కు చెల్లించకుండా ఉండేందుకు హెచ్సీఏ ఉద్దేశపూర్వకంగానే విస్మరించిందని చెప్పారు. వాదనలు విన్న ధర్మాసనం.. విశాఖ ఇండస్ట్రీస్కు అనుకూలంగా ఇచ్చిన మధ్యవర్తిత్వ తీర్పులో భాగంగా హెచ్సీఏ రూ.17.5 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. -
ప్రపంచకప్కు ఉప్పల్ స్టేడియం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ల నిర్వహణ కోసం ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియం అన్ని విధాలా సిద్ధమైందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది. హెచ్సీఏ పర్యవేక్షకుడు, ఏకసభ్య కమిటీ చైర్మన్ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు తరఫున ప్రతినిధిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ కె. దుర్గాప్రసాద్ వరల్డ్ కప్కు సంబంధించి ఏర్పాట్ల గురించి వెల్లడించారు. బీసీసీఐ ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో స్టేడియంలో కొత్తగా అనేక అభివృద్ధి చేపట్టినట్లు ఆయన వివరించారు. ‘స్టేడియంలో ఐసీసీ ప్రమాణాలకు అనుగుణంగా చక్కటి అవుట్ ఫీల్డ్ను సిద్ధం చేశాం. ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాలను ఎంతో మెరుగుపర్చాం. వారి కోసం స్టేడియంలో మూడు వైపులా నార్త్, సౌత్, ఈస్ట్లలో కనోపీలను ఏర్పాటు చేశాం. సౌత్లో కొన్నాళ్ల క్రితం పాడైపోయిన కనోపీని పునరుద్ధరించాం. పాతవాటి స్థానంలో కొత్తగా ఫ్లడ్లైట్లను కూడా ఏర్పాటు చేశాం. ఎల్ఈడీ లైట్లు ఉండటం ఈసారి ప్రత్యేకత’ అని దుర్గా ప్రసాద్ చెప్పారు. స్టేడియం సామర్థ్యం 39 వేలు కాగా, 11 వేలు పాత సీట్లను తొలగించి వాటి స్థానంలో కొత్తవి సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. వరుసగా రెండు రోజుల్లో రెండు మ్యాచ్లు ఉండటంతో ఎలాంటి సమస్యా లేదని, వాటిని సమర్థంగా నిర్వహించగలమని విశ్వాసం వ్యక్తం చేసిన దుర్గాప్రసాద్... అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ మ్యాచ్లపై ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో ప్రపంచ కప్ మ్యాచ్లు ఉన్నాయి. -
CWC 2023: పాకిస్తాన్ మ్యాచ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ
ఈనెల 29న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (ఉప్పల్ స్టేడియం) జరగాల్సి ఉన్న వన్డే వరల్డ్కప్-2023 వార్మప్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియంలో జరుగనుంది. పాకిస్తాన్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్కు సెక్యూరిటీ ఇవ్వలేమని స్థానిక పోలీసులు చెప్పడంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఈ నిర్ణయం తీసుకుంది. మ్యాచ్కు ముందు రోజు (సెప్టెంబర్ 28) నగరంలో గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉండటంతో తగినంత భద్రత ఇవ్వలేమని నగర పోలీసులు హెచ్సీఏకు తెలిపారు. వీలైతే మ్యాచ్ను వాయిదా వేయాలని వారు హెచ్సీఏని కోరారు. అయితే, ఇదివరకే షెడ్యూల్ను ఓ సారి సవరించి ఉండటంతో బీసీసీఐ షెడ్యూల్ మార్పు కుదరదని హెచ్సీఏకు తేల్చి చెప్పింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పాక్-న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్ను ఖాళీ స్టేడియంలో నిర్వహించేందుకు హెచ్సీఏ సిద్ధమైంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు ఇదివరకే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందిగా బీసీసీఐ వరల్డ్కప్ టికెటింగ్ పార్డ్నర్ బుక్ మై షోకు సూచించింది. కాగా, వన్డే వరల్డ్కప్-2023కు ముందు మొత్తం 10 వార్మప్ మ్యాచ్లు జరుగనున్న విషయం తెలిసిందే. వార్మప్ మ్యాచ్ల్లో భాగంగా సెప్టెంబర్ 29న 3 మ్యాచ్లు, సెప్టెంబర్ 30న 2, అక్టోబర్ 2న 2, అక్టోబర్ 3న 3 మ్యాచ్లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్లన్నీ డే అండ్ మ్యాచ్లుగా సాగనున్నాయి. సెప్టెంబర్ 29: బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక (గౌహతి, మధ్యాహ్నం 2 గంటలకు) ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) సెప్టెంబర్ 30: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) అక్టోబర్ 2: బంగ్లాదేశ్ వర్సెస్ ఇంగ్లండ్ (గౌహతి) న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికా (తిరువనంతపురం) అక్టోబర్ 3: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక (గౌహతి) ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ (తిరువనంతపురం) ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ (హైదరాబాద్) -
బీసీసీఐకి హెచ్సీఏ షాక్... మరోసారి ప్రపంచ కప్ షెడ్యూల్లో మార్పులు?
భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2023కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది. అయితే ఈ మెగా టోర్నీకి ముందు ఐసీసీ, బీసీసీఐకి మరో తలనొప్పి వచ్చి పడింది. కొత్తగా ప్రకటించిన వరల్డ్కప్ షెడ్యూల్లో మార్పులు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) బీసీసీఐను అభ్యర్దించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అభ్యర్ధన మెరకు ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ ప్రకారం మరో వారం రోజుల్లో టికెట్ల విక్రయాలకు కూడా బీసీసీఐ సిద్దమైంది. అంంతలోనే హెచ్సీఏ.. భారత క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. కాగా వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ప్రకారం, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 9వ తేదీన న్యూజిల్యాండ్, నెదర్లాండ్స్ తలపడనున్నాయి. ఆ మరుసటి రోజే(ఆక్టోబర్) 10వ తేదీన పాకిస్తాన్, శ్రీలంక మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇలా వరుస రోజుల్లో మ్యాచ్లకు భద్రత కల్పించడం తమకు కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు హెచ్సిఎకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులల అభ్యర్దను పరిగణలోకి తీసుకున్న హెచ్సిఏ.. ఇదే విషయంపై బీసీసీఐకు లేఖ రాసింది. కాగా వాస్తవానికి పాక్-శ్రీలంక మ్యాచ్ ఆక్టోబర్ 12 హైదారాబాద్గా జరగాల్సింది. కానీ ఐసీసీ షెడ్యూల్ మార్చడంతో ఆ మ్యాచ్ రెండు రోజులు ముందు వచ్చింది. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రిక్వెస్ట్పై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి చదవండి: ODI WC 2023: సంజూ శాంసన్ కాదు.. వన్డే ప్రపంచకప్లో భారత వికెట్ కీపర్ అతడే! -
హెచ్సీఏ ఎన్నికల అధికారిగా వీఎస్ సంపత్
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడింది. భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్గా పని చేసిన వీరవల్లి సుందరం (వీఎస్) సంపత్ హెచ్సీఏ ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్సీఏ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) లావు నాగేశ్వరరావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. హెచ్సీఏ ఎన్నికల ప్రక్రియ మొత్తం వీఎస్ సంపత్ నేతృత్వంలోనే జరుగుతుంది. -
హెచ్సీఏ నిర్వాకం.. జట్టులో అవకాశమిస్తామంటూ లక్ష వసూలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) నిర్వాకం మరోసారి బయటపడింది. అక్రమాలకు కేరాఫ్గా మారిన హెచ్సీఏ మరో వివాదంలో చిక్కుకుంది. మంగళవారం ఉప్పల్లో నిర్వహించిన అండర్-19 సెలక్షన్స్లో గందరగోళం చోటుచేసుకుంది. సెలక్షన్ ట్రయల్స్ కావడంతో తెలంగాణ రాష్ట్రం లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు హాజరయ్యారు. అయితే మన రాష్ట్రం నుంచి కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రికెటర్లను హెచ్సీఏ వెనక్కి పంపించింది. ఈ నేపథ్యంలో పద్దతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించలేదని అక్కడికి వచ్చిన యువ క్రికెటర్లు ఆరోపించారు. అంతేకాదు ఒక యువ క్రికెటర్ దగ్గర హెచ్సీఏ డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. వన్డౌన్ ప్లేయర్గా అవకాశం ఇస్తామంటూ యువ క్రికెటర్ దగ్గర రూ. లక్ష వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలంటూ సదరు బాధితుడు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఆసక్తి కలిగించింది. కాగా హెచ్సీఏ తీరుపై పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ''హెచ్ సీయూ ఒక పద్ధతి ప్రకారం సెలక్షన్స్ నిర్వహించడం లేదు. ఈ సెలక్షన్ ఒక్కో జిల్లాకు ఒకరోజు ఇస్తే క్రికెటర్లు ఆ రోజు వచ్చేవారు. కానీ అందరూ ఒకటే రోజు రావడంతో ఉదయం 6 గంటలకు వచ్చిన పిల్లలు ఉదయం నుంచి తిండి, నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు'' అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: నిబంధనలు గాలికి.. మగ షూటర్ల గదిలో మహిళా షూటర్లు! ఏమో.. టీమిండియాపై అదే రిపీట్ చేస్తామేమో! స్టోక్స్ ఓవరాక్షన్ వద్దు! ఇక్కడికొచ్చాక.. -
హెచ్సీఏకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇవ్వడం ఆసక్తి కలిగించింది. హెచ్సీఏలో అవినీతి పెరిగిపోయిందని.. సెలక్షన్లలో అవకతవకలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏ తీరును ప్రభుత్వం గమనిస్తుందని త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ''ఉప్పల్ స్టేడియంకు సంబంధించిన లీజ్ త్వరలో ముగిసిపోతుంది. ఉప్పల్ స్టేడియం లీజ్పై ప్రభుత్వం పునరాలోచనలో ఉంది. హెచ్సీఏ అవినీతిని దృష్టిలో పెట్టుకొని ఉప్పల్ స్టేడియాన్ని స్పోర్ట్స్ అథారిటీకి అప్పగించే యోచనలో ఉన్నాం.'' అని వెల్లడించారు. చదవండి: చీఫ్ సెలెక్టర్ పదవికి ఆహ్వానాలు.. ముందు వరుసలో సెహ్వాగ్! -
50 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ బాదిన హైదరాబాదీ కుర్రాడు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న లీగ్ మ్యాచ్ల్లో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. రెండు రోజుల లీగ్లో భాగంగా కాంకర్డ్ క్రికెట్ క్లబ్, శ్రీశ్యామ్ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆరోన్ వర్గీస్ అనే కుర్రాడు ట్రిపుల్ సెంచరీతో మెరిశాడు. గురువారం జరిగిన మ్యాచ్లో కాంకర్డ్ తరపున ఆడిన ఆరోన్ వర్గీస్ మెరుపు ఇన్నింగ్స్ ప్రదర్శించాడు. కేవలం 260 బంతుల్లో 50 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 321 పరుగులు సాధించాడు. ఆరోన్ అద్భుత బ్యాటింగ్కు తోడుగా అయాన్ అహ్మద్(52), రామ్ రేపాల(50) రాణించడంతో కంకార్డ్ 85.5 ఓవర్లలో(నిర్ణీత 90 ఓవర్లు) 560 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టు చేసిన 560 పరుగుల్లో 321 పరుగులు ఆరోన్ వర్గీస్వే కావడం విశేషం. చదవండి: కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల చేధన -
హెచ్సీఏను ఏకిపారేసిన సునీల్ గావస్కర్
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ మరో పరాజయాన్ని మూటగట్టుకొని ప్లేఆఫ్ చేరే అవకాశాలను కోల్పోయింది. శనివారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో లక్నో సూపర్జెయింట్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ సమయంలో నోబాల్ విషయమై ఎస్ఆర్హెచ్ అభిమానులు కాస్త అతి చేశారు. థర్డ్ అంపైర్ నోబాల్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు అభిమానులు లక్నో డగౌట్వైపు బోల్టులు, మేకులతో దాడి చేశారు. ఈ సమయంలో లక్నో ఆటగాళ్లు సహా సిబ్బంది అక్కడ ఉండడంతో కాస్త గందరగోళం నెలకొంది, అయితే డగౌట్కు కనీస భద్రతా ప్రమాణాలు లేకుండా కేవలం టెంట్లతో ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది. దేవుని దయ వల్ల మేకులు ఎవరికి గుచ్చుకోకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇదే విషయమై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ హెచ్సీఏ వైఖరిని ఎండగట్టాడు. ''ఐపీఎల్లో ఇతర వేదికల్లో డగౌట్లను ఫ్లెక్సీ గ్లాస్తో ఏర్పాటు చేశారు. కానీ హైదరాబాద్ స్టేడియంలో మాత్రం డగౌట్లను కేవలం గొడుగుల కింద ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇవాళ లక్నోతో మ్యాచ్ సందర్భంగా నోబాల్ ఇవ్వలేదని అభిమానులు మేకులు, బోల్టులు విసరడం మంచి పద్దతి కాదు. దేవుని దయవల్ల ఎవరికి ఏం కాలేదు. అయినా డగౌట్ ఏర్పాటులో ఇంత నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. హెచ్సీఏ నిర్వహణ లోపం ఏంటనేది మరోసారి బయటపడింది. కనీసం సరైన డగౌట్లు నిర్మించలేని పరిస్థితిలో హెచ్సీఏ ఉండడం దురదృష్టకరం'' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 19వ ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఓవర్ మూడో బంతి హైఫుల్ టాస్గా వెళ్లింది. క్రీజులో ఉన్న అబ్దుల్ సమద్ నడుము పై భాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్కు కాల్ ఇచ్చాడు. అయితే లక్నో సూపర్జెయింట్స్ అంపైర్ కాల్ను చాలెంజ్ చేశారు. దీంతో అల్ట్రాఎడ్జ్లో పరిశీలించిన థర్డ్ అంపైర్ బంతి క్లియర్గా ఉందని.. నో బాల్ కాదని చెప్పాడు. దీంతో క్లాసెన్ సహా అబ్దుల్ సమద్లు షాక్కు గురయ్యారు. వాస్తవానికి నడుము పై నుంచి బంతి వెళితే నోబాల్ ఇవ్వడం జరుగుతుంది. అంత క్లియర్గా నోబాల్ అని కనిపిస్తున్నా థర్డ్ అంపైర్ కరెక్ట్ బాల్గా కౌంట్ చేయడం ఆసక్తి కలిగించింది. చదవండి: సూపర్ ప్రబ్సిమ్రన్.. ఓపెనర్గా వచ్చి సెంచరీ కొట్టి -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
కథ కంచికి.. హెచ్సీఏకు తగిన శాస్తి
వెంకటపతిరాజు, మహ్మద్ అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇలా ఆణిముత్యం లాంటి క్రికెటర్లను దేశానికి అందించిన ఘనత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ది(హెచ్సీఏ). అలాంటి హెచ్సీఏ ఇవాళ అంతర్గత కుమ్ములాటలు, చెత్త రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయింది. ఇంత జరుగుతున్నా బీసీసీఐ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది. హెచ్సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ సుప్రీం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీ హెచ్సీఏ వ్యవహరాలను చూసుకుంటుందని తెలిపింది. ఇన్నాళ్లుగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వచ్చిన హెచ్సీఏ కథ చివరికి ఇలా ముగిసింది. టాలెంటెడ్ ఆటగాళ్లను పట్టించుకోకుండా ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వారినే ఆడించడం హెచ్సీఏలో కామన్గా మారిపోయింది. ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలోనూ హైదరాబాద్ జట్టు దారుణ ప్రదర్శనను కనబరిచింది. నాలుగు రోజుల మ్యాచ్ల్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి నిండా ఒక్కరోజు కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేక.. సరిగా బౌలింగ్ చేయలేక చేతులెత్తేస్తున్నారు. టోర్నీలో ఆరు మ్యాచ్ల్లో ఐదింటిలో పరాజయం.. ఒక మ్యాచ్ డ్రాతో ఒక్క పాయింటుతో గ్రూప్-బి పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. రంజీలో పాల్గొన్న మిగతా రాష్ట్రాల జట్లు ఆటలో ముందుకు వెళుతుంటే.. హెచ్సీఏ మాత్రం మరింత వెనక్కి వెళుతుంది. పాలకుల అవినీతి పరాకాష్టకు చేరడమే హైదరాబాద్ క్రికెట్ దుస్థితికి ప్రధాన కారణమన్నది చర్చనీయాంశంగా మారింది. ఇక టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన టి20 మ్యాచ్కు టికెట్ల అమ్మకంపై జరిగిన రగడ హెచ్సీఏలోని అంతర్గత విబేధాలను మరోసారి బహిర్గతం చేసింది. హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ సహా మిగతా కార్యవర్గ సభ్యులు మధ్య తలెత్తిన విబేధాలతో ఆటను సరిగా పట్టించుకోవడం లేదని భావించిన సుప్రీం కోర్టు పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసింది. హెచ్సీఏ వ్యవహారాల పర్యవేక్షణకు జిస్టిస్ కక్రూ, డీజీపీ అంజనీ కుమార్, వెంకటపతిరాజు, వంకా ప్రతాప్లతో తాత్కాలిక కమిటీని నియమించింది. అయినప్పటికి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా హెచ్సీఏ పరిస్థితి ఉంది. పైగా వంకా ప్రతాప్ కమిటీ బాధ్యతల్లోనే గాకుండా జట్టు సెలక్షన్ కమిటీలోనూ వేలు పెడుతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. హెచ్సీఏ అకాడమీ డైరెక్టర్గా వంకా ప్రతాప్ నెలకు రూ. 3 లక్షలు జీతం తీసుకుంటున్నప్పటికి.. పర్యవేక్షక కమిటీకి హాజరైనందున తనకు రూ. 5.25 లక్షలు ఇవ్వాలని హెచ్సీఏకు విజ్ఞప్తి చేశాడు. తన స్వప్రయోజనాల కోసం హెచ్సీఏను వంకా ప్రతాప్ భ్రష్టు పట్టిస్తున్నారని కొంతమంది పేర్కొన్నారు. మాజీ ఆటగాళ్లు పరిపాలకులుగా ఉంటే హెచ్సీఏ కాస్త గాడిన పడుతుందని భావించారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు సగటు క్రికెట్ అభిమానులను ఆవేదన కలిగించాయి. ఇంత జరుగుతున్నా బీసీసీఐ నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడం సగటు అభిమానిని ఆశ్చర్యానికి గురి చేసింది. త్వరలో హెచ్సీఏ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎన్నికలు సజావుగా జరగాలని కొంతమంది హెచ్సీఏ ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కథ కంచికి చేరింది. సుప్రీంకోర్టు హెచ్సీఏ వ్యవహార కమిటీని రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ లావు నాగేశ్వరరావు ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఇకపై ఏకసభ్య కమిటీ హెచ్సీఏ వ్యవహారలన్నీ చూసుకుంటుందని సుప్రీం పేర్కొంది. చదవండి: అజారుద్దీన్కు చుక్కెదురు.. హెచ్సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేసిన సుప్రీంకోర్టు
-
అజారుద్దీన్కు చుక్కెదురు.. హెచ్సీఏ కమిటీని రద్దు చేసిన సుప్రీం కోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అజర్ నేతృత్వం వహిస్తున్న హెచ్సీఏ కమిటీని రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీర్పునిచ్చింది. ప్రస్తుత కమిటీ స్థానంలో మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటందని తెలిపింది. త్వరలోనే హెచ్సీఏకు ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. హెచ్సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ అంబుడ్స్మెన్గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్సీఏ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీంకోర్టు హెచ్సీఏ కమిటీ రద్దుకే మొగ్గుచూపింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్సీఏకు సుప్రీం ఆదేశించింది. -
దీపక్ చహర్ భార్యకు బెదిరింపులు
టీమిండియా స్టార్ క్రికెటర్ దీపక్ చాహర్ భార్య జయా భరద్వాజ్కు చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ రావడం సంచలనం కలిగించింది. తనకు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు తిరిగి ఇవ్వమన్నందుకు సదరు దుండగులు ఆమెను చంపేస్తామంటూ బెదిరించారు. ఈ విషయమై దీపక్ చహర్ తండ్రి ఆగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విషయంలోకి వెళితే.. రిఖ్ స్పోర్ట్స్ యజమాని ధ్రువ్ పరేక్, అతని తండ్రి కమలేశ్ పరేక్ జయ భరద్వాజ్ దగ్గర రూ. 10లక్షలు అప్పుగా తీసుకున్నారు. వ్యాపారం కోసం అని చెప్పడంతో 2022 అక్టోబర్ 7న ఆన్లైన్లో రూ.10 లక్షలు పంపించారు. కానీ ఆ డబ్బును వారు దుర్వినియోగం చేసినట్లు తెలుసుకున్న జయా భరద్వాజ్ డబ్బు తిరిగి చెల్లించాలని అడిగారు. అయితే తండ్రి, కొడుకులు డబ్బు తిరిగి ఇవ్వడమే కాకుండా ఫోన్ చేసి అసభ్యకర వ్యాఖ్యలతో దుర్భాషలాడారని.. చంపేస్తామంటూ బెదిరించారని దీపక్ చహర్ తండ్రి పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధికారి, ఆయన కుమారుడు ఉన్నట్లు ఆరోపణులు వస్తున్నాయి. మోసం చేసిన వారిద్దరికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్తో సంబంధం ఉన్నట్లు తెలియడంతో కంపెనీ యజమానుల వివరాలను సేకరిస్తున్నారు. కాగా దీపక్ చహర్ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. దీపక్, జయ భరద్వాజ్ల వివాహం గతేడాది జూన్ 1న జరిగింది. వీరిద్దరూ చాలాకాలం ప్రేమించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కాగా టీమిండియాతో పాటు చెన్నై సూపర్ కింగ్స్కు ఆల్రౌండర్గా సేవలందిస్తున్నాడు చహర్. చహర్ టీమిండియా తరపున ఏడు వన్డేల్లో 10 వికెట్లు, 24 టి20 మ్యాచ్ల్లో 29 వికెట్లు పడగొట్టాడు. చదవండి: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
హైదరాబాద్లో కివీస్తో మ్యాచ్.. ఆ కిక్కే వేరు.. టీమిండియాదే పైచేయి! ఈసారి..
India vs New Zealand, 1st ODI - Hyderabad- Head To Head Records: అనగనగా భారత్, కివీస్... క్రికెట్లో ఈ రెండు జట్లు తలపడితే ఆ మజానే వేరు. అదీ భాగ్యనగరంలో అయితే మరింత కిక్కే కిక్కు.... వీటి మధ్య ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. అన్నింటా భారత్దే పైచేయిగా నిలిచింది. ఈ రెండు జట్ల నడుమ జరిగిన పోటీల్లో ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో చిరస్మరణీయమైన గుర్తులకు హైదరాబాద్ వేదిక అయింది. పాలిఉమ్రిగర్ నుంచి మొదలుకుంటే విజయ్ మంజ్రేకర్, ఎరాపల్లి ప్రసన్న, బిషన్ సింగ్ బేడీ, ఆబిద్ అలీ, అజహరుద్దీన్, కపిల్ దేవ్, శ్రీకాంత్, అర్షద్ అయూబ్ , నరేంద్ర హిర్వాణీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, ధోనీ,కోహ్లి , పుజారా, అశ్విన్... రిచర్డ్ హ్యాడ్లీ, మార్క్ గ్రేట్ బ్యాచ్, జాన్రైట్, బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్, కేన్ విలియఅమ్సన్.. ఇలా ఎందరో టాప్మోస్ట్ ఆటగాళ్లు తమ ఆటతో హైదరాబాద్ ప్రేక్షకులను హుషారెత్తించారు. ఇక నేడు జరగబోయే మ్యాచ్ సైతం భాగ్యనగర ప్రేక్షకులను అలరించనుంది. స్టార్ ప్లేయర్లతో ఇండియా, కివీస్ జట్లు బరిలో దిగనున్నాయి. హైదరాబాదీస్.. లెట్స్ ఎంజాయ్ స్టేడియంలో భారత ఆటగాళ్లు సాక్షి క్రీడా విభాగం: న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు భాగ్యనగరంతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. హైదరాబాద్ గడ్డపై భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య 1955లో తొలిపోరు జరిగింది. చివరిసారి ఈ రెండు జట్లు 2012లో ఇక్కడ తలపడ్డాయి. 1955 నుంచి 2012 మధ్య కాలంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య హైదరాబాద్లో (ఎల్బీ స్టేడియం, ఉప్పల్ స్టేడియం) ఐదు టెస్టులు, రెండు వన్డేలు జరిగాయి. ఐదు టెస్టుల్లో భారత్ రెండు టెస్టుల్లో గెలిచి, మిగతా మూడు టెస్టులను ‘డ్రా’గా ముగించింది. ఇక రెండు వన్డేల్లో భారత్నే విజయం వరించింది. తద్వారా హైదరాబాద్ గడ్డపై న్యూజిలాండ్ చేతిలో భారత్ ఇప్పటి వరకు ఓటమి రుచి చూడలేదు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు భాగ్యనగరంలో ఇంకా గెలుపు బోణీ కొట్టలేదు. 2012 తర్వాత మళ్లీ హైదరాబాద్లో అంతర్జాతీయ మ్యాచ్ కోసం అడుగుపెట్టిన న్యూజిలాండ్ నేడు ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్తో తొలి వన్డే ఆడనుంది. గతంలో ఎల్బీ స్టేడియంలో రెండు వన్డేలు ఆడిన న్యూజిలాండ్ ఉప్పల్ స్టేడియంలో తొలిసారి వన్డే మ్యాచ్లో బరిలోకి దిగుతోంది. రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్రౌండర్ టిమ్ సౌతీ లేకుండానే భారత్తో వన్డే సిరీస్లో పోటీపడుతున్న న్యూజిలాండ్ తాత్కాలిక కెపె్టన్ టామ్ లాథమ్ సారథ్యంలో ఈసారైనా తమ రికార్డును మెరుగుపర్చుకుంటుందా లేక భారత్కు దాసోహమంటుందా అనే విషయం నేడు తేలిపోతుంది. పిచ్ను పరిశీలిస్తున్న రోహిత్, అజహర్ ఇప్పటి వరకు హైదరాబాద్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు ఇలా.. ►ఎప్పుడు: 1955, నవంబర్ 19– 24 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 498/4 డిక్లేర్డ్ (పాలీ ఉమ్రిగర్ 223, విజయ్ మంజ్రేకర్ 118, కృపాల్ సింగ్ 100 నాటౌట్); న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 326 ఆలౌట్ (జాన్ గయ్ 102, సుభాష్ గుప్తే 7/128); న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 212/2 (బెట్ సట్క్లిఫ్ 137 నాటౌట్). ► ఎప్పుడు: 1969, అక్టోబర్ 15–20 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 181 ఆలౌట్ (బ్రూస్ ముర్రే 81, ఎరాపల్లి ప్రసన్న 5/51), భారత్ తొలి ఇన్నింగ్స్: 89 ఆలౌట్ (వెంకట్రాఘవన్ 25 నాటౌట్, బిషన్ సింగ్ బేడీ 20, డేల్ హ్యాడ్లీ 4/30, బాబ్ కునిస్ 3/12), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 175/8 డిక్లేర్డ్ (డౌలింగ్ 60, సయ్యద్ ఆబిద్ అలీ 3/47, ప్రసన్న 3/58), భారత్ రెండో ఇన్నింగ్స్: 76/7 (భారత విజయ లక్ష్యం 268). ►ఎప్పుడు: 1988, డిసెంబర్ 2–6 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ 10 వికెట్లతో విజయం సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 254 ఆలౌట్ (మార్క్గ్రేట్బ్యాచ్ 90 నాటౌట్, ఇయాన్ స్మిత్ 79, అర్షద్ అయూబ్ 4/55, సంజీవ్ శర్మ 3/37), భారత్ తొలి ఇన్నింగ్స్: 358 ఆలౌట్ (కృష్ణమాచారి శ్రీకాంత్ 69, అజహరుద్దీన్ 81, కపిల్ దేవ్ 40, మార్టిన్ స్నెడెన్ 4/69), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 124 ఆలౌట్ (జాన్ రైట్ 62, రిచర్డ్ హ్యాడ్లీ 31, కపిల్ దేవ్ 3/21, అర్షద్ అయూబ్ 3/36, నరేంద్ర హిర్వాణీ 3/43), భారత్ రెండో ఇన్నింగ్స్: 22/0 (భారత విజయ లక్ష్యం 21). న్యూజిలాండ్ ఆటగాళ్ల ప్రాక్టీస్ ►ఎప్పుడు: 2010, నవంబర్ 12–16 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: ‘డ్రా’ సంక్షిప్త స్కోర్లు: న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 350 ఆలౌట్ (టిమ్ మెకింటోష్ 102, మార్టిన్ గప్టిల్ 85, జెస్సీ రైడర్ 70, జహీర్ ఖాన్ 4/69, హర్భజన్ సింగ్ 4/76), భారత్ తొలి ఇన్నింగ్స్: 472 ఆలౌట్ (వీరేంద్ర సెహ్వాగ్ 96, గౌతమ్ గంభీర్ 54, వీవీఎస్ లక్ష్మణ్ 74, హర్భజన్ సింగ్ 111 నాటౌట్, డానియల్ వెటోరి 5/135), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 448/8 డిక్లేర్డ్ (బ్రెండన్ మెకల్లమ్ 225, కేన్ విలియమ్సన్ 69, శ్రీశాంత్ 3/121, సురేశ్ రైనా 2/38), భారత్ రెండో ఇన్నింగ్స్: 68/0 (భారత విజయ లక్ష్యం 327). ►ఎప్పుడు: 2012, ఆగస్టు 23–26 ఎక్కడ: ఉప్పల్ స్టేడియం ఫార్మాట్: టెస్ట్ తుది ఫలితం: భారత్ ఇన్నింగ్స్ 115 పరుగుల తేడాతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్ తొలి ఇన్నింగ్స్: 438 ఆలౌట్ (చతేశ్వర్ పుజారా 159, విరాట్ కోహ్లి 58, ఎమ్మెస్ ధోని 73, జీతన్ పటేల్ 4/100), న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 159 ఆలౌట్ (జేమ్స్ ఫ్రాంక్లిన్ 43 నాటౌట్, రవిచంద్రన్ అశ్విన్ 6/31, ప్రజ్ఞాన్ ఓజా 3/44), న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): 164 ఆలౌట్ (కేన్ విలియమ్సన్ 52, రవిచంద్రన్ అశ్విన్ 6/54, ప్రజ్ఞాన్ ఓజా 3/48). మరుపురాని వన్డే మ్యాచ్ ఎప్పుడు: 1999, నవంబర్ 8 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 174 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 376/2 (50 ఓవర్లలో) (సచిన్ టెండూల్కర్ 186 నాటౌట్, రాహుల్ ద్రవిడ్ 153), న్యూజిలాండ్: 202 ఆలౌట్ (33.1 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 43, వెంకటేశ్ ప్రసాద్ 2/38, అనిల్ కుంబ్లే 2/39). సచిన్, సెహ్వాగ్ల వీర విహారం ఎప్పుడు: 2003, నవంబర్ 15 ఎక్కడ: ఎల్బీ స్టేడియం ఫార్మాట్: వన్డే తుది ఫలితం: భారత్ 145 పరుగులతో విజయం సంక్షిప్త స్కోర్లు: భారత్: 353/5 (50 ఓవర్లలో) (వీరేంద్ర సెహ్వాగ్ 130, సచిన్ టెండూల్కర్ 102, రాహుల్ ద్రవిడ్ 50 నాటౌట్), న్యూజిలాండ్: 208 ఆలౌట్ (47 ఓవర్లలో) (స్కాట్ స్టయిరిస్ 54, జహీర్ ఖాన్ 3/30, అజిత్ అగార్కర్ 2/28, అనిల్ కుంబ్లే 2/36, మురళీ కార్తీక్ 2/38). ఉప్పల్లో భారత్ ఇలా.. 2005 నుంచి 2022 వరకు ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు వివిధ జట్లతో అన్ని ఫార్మాట్లలో కలిపి 13 మ్యాచ్లు (6 వన్డేలు, 5 టెస్టులు, 3 టి20) ఆడింది. 9 మ్యాచ్ల్లో (4 టెస్టులు, 3 వన్డేలు, 2 టి20) గెలుపొంది, 3 మ్యాచ్ల్లో (వన్డేలు) ఓడిపోయింది. మరో మ్యాచ్ ‘డ్రా’ (టెస్ట్) అయింది. -
హెచ్సీఏలో మరోసారి బయటపడ్డ విభేదాలు.. అజహర్పై తీవ్రస్థాయి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో (హెచ్సీఏ) విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్పై జనరల్ సెక్రెటరీ విజయ్ ఆనంద్ సంచలన ఆరోపణలు చేశాడు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్ స్టేడియం) వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రేపు (జనవరి 18) వన్డే మ్యాచ్ జరుగనుండగా.. జనరల్ సెక్రెటరీని అయిన నన్ను సంప్రదించకుండా అజహర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడంటూ ఆనంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. జనరల్ సెక్రెటరీగా తన విధులు అధ్యక్షుడితో సమానంగా ఉంటాయని, అయినా అజహర్ తనను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించాడు. దళితుడినని అజహర్ తనను చిన్న చూపు చూస్తున్నాడని, బెదిరించి చెక్కులపై సైన్ చేయించుకుంటున్నాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. హెచ్సీఏలో నియంతలా వ్యవహరిస్తున్న అజహర్.. రేపు జరిగే వన్డే మ్యాచ్ టికెట్లను పక్కదారి పట్టించాడని, ఆన్లైన్ టికెట్ల అమ్మకాల్లో గోల్మాల్ చేశాడని ఆరోపించాడు. తనతో పాటు తన ప్యానెల్ మొత్తాన్ని అజహర్ పక్కకు పెట్టాడని, ఎవరి ప్రమేయం లేకుండా అన్నీ తానై వ్యవహరిస్తున్నాడని అన్నాడు. -
అజహరుద్దీన్ నిర్ణయాలను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడిగా మొహమ్మద్ అజహరుద్దీన్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 తర్వాత తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేయాలని సూపర్వైజరీ కమిటీ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ (రిటైర్డ్) ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన సుప్రీం కోర్టుకు తన నివేదిక అందించారు. దీని ప్రకారం కార్యదర్శి విజయానంద్ పదవితో పాటు అడ్హాక్ కమిటీ కూడా రద్దయినట్లే. సెప్టెంబర్ 30తోనే అజహర్ పదవీకాలం ముగిసిందని, ఆపై ఆయన తీసుకున్న నిర్ణయాలకు ఎలాంటి విలువా లేదని కక్రూ పేర్కొన్నారు. ఆయన నివేదిక ప్రకారం సెలక్టర్లు, కోచ్ల ఎంపిక, ఇతర నియామకాలేవీ చెల్లవు. సూపర్వైజరీ కమిటీ పర్యవేక్షణలోనే కొత్త సెలక్టర్లను కూడా ఎంపిక చేయాలని కక్రూ సూచించారు. చదవండి: ఇంగ్లండ్ వికెట్ కీపర్ అద్భుత విన్యాసం.. చూసి తీరాల్సిందే! వీడియో వైరల్ -
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట విషాదం
సాక్షి, హైదరాబాద్ (బంజారాహిల్స్): భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రెసిడెంట్ మహ్మద్ అజహారుద్దీన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అజహార్ తండ్రి మహ్మద్ యూసఫ్ ఆనారోగ్యం కారణంగా ఇవాళ మృతి చెందారు. యూసఫ్.. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రేపు బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. -
అజహారుద్దీన్పై సీపీకి ఫిర్యాదు.. ‘తప్పుడు ధ్రువపత్రాలతో..’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఉప్పల్ వేదికగా సెప్టెంబర్ 25న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ జరిగిన నాటి నుంచి హెచ్సీఏపై వివిధ అంశాలకు సంబంధించి పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా హెచ్సీఏ అధ్యక్షుడు అజహారుద్దీన్ పదవీకాలానికి సంబంధించి మరో కేసు నమోదైంది. హెచ్సీఏ అధ్యక్షుడిగా అజహారుద్దీన్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 26తోనే ముగిసినప్పటికీ.. అతను తప్పుడు ధ్రువపత్రాలను సమర్పించి చేసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడని మాజీ అధ్యక్షుడు జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబు బృందం రాచకొండ సీపీ మహేష్ భగవత్కి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు లిఖితపూర్వరంగా సీపీకి కంప్లైంట్ను అందజేశారు. పదవీకాలంపై ఎవరిని సంప్రదించకుండా ఆయనకు ఆయనే గడువు పొడిగించుకుంటూ ఉత్తర్వులు జారీ చేసుకున్నారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 18న జరిగే బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్కు హాజరు అయ్యేందుకు అజహారుద్దీన్ తన పదవీకాలాన్ని పొడిగించుకున్నాడని ఆరోపించారు. దీనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని సీపీకి కంప్లైంట్ చేశారు. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరో కేసు నమోదు
-
Ind Vs Aus: ఫ్యాన్స్ అరుపులు, కేకలతో హోరెత్తిన స్టేడియం.. ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ!
Ind vs Aus 3rd T20- Hyderabad Uppal- సాక్షి, హైదరాబాద్/ఉప్పల్: క్రికెట్ ఫీవర్కు నగరం కేరాఫ్ అడ్రస్గా మారింది. ఆదివారం ఓ వైపు బతుకమ్మ సంబురాలు మొదలవగా.. మరోవైపు ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ సంబరం ఊపేసింది. ఉరిమే ఉత్సాహంతో అభిమానులు మధ్యాహ్నం నుంచే స్టేడియానికి బారులు తీరారు. స్టేడియం వెలుపల తమ బుగ్గలకు త్రివర్ణాలను వేయించుకున్నారు. చేతుల్లో జెండాలతో సందడి చేశారు. జింఖానా తొక్కిసలాట నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ), రాచకొండ పోలీస్ కమిషనరేట్ పకడ్బందీ చర్యలు చేపట్టింది. సెక్యూరిటీ, చెకింగ్ పాయింట్ల వద్ద కాస్త నిరీక్షణ మినహా మిగతా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు, అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టారు. ఇక సూర్యాస్తమయానికి ముందే స్టేడియం దాదాపుగా నిండిపోయింది. అభిమానుల కోలాహలం, చప్పట్లు, అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తింది. మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పటికీ ప్రేక్షకులంతా క్రీడాస్ఫూర్తి చాటారు. ఆటగాళ్లను హుషారెత్తించారు. ప్రతి బౌండరీకి, సిక్సర్కు మైదానం దద్దరిల్లిపోయింది. మొత్తానికి మ్యాచ్ను ఫలితంతో సంబంధం లేకుండా ప్రతీ క్షణాన్ని ఆస్వాదించారు. గంటల తరబడి ఎదురుచూపులు క్రికెటర్లను చూడటానికి అభిమానులు ఉప్పల్ ఏక్ మినార్ మజీద్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మధ్యాహ్నం నాలుగు గంటల నుంచే నిలబడ్డారు. ఎన్జీఆర్ గేట్–1నుంచి ఉప్పల్ స్టేడియం వద్దకు దాదాపు కిలో మీటరు పొడవునా రోడ్డుపై నిలబడి వేచి చూశారు. స్టేడియానికి సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఉప్పల్ ఏక్ మినార్ వద్దకు క్రికెటర్లు బస్సులో చేరుకున్నారు. బస్సు చేరుకోగానే అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొడుతూ అభివాదం చేస్తూ ఆల్ది బెస్ట్ చెప్పారు. జోరుగా బ్లాక్ టికెట్ల దందా.. ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో జోరుగా బ్లాక్ టికెట్ల దందా నడించింది. కొందరు యువకులు స్టేడియం పరిసరాల్లో రూ.850 టికెట్ను దాదాపు రూ.11000 వరకు విక్రయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు టికెట్లు విక్రయించే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఆరు టికెట్లు, రెండు సెల్ఫోన్లు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులను ఉప్పల్ పోలీసులకు అప్పజెప్పారు. గతంలో అభిమానులకు టాయిలెట్ సౌకర్యం ఉండేదికాదు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని జీహెచ్ఎంసీ అధికారులు దాదాపు ఎనిమిది మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉంచారు. భారీ సంఖ్యలో విదేశీయులు.. గతంలో ఎన్నడూ లేనివిధంగా విదేశీయులు కూడా భారీ సంఖ్యలో రోడ్లపై కనిపించారు. కొందరు యువకులు వారితో సెల్ఫీలు దిగారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు వివిధ రకాల వేషధారణలతో తరలి వచ్చారు. మరి కొందరు అభిమాన క్రికెటర్ల బొమ్మలున్న టీ షర్టులు ధరించారు. మెట్రో అదనపు ట్రిప్పులు నడపడంతో అందుబాటులో ఉన్న పీఐపీలు కూడా మెట్రో సర్వీస్ను వాడుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా స్టేడియం స్టేషన్ వద్ద వరద లాగా క్రీడాభిమానులు మెట్రో రైలు నుంచి కిందకు దిగడం కనిపించింది. స్టేడియం ప్రాంగణంలో ఆకట్టుకున్న బతుకమ్మ క్రికెట్ స్టేడియం పరిసరాల్లో గేటు నంబర్ – 4 వద్ద బతుకమ్మలను ఏర్పాటు చేశారు. విదేశీయులు బతుకమ్మలను ఆసక్తిగా తిలకించారు. అంతా గందరగోళం.. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే స్డేడియం వద్దకు పంపుతామన్న పోలీసులు.. అలాంటిదేమీ లేకుండా అందరినీ స్టేడియం గేట్ల వద్దకు పంపడంతో వేలాది మంది క్రికెట్ స్టేడియం ప్రాంగణంలోకి వచ్చారు. ఏక్ మినార్ మజీద్ వద్ద, రామంతాపూర్ నుంచి వచ్చే వారిని ఎల్జీ గోడాన్ వద్ద ఏర్పాటు చేసిన బారికేడుల వద్ద టికెట్లను చెక్ చేయలేదు. దీంతో అందరినీ స్టేడియం వద్దకు పడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. టికెట్ లేని వేలాది అభిమానులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు. దీంతో లోనికి వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గాయపడిన వారితో స్టేడియానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ నెల 22న జింఖానాలో టికెట్ క్యూ లైన్లలో తొక్కిసలాట, తదనంతరం లాఠీచార్జిలో గాయపడిన వారిని క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక వాహనంలో ఉచితంగా మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ తీసుకొచ్చారు. ముందుగా రవీంద్రభారతిలో బాధితులను పలకరించిన ఆయన మ్యాచ్ చూసేందుకు ఏర్పాట్లు చేశారు. అంతేకాదు వారందరినీ స్వయంగా పోలీసు మినీ బస్సులో ఎక్కించిమరీ స్టేడియం వరకు వెంట వచ్చారు. చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు -
Sakshi Cartoon 24-09-2022
-
ఆన్లైన్ బుకింగ్ చేసినవాళ్లకే జింఖానాలోకి ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో జరగబోయే టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయం రసాభాసాగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లకు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో టికెట్లు ఇవ్వాలని హెస్సీఏ నిర్ణయించింది. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత టికెట్లు ఇవ్వనున్నారు. అలాగే.. ఆఫ్లైన్ టికెట్ల కోసమంటూ గ్రౌండ్ వైపు ఎవరూ రావొద్దని పోలీసులు కోరుతున్నారు. గురువారం నాటి తొక్కిసలాట, లాఠీఛార్జీ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేటీఎంలో టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు.. జింఖానా వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ కో నిల్చోవాలని సూచిస్తున్నారు పోలీసులు. అలాగే ఆన్లైన్ బుకింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే జింఖానాలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర వ్యక్తులు గ్రౌండ్లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు. ఇక హెచ్సీఏ తీరుతో క్రికెట్ చూడటం అభిమానులకు అందని ద్రాక్షేనా అనే ప్రశ్న మొదలైంది. అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహణలో హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ ఘోర వైఫల్యం చెందారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల విక్రయాల్లో పారదర్శకత లోపించిందని, లోగుట్టుగా నడిచిన మ్యాచ్ టికెట్ విక్రయాల తీరుపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కాంప్లిమెంటరీ పాసుల కోసం బడాబాబులు, వీఐపీలు కక్కుర్తి పడుతున్నట్లు తేలింది. అసలు ఆఫ్ లైన్ టికెట్లు సైతం ఎన్ని విక్రయించారో అజార్ క్లారిటీ ఇవ్వకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో మ్యాచ్ల నిర్వహణ సాఫీగా సాగుతున్న వేళ.. టికెట్ విక్రయాల కోసం హెచ్సీఏ సతమతం కావడంపై చర్చ నడుస్తోంది. ఒకరకంగా జింఖానా తొక్కిసలాట ఘటనతో నగర ఈమేజ్ దెబ్బతిందనే మాట సైతం వినిపిస్తోంది. హెచ్సీఏ అధ్యక్షుడు అజార్ ఒంటెద్దు పోకడతోనే ఈ స్థితి కి కారణమంటున్నారు కొందరు. ఇదీ చదవండి: జింఖానా ‘తొక్కిసలాట’.. మహిళను కాపాడేందుకు ఆ లేడీ కానిస్టేబుల్ ఏం చేసిందంటే? -
భారత్- ఆసీస్ ఉప్పల్ మ్యాచ్.. టికెట్లు అయిపోయాయి : హెచ్సీఏ ప్రకటన
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium- Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిద్దామనుకున్న చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. ఉప్పల్ స్టేడియం చుట్టూ.. జింఖానా గ్రౌండ్ చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రూ. 1200 టికెట్ను బ్లాక్లో 20 వేలకు అమ్ముకున్నారని ఆరోపిస్తున్నారు. ఇంత కష్టపడి ప్రాణాలకు మీదకు తెచ్చుకుని మరీ క్యూలో నిల్చుని ఉంటే ఆఖరికి టికెట్ల అయిపోయాయని ప్రకటించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆది నుంచి గందరగోళమే! సెప్టెంబరు 25న ఉప్పల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మూడో టీ20 జరుగనుంది. ఇందుకు సంబంధించి టికెట్లు ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెప్పినప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్లో అవి అందుబాటులో లేకపోవడంతో ఫ్యాన్స్ మండిపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్లో ఆఫ్లైన్లో టికెట్లను విక్రయించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో గురువారం పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొంతమంది గాయపడ్డారు. టికెట్ల కోసం క్యూలో నిల్చున్న మహిళలు, యువతులు ఇబ్బంది పడ్డారు. ఇంత కష్టపడ్డా చాలా మందికి టికెట్లు దొరకలేదు. టికెట్లు అయిపోయాయని ప్రకటించిన హెచ్సీఏ.. జింఖానా గ్రౌండ్స్లో టికెట్ల అమ్మకాన్ని నిలిపివేసింది. క్యూలైన్లో ఉన్నవాళ్లను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో చాలా మంది నిరాశగా వెనుదిరిగారు. మరోవైపు... జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాటపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై హెచ్సీఏను వివరణ కోరింది. క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంబంధిత అధికారులతో సమావేశమై సమీక్ష చేపట్టారు. కాగా మిగతా టికెట్లు ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్సీఏ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చదవండి: Ind Vs Aus 3rd T20: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! అప్పుడే వాళ్లకు తెలిసివస్తుంది! Ind Vs Aus: కోహ్లి, పాండ్యా మాత్రమే! మిగతా వాళ్లంతా ఆ విషయంపై దృష్టి సారించకపోతే! -
హెచ్సీఏపై సమీక్ష.. కఠినచర్యలు తప్పవ్..! మంత్రి షాకింగ్ కామెంట్స్
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: జింఖానా తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. హెచ్సీఏ నుంచి ప్రభుత్వం వివరణ కోరింది. మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులతో సమావేశమయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్ హాజరయ్యారు. చదవండి: హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి? సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, టికెట్ల అమ్మకాలు పారదర్శకంగా జరగలేదన్నారు. టికెట్ల అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠినచర్యలు తప్పవన్నారు. తెలంగాణ ప్రతిష్టను దిగజారిస్తే ఊరుకునేదిలేదన్నారు.హెచ్సీఐ పూర్తిగా వైఫల్యం చెందిందని మంత్రి అన్నారు. కాగా, ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. -
Ind Vs Aus: మ్యాచ్ను బాయ్కాట్ చేయండి.. అప్పుడే వాళ్లకు బుద్ధి వస్తుంది!
India Vs Australia 2022 3rd T20 Uppal Stadium Tickets- HCA: భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 టిక్కెట్ల అమ్మకం నేపథ్యంలో జింఖానా గ్రౌండ్లో జరిగిన తొక్కిసలాటపై స్పోర్ట్స్ అనలిస్ట్ మలపాక వెంకట్ స్పందించారు. ఇది చాలా దురదృష్టకర ఘటన అన్నారు. సాక్షి టీవీతో ఆయన మాట్లాడుతూ... ‘‘మూడేళ్ల తర్వాత మ్యాచ్ చూసే అవకాశం వచ్చింది. కానీ ఇటు ప్రేక్షకులు గానీ.. అటు హెచ్సీఏ గానీ.. ఏదైనా దుర్ఘటన జరిగితే బీసీసీఐ మళ్లీ పదేళ్ల దాకా ఇక్కడ మ్యాచ్ నిర్వహించదు అన్న విషయం గురించి ఆలోచించలేకపోయారు’’ అని వాపోయారు. అది తొందరపాటు చర్యే! ఇక టిక్కెట్ల అమ్మకం విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వైఖరి గురించి చెబుతూ.. ‘‘హెచ్సీఏ ఎలక్షన్ సమయంలో ఓటింగ్కు కేవలం 222 మంది వచ్చినపుడే.. వారం ముందు నుంచీ రెక్కీ చేసేవాళ్లం. క్యూలో ఎలా నిలబడాలి? అన్న అంశం గురించి జాగ్రత్తలు తీసుకునేవాళ్లం. ఎన్నికల ప్రక్రియ సాఫీగా జరిగేలా చూసుకునేవాళ్లం. నిజానికి మ్యాచ్ ఉందంటే.. జనాలు పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదనడం తొందరపాటు చర్యే అవుతుంది. మ్యాచ్ను బాయ్కాట్ చేయండి! తప్పకుండా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ వస్తారని తెలుసు. అయినా ఇలా జరగడం దురదృష్టకరం’’ అని మలపాక వెంకట్ పేర్కొన్నారు. మ్యాచ్ను మొత్తంగా బాయ్కాట్ చేస్తే అప్పుడే పరిస్థితి తీవ్రత ఏమిటో నిర్వాహకులకు అర్థమవుతుందన్నారు. వానను కూడా లెక్కచేయక చాలా మంది క్యూలో నిల్చుని ఉన్నారన్న ఆయన.. ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మ్యాచ్ను బాయ్కాట్ చేయాలని ఫ్యాన్స్కు పిలుపునిచ్చారు. స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ జరిగితే అప్పుడు నిర్వాహకులకు తెలిసివస్తుందన్నారు. ఇక టిక్కెట్ల విషయంలో స్కామ్ జరిగిందా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తనకు తెలిసినంత వరకు అలాంటిదేమీ లేదన్నారు మలపాక వెంకట్. అంతర్జాతీయ మ్యాచ్ కాబట్టి ఒకవేళ జరగరాని ఘటన జరిగితే హైదరాబాద్ పరువు పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట తర్వాత స్పందించే బదులు.. రాష్ట్ర ప్రభుత్వం, క్రీడా మంత్రి ఏర్పాట్ల గురించి ముందే ఆలోచించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కాగా సెప్టెంబరు 25న భారత్- ఆసీస్ మధ్య ఉప్పల్ స్టేడియంలో మూడో టీ20 జరుగనుంది. ఇక ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లను మాత్రమే హెచ్సీఏ అందుబాటులో ఉంచింది. వీటి కోసం పెద్ద ఎత్తున జింఖానా గ్రౌండ్కు వెళ్లిన అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: Ind A vs NZ A 1st ODI: అదరగొట్టిన శార్దూల్, కుల్దీప్ సేన్.. 167 పరుగులకే కివీస్ ఆలౌట్ -
హెచ్సీఏ ఘోర వైఫల్యం.. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయి?
సాక్షి, హైదరాబాద్: ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద టికెట్ల అమ్మకాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA)ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. టిక్కెట్లు కోసం ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తున్నాయి. హెచ్సీఏ ఘోర వైఫల్యంపై ఆ అసోసియేషన్ మాజీ కార్యదర్శి శేష్ నారాయణ్ మండిపడ్డారు. 32 వేల టిక్కెట్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. చదవండి: ఉప్పల్ స్టేడియంలో ఇండియా– ఆస్ట్రేలియా మ్యాచ్.. అభిమానులతో ఆటలా! ‘‘ఒక్కరోజే ఇన్ని టిక్కెట్లు ఎలా అమ్ముదామనుకున్నారు. ఆన్లైన్లో అని చెప్పి ఆఫ్లైన్లోకి ఎందుకెళ్లారు?. హెచ్సీఏలో అజారుద్దీన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. తొక్కిసలాటకు ఆయనే బాధ్యత వహించాలి. 32 వేల టిక్కెట్లు అందుబాటులో ఉండాలి. టికెట్ల విక్రయానికి అన్ని చోట్ల కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ఒక్కచోటే కౌంటర్ పెట్టడం సరికాదు. ఒక్కరోజే టికెట్లు విక్రయించడం సరికాదు. కనీసం నాలుగైదు రోజులు టికెట్లు విక్రయించాలి. ఆన్లైన్లో అమ్మిన టికెట్లలో అక్రమాలు జరిగాయి. ఎవరికి టికెట్లు అమ్మారో వివరాలు బయటపెట్టాలి’’ అని శేష్ నారాయణ్ డిమాండ్ చేశారు. -
క్రికెట్ అభిమానులకు హెచ్సిఏ శుభవార్త
-
IND Vs AUS: జింఖానాలో ఇవాళ టికెట్ల విక్రయం
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ‘ఆఫ్లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్సైడర్’ యాప్ ద్వారా ఆన్లైన్లో హెచ్సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్సైడర్’తో చర్చలు జరిపిన హెచ్సీఏ టికెట్లను నేరుగా కౌంటర్లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్లైన్, ఆఫ్లైన్లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. బ్లాక్లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు. బ్లాక్లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఉప్పల్లో మూడో టీ20.. హెచ్సీఏకు క్రీడామంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ విషయంలో బ్లాక్ టికెట్స్పై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్ కేటాయిస్తున్నారో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివరాలతో సహా చెప్పాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టేడియం కట్టారన్నది గుర్తుంచుకోవాలన్నారు. పది మంది ఎంజాయ్ చేయడానికి, బ్లాక్ దందా కోసం మ్యాచ్ టికెట్స్ ఇవ్వలేదన్నారు. క్రికెట్ మ్యాచ్ టికెట్స్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. హెచ్సీఏ మ్యాచ్కు సంబంధించి టికెట్స్ అన్నింటిని సేల్ చేయాలని ఆదేశించారు. బ్లాక్ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబరు 25న(ఆదివారం) ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్- ఆసీస్ మధ్య మూడో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే. చదవండి: (స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు) -
భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్.. హెచ్సీఏలో టికెట్ల రగడ
ఉప్పల్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) నిర్లక్ష్య వైఖరిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య టీ– 20 క్రికెట్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో టికెట్ల కోసం క్రీడాభిమానులు పడిగాపులు కాస్తున్నారు. స్టేడియానికి నిత్యం వచ్చిపోతున్నా పట్టించుకోని పరిస్థితి నెలకొంది. టికెట్లు ఇక్కడ లభించవు జింఖానా గ్రౌండ్లో ఇస్తారని చెప్పి పంపిస్తున్నారు. అక్కడికి వెళితే ఉప్పల్ స్టేడియం వద్దే ఇస్తారంటూ పరుగులు పెట్టిస్తున్నారు. ఇలా అక్కడికీ.. ఇక్కడికీ తిప్పించుకోవడమే తప్ప టికెట్లు మాత్రం ఇవ్వడంలేదని అభిమానులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. టికెట్లు విక్రయించకుండా తమ మనోభావాలతో ఆడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. టికెట్ల అమ్మకాల విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని, నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని ఆరోపిస్తున్నారు. అరగంటలోనే అమ్ముడుపోయాయట.. ►టికెట్ల విక్రయం కోసం ఈ నెల 15 నుంచి పేటీఎం ఇన్సైడర్ యాప్ను అందుబాటులో ఉంచినట్లు స్వయంగా హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ చెబుతున్నప్పటికీ కేవలం అరగంటలోనే అన్ని టికెట్లు విక్రయించినట్లు, యాప్లో అవి అందుబాటులో లేకపోవడంతో హెచ్సీఏ పరువు దిగజార్చుకుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోయినా ఆఫ్లైన్లో అవి లభిస్తాయనే ఆశతో అభిమానులు ఉప్పల్ స్టేడియం చుట్టూ నిత్యం చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ►ఉప్పల్, రామంతాపూర్, నాచారం, సికింద్రాబాద్, అంబర్పేట, మెహిదీపట్నం, యాదగిరి గుట్ట, ఘట్కేసర్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చి ఉదయం నుంచే స్టేడియం గేటు వద్ద తిండీతిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. ఒకానొక దశలో గేట్ దూకి వెళ్లడానికి ప్రయత్నించి.. పోలీసులు అడ్డుకోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. టికెట్లు ఎప్పుడు ఇస్తారు? ఎక్కడ ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానం రాక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జింఖానా గ్రౌండ్ వద్ద గందరగోళం.. గేటుకు తాళం.. రసూల్పుర: క్రికెట్ మ్యాచ్ టికెట్లు ఇస్తున్నారనే వదంతులతో మంగళవారం సికింద్రాబాద్లోని జింఖానా గ్రౌండ్ వద్దకు వేలాది మంది క్రీడాభిమానులు ఒక్కసారిగా తరలి వచ్చారు. దీంతో భద్రతా సిబ్బంది మైదానం గేటుకు తాళం వేశారు. ఆగ్రహానికి గురైన అభిమానులు గోడ దూకి లోనికి వెళ్లారు. దీంతో సిబ్బంది లాఠీలకు పని చెప్పారు. లాఠీ దెబ్బలు తిన్న అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వెళ్లిపోయారు. దీంతో జింఖానా మైదానం పరిసర రోడ్లపై ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు జింఖానా మైదానానికి చేరుకుని అక్కడ ఉన్న కొందరు అభిమానులను పంపించివేశారు. గేట్ తీసే వరకు కదిలేది లేదని.. మరికొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నెల 14 నుంచి టికెట్ల కోసం జింఖానా మైదానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని ఆగ్రహం వ్యక్తంచేశారు. టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని, ఇప్పటికే అవి అమ్ముడుపోయాయని సిబ్బంది చెబుతున్నారని మండిపడ్డారు. జింఖానా మైదానంలో టికెట్లు ఇస్తారో లేదో స్పష్టంగా చెప్పడం లేదని విరుచుకుపడ్డారు. చదవండి: మ్యాచ్కు హాజరైన యువరాజ్.. కోహ్లితో మాటామంతీ Situation at hyderabad gymkhana grounds for australia vs india match tickets. #hca #cricket #india #t20 pic.twitter.com/a6FZLy6IuM — Poley_Adiripoley (@poleyadiripoley) September 21, 2022 -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మళ్ళీ రచ్చకెక్కిన విభేదాలు
-
IPL 2022: హైదరాబాద్ మాజీ క్రికెటర్కు బంపర్ ఆఫర్
ఈనెల 26 నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ 2022 సీజన్ కోసం బీసీసీఐ ప్రకటించిన ఆరుగురు రిఫరీల ప్యానెల్లో హైదరాబాద్ మాజీ రంజీ ఆటగాడు డేనియల్ మనోహర్కు చోటు దక్కింది. ఈ ప్యానెల్లో మనోహర్.. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్తో కలిసి పని చేయనున్నాడు. మనోహర్.. ఐపీఎల్లో రిఫరీగా వ్యవహరించబోయే తొలి హైదరాబాదీగా రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. గతంలో శివరాం, షంషుద్దీన్, నంద కిషోర్లు ఐపీఎల్లో హైదరాబాద్ నుంచి అంపైర్లుగా వ్యవహరించారు. మనోహర్.. 73 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్లో 8 సెంచరీలు, 20 హాఫ్ సెంచరీల సాయంతో 4009 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్లో 65 వికెట్లు పడగొట్టాడు. 2007-08 సీజన్ అనంతరం అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. 48 ఏళ్ల మనోహర్ భారత ఏ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించారు. చదవండి: Maxwell: ప్రత్యర్ధులు బహు పరాక్.. కెప్టెన్సీ భారం లేని కోహ్లి ఉప్పెనలా విరుచుకుపడతాడు.. -
Noel David: దయనీయ స్థితిలో టీమిండియా మాజీ క్రికెటర్.. భరోసా కల్పించిన హెచ్సీఏ
గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా మాజీ క్రికెటర్, హైదరాబాద్ ఆల్రౌండర్ నోయెల్ డేవిడ్ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహారుద్దీన్ సోమవారం కలిశాడు. ఈ సందర్భంగా నోయెల్ ఆరోగ్యం గురించి వైద్యుల వద్ద ఆరా తీసిన అజహార్.. నోయెల్ కిడ్నీ ఆపరేషన్కు అయ్యే ఖర్చునంతా హెచ్సీఏనే భరిస్తుందని భరోసా ఇచ్చాడు. Team India player was suffering in hospital for years, now Mohammad Azharuddin came forward to help, career was over after 4 matches! https://t.co/zucux7ioUR — News NCR (@NewsNCR2) February 28, 2022 అలాగే నోయెల్కు వ్యక్తిగత ఆర్ధిక సాయాన్ని కూడా చేస్తామని అజహార్ హామీ ఇచ్చాడు. ఆఫ్ స్పిన్ ఆల్రౌండర్ అయిన 51 ఏళ్ల నోయెల్.. 1997లో వెస్టిండీస్లో పర్యటించిన భారత జట్టులో సభ్యుడు. టీమిండియా తరఫున 1997లో నాలుగు వన్డేలు ఆడిన నోయెల్.. బ్యాటింగ్లో తన సామర్ధ్యానికి తగ్గ ప్రదర్శన చేయనప్పటికీ, బౌలంగ్లో పర్వాలేదనిపించి నాలుగు వికెట్లు పడగొట్టాడు. చదవండి: సచిన్ సహచరుడు, టీమిండియా మాజీ ప్లేయర్ అరెస్ట్ -
షేక్ రషీద్కు 10 లక్షల నజరానా... రిషిత్ రెడ్డికి ఎంతంటే!
U 19 World Cup Winner India:- విశాఖ స్పోర్ట్స్: భారత జట్టు అండర్–19 ప్రపంచకప్ టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఆంధ్ర క్రికెటర్ షేక్ రషీద్కు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) రూ. 10 లక్షల నజరానా ప్రకటించింది. రషీద్ భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర రెడ్డి, కోశాధికారి గోపినాథరెడ్డి, ఏసీఏ ఆపరేషన్స్ డైరెక్టర్ వేణుగోపాలరావు, సీఈవో శివారెడ్డి ఆకాంక్షించారు. మరోవైపు ప్రపంచకప్లో భారత జట్టుకు స్టాండ్బై ప్లేయర్గా ఉన్న హైదరాబాద్ యువ క్రికెటర్ రిషిత్ రెడ్డికి రూ. 10 లక్షలు అందజేస్తామని హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ ప్రకటించారు. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
నన్ను బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్/సనత్నగర్: హెచ్సీఏ నుంచి సస్పెండ్ అయిన కొంత మంది సభ్యులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మహ్మద్ అజారుద్దీన్ గురువారం బేగంపేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జాన్ మనోన్, విజయానంద్, నరేష్ శర్మలు జింఖానా గ్రౌండ్లోని హెచ్సీఏ కార్యాలయానికి వచ్చిఅక్కడ ఉండే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతూ, బెదిరిస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని బేగంపేట ఇన్స్పెక్టర్ పీ శ్రీనివాసరావు తెలిపారు. చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి Rishi Dhawan: ఐపీఎల్ ఆడకపోవడమే అతను చేసిన నేరమా.. అందుకే టీమిండియాకు ఎంపిక చేయలేదా..? -
హెచ్సీఏ అండర్–16 టోర్నీ విజేత గౌతమ్ కాలేజి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–16 స్కూల్, కాలేజీ టోర్నమెంట్లో గౌతమ్ జూనియర్ కాలేజీ (ఈసీఐఎల్) విజేతగా నిలిచింది. ఉప్పల్ స్టేడియంలో గురువారం జరిగిన ఫైనల్లో గౌతమ్ కాలేజి 71 పరుగుల ఆధిక్యంతో హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ జట్టుపై గెలిచింది. తొలుత గౌతమ్ కాలేజి 50 ఓవర్లలో 7 వికెట్లకు 297 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి (74 బంతుల్లో 93; 13 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. బిడిగుల బాలాజీ (46; 5 ఫోర్లు), రిషభ్ (35; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 298 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ వఫీ కచ్చి (119 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. గౌతమ్ కాలేజీ బౌలర్లలో బాలాజీ మూడు, రుతీష్ రెడ్డి రెండు, రవికుమార్ రెండు వికెట్లు తీశారు. గౌతమ్ కాలేజి జట్టు లెగ్ స్పిన్నర్ డి.మనీశ్ ఓవరాల్గా 14 వికెట్లు పడగొట్టి ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. భారత జట్టు మాజీ కెప్టెన్, హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత జట్లకు ట్రోఫీలు అందజేశారు. -
హెచ్సీఏ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తాం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కార్యకలాపాల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం మాజీ క్రీడాకారులు, న్యాయమూర్తుల పేర్లు ప్రతిపాదించాలని పిటిషనర్లకు సూచించింది. హెచ్సీఏ అంబుడ్స్మెన్ జస్టిస్ దీపక్వర్మ నియామకంపై సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెడుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హెచ్సీఏ , బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్లు దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. -
సుప్రీంకోర్టు: హెచ్సీఏ రోజువారీ కార్యకలాపాలకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో కొనసాగుతున్న ఆధిపత్య పోరు కారణంగా రోజూవారీ క్రికెట్ వ్యవహారాలకు అంతరాయం కలిగించవద్దని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అందుకే ఇకపై ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించి చెక్లపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్, కార్యదర్శి విజయానంద్ సంయుక్తంగా సంతకాలు చేయాలని ఆదేశించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన బెంచ్ చెక్ల విషయంలో ఈ తాత్కాలిక ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను దీపావళి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. -
ప్రపంచంలో అతి పెద్ద క్రికెట్ బ్యాట్ ఆవిష్కరణ..
World Biggest Cricket Bat Unveiled In Hyderabad: ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బ్యాట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై శనివారం ఆవిష్కరించబడింది. పెర్నాడ్ రికార్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూపొందించబడిన ఈ బ్యాట్ పొడవు 56.1 అడుగులు కాగా, బరువు 9 టన్నులుగా ఉంది. పాప్లర్ ఉడ్తో తయారు చేసిన ఈ బ్యాట్ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకుంది. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో టీమిండియాకు విషెస్ చెబుతూ.. ప్రజల సందర్శనార్ధం ఈ బ్యాట్ను ట్యాంక్ బండ్పై ఉంచారు. ఈ బ్యాట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్, తెలంగాణ పురుపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్ ప్రోమో.. రోమాలు నిక్కపొడుచుకుపోవాల్సిందే -
హైదరాబాద్ మహిళల వన్డే క్రికెట్ జట్టు ఇదే..
సాక్షి, హైదరాబాద్: బీసీసీఐ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. 27 మంది సభ్యులతో కూడిన హైదరాబాద్ జట్టుకు డి. రమ్య కెప్టెన్గా వ్యవహరించనుందని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తెలిపింది. జట్టులో ఐదుగురు స్టాండ్బైగా ఉన్నారు. బెంగళూరులో శనివారం నుంచి ఈ టోర్నీ మొదలయింది. టీమ్ ఇదే.. డి. రమ్య (కెప్టెన్), ప్రణవి చంద్ర (వైస్ కెప్టెన్), అనూరాధ నాయక్, ఎం.మమత (వికెట్ కీపర్లు), కీర్తి రెడ్డి, కె.అనిత, జి.త్రిష, యశశ్రీ, త్రిషా పూజిత, బి.శ్రావణి, బి.అంజలి, తెహ్నియాత్ ఫాతిమా, పి.పార్వతి, సాయిలేహ, క్రాంతి రెడ్డి, ప్రణతి రెడ్డి, వంకా పూజ, కోడూరి ఇషిత, ఆలపాటి ప్రణతి, పూజాశ్రీ, ఆశ్రిత రెడ్డి, సి.ఎస్.సాధ్వి. స్టాండ్బై: ఎం.అనిత, జి.కె.శ్రావ్య, టి.చందన, శివాని గౌడ్, మెర్లిన్ జాన్. విద్యుత్ జైసింహ (కోచ్), హర్ష హరినారాయణ (అసిస్టెంట్ కోచ్), స్రవంతి నాయుడు (ఫీల్డింగ్ కోచ్), గజానంద్ రెడ్డి, సునీతా ఆనంద్ (ట్రైనర్), హర్ష గంగ్వాల్ (ఫిజియో), మానస (మేనేజర్). -
‘హెచ్సీఏపై సీబీఐ అవసరం’
సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై సీబీఐ దర్యాప్తు అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. క్రికెట్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటోందని వ్యాఖ్యానించింది. హెచ్సీఏ అంబుడ్స్మెన్, ఎథిక్స్ అధికారిగా జస్టిస్ దీపక్ వర్మను నియమించాలని అపెక్స్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు పక్కన పెట్టడంతో హెచ్సీఏ, బడ్డింగ్స్టార్ క్రికెట్ క్లబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా హెచ్సీఏ వ్యవహారాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ కొంత మంది మంచి వ్యక్తుల్ని నియమిస్తాం. విచారణకు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులను నియమిస్తాం. హెచ్సీఏలోని రెండు గ్రూపులు మేనేజ్మెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. సీబీఐ దర్యాప్తు అవసరం. న్యాయవ్యవస్థను కూడా లాగాలని వారు చూస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘జస్టిస్ వర్మను ఎలాంటి ఆర్డర్ ఇవ్వొద్దని తెలపండి. ఆయన పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. బుధవారానికి విచారణ వాయిదా వేస్తాం. ఈ లోగా విచారణ నిమిత్తం కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పేర్లు పరిశీలిస్తాం’’ అని ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. -
హెచ్సీఏ వివాదం: హైకోర్టులో అజారుద్దీన్కు ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్తో పాటు మరికొందరిని అనర్హులుగా ప్రకటిస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్, జస్టిస్ దీపక్ వర్మ జారీచేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిలిపివేస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచందర్రావు, జస్టిస్ కె.లక్ష్మణ్లతో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ అజారుద్దీన్ దాఖలు చేసిన అప్పీల్ను ధర్మాసనం విచారించింది. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ చదవండి: దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే! -
అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అజారుద్దీన్కు హైకోర్టులో ఊరట లభించింది. హెచ్సీఏ ఉపాధ్యక్షుడు కె.జాన్ మనోజ్తోపాటు పలువురు ఎగ్జిక్యూటివ్ సభ్యులను సస్పెండ్ చేస్తూ హెచ్సీఏ అంబుడ్స్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ దీపక్ వర్మ గత నెల జూలై 4న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ జస్టిస్ టి.అమర్నాథ్గౌడ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డి, జస్టిస్ షమీమ్ అఖ్తర్లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. త్వరలో ఈ పిటిషన్ సింగిల్ జడ్జి ముందుకు విచారణకు రానున్న నేపథ్యంలో అప్పటివరకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోరాదని సూచించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై అజారుద్దీన్ ధర్మాసనాన్ని ఆశ్రయించారు. -
స్పోర్ట్స్మెన్గా అజహార్కు మర్యాదిస్తాం.. అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదు
సాక్షి, హైదరాబాద్: అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తూ అంబుడ్స్మెన్ జస్టిస్ దీపక్వర్మ ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ఇతర కౌన్సిల్ సభ్యులు బుధవారం ఉప్పల్ స్టేడియంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ను తిరిగి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్మన్కు అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేసే అధికారం లేదని కౌన్సిల్ ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ పేర్కొన్నారు. అంబుడ్స్మెన్ ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించామని, దానిపై అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చిందని ఆయన వెల్లడించారు. స్పోర్ట్స్మెన్గా అజహార్కు రెస్పెక్ట్ ఇస్తాం.. కానీ, అతనికి అడ్మినిస్ట్రేషన్ తెలీదని చురకలంటించారు. రేపటి నుండి జరిగే క్రికెట్ లీగ్స్కు అజహార్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. అసోసియేషన్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మరోవైపు, అంబుడ్స్మెన్గా దీపక్వర్మ నియామకం చెల్లదని అపెక్స్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ విజయానంద్ అన్నారు. అతన్ని అంబుడ్స్మెన్గా తాము ఎన్నికొలేదని పేర్కొన్నారు. ఏప్రిల్లో జరిగిన ఏజీఎమ్ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్ నిస్సార్ అహ్మద్ ఖక్రూను అంబుడ్స్మన్గా ఎన్నుకున్నారని తెలిపారు. ఈ నెల 18న అజహార్ నియమించిన జిల్లాల అఫిలియేషన్పై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. తమ స్పోర్ట్స్ రూంను లాక్ చేశారని, రికార్డులు స్వాధీనం చేసుకున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విషయమై రేపు లీగ్స్ ప్రారంభించడానికి వచ్చే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీనివాస్గౌడ్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ కేసు విషయమై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా పడిందని తెలిపారు. -
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హెటెన్షన్
-
హెచ్సీఏ వివాదం: జింఖానా వద్ద హైటెన్షన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ (హెచ్సీఏ)లో వివాదం ముదురుతోంది. సికింద్రాబాద్ జింఖానా వద్ద హెటెన్షన్ నెలకొంది. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రెస్మీట్కు పోలీసుల అనుమతి నిరాకరించారు. జింఖానా బయట భారీగా పోలీసుల మోహరించారు. ఈ క్రమంలో ఎలాగైనా ప్రెస్మీట్ నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. అంబుడ్స్మెన్ ప్రకటనపై అపెక్స్ కౌన్సిల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అజార్ విజ్ఞప్తి మేరకు జింఖానా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు అడ్డొస్తే ఎవరినీ ఉపేక్షించమని పోలీసులు తెలిపారు. జింఖానా నుంచి అజార్ను కూడా బయటకు పంపేందుకు పోలీసులు యత్నించారు. అజార్ గ్రూప్, జాన్ మనోజ్ గ్రూప్లను పోలీసులు అడ్డుకుంటున్నారు. హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్కు అంబుడ్స్మన్ మధ్య పంచాయతీ తీవ్రమవుతోంది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేశారు. గతంలో అజార్కు అపెక్స్ కౌన్సిల్ షోకాజ్ నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. అపెక్స్ కౌన్సిల్ జాన్ మనోజ్ను హెచ్సీఏ అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపథ్యంలో అజారుద్దీన్ ఫిర్యాదు మేరకు అంబుడ్స్మన్ దీపక్ వర్మ అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేశారు. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు కొనసాగనుంది. ఈ క్రమంలో అంబుడ్స్మన్ నిర్ణయాన్ని అపెక్స్ కౌన్సిల్ తప్పుపట్టింది. అంబుడ్స్మన్గా దీపక్ వర్మను ఏజీఎం వ్యతిరేకించింది. అపెక్స్ కౌన్సిల్ రద్దు చేసే అధికారం దీపక్వర్మకు లేదని పేర్కొంది. దీపక్వర్మ నియామకమే చెల్లదని అపెక్స్ కౌన్సిల్ అంటోంది. -
HCA లో కీలకపరిణామం అపెక్స్ కౌన్సిల్ రద్దు
-
హెచ్సీఏలో కొత్త ట్విస్ట్; అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేసిన అంబుడ్స్మన్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తున్నట్లు అంబుడ్స్మన్ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ జరిపేంత వరకు అపెక్స్ కౌన్సిల్ రద్దు చేస్తున్నట్లుగా అంబుడ్స్మన్ తెలిపింది. కాగా ఇటీవలే హెచ్సీఏలోని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారని, అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ అంబుడ్స్మన్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అజహర్ ఫిర్యాదును పరిశీలించిన అంబుడ్స్మన్ అపెక్స్ కౌన్సిల్ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే దీనిపై అపెక్స్ కౌన్సిల్ స్పందిస్తూ అసలు అంబుడ్స్మన్ నియామకం చెల్లదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబుడ్స్మన్గా దీపక్ వర్మను అజార్ ఏకపక్షంగా నియమించాడని.. ఆ వ్యక్తి అజహర్ చెప్పినట్టే వ్యవహరిస్తాడని పేర్కొంది. కాగా రేపు(సోమవారం) మధ్యాహ్నం 12 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ముదురుతున్న వివాదం
-
హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తాత్కాలిక అధ్యక్షుడిగా జాన్ మనోజ్ నియమితులయ్యారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ శుక్రవారం లెటర్ జారీ చేసింది. లోధా కమిటీ సిఫార్సుల మేరకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమిస్తూ తీర్మానం చేసింది. ఇక ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారని, నిబంధనలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను ఇటీవలే అపెక్స్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. హెచ్సీఏలో అతని సభ్యత్వం రద్దు చేసి షోకాజ్ నోటీస్ జారీచేసింది. కాగా నోటీసులపై అజారుద్దీన్ వివరణ ఇవ్వకపోవడంతో తాత్కాలిక ప్రెసిడెంట్ గా జాన్ మనోజ్ ను నియమిస్తున్నట్లు అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. మరోవైపు హెచ్సీఏలో వివాదం రోజురోజుకు ముదురుతుంది. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా హెచ్సీఏ తయారయ్యింది. అయితే క్రికెట్ సీజన్ మొదలవుతున్న వివాదాల్లో మునిగి తేలుతున్న హెచ్సీఏ ఇంకా గాడిన పడలేదు. చదవండి: అజారుద్దీన్ ఒక డిక్టేకర్లా వ్యవహరిస్తున్నాడు -
'వాళ్ల అవినీతి బయటపడుతుందనే నన్ను తొలగించారు'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసొసియేషన్(హెచ్సీఏ) అధ్యక్ష పదవి నుంచి భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ను నాటకీయ పరిణామాల మధ్య తొలిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ నోటీసులపై అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అజారుద్దీన్ మాట్లాడుతూ.. 'ఉద్దేశపూర్వకంగానే నాకు నోటీసులు ఇచ్చారు. హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగేలా నేనెప్పుడూ పనిచేయలేదు. అపెక్స్ కౌన్సిల్లో ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడ్డారు. వాళ్ల నిర్ణయమే అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంగా చెబితే ఎలా?. అవినీతిని అరికట్టడానికి అంబుడ్స్మన్ను నియమిస్తే అడ్డుకున్నారు... వాళ్ల అవినీతి బయటపడుతుందనే నాపై కుట్రలు పన్నారు' అంటూ చెప్పుకొచ్చారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అజహర్పైనే హెచ్సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. చదవండి: అజహరుద్దీన్పై వేటు! -
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ట్విస్ట్
-
అజహరుద్దీన్పై వేటు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అనూహ్య పరిణామం! నిబంధనలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా హెచ్సీఏ ప్రయోజనాలు దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారంటూ స్వయంగా అధ్యక్షుడిపైనే హెచ్సీఏ చర్య తీసుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ను ఆ పదవినుంచి తప్పిస్తున్నట్లు హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ప్రకటించింది. ఆయన హెచ్సీఏ సభ్యత్వం కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. అజహర్పై పలు ఆరోపణలు చేస్తూ ఈ నెల 10న అతనికి షోకాజ్ నోటీసు జారీ చేయగా...అందుకు అజహర్ స్పందించకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్లు అపెక్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. యూఏఈలో జరిగిన అనధికారిక టి10 టోర్నీలో ఒక జట్టుకు మెంటార్గా వ్యవహరించడం, తన రిటైర్మెంట్ తేదీపై తప్పుడు సమాచారం ఇవ్వడం, హెచ్సీఏ ఖాతాలను స్థంభింపజేయడం, అంబుడ్స్మన్ ని యామకం, ఆటగాళ్ల ఎంపికలో జోక్యం చేసుకోవడం, హెచ్సీఏ సమావేశాలకు హాజరు కాకపోవడం తదితర అంశాలపై ఆరోపణలు చేసిన అపెక్స్ కౌన్సిల్...ఇకపై అసోసియేషన్ కార్యకలాపాల్లో అజహర్ పాల్గొనరాదని నిషేధం విధించింది. గత కొంత కాలంగా అజహర్కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో అవతలి పక్షంపై ఇరు వర్గాలు విరుచుకు పడుతున్నాయి. వివాదం బీసీసీఐ వరకు చేరినా, దీనిపై బోర్డు పెద్దగా స్పందించలేదు. ఇదే అపెక్స్ కౌన్సిల్ విభేదించినా సరే... ఇటీవల జరిగిన ఎస్జీఎంలో కూడా హెచ్సీఏ ప్రతినిధిగా అజహర్ పాల్గొనే అవకాశం బీసీసీఐ కల్పించింది. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయానికి చట్టబద్ధత ఉందా లేదా అనే అంశంపై స్పష్టత లేని నేపథ్యంలో అజహర్పై వేటు అంశం ఆసక్తికరంగా మారింది. -
కిరాణా కొట్టులా హెచ్సీఏ: తీవ్ర స్థాయికి వివాదాలు
సాక్షి, హైదరాబాద్: ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రస్తుతం పరిస్థితులు సక్రమంగా లేవు. ఎన్నో వివాదాలతో హెచ్సీఏ సతమతమవుతోంది. తాజాగా మరో వివాదం రాజుకుంది. హెచ్సీఏ సీఈఓ నియామకంపై తలెత్తిన వివాదం ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదు. ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ఈ వివాదం కొనసాగుతోంది. హెచ్సీఏ సీఈఓగా సునీల్ కాంతేను నియమించినట్లు ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్ ప్రకటించారు. అయితే ఆ నియామాకం చెల్లదంటూ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న మహ్మద్ అజహరుద్దీన్ ఖండించాడు. నిబంధనలకు విరుద్ధంగా అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఈఓ నియామకం చెల్లదంటూ వాదించారు. సభ్యుల తీరుతో హెచ్సీఏను ‘కిరాణా కొట్టులా మార్ఛారు’ అంటూ తీవ్రస్థాయిలో అజార్ ధ్వజమెత్తారు. ఈ విధంగా హెచ్సీఏ ప్రస్తుతం తీవ్ర విబేధాల మధ్య నడుస్తోంది. పాలకవర్గంలో తారస్థాయికి విబేధాలు జరుగుతున్నాయి. వీటితో హెచ్సీఏ చరిత్ర మసకబారుతోందని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం! చదవండి: హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచ్.. నా చేతుల్లో మంత్రదండం లేదు -
హెచ్సీఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది
-
ఐపీఎల్ మ్యాచ్: నా చేతుల్లో మంత్రదండం లేదు
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్–2021 మ్యాచ్లను హైదరాబాద్లో నిర్వహించే అవకాశం రాకపోవడం పట్ల తనపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ వివరణ ఇచ్చారు. హెచ్సీఏ సీనియర్ సభ్యులు ఈ విషయంపై తనను తప్పుపట్టడంలో అర్థం లేదన్న అజహర్... చివరి వరకు తాను ప్రయత్నించానని స్పష్టం చేశారు. కరోనా నేపథ్యంలో ఈసారి లీగ్ను ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, కోల్కతా, అహ్మదాబాద్లలో మాత్రమే నిర్వహించనున్నారు. ‘అజహర్ వల్ల కాలేదని కొందరంటున్నారు. నా చేతుల్లో మంత్రదండం లేదు. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే బోర్డు, గవర్నింగ్ కౌన్సిల్ వేదికలను ఖరారు చేశాయి. ఉప్పల్ స్టేడియానికి అవకాశం లభించడం లేదని వార్తలు వచ్చిన వెంటనే నేను మళ్లీ బోర్డు పెద్దలతో మాట్లాడాను కూడా. హైదరాబాద్ను తప్పించిన విషయంలో బోర్డు కూడా అధికారికంగా ఎలాంటి కారణం చూపించలేదు కాబట్టి నాకూ తెలీదు. అయితే ఇప్పటికే ప్రకటించిన వేదికల్లో ఏదైనా కారణం చేత మ్యాచ్ల నిర్వహణ సాధ్యం కాకపోతే మన నగరం అందుకు సిద్ధంగా ఉందని నేను చెప్పగలను. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ విషయంలో హామీ ఇచ్చింది’ అని అజహర్ వ్యాఖ్యానించారు. కొందరు మాజీ క్రికెటర్లు తాజా ఐపీఎల్ వ్యవహారంలో తనను విమర్శిస్తున్నారని, నిజానికి వారి హయాంలో చేసిన తప్పులను ప్రస్తుత కమిటీ దిద్దుకుంటూ వస్తోందని మాజీ కెప్టెన్ అన్నారు. ‘ఆర్థికపరమైన బకాయిలు, జరిమానాలు... ఇలా చాలావాటిని మేం సరి చేస్తున్నాం. లేదంటే ఈపాటికి హెచ్సీఏ మూత పడేది. ఇన్ని మాటలు చెబుతున్నవారు తాము పదవిలో ఉన్నప్పుడు 2011 వన్డే వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ అయినా తీసుకొచ్చారా’ అని ఆయన ప్రశ్నించారు. -
లీగ్ మ్యాచ్లు ఆపండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఆధ్వర్యంలో ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. లీగ్ మ్యాచ్లలో ప్రతిభ కనబర్చిన వారికి స్పోర్ట్స్ కోటాలో తమ బ్యాంక్లో ఉద్యోగాలు ఇస్తామని, అయితే లీగ్ మ్యాచ్లలో తమను ఆడనివ్వడం లేదంటూ యూనియన్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రతిభావంతులను గుర్తించడానికి తాము లీగ్ మ్యాచ్లలో పాల్గొంటామని, ఈ మేరకు గతంలో హైకోర్టు ఆదేశించినా తమను లీగ్ మ్యాచ్లు ఆడనివ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది డాక్టర్ లక్ష్మీనరసింహం వాదనలు వినిపించారు.(చదవండి: ఓపెనర్గానే రోహిత్ శర్మ! ) ఈ విషయంపై స్పందించిన న్యాయమూర్తి... హెచ్సీఏ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎటువంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని ఆదేశించారు. కౌంటర్ దాఖలు చేయాలని హెచ్సీఏను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ఇటీవలే యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో సమస్య ఉత్పన్నమైంది. ఇప్పటికే హెచ్సీఏ లీగ్లో ఆంధ్రా బ్యాంక్ పేరుతో ప్రత్యేక జట్టు ఉంది. అయితే యూనియన్ బ్యాంక్లో ఆంధ్రా బ్యాంక్ విలీనం కావడంతో ఇప్పుడు యూనియన్ బ్యాంక్ కూడా తమను ప్రత్యేక జట్టుగా గుర్తించి మ్యాచ్ల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని హెచ్సీఏను కోరింది. -
నాలుగు రోజుల్లోనే మారిన కోచ్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్వాన్న పనితీరుకు మరో నిదర్శనం! దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం హెచ్సీఏ శనివారం 20 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే గత మంగళవారమే జట్టు కోచ్గా రంజీ మాజీ ప్లేయర్ అనిరుధ్ సింగ్ను ఎంపిక చేసిన హెచ్సీఏ ఇంతలోనే అతడిని తొలగించింది. అసిస్టెంట్ కోచ్గా ఉన్న జాకీర్ హుస్సేన్ను కొత్త కోచ్గా ప్రకటించింది. టీమ్ను ఎంపిక చేసే క్రమంలో హెచ్సీఏ నిర్వహిస్తున్న అంతర్గత టోర్నీ మ్యాచ్లకు అనిరుధ్ హాజరయ్యాడు కూడా. కానీ హెచ్సీఏ పెద్దల ప్రాధాన్యాలు మారిపోయాయి. అనిరుధ్ కోచ్గా పనికి రాడంటూ అతడిని పక్కన పెట్టేశారు. జట్టు ఎంపికలో తన అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయడమే కోచ్గా అనిరుధ్ చేసిన తప్పని తెలుస్తోంది! గత సీజన్లో కూడా అండర్–19 కోచ్గా వ్యవహరించిన అనిరుధ్ను సీజన్ మధ్యలోనే తప్పించింది. మరోవైపు కెప్టెన్గా మళ్లీ తన్మయ్ అగర్వాల్నే హెచ్సీఏ నియమించింది. గత రంజీ ట్రోఫీ సీజన్లో అతని సారథ్యంలో ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్లు చిత్తుగా ఓడినా ‘తమవాడు’ కాబట్టి మరోసారి కెప్టెన్సీని అప్పగించింది. జట్టు వివరాలు: తన్మయ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అభిరథ్ రెడ్డి, హిమాలయ్, సందీప్, రాహుల్ బుద్ధి, సాయి ప్రజ్ఞయ్ రెడ్డి, సుమంత్, మిలింద్, టి.రవితేజ, అజయ్దేవ్ గౌడ్, యుధ్వీర్ సింగ్, తనయ్ త్యాగరాజన్, మికిల్ జైస్వాల్, హితేశ్ యాదవ్, రాకేశ్ యాదవ్, ప్రతీక్ రెడ్డి, రక్షణ్, కార్తికేయ, ఎంఎస్ఆర్ చరణ్. -
‘నా ఎంపికను ప్రశ్నించే హక్కు మీకు లేదు’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అంబుడ్స్మన్ రిటైర్డ్ జస్టిస్ దీపక్ వర్మను ఎంపిక చేయడంతో అధ్యక్ష, కార్యదర్శి వర్గాల మధ్య వచ్చిన విభేదాల అంకం కీలక మలుపు తీసుకుంది. ఈ విషయంలో కార్యదర్శి విజయానంద్ తదితరులపై అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్దే పైచేయి అయింది. తమకు తెలీకుండా, తమ సూచనలను పరిగణలోకి తీసుకోకుండా అజహర్ ఏకపక్షంగా అంబుడ్స్మన్ను నియమించారని, అది చెల్లదంటూ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు వాదిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు స్వయంగా దీపక్ వర్మ దీనిపై స్పందించారు. అంద రి అనుమతితోనే గత జూన్లోనే తనను ఎంపిక చేసినట్లు, ఇప్పుడు కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను హెచ్సీఏ అంబుడ్స్మన్గా బాధ్యతలు కూడా స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు వర్మ నేరుగా లేఖ రాశారు. (చదవండి: వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!) తన నియామకాన్ని మళ్లీ ప్రశ్నిస్తే న్యాయపరంగా తగిన చర్య తీసుకుంటామని కూడా ఆయన హెచ్చరించారు. ‘హెచ్సీఏ అంబుడ్స్మన్గా బాధ్యతలు చేపట్టాలని కార్యదర్శి విజయానంద్ నాకు స్వయంగా లేఖ రాయడంతో నేను అంగీరిస్తున్నట్లు బదులిచ్చాను. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసాధారణ నిర్ణయాల అవసరం ఉంది కాబట్టి జూన్ 6న జరిగిన సమావేశంలో దీనికి ఆమోద ముద్ర వేశారు. పైగా ప్రభుత్వ నిబంధనల కారణంగా ఏజీఎం ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదు కాబట్టి ముందుగా నన్ను నియమించేసి ఆ తర్వాత అంతా చక్కబడిన తర్వాతైనా అధికారికంగా ఆమోద ముద్ర వేయవచ్చని కూడా అదే సమావేశంలో స్పష్టం చేశారు. దీనికి హాజరైన సభ్యులంతా అంగీకారం తెలిపారే తప్ప ఏ ఒక్కరూ అభ్యంతర పెట్టలేదు. అంబుడ్స్మన్గా నా నియమాకంలో ఎలాం టి అక్రమమూ జరగలేదు. అపాయింట్మెంట్ లెటర్పై సంతకం లేకుండా ఉండటం పెద్ద సమస్య కాదు. పైగా నాడు అంగీకారం తెలిపిన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారులకు నన్ను ప్రశ్నించే అధికారం లేదు. మళ్లీ దానిని తప్పుగా చూపిస్తూ ఏవైనా లేఖలు రాస్తే వారిపై చర్య తీసుకుంటాం’ అని దీపక్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. వర్మ ఇప్పటికే ఢిల్లీ క్రికెట్ సంఘానికి కూడా అంబుడ్స్మన్గా వ్యవహరిస్తున్నారు. -
అజహరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య వివాదం!
సాక్షి, హైదరాబాద్: సరిగ్గా ఏడాది క్రితం వారంతా కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు, ఘన విజయం సాధించారు. కానీ ఇప్పుడు మాత్రం అంతర్గత విభేదాలతో రచ్చకెక్కుతున్నారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో తాజా పరిస్థితి ఇది. అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్కు, ఇతర అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వివాదం చివరకు పోలీస్ స్టేషన్ దాకా చేరింది. హెచ్సీఏ సభ్యులు తనను బహిరంగంగా తిట్టారంటూ అజహర్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోశాధికారి సురేందర్ అగర్వాల్, మరో సభ్యుడు మొయిజుద్దీన్లపై పోలీసులు సెక్షన్ 504, 506ల కింద కేసులు నమోదు చేశారు. అసోసియేషన్ పనికి సంబంధించి ఒక హెచ్సీఏ ఉద్యోగి సురేందర్ అగర్వాల్ వద్దకు వెళ్లగా... ఆయనతో పాటు మరి కొందరు కలిసి సదరు ఉద్యోగితో పాటు అజహర్ను కూడా బూతులు తిట్టడంతో వివాదం ముదిరినట్లు తెలిసింది. దాంతో తనను దూషించారంటూ అజహర్ వర్గం పోలీసులను ఆశ్రయించింది. దీనికి సంబంధించి సోమవారం పోలీసులు విచారణ జరిపే క్రమంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కూడా కొంత గొడవ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడి రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. మరోవైపు సురేందర్ అగర్వాల్పై ఇంకో కేసు కూడా నమోదైంది. హెచ్సీఏ క్లబ్లకు రూ. 50 వేలు ఇస్తున్నామంటూ తమకు మాత్రం ఇవ్వలేదని, నిధులను కోశాధికారి సురేందర్ దుర్వినియోగం చేశారంటూ షాలీమార్ క్రికెట్ క్లబ్ యజమాని ఎజాజ్ అలీ ఖురేషీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే కారణమా... సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలు అమలు చేయాల్సి ఉంది. ఈ విషయంలో అజహర్కు, ఇతర సభ్యులకు మధ్య విభేదాలు మొదలైనట్లు సమాచారం. హెచ్సీఏలో వివాదాల పరిష్కారం కోసం జస్టిస్ దీపక్ వర్మను అజహర్ అంబుడ్స్మన్ నియమించారు. ఇది కమిటీలో ఇతర సభ్యులకు నచ్చలేదు. తమతో ఏమాత్రం సంప్రదించలేదని, ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని వారు చెబుతున్నారు. అయితే గత ఏడాది కొత్త కార్యవర్గం ఎన్నికైన తర్వాత జరిగిన తొలి సమావేశంలోనే ఇందుకు అంగీకారం తెలిపారని, నాటి సమావేశం మినిట్స్లో కూడా ఇది ఉందనేది అజహర్ వాదన. రాబోయే ఏజీఎంలో ఆమోద ముద్ర వేసిన తర్వాతే అంబుడ్స్మన్ నియామకాన్ని అమల్లోకి తేవాలని అజహర్ వ్యతిరేక బృందం చెబుతోంది. అయితే కరోనా నేపథ్యంలో 200కు పైగా సభ్యులు హాజరయ్యే అవకాశం ఇప్పట్లో లేని నేపథ్యంలో ఏజీఎం సాధ్యం కాదంటున్న అజహర్... ఏడాది కాలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడంతో అసోసియేషన్ ఎలా పని చేస్తుందనేది మరో వర్గం వాదన. ఇటీవల క్లబ్ల పూర్తి వివరాలు, యజమానుల వివరాలు తనకు ఇవ్వాలంటూ అజహర్ లేఖ రాయడం కూడా వివాదానికి కారణమైంది. అంబుడ్స్మన్ వస్తే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కింద తమకు ఇబ్బందురు ఎదురు కావచ్చనే కారణంతోనే హెచ్సీఏలో పలువురు సభ్యులు అజహర్ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారని సమాచారం. చదవండి: ‘టీ20ల్లో ఆ మార్పు చేసి చూడండి.. ’ -
ఉప్పల్ స్టేడియంను ఉపయోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 నుంచి తెలంగాణ ప్రజలను రక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో తాము కూడా భాగం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) వెల్లడించింది. ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను కరోనా బాధితుల కోసం ఐసోలేషన్ సెంటర్గా ఉపయోగించునేందుకు ఇస్తామని హెచ్సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ ప్రకటించారు. వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడేలా స్టేడియంలో 40 పెద్ద గదులు ఉన్నాయని, అతి పెద్ద పార్కింగ్ సదుపాయం ఉండటం వల్ల కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుందని హెచ్సీఏ పేర్కొంది. కరోనాను ఎదుర్కొనే క్రమంలో సామాజిక బాధ్యతగా తాము స్టేడియాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసోసియేషన్ స్పష్టం చేసింది. -
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ నివారణ చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పులువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ కోరారు. స్టేడియంలో 40 పెద్ద రూమ్లు ఉన్నాయని, పార్కింగ్ సదుపాయం కూడా ఉందని తెలిపారు. ఇది ఐసోలేషన్ కేంద్రంగా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ మేరకు హెచ్సీఏ సెక్రటరీ ఆర్ విజయానంద్ బుధవారం సీఎం కేసీఆర్కు లేఖ రాశారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాపై పోరాటానికి తమ వంతు సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. -
అజహరుద్దీన్పై ఎఫ్ఐఆర్..
సాక్షి, హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్పై ఔరంగాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అజహరుద్దీన్తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదయినట్లు తెలుస్తోంది. అజహరుద్దీన్తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని ఔరంగాబాద్కు చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్ఐఆర్ నమోదు కావడంపై అజహరుద్దీన్ స్పందించారు. ఔరంగాబాద్ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తన లీగల్ టీమ్తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని అజహరుద్దీన్ పేర్కొన్నారు. -
అంబటి రాయుడిపై చర్యలు!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి రాజ్యమేలుతోందని క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. హెచ్సీఏలోని పెద్దల్ని అవమానపరుస్తూ రాయుడు చేసిన వ్యాఖ్యలపై నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్సీఏలో ముఖ్యడొకరు పేర్కొన్నారు.దాంతో రాయుడిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ఏడాదిలో చాలా మ్యాచ్లు ఉంటాయి.. ఫిట్గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది. హెచ్సీఏ గౌరవానికి భంగం కలిగించిన రాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే మేము నడుచుకుంటాం. మొదటగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఈవోను ఆదేశిస్తాం. నివేదిక సమర్పించిన తర్వాత అత్యున్నత మండలి అతనిపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని సదరు సభ్యుడు పేర్కొన్నారు హెచ్సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ట్వీట్ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్ సర్... దయచేసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి. జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. దీనిపై హెచ్సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంబటి రాయుడు తీవ్ర అసహనంలో ఉన్నాడంటూ పేర్కొన్నాడు. అయితే దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దని అజహర్కు అంబటి రాయుడు సూచించాడు. హెచ్సీఏ అభివృద్ధికి అందరం కలిసి పని చేద్దామని తెలిపాడు. -
హెచ్సీఏలో అవినీతి రాజ్యమేలుతోంది
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)పై పెద్ద పిడుగు పడింది. క్రికెట్ సంఘాలపై అవినీతి ఆరోపణలు తరచుగా వార్తల్లో కనిపించేవే. అయితే ఈసారి భారత క్రికెటర్, అత్యంత అనుభవజు్ఞడు, హెచ్సీఏను దగ్గరి నుంచి చూసిన వ్యక్తి హైదరాబాద్కు చెందిన అంబటి రాయుడు సంఘంలో జరుగుతోన్న అవినీతిని బహిరంగంగా ఎండగట్టాడు. జట్టు ఎంపికలో డబ్బు, హోదా, రాజకీయ ఫలితాలు ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంటూ ఏకంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)కు ట్వీట్ చేశాడు. పలు ఏసీబీ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నాడు. ‘కేటీఆర్ సర్... దయచేసి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రబళిన అవినీతిపై దృష్టి సారించండి. జట్టు ఎంపికను డబ్బు, అవినీతి పరులు ప్రభావితం చేస్తుంటే హైదరాబాద్ క్రికెట్ ఎలా అభివృద్ధి చెందుతుంది? వారిపై చర్య తీసుకోండి. ఏసీబీ కేసుల్ని ఎదుర్కొంటోన్న పలువురు హైదరాబాద్ క్రికెట్ను శాసిస్తున్నారు’ అని రాయుడు ట్వీట్లో తీవ్రంగా ఆరోపించాడు. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సీజన్ రంజీ ట్రోఫీలో ఆడలేనంటూ రాయుడు జట్టు నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో బి. సందీప్ హైదరాబాద్కు సారథ్యం వహించనున్నాడు. అంబటి రాయుడు ఆరోపణలను హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తేలికగా తీసుకున్నారు. రాయుడు వ్యాఖ్యలపై స్పందిస్తూ అతను నిస్పృహలో ఉన్న క్రికెటర్ అని అన్నారు. -
హెచ్సీఏపై అంబటి రాయుడు తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్వల్ప వ్యవధిలోనే యూటర్న్ తీసుకుని హైదరాబాద్ క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైన తెలుగు తేజం అంబటి రాయుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో అవినీతి పెరిగిపోయిందంటూ తీవ్ర ఆరోపణలు చేశాడు. దాంతో తాను వచ్చే రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉంటానంటూ ప్రకటించాడు. దీనిలో భాగంగా హెచ్సీఏలో అవినీతిని నిరోధించాలంటూ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్కు) ట్వీట్ చేశారు. ‘హలో కేటీఆర్ సార్. హెచ్సీఏలో తీవ్రంగా ప్రబలిన అవినీతిపై దృష్టి పెట్టండి. అసలు హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించకపోవడానికి అవినీతే కారణం. హెచ్సీఏను డబ్బుతో ప్రభావితం చేసేవారి సంఖ్య పెరిగిపోయింది. హెచ్సీఏను ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో వారిపై చాలా ఏసీబీ కేసులు ఉన్నాయి. వారికే రెడ్ కార్పెట్ పరుస్తున్నారు’ అని అంబటి రాయుడు ట్వీట్ చేశాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో భాగంగా హైదరాబాద్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అంబటి రాయుడు.. జట్టులో రాజకీయాలు పెరిగిపోయాయని ఆరోపిస్తున్నాడు. ప్రస్తుత పరిణామాలతో జట్టులో మంచి వాతావరణం లేదన్నాడు. దాంతోనే తాను హైదరాబాద్ జట్టుకు దూరంగా ఉండదలుచుకున్నానని పేర్కొన్నాడు. ‘ నిజాయితీగా చెప్పాలంటే నేను రంజీ ట్రోఫీ ఆడదామనుకున్నా. కానీ ఒక కెప్టెన్గా నేను ఊహించినట్లు జరగడం లేదు. రాజకీయాలు పెరిగిపోయాయి. మంచి క్రికెట్ ఆడే వాతావరణం ఇప్పుడు హైదరాబాద్ జట్టులో లేదు. నేను హైదరాబాద్ క్రికెట్ జట్టులో సౌకర్యవంతంగా లేను’ అని ఒక ఇంటర్యూలో పేర్కొన్నాడు. Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet. — Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019 -
సహస్రారెడ్డి సెంచరీ వృథా
సాక్షి, హైదరాబాద్: విశాక బ్యాట్స్మన్ సహస్రా రెడ్డి (147 బంతుల్లో 103; 17 ఫోర్లు) అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ సహచరులు విఫలమవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. బౌలింగ్లో నదీమ్ (5/57) చెలరేగడంతో హెచ్సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్లో భాగంగా రోహిత్ ఎలెవన్తో జరిగిన మ్యాచ్లో విశాక సీసీ 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆట రెండోరోజు మంగళవారం 214 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన విశాక సీసీ 59.1 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. సహస్రా రెడ్డి కీలక సెంచరీ సాధించగా, సాయి విహారి (41; 9 ఫోర్లు) రాణించాడు. మిగతా బ్యాట్స్మెన్ విఫలమవ్వడంతో విశాక జట్టు పరాజయం పాలైంది. అంతకుముందు రోహిత్ ఎలెవన్ 61.1 ఓవర్లలో 213 పరుగులు చేసింది. అపెక్స్ సీసీతో మంగళవారం మొదలైన మరో మ్యాచ్లో విజయ్ హనుమాన్ సీసీ జట్టు సాధారణ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన విజయ్ హనుమాన్ 51.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. రాజశేఖర్ (62; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. సాహిల్ (37) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాహుల్ రెడ్డి 4 వికెట్లు, వినీత్ 5 వికెట్లతో ప్రత్యరి్థని కట్టడి చేశారు. సలీమ్ పాషా హ్యాట్రిక్.. స్పోర్టివ్ సీసీ విజయం హెచ్సీఏ ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్లో స్పోర్టివ్ సీసీ బౌలర్ సలీమ్ పాషా (6/58) అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ‘హ్యాట్రిక్’తో సహా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో మంగళవారం హైదరాబాద్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో స్పోర్టివ్ సీసీ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టైటాన్స్ 69 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఎస్. రోహిత్ రెడ్డి (76; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, జైనాథ్ మాన్సింగ్ (49; 9 ఫోర్లు) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సలీమ్ పాషా 6 వికెట్లతో చెలరేగాడు. అనంతరం స్పోరి్టవ్ సీసీ 47.1 ఓవర్లలో 8 వికెట్లకు 190 పరుగులు చేసి గెలుపొందింది. స్వామి నాయుడు (34) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో సాకేత్ 3... నరేందర్ గౌడ్, రోహిత్ రెడ్డి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హర్షవర్ధన్ 201 నాటౌట్
సాక్షి, హైదరాబాద్: హెచ్సీఏ రెండు రోజుల క్రికెట్ లీగ్లో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు బ్యాట్స్మన్ హర్షవర్ధన్ సింగ్ దుమ్మురేపాడు. మంగళవారం ఉస్మానియాతో మొదలైన ఈ మ్యాచ్లో అతడు ఏకంగా ద్విశతకం (252 బంతుల్లో 201 నాటౌట్; 27 ఫోర్లు, 4 సిక్స్లు)తో కదంతొక్కాడు. దీంతో బ్రదర్స్ ఎలెవెన్ జట్టు 90 ఓవర్లలో 9 వికెట్లకు 409 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్లో హర్షవర్ధన్ నిలకడగా రాణిస్తున్నాడు. అతని ఖాతాలో మూడు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ చేరాయి. గత మ్యాచ్ల్లో పీకేఎంసీసీపై (111), జాన్సన్ స్కూల్ (102 నాటౌట్), హైదరాబాద్ టైటాన్స్ (101 నాటౌట్) అతను సెంచరీలు సాధించాడు. ఓపెనర్ మణికంఠ (89 బంతుల్లో 92; 9 ఫోర్లు, 7 సిక్స్లు) శతకాన్ని చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. -
40 ఫోర్లు, 15 సిక్సర్లతో ట్రిపుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల లీగ్లో మహబూబ్నగర్ బ్యాట్స్మన్ జి. గణేశ్ (192 బంతుల్లో 329; 40 ఫోర్లు, 15 సిక్సర్లు) దూకుడైన ట్రిపుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. గణేశ్ వీర విధ్వంసంతో బుధవారం డబ్ల్యూఎంసీసీతో ముగిసిన మ్యాచ్ లో మహబూబ్నగర్ జట్టు 483 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ జట్టు 79.4 ఓవర్లలో 658 పరుగుల భారీస్కోరు సాధించింది. గణేశ్ విజృంభణకు తోడు అబిద్ (69 బంతుల్లో 110; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) కూడా సెంచరీతో చెలరేగాడు. పి. హర్షవర్ధన్ (49; 9 ఫోర్లు), కేశవులు (78; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో టైటస్ 5 వికెట్లతో ఆకట్టుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో డబ్ల్యూఎంసీసీ తడబడింది. బుధవారం ఇన్నింగ్స్ ప్రారంభించిన డబ్ల్యూఎంసీసీ 49.4 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అక్షయ్ (28), హర్ష (28), శరత్ (28) పరవాలేదనిపించారు. మహబూబ్నగర్ బౌలర్లలో కయ్యుం 3, రుషేంద్ర 2 వికెట్లు దక్కించుకున్నారు. -
హెచ్సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు
హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)కు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహ్మద్ అజహరుద్దీన్ తన బాధ్యతలను స్వీకరించారు. సోమవారం హెచ్సీఏ అధ్యక్షునిగా అజహర్ బాధ్యతలు చేపట్టారు. ఇక వైస్ ప్రెసిడెంట్గా జాన్ మనోజ్, సెక్రటరీగా విజయానంద్. జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మ, ట్రెజరర్గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్గా అనురాధలు తమ బాధ్యతలను స్వీకరించారు.కొన్ని రోజుల క్రితం హెచ్సీఏ అధ్యక్షుడిగా అజహర్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్ను కూడా గెలిపించుకున్నారు. హెచ్సీఏ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అజహర్ మాట్లాడుతూ.. ‘ క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాను. హెచ్సీఏ అవినీతి మరకలు తుడిచేసి పూర్వ వైభవం తీసుకొస్తా. జిల్లాల్లో స్టేడియంలు అభివృద్ధి చేస్తా. అన్ని ప్యానల్ను కలుపుకుని వారి సలహాలు, సూచనలు స్వీకరిస్తా’ అని అన్నారు. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్చంద్కు వచ్చిన మొత్తం ఓట్ల కంటే అజహర్కు వచ్చిన మెజారిటీ ఎక్కువ కావడం ఇక్కడ విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్కుమార్కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. -
కేటీఆర్తో అజహర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రితో భారత క్రికెట్ మాజీ కెపె్టన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) అధ్యక్షుడిగా ఎన్నికైన మహ్మద్ అజహరుద్దీన్ శనివారం భేటీ అయ్యారు. హెచ్సీఏ అధ్యక్షుడిగా శుక్రవారం ఎన్నికైన అజహరుద్దీన్.. తాను సీఎం కేసీఆర్, కేటీఆర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ప్రగతిభవన్లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్తో అరగంటపాటు ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో అజహరుద్దీన్ మాట్లాడుతూ హైదరాబాద్లో క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం గురించి చర్చించినట్లు వెల్లడించారు. హైదరాబాద్లో ప్రతిభావంతులైన ఎందరో యువకులున్నా, సరైన అవకాశాలు రావడం లేదనే విషయంతోపాటు, క్రికెట్ అభివృద్ధికి చేపట్టాల్సిన మౌలిక వసతుల కల్పన గురించి కేటీఆర్ వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు. హెచ్సీఏ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తనతోపాటు నూతనంగా ఎన్నికైన హెచ్సీఏ కార్యవర్గాన్ని కేటీఆర్కు పరిచయం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించేందుకు ఆయన నిరాకరిస్తూ.. హెచ్సీఏ అధ్యక్షుడి హోదాలో తాను కేవలం క్రికెట్కు సంబంధించిన అంశాలపైనే కేటీఆర్ను కలిసినట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ను ఎప్పుడు కలుస్తారని ప్రశ్నించగా ‘సీఎం రాష్ట్రానికి బాస్.. వీలైనంత త్వరలో ఆయనను కలుస్తా’అని సమాధానం ఇచ్చారు. -
కేటీఆర్ను కలిసిన అజహరుద్దీన్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ సారథి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) తాజా అధ్యక్షుడు మొహమ్మద్ అజహరుద్దీన్ శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ను బుద్ధ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. అజహర్తో పాటు తాజాగా ఎన్నికైన హెచ్సీఏ ప్యానల్ సభ్యులు కూడా కేటీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా హెచ్సీఏ కొత్త ప్యానల్కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. క్రికెట్ అభివృద్దికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుందని, హెచ్సీఏ కూడా తగిన కృషి చేయాలని సభ్యులకు సూచించారు. అయితే ఈ భేటీపై అనేక రాజకీయ ఊహాగానాలకు తెరదీస్తోంది. అజహరుద్దీన్ శుక్రవారం హెచ్సీఏ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ రాష్ట్రానికి బాస్ అంటూ పేర్కొనడంతో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఇన్నాళ్లూ హెచ్సీఏ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ జి.వివేక్కు చెక్ పెట్టేందుకు అజహర్కు టీఆర్ఎస్ పరోక్ష సహకారమందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్లోకి చేరడానికి ఇదే సరైన సమయమని అజహర్ భావిస్తున్నట్లు అతడి సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం కేసీఆర్ను కూడా కలుస్తాం.. క్రికెట్కు ప్రభుత్వ సహకారాన్ని అందించాలని మాత్రమే మంత్రి కేటీఆర్ను కలిశానని హెచ్సీఏ అధ్యక్షుడు అజహరుద్దీన్ తెలిపారు. 33 జిల్లాల్లో యువత ప్రతిభనను గుర్తించి క్రికెట్లోకి తీసుకవస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అందరినీ కలిసి క్రికెట్ అభివృద్దికి పాటుపడేలా కోరుతామని తెలిపారు. సీఎం కేసీఆర్ను కూడా కలిసి హెచ్సీఏ, క్రికెట్ క్రికెట్ అభివృద్దికి సహకరించాలని కోరతామని అజహరుద్దీన్ వివరించారు. -
అజహరుద్దీన్.. ఇలా గెలిచెన్
సాక్షి, హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికల్లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. అధ్యక్షుడిగా ఆయన విజయం సాధించడమే కాకుండా తన ప్యానల్ను కూడా గెలిపించుకున్నారు. హెచ్సీఏ చరిత్రలో ఒకే ప్యానెల్ అన్ని స్థానాలు కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ ప్యానెల్ సపోర్ట్ చేసిన ప్రెసిడెంట్ అభ్యర్థి ప్రకాశ్చంద్ జైన్ కేవలం 73 ఓట్లతో సరిపెట్టుకున్నారు. ప్రకాశ్చంద్కు వచ్చిన ఓట్ల కంటే ఒక ఓటు ఎక్కువ మెజారిటీతో అజర్ గెలుపొందడం విశేషం. మరో ప్రత్యర్థి దిలీప్కుమార్కు కేవలం 3 ఓట్లు మాత్రమే దక్కాయి. అజహరుద్దీన్ 147 ఓట్లు దక్కించుకుని, 74 ఓట్ల ఆధిక్యం సాధించారు. 227 ఓట్లకు గాను 223 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శాండ్రా బ్రాన్గాంజా(మహిళా క్రికెటర్), అర్జున్ యాదవ్(ఇండియా సిమెంట్), పి. వెంకటేశ్వర్లు(ఆక్స్ఫర్డ్ బ్లూస్ క్రికెట్ క్లబ్), శ్రీనివాస్ ఆచార్య(ఉస్మానియా మెడికల్ కాలేజీ) ఓటు వేయలేదు. మొత్తం మూడు ఓట్లు(సంయుక్త కార్యదర్శికి రెండు, కౌన్సిలర్కి ఒకటి) చెల్లలేదు. ఫలించిన అజర్ కల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడు కావాలన్న కలను అజహరుద్దీన్ ఎట్టకేలకు సాకారం చేసుకున్నారు. రెండేళ్ల క్రితం హెచ్సీఏ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసి భంగపడ్డ ఆయన ఈసారి వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం అందుకున్నారు. హెచ్సీఏలో పట్టున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, తదితరుల అండతో మాజీ అధ్యక్షుడు వివేక్ ప్యానెల్ మద్దతు ఇచ్చిన ప్రకాశ్చంద్ను చిత్తుగా ఓడించారు. వివేక్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం కూడా అజర్కు కలిసొచ్చింది. కేసీఆర్ను కలుస్తా: అజర్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో అజహరుద్దీన్ పార్టీ మారతారన్న ప్రచారం మరోసారి ఊపందుకుంది. టీఆర్ఎస్ మద్దతుతోనే ఆయన గెలిచారన్న చర్చ కూడా జరుగుతోంది. దీనిపై ఆయన స్పందిస్తూ.. పార్టీ మారతానో, లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు. టీఆర్ఎస్లో చేరతానో, లేదో చెప్పే వేదిక ఇది కాదని అన్నారు. తన ప్యానల్తో సహా ప్రగతి భవన్కు వెళ్లి శనివారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవనున్నట్టు తెలిపారు. క్రికెట్ అభివృద్ధి గురించి సీఎంతో చర్చిస్తానని చెప్పారు. కాగా, అజహరుద్దీన్.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హర్షం ప్రకటించిన కాంగ్రెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అజహరుద్దీన్ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం ప్రకటించింది. అజహరుద్దీన్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు అభినందనలు తెలిపారు. వి.హనుమంతరావు నేతృత్వంలో గాంధీభవన్ వద్ద బాణసంచా కాల్చి కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. ప్రేమ్లాల్, అఫ్జలుద్దీన్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. -
మొదలైన పోలింగ్.. అధ్యక్షుడు ఎవరో?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకే ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో 230 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. హెచ్సీఏ అధ్యక్షపదవి కోసం టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్, దిలీప్ కుమార్, ప్రకాష్చంద్ జైన్లు ప్రధానంగా పోటీపడుతుండగా.. ఉపాధ్యక్ష పదవి కోసం జాన్ మనోజ్, సర్దార్ దల్దీత్ సింగ్లు రేసులో ఉన్నారు. హాట్ ఫేవరేట్గా అజారుద్దీన్.. హెచ్సీఏ అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నా.. అందరి చూపు టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్పైనే ఉంది. అజారుద్దీన్ కూడా తన గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే తన నామినేషన్ తిరస్కరణ కావడంతో హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు గడ్డం వివేక్ వెంకటస్వామి అజారుద్దీన్కు వ్యతిరేకంగా ప్రకాష్ ప్యానెల్కు మద్దతు ఇస్తున్నారు. దీంతో ఈ సారి అధ్యక్షుడు ఎవరనే దానిపై అందిరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఎన్నికల్లో అంతర్జాతీయ మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, శివలాల్ యాదవ్, అర్షద్ ఆయుబ్, నోయల్ డేవిడ్, సాండ్రా బ్రగాంజ్, రజనీ వేణుగోపాల్, పూర్ణిమా రావు, డయానా డేవిడ్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
నామినేషన్ తిరస్కరణ.. వివేక్ ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష పదవి కోసం తాను దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించడం అన్యాయమని మాజీ అధ్యక్షుడు జి.వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ ళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఫిక్సింగ్కు పాల్పడిన అజహరుద్దీన్ను వెనుకేసుకొస్తూ, క్రికెట్ అభివృద్ధికి కృషి చేసిన తన నామినేషన్ను తిరస్కరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. ‘క్రమశిక్షణా కమిటీ విచారణలో తాను ఫిక్సింగ్ చేసినట్లు స్వయంగా అజహరుద్దీన్ ఒప్పుకున్నారు. అయినా అతని నామినేషన్ స్వీకరించారు. ఇప్పటికీ బీసీసీఐ అతనిపై నిషేధాన్ని ఎత్తివేయలేదు. నిషేధాన్ని ఎత్తివేస్తే అందుకు సంబంధించిన పత్రాల్ని బయట పెట్టమనండి. బీసీసీఐ నుంచి నిధులు రాకున్నా సొంత ఖర్చుతో టి20 లీగ్ నిర్వహించా. నాపై తప్పుడు రిపోర్టులు సృష్టించి హెచ్సీఏకు దూరం చేశారు’ అని ధ్వజమెత్తారు. తమ ప్యానెల్నుంచి అధ్యక్షుడిగా ప్రకాశ్ చంద్ జైన్, ఉపాధ్యక్షునిగా దల్జీత్ సింగ్, కార్యదర్శిగా వెంకటేశ్వరన్, సంయుక్త కార్యదర్శిగా శివాజీ యాదవ్లను గెలిపించాలని కోరారు. క్రీడల్లోనూ రాజకీయాలు ఎక్కువయ్యాయని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే చక్రం తిప్పుతోన్న కల్వకుంట్ల కుటుంబం... క్రీడల్లోనూ తన వర్గాన్ని తయారుచేసే దిశగా పావులు కదుపుతోందని ఆరోపించారు. ఆ ప్రయత్నంలోనే అజహరుద్దీన్తో చేతులు కలిపిన కేటీఆర్ తాజా హెచ్సీఏ ఎన్నికల్లో అజహర్కే ఓటువేయాలంటూ ఓటర్లని ప్రభావితం చేస్తున్నారన్నారు. అజహరుద్దీన్ తర్వాత కవితకు అవకాశం ఇవ్వాలనే ప్రణాళికతోనే ఇదంతా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. -
ఎన్స్కాన్స్ మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్లో భాగంగా ఎన్స్కాన్స్, కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆటకు చివరిరోజైన శుక్రవారం ఓవర్నైట్ స్కోరు 181/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కేంబ్రిడ్జ్ ఎలెవన్ జట్టు ఆటముగిసే సమయానికి 143.5 ఓవర్లలో 8 వికెట్లకు 418 పరుగులు చేసింది. రాకేశ్ యాదవ్ (287 బంతుల్లో 102 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆరిష్ జైదీ (76), ఆశిష్ శ్రీవాస్తవ్ (53) అర్ధసెంచరీలు సాధించారు. ప్రత్యర్థి బౌలర్లలో మెహదీ హసన్ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ఎన్స్కాన్స్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 120.2 ఓవర్లలో 381 పరుగులకు ఆలౌటైంది. 37 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కేంబ్రిడ్జ్ జట్టుకు 3 పాయింట్లు లభించగా... ఎన్స్కాన్స్ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఇతర మ్యాచ్ల ఫలితాలు జైహనుమాన్ తొలి ఇన్నింగ్స్: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 292 (74 ఓవర్లలో), జై హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 224 (శశిధర్ రెడ్డి 52, వినీత్ రెడ్డి 47; తనయ్ త్యాగరాజన్ 5/59), స్పోర్టింగ్ ఎలెవన్ రెండో ఇన్నింగ్స్: 22/2 (4 ఓవర్లలో). ఆర్ దయానంద్ తొలి ఇన్నింగ్స్: 291 (103 ఓవర్లలో), ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 295/8 (బి. సుమంత్ 63 నాటౌట్; మోహిత్ సోని 3/66). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 303 (89.5 ఓవర్లలో), ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 343 (69.2 ఓవర్లలో). దక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 238 (67.1 ఓవర్లలో), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 249/9 (హెచ్కే సింహా 83; పుష్కర్ 3/61, మిలింద్ 3/64). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 635/9 డిక్లేర్డ్ (148.4 ఓవర్లలో), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 249 (ప్రత్యూష్ కుమార్ 75, సంహిత్ రెడ్డి 59; ప్రణీత్ రాజ్ 3/58, గిరీశ్ గౌడ్ 3/26). హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 170 (40 ఓవర్లలో), జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 135/5 (అభిరత్ రెడ్డి 79 బ్యాటింగ్; జయసూర్య 3/26). -
కౌశిక్ రెడ్డి అద్భుత సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–2 డివిజన్ రెండు రోజుల క్రికెట్ లీగ్లో గెలాక్సీ సీసీ బ్యాట్స్మన్ కౌశిక్ రెడ్డి (123 బంతుల్లో 102 నాటౌట్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. కౌశిక్ శతకంతో చెలరేగడంతో జిందా తిలిస్మాత్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో గెలాక్సీ సీసీ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 177 పరుగుల లక్ష్యఛేదనకు శుక్రవారం బరిలో దిగిన గెలాక్సీ సీసీ 39.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కౌశిక్తో పాటు శశాంక్ (38 నాటౌట్) రాణించాడు. అంతకుముందు జిందా తిలిస్మాత్ జట్టు 50.3 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌటైంది. గెలాక్సీ బౌలర్ షౌనక్ కులకర్ణి 8 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ఇతర మ్యాచ్ల ఫలితాలు ఆదిలాబాద్ జిల్లా: 265 (ప్రదీప్ 90 నాటౌట్; హరీశ్ ఠాకూర్ 7/85), సికింద్రాబాద్ నవాబ్స్: 35 (రాకేశ్ 4/7, ప్రదీప్ 4/13, అశ్విక్ 2/5). దక్కన్ వాండరర్స్: 184 (56.4 ఓవర్లలో), హైదరాబాద్ బ్లూస్: 39/2 (9 ఓవర్లలో). మెగాసిటీ: 269 (76.5 ఓవర్లలో), సీసీఓబీ: 154/8 (బషీరుద్దీన్ 47; టి. గౌరవ్ 6/43). కొసరాజు: 365 (75 ఓవర్లలో), సైబర్టెక్: 122 (కె. శ్రౌత్ రావు 40; రంజిత్ కుమార్ 6/22). మహమూద్: 185 (69.1 ఓవర్లలో), కరీంనగర్ జిల్లా: 134 (సాయితేజ 32; ముబస్సిర్ అహ్మద్ 3/21). ఆక్స్ఫర్డ్ బ్లూస్: 391 (87.4 ఓవర్లలో), అగర్వాల్ సీనియర్: 209 (పి. వీరేందర్ 61 నాటౌట్; సచిత్ నాయుడు 5/69). మాంచెస్టర్: 158 (55.5 ఓవర్లలో), గ్రీన్ టర్ఫ్: 132 (వి. పరిమళ్ 3/40, సాయి ప్రతీక్ 3/11). వరంగల్ జిల్లా: 459 (89.2 ఓవర్లలో), ఎలిగెంట్ సీసీ: 155 (సయ్యద్ అఫ్జల్ 78; ఎన్. అజయ్ 5/51, పవన్ రెడ్డి 5/66). -
ఎవర్గ్రీన్ ఇన్నింగ్స్ విజయం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్లో ఎవర్గ్రీన్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇండియా సిమెంట్స్తో జరిగిన మ్యాచ్లో ఎవర్గ్రీన్ ఇన్నింగ్స్ 96 పరుగులతో గెలుపొందింది. ఓవర్నైట్ స్కోరు 93/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన ఎవర్గ్రీన్ 73.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఎవర్గ్రీన్ జట్టుకు 243 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. బి.మనోజ్ కుమార్ (75), జి. అనికేత్ రెడ్డి (79) అర్ధసెంచరీలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇండియా సిమెంట్స్ 33.1 ఓవర్లలో 147 పరుగులకు కుప్పకూలింది. మొహమ్మద్ ఒమర్ (57 నాటౌట్) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో వంశీకృష్ణ 4, శ్రవణ్ 6 వికెట్లతో జట్టును గెలిపించారు. ఇన్నింగ్స్ విజయం సాధించిన ఎవర్గ్రీన్ జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఇతర మ్యాచ్ల వివరాలు జై హనుమాన్ తొలి ఇన్నింగ్స్: 283 (73.2 ఓవర్లలో), స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 292 (ఫైజల్ 61, యుధ్వీర్ సింగ్ 62; శ్రవణ్ 5/50), జై హనుమాన్ రెండో ఇన్నింగ్స్: 92/2 (అనురాగ్ 31 బ్యాటింగ్). ఆర్. దయానంద్ తొలి ఇన్నింగ్స్: 291 (ఆకాశ్ భండారి 7/95), ఎస్బీఐ తొలి ఇన్నింగ్స్: 265/5 (అనిరుధ్ సింగ్ 54, డానీ డెరెక్ 74, బి. సుమంత్ 53 బ్యాటింగ్). ఎస్సీఆర్ఎస్ఏ తొలి ఇన్నింగ్స్: 151 (51.2 ఓవర్లలో), ఆంధ్రా బ్యాంక్ తొలి ఇన్నింగ్స్: 167 (అమోల్ షిండే 58; సురేశ్ 5/56), ఎస్సీఆర్ఎస్ఏ రెండో ఇన్నింగ్స్: 97 (హితేశ్ యాదవ్ 6/37), ఆంధ్రా బ్యాంక్ రెండో ఇన్నింగ్స్: 85/1 (రోనాల్డ్ 47 నాటౌట్). ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 303 (సాయి అభినయ్ 92; రాజు 6/58), ఇన్కమ్ ట్యాక్స్ తొలి ఇన్నింగ్స్: 343 (హర్షవర్ధన్ 96, చరణ్ 74, సందీప్ 79). డెక్కన్ క్రానికల్ తొలి ఇన్నింగ్స్: 238 (వరుణ్ గౌడ్ 102, మిలింద్ 58; ముదస్సిర్ 7/83), బీడీఎల్ తొలి ఇన్నింగ్స్: 176/4 (సింహా 70 బ్యాటింగ్, సంతోష్ గౌడ్ 50). ఎన్స్కాన్స్ తొలి ఇన్నింగ్స్: 381 (ఒవైస్ 140 నాటౌట్; ఆశిష్ 6/111), కేంబ్రిడ్జ్ ఎలెవన్: 181/4 (పి. నితీశ్ రాణా 65). ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 635/9 (మికిల్ జైస్వాల్ 186, శిరీష్ 52, నిఖిల్ 100 నాటౌట్, గిరీశ్ 52; అలీమ్ 5/183), కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 74/4 (28 ఓవర్లలో). హైదరాబాద్ బాట్లింగ్ తొలి ఇన్నింగ్స్: 170 (శ్రీచరణ్ 63, తాహా షేక్6/48), జెమినీ ఫ్రెండ్స్: 135 (అభిరత్ రెడ్డి 79 బ్యాటింగ్). -
ఐపీఎల్ ఫైనల్ టికెట్లపై అనుమానాలు?
హైదరాబాద్: స్థానిక రాజీవ్గాంధీ అంతర్జాతీయ మైదానంలో రేపు జరగబోయే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న నిర్వాహకులు టికెట్లను హాంఫట్ అనేశారు. సాధారణంగా మ్యాచ్ టిక్కెట్ల గురించి పత్రికలు, టీవీ ఛానెళ్ల ద్వారా అభిమానులకు సమాచారం అందించడం ఆనవాయితీ. కానీ ఫైనల్ మ్యాచ్ కోసం ఆ ఆనవాయితీని నిర్వాహకులు పక్కకు పెట్టారు. ప్లేఆఫ్ మ్యాచ్ల టిక్కెట్లను పద్దతి ప్రకారమే అందుబాటులో పెట్టిన నిర్వాహకులు.. ఫైనల్ మ్యాచ్ విషయంలో ఎలాంటి ప్రకటనలు చేయకుండానే టికెట్లను అమ్మకానికి పెట్టారు. ఫైనల్ మ్యాచ్ టికెట్లను ఈవెంట్స్ .కామ్ సంస్థ ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా టిక్కెట్ల అమ్మకాలు మొదలుపెట్టిన ఆ సంస్థ రెండు నిమిషాల్లోనే అన్నీ అమ్ముడైనట్లు చూపించింది. అయితే వెబ్సైట్లో కేవలం ఎక్కువ ధరల టికెట్లను మాత్రమే అందుబాటులో ఉంచారని కామన్ టికెట్ల సంగతేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఎన్ని టిక్కెట్లు అమ్మకానికి పెట్టారు....? ఎన్ని అమ్ముడయ్యాయి...? ఏ టిక్కెట్లు ఎవరు కొన్నారు....? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఈ విషయంపై ఈవెంట్స్నౌ ప్రతినిధిలు నోరు మెదుపటం లేదు. ఇక హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఈ వివాదంపై స్పందించకపోవడం పట్ల అనేక అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్ ఫైనల్ ఆదరణ దృష్ట్యా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐతే ఈవెంట్స్నౌ.కామ్ గానీ.. హెచ్సీఏ గానీ మొదట్నుంచీ టిక్కెట్ల అమ్మకంపై గుట్టుగానే ఉన్నాయి. ఎవరికీ కనీస సమాచారం అందించలేదు. రోజువారీ టిక్కెట్ల అమ్మకాల గురించి బీసీసీఐ, హెచ్సీఏలకు సమాచారం ఇవ్వాలి. ఈవెంట్స్నౌ సంస్థ ఆ పని చేసిందో లేదో తెలియదు. కొన్ని నిమిషాల వ్యవధిలో అన్ని టిక్కెట్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని హెచ్సీఏ అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. -
హెచ్సీఏలో గొడవ ముదిరింది!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కార్యదర్శి శేష్ నారాయణ్, జి.వివేకానంద్ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ మధ్య గత కొంత కాలంగా సాగుతున్న విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు అవినీతి, నిధుల గోల్మాల్వంటి అంశాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించిన ఇరు వర్గాలు ఇప్పుడు జట్టు ఎంపిక విషయంలో కూడా తమ అహాన్ని బయట పెట్టాయి. ఈ నెల 18 నుంచి ఆగస్టు 15 వరకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్సీఏ) ఒక టోర్నీ నిర్వహిస్తోంది. 2018–19 రంజీ సీజన్ సన్నాçహాల్లో భాగంగా జరిగే ఈ టోర్నీలో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా హైదరాబాద్ జట్టు బరిలోకి దిగుతోంది. అయితే ఇందులో పాల్గొనే ఆటగాళ్లపై సందిగ్ధత నెలకొంది. అటు కార్యదర్శి, ఇటు అపెక్స్ కౌన్సిల్ రెండు వేర్వేరు జట్లను ప్రకటించాయి. మాదంటే మాదే అధికారిక జట్టని ఇరు వర్గాలు చెబుతున్నాయి. శివాజీ యాదవ్, రమేశ్, నిరంజన్, ఎంపీ అర్జున్, సయ్యద్ మిరాజ్లతో కూడా సెలక్షన్ కమిటీ ఆదివారం అపెక్స్ కౌన్సిల్ జట్టును ప్రకటించింది. ఈ కమిటీని కూడా శనివారమే ఏర్పాటు చేశారు. త్వరలో జరుగబోయే ఏజీఎంలో ఈ కమిటీ ఏర్పాటుకు ఆమోద ముద్ర వేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది. అయితే నిబంధనల ప్రకారం కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగుతుంది కాబట్టి పాత సెలక్షన్ కమిటీతోనే జట్టును ఎంపిక చేసినట్లు శేష్ నారాయణ్ చెబుతున్నారు. ఈ సెలక్షన్ కమిటీలో అరవింద్ శెట్టి, నిరంజన్, విష్ణువర్ధన్ సభ్యులుగా ఉన్నారు. ఈ తరహాలో జట్ల ఎంపిక క్రికెటర్లను ఆందోళనలో పడేసింది. తాము జట్టులోకి ఎంపికైనట్లా, కానట్లా... అసలు టోర్నీకి వెళ్లాల్సి ఉందా లేదా అని వారంతా సంకోచంలో ఉన్నారు. చివరకు ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరం. హైదరాబాద్ జట్లు కార్యదర్శి ప్రకటించిన హైదరాబాద్ జట్టు: సీవీ మిలింద్ (కెప్టెన్), రోహిత్ రాయుడు, అభిరత్ రెడ్డి, ఠాకూర్ తిలక్ వర్మ, హిమాలయ్ అగర్వాల్ (వికెట్ కీపర్), చందన్ సహాని, యతిన్ రెడ్డి, టి. రవితేజ, సాకేత్ సాయిరామ్, టీపీ అనిరుధ్, తనయ్ త్యాగరాజన్, ముదస్సిర్ హుస్సేన్, కె. సుమంత్ (వికెట్ కీపర్), సమిత్ రెడ్డి, మల్లికార్జున్, అలంకృత్ అగర్వాల్, ఎన్. అర్జున్ యాదవ్ (కోచ్), నోయెల్ డేవిడ్ (ఫీల్డింగ్ కోచ్), మహబూబ్ అహ్మద్ (మేనేజర్), భీషం ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). అపెక్స్ కౌన్సిల్ ప్రకటించిన హైదరాబాద్ జట్టు: అంబటి రాయుడు (కెప్టెన్), పి. అక్షత్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, రోహిత్ రాయుడు, బి. సందీప్, కొల్లా సుమంత్ (వికెట్ కీపర్), టి. రవితేజ, ఆకాశ్ భండారి, మెహదీహసన్, ప్రజ్ఞాన్ ఓజా, ఎం. రవికిరణ్, ముదస్సర్ హుస్సేన్, సీవీ మిలింద్, ఎ. వరుణ్ గౌడ్, చందన్ సహాని, ఠాకూర్ తిలక్ వర్మ, ఎన్పీ సింగ్ (కోచ్), ఇంద్ర శేఖర్ రెడ్డి (మేనేజర్), ప్రతాప్ సింగ్ (ఫిజియో), నవీన్ రెడ్డి (ట్రెయినర్). -
అంబటి రాయుడుపై వేటు
ముంబై: భారత క్రికెటర్, హైదరాబాద్ రంజీ కెప్టెన్ అంబటి రాయుడుపై వేటు పడింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు అంబటిపై బీసీసీఐ రెండు మ్యాచుల నిషేధం విధించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కర్టాటకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా అంబటి నిబంధనలు పాటించక పోవడంతో ఈ చర్యలు తీసుకుంది. ఈ అంశంపై బీసీసీఐ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'రాయుడు నిబంధనలు ఉల్లంఘించినట్టు అంగీకరించాడు. అదే విధంగా రెండు మ్యాచ్ల నిషేధాన్ని అతను అమోదించాడు' అని తెలిపింది. బీసీసీఐ నిర్ణయంతో రానున్న విజయ్ హజారే ట్రోఫిలో మొదటి రెండు మ్యాచ్లకు అంబటి దూరం కానున్నాడు. కాగా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ లో భాగంగా జనవరి 11న కర్ణాటకతో హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కర్ణాటక బ్యాటింగ్లో.. హైదరాబాద్ ఫీల్డర్ మెహదీ హసన్ బాలును ఆపే ప్రయత్నంలో పొరపాటున బౌండరీ లైన్ తాకాడు. అయితే అది చూడని అంపైర్లు అవి రెండు రన్స్ గా డిక్లేర్ చేశారు. ఆ స్కోరుతో కలుపుకుని కర్ణాటక 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది. అయితే ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్, ఈ విషయాన్ని థర్డ్ అంపైర్కు తెలపగా.. ఆయన మరో రెండు పరుగులు అదనంగా ఇచ్చారు. దీంతో కర్ణాటక 205 పరుగులు చేసినట్టు అయింది. ఛేజింగ్ లో హైదరాబాద్ 203 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయినా, ముందు కలిపిన రెండు పరుగులతో బెంగళూరు టీమ్ గెలిచిందని అంపైర్లు ప్రకటించారు. దీంతో అంబటి రాయుడు అంపైర్లపై ఫైర్ అయ్యాడు. కనీసం సూపర్ ఓవర్ అయినా నిర్వహించాలని అంబటి కోరినా.. అందుకు అంపైర్లు నిరాకరించారు. దీనికి నిరసనగా, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా హైదరాబాద్ ఆటగాళ్లు మైదానంలోనే ఉండిపోయారు. దీంతో, ఆ తర్వాత జరగాల్సిన ఆంధ్ర- కేరళ మ్యాచ్ ఆలస్యంగా మొదలై, 13 ఓవర్ల మ్యాచ్ గా ముగిసింది. ఈ విషయాన్ని అంపైర్లు బీసీసీఐకు పంపించగా.. రాయుడి చర్యలను బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. -
హెచ్సీఏపై నిప్పులు చెరిగిన అజారుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)పై టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోథా సిఫార్సులను హెచ్సీఏ అమలు చేయడం లేదని ఆయన ఆరోపించారు. హెచ్సీఏ పాలకవర్గం ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని అజారుద్దీన్ విమర్శించారు. ఆయన శనివారమిక్కడ మీడియా సమావేశంతో మాట్లాడుతూ...‘ నేను రాజకీయంగా ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేశానని క్రికెటర్గా యూపీ నుంచి రిజిస్ట్రర్ ఎలా చేసుకుంటాను. హెచ్సీఏ అందరిని పక్కదారి పట్టిస్తోంది. గ్రామీణ క్రీడాకారులకు అవకాశం ఇవ్వడం లేదు. జిల్లా, రూరల్ ప్రాంతాల నుంచి కూడా మంచి క్రీడాకారులు ఉన్నారు. హెచ్సీఏ నిర్వహించే టీ20 లీగ్ అంతా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆ లీగ్కు వివేక్ తన తండ్రి పేరు పెట్టడంపై అందరి ఆమోదం తీసుకోలేదు. హెచ్సీఏ లోగోతో వివేక్ తండ్రి వెంకటస్వామి పేరుతో టీ20 లీగ్ నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమే. ఇక బీసీసీఐ నుంచి నాకు క్లియరెన్స్ రాలేదని ఆరోపించారు. కానీ నాకు హైకోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. దీనిపై నేను బీసీపీఐకి నివేదిక పంపాను. కోర్టు ఆదేశాలను బయటకు రానీయకుండా హెచ్సీఏ అధ్యక్షుడు వివేక్ తప్పు చేశారు. చదువుకున్న వ్యక్తులు ఇలా ప్రవర్తించడం బాధాకరం. దీనిపై నేను చట్టపరంగా ముందుకు వెళతా. నాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్తో ఎలాంటి సంబంధం లేదు. అయితే నన్ను ఓ సెలబ్రెటీగా అందరూ ఆహ్వానిస్తారు’ అని తెలిపారు. -
'వివేక్ చెప్పేవన్నీ అవాస్తవాలే'
-
బోర్డు ప్రెసిడెంట్స్ జట్టులో మనోళ్లు ఐదుగురు
సాక్షి, హైదరాబాద్: బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుకు ఏకంగా ఐదుగురు హైదరాబాద్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఆల్రౌండర్లు ఆకాశ్ భండారి, సీవీ మిలింద్ సహా పేస్ బౌలర్ రవికిరణ్, బ్యాట్స్మెన్ తన్మయ్ అగర్వాల్, బావనక సందీప్లకు 13 సభ్యులుగల బోర్డు జట్టులో తొలిసారిగా స్థానం లభించింది. మధ్యప్రదేశ్ వికెట్ కీపర్ నమన్ ఓజా ఈ జట్టుకు సారథ్యం వహిస్తాడు. ఈ జట్టు వచ్చే నెల 11, 12 తేదీల్లో శ్రీలంకతో కోల్కతాలో జరిగే రెండు రోజుల వార్మప్ మ్యాచ్లో తలపడుతుంది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతున్న నేపథ్యంలో లంకతో ప్రాక్టీస్ మ్యాచ్ సమయంలో ఐదో రౌండ్ మ్యాచుల్లేని హైదరాబాద్, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్ ఆటగాళ్లను మాత్రమే బోర్డు ప్రెసిడెంట్స్ జట్టుకు ఎంపిక చేశారు. రంజీల నుంచి యువ ఆటగాళ్లను తప్పించవద్దనే జూనియర్ టీమిండియా కోచ్ ద్రవిడ్ సూచన మేరకే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు: నమన్ ఓజా (కెప్టెన్), బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, ఆకాశ్ భండారి, రవికిరణ్, సీవీ మిలింద్, సంజూ శామ్సన్, జీవన్జ్యోత్ సింగ్, అభిషేక్ గుప్తా, రోహన్ ప్రేమ్, జలజ్ సక్సేనా, అవేశ్ ఖాన్, సందీప్ వారియర్. -
హైదరాబాద్ క్రికెట్ కోచ్గా అరుణ్కుమార్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ టీం కోచ్గా జె. అరుణ్కుమార్ నియమితులయ్యారు. 2017-2018 సీజన్కుగాను అరుణ్కుమార్(42) జట్టు కోచ్గా వ్యవహరించనున్నారని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి. వివేకానంద్ తెలిపారు. అరుణ్కుమార్ కోచ్గా కర్ణాటక జట్టు అనేక టోర్నమెంట్లు గెలుచుకుందన్నారు. ఆయన శిక్షణలో హైదరాబాద్ జట్టు రాటుదేలుతుందన్న నమ్మకముందన్నారు. జట్టుకు ప్రస్తుతం కోచ్గా ఉన్న భరత్ అరుణ్ జాతీయ టీంకు బౌలింగ్ కోచ్గా నియమితులు కావటంతో ఈ స్థానంలో అరుణ్కుమార్ను ఎంపిక చేశారు. లెఫ్ట్హ్యాండ్ బ్యాట్మన్గా 1993-94 లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన అరుణ్ కుమార్ 2008 లో రిటైరయ్యారు. ఐపీఎల్ పంజాబ్ ఎలెవన్ జట్టుకు కూడా ఆయన కోచ్గా పనిచేశారు. -
ఆకిబ్ ఆల్రౌండ్ ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఇంటర్ స్కూల్ క్రికెట్ లీగ్లో భవన్స్ హైస్కూల్ ఆటగాడు మొహమ్మద్ ఆకిబ్ (137, 3/18) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్లో సెంచరీతో చెలరేగిన ఆకిబ్, తర్వాత బౌలింగ్లోనూ విజృంభించాడు. దీంతో మోజెస్ హైస్కూల్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భవన్స్ హైస్కూల్ జట్టు 173 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్కు దిగిన భవన్స్ హైస్కూల్ 45 ఓవర్లలో 8 వికెట్లకు 283 పరుగులు సాధించింది. ఆకిబ్ (128 బంతుల్లో 137; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. కార్తికేయన్ (34) రాణించాడు. అనంతరం 284 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మోజెస్ హైస్కూల్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎం. కౌశిక్ (23 నాటౌట్) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. భవన్స్ బౌలర్లలో అకీబ్ 3, అమన్ మిశ్రా, అనంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఇతర మ్యాచ్ల వివరాలు చిరెక్ పబ్లిక్ స్కూల్: 125 (కార్తీక్ గుప్తా 44, సమర్థ్ 48; ఎస్. నిఖిల్ 5/24, కె. సాహిల్ 3/19), కాల్ పబ్లిక్ స్కూల్: 126 (సాత్విక్ 38 నాటౌట్, గౌరంగ్ 77 నాటౌట్). బాయ్స్టౌన్: 118 (మొహమ్మద్ జైబ్ 42; శశి కుమార్ 3/29, ఎస్. ఈశ్వర్ 3/7), సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్: 90 (మొహమ్మద్ జైబ్ 3/10, మొహమ్మద్ ఫరీస్ షరీఫ్ 2/19, అజయ్ 2/20). వెస్లీ జూనియర్ కాలేజ్: 125 (హరిసింగ్ 44; ఫైజాన్ 5/30), సీడీఆర్ జూనియర్ కాలేజ్: 127/7 (ఆర్య 4/12). హెచ్పీఎస్: 92 (28.3 ఓవర్లలో), భవన్స్ ఎస్ఏ: 93/9 (28.1 ఓవర్లలో). జాన్సన్ గ్రామర్ స్కూల్: 121 (కుషాల్ దేశాయ్ 4/13), లయోలా జూనియర్ కాలేజ్: 124/2 (అభిషేక్ లింగం 77 నాటౌట్). సుల్తాన్ ఉలూమ్: 72 (గోవింద్ 5/26), డాన్బాస్కో హైస్కూల్: 74/2 (17.4 ఓవర్లలో). సెయింట్ జోసెఫ్ హైస్కూల్: 94 (సాకేత్ 4/23), నీలకంఠ విద్యాపీఠ్: 97/3 (17.2 ఓవర్లలో). గౌతమ్ మోడల్ స్కూల్: 165 (అజీజుద్దీన్ 48; అయాన్ 3/20), మెరిడియన్ హైస్కూల్: 71 (హర్ష సంకల్ప్ 3/12). హైదరాబాద్ వాండరర్స్: 179(ఒబేద్ 43; హర్షిత్ 3/34, శ్రీకాంత్ 3/28), లక్కీ ఎలెవన్: 181(ధీరజ్ 84 నాటౌట్). -
హెచ్సీఏ సలహా కమిటీలో లక్ష్మణ్
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో కొత్తగా క్రికెట్ సలహా కమిటీ ఏర్పాటైంది. ఈనెల 12న జరిగిన హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ స్పిన్నర్ వెంకటపతిరాజు, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ పూర్ణిమా రావు ఇందులో సభ్యులుగా ఉంటారని హెచ్సీఏ పేర్కొంది. తమ విజ్ఞప్తిని అంగీకరించిన వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు హెచ్సీఏ కార్యదర్శి టి.శేష్ నారాయణ్ తెలిపారు. హైదరాబాద్ క్రికెట్ అభ్యున్నతికి ఈ కమిటీ సభ్యులు అపెక్స్ కౌన్సిల్కు విలువైన సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. ‘కమిటీలో భాగం పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్ మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ కమిటీ ఉపయోగపడుతుంది’ అని లక్ష్మణ్ అన్నారు. క్రికెట్ వ్యవహారాల కోసం ఇటీవల ఏర్పడిన అపెక్స్ కౌన్సిల్కు సహాయంగా ఉండేందుకు తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు వెంకటపతి రాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ క్రికెట్కు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు. అలాగే అపెక్స్ కౌన్సిల్ మహిళా క్రికెట్కు ప్రాధాన్యం ఇవ్వడం సంతోషకరమని పూర్ణిమా రావు అన్నారు. తెలంగాణలో మహిళా క్రికెట్ అభివృద్ధికి తన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు చెప్పారు. -
ఐపీఎల్ వివాదం: సన్రైజర్స్కు ఝలక్!
హైదరాబాద్: ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ టోర్నమెంటు విషయంలో హైదరాబాద్ సన్రైజర్స్ జట్టు యాజమాన్యానికి, హైదరాబాద్ క్రికెట్ సంఘానికి (హెచ్సీఏ) మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల టికెట్ల విషయమై ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్నట్టు తెలుస్తోంది. టికెట్ల విషయంలో సన్రైజర్స్ జట్టు తమతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నదని హెచ్సీఏ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నది. సన్రైజర్స్ జట్టు యాజమాన్యం ఇలాగే ప్రవర్తిస్తే.. ఈ నెల 17న ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్కు సహరించబోమంటూ హెచ్సీఏ షాకిచ్చింది. ఐపీఎల్ పదో ఎడిషన్ ఉప్పల్ స్టేడియంలో ఇటీవల ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 17న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్రైజర్స్, కింగ్స్ పంజాబ్ ఎలెవన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అప్పటిలోగా టికెట్ల వివాదాన్ని పరిష్కరించకుంటే సహాయ నిరాకరణ జెండా ఎగురవేస్తామని హెచ్సీఏ హెచ్చరిస్తోంది. -
హెచ్సీఏ అధ్యక్షుడిగా వివేక్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్ (వివేకానంద్) ఘన విజయం సాధించారు. జనవరి 17న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా... మొత్తం 216 ఓట్లకుగాను..206 ఓట్లు పోలయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉప్పల్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరి గింది. ఈ ఎన్నికల్లో వివేక్ ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి పోటీచేసిన డాక్టర్ వివేక్కు 136 ఓట్లు రాగా... ఆయన సమీప ప్రత్యర్థి విద్యుత్ జయసింహకు 68 ఓట్లు దక్కాయి. వివేక్ 68 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. మరో రెండు ఓట్లు చెల్లలేదు. ఇక ఉపాధ్యక్షునిగా ఎన్నికైన అనిల్ కుమార్కు 138 ఓట్లు లభించగా... సమీప అభ్యర్థి ఇమ్రాన్ మహమూద్ 86 ఓట్లు దక్కాయి. సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన అఫ్జల్ అసద్కు 124 ఓట్లు లభించగా... ఆయన సమీప ప్రత్యర్థి వంకా ప్రతాప్కు 80 ఓట్లు దక్కాయి. కోశాధికారిగా ఎన్నికై న మహేంద్రకు 148 ఓట్లు దక్కగా... సమీప ప్రత్యర్థి అనురాధకు 54 ఓట్లు వచ్చాయి. కమిటీ సభ్యులుగా ఎన్నికైన హన్మంత్ రెడ్డికి 100 ఓట్లు లభించాయి. కాగా హెచ్సీఏ కార్యదర్శిగా ఎన్నికైన శేష్నారాయణ గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షునిగా ఎన్నికైన వివేక్ మాట్లాడుతూ...హెచ్సీఏకు మంచిరోజులు వచ్చాయన్నారు. అవినీతిలేని పా లనను అందిస్తామని, క్రికెట్ను మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో హెచ్సీఏను విస్తరిస్తామన్నారు. -
హైదరాబాద్లోనే ఐపీఎల్ మ్యాచ్లు
సమ్మె విరమించిన హెచ్సీఏ సిబ్బంది హైదరాబాద్: హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత తొలగిపోయింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) సిబ్బంది, గ్రౌండ్స్మెన్ సమ్మె నేపథ్యంలో మ్యాచ్లను తరలిస్తారనే ఊహాగానాలకు తెరపడింది. గత 14 రోజులుగా చేస్తోన్న సమ్మెను హెచ్సీఏ సిబ్బంది శుక్రవారం విరమించారు. కొంతకాలంగా తమకు బాకీగా ఉన్న జీతాలు, ఇతర అలవెన్సులు, బిల్లులను వెంటనే ఇవ్వాలంటూ సిబ్బంది ధర్నాకు దిగారు. హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షులు నరేందర్ గౌడ్, ఉపాధ్యక్షులు సురేందర్ అగర్వాల్, కార్యదర్శి జాన్ మనోజ్లు హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు పేర్కొన్నారు. వెంటనే మ్యాచ్లకు గ్రౌండ్ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. సిబ్బంది ధర్నాను విరమించడం పట్ల హెచ్సీఏ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. -
ఐపీఎల్ నిర్వహణకు అడ్మినిస్ట్రేటర్లు
ఇద్దరిని నియమించిన హైకోర్టు హైదరాబాద్: హైదరాబాద్లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్–2017) మ్యాచ్లను అడ్మినిస్ట్రేటర్స్ పర్యవేక్షణలోనే నిర్వహించాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఆదేశించింది. బీసీసీఐ సిఫార్సుల మేరకు సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఏఆర్ దవే, హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ జీవీ సీతాపతిలను అడ్మినిస్ట్రేటర్స్గా నియమించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్ల నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సంఘాల మధ్య ఉన్న వివాదం నేపథ్యంలో అడ్మినిస్ట్రేటర్ను నియమించాలంటూ బీసీసీఐ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. హెచ్సీఏలో లోధా కమిటీ సిఫార్సులు అమలు చేయకపోవడం కూడా అడ్మినిస్ట్రేటర్స్ నియమించడానికి కారణమని తెలిపింది. ‘‘హెచ్సీఏలో సరఫరాదారులు, సిబ్బందికి బకాయిలు చెల్లింపు బాధ్యత అడ్మినిస్ట్రేటర్స్దే. వాస్తవాలను పరిశీలించిన తర్వాతే బ్యాంకులో ఉన్న నగదు నిల్వల ఆధారంగా చెల్లింపులు చేయాలి. అవసరమనుకుంటే ఉత్తర్వుల సవరణకు తమను ఆశ్రయించవచ్చు. అడ్మినిస్ట్రేటర్స్ రవాణా ఖర్చులను హెచ్సీఏ చెల్లించాలి. ఇద్దరు అడ్మినిస్ట్రేటర్స్ బీసీసీఐని సంప్రదించి ఆర్థిక సలహాదారులను నియమించుకోవచ్చు. ఐపీఎల్ మ్యాచ్ల ఖాతాల నిర్వహణ బాధ్యత ఆర్థిక సలహాదారులే చూడాలి. హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులు ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యాచ్లు చూసేందుకు అవకాశం కల్పించండి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సిరాజ్, తన్మయ్లకు సన్మానం
సాక్షి, హైదరాబాద్: వర్ధమాన క్రికెటర్లు మొహమ్మద్ సిరాజ్, తన్మయ్ అగర్వాల్, రాహుల్సింగ్లకు గురువారం ఘన సన్మానం జరిగింది. బషీర్బాగ్లోని ప్రెస్ క్లబ్లో క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వీరిని సన్మానించింది. దేశవాళీ టోర్నీల్లో నగరానికి చెందిన సిరాజ్, తన్మయ్, రాహుల్ సింగ్లు నిలకడగా రాణిస్తున్నారు. సిరాజ్ ఇటీవలే ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ వి. హనుమంతరావు ఆటగాళ్లకు శాలువాను కప్పి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమానికి రాహుల్ సింగ్ అందుబాటులో లేకపోవడంతో ఆయన తండ్రి జ్ఞాపికను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ భారత క్రికెటర్ అర్షద్ ఆయూబ్, హెచ్సీఏ కార్యదర్శి జాన్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్సీఏ కేసు వాయిదా
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. బీసీసీఐ కౌంటర్లో పేర్కొన్న అంశాలపై విచారణ సాగింది. కాగా, తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి (మార్చి 7కు) హైకోర్టు వాయిదా వేసింది. -
హెచ్సీఏపై మరో రిట్ దాఖలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)పై మరో రిట్ పిటిషన్ దాఖలు అయింది. హెచ్సీఏ ఎన్నికల వివాదంపై కోర్టులో విచారణ జరుగుతుండగానే వచ్చే నెల 9వ తేదీ నుంచి జరగనున్న టెస్ట్ మ్యాచ్లకు తాత్కాలిక అధికారిని నియమించాలంటూ మరో పిటిషన్ దాఖలయింది. లోథా కమిటీ ఆదేశాల ప్రకారం హెచ్సీఏ పనిచేయాలంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించుకున్నారు. కాగా, విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. -
అంతా బాగుంది
టెస్టు నిర్వహణ ఏర్పాట్లపై శెట్టి సంతృప్తి హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ మధ్య వచ్చే నెల 9 నుంచి హైదరాబాద్లో జరగాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్ నిర్వహణపై ఉన్న సందేహాలు దాదాపుగా తొలగిపోయాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) కమిటీ రాజకీయాలు, నిధుల సమస్య కారణంగా ఈ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగడం అనుమానంగా కనిపించింది. అయితే బీసీసీఐ జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టి రాకతో అంతా చక్కబడినట్లు కనిపిస్తోంది. శెట్టి బుధవారం ఉప్పల్ స్టేడియాన్ని సందర్శించి తాజా పరిస్థితిని సమీక్షించారు. మైదానంలో ఉన్న సౌకర్యాలతో పాటు అవుట్ ఫీల్డ్ను, పిచ్ను కూడా పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న హెచ్సీఏ కార్యవర్గం మ్యాచ్ నిర్వహణ కోసం పూర్తిగా సహకరిస్తుందా అని శెట్టి సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. తమ నుంచి ఎలాంటి సమస్యా రాదని సభ్యులు ఆయనకు వివరించారు. వాణిజ్య ప్రకటనల ద్వారా రూ. 1.60 కోట్లు రావడంతో నిధులపరంగా కూడా సమస్య ఏమీ లేదని వారు రత్నాకర్ శెట్టికి వెల్లడించారు. -
రత్నాకర్ శెట్టికి హైదరాబాద్ ‘టెస్టు’ బాధ్యతలు
ముంబై: హైదరాబాద్లో వచ్చే నెల 9 నుంచి జరగాల్సిన భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్ను సమర్థంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్రత్యేక చొరవ తీసుకుంటోంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్సీఏ)లో ప్రస్తుతం తాత్కాలిక ప్రాతిపదికన ఆఫీస్ బేరర్లు పని చేస్తుండగా, ఇటీవలే జరిగిన ఎన్నికల ఫలితాలను కూడా ప్రకటించకుండా హైకోర్టు నిలిపేసింది. ఈ నేపథ్యంలో బోర్డు జనరల్ మేనేజర్ (గేమ్ డెవలప్మెంట్) రత్నాకర్ శెట్టికి టెస్టు మ్యాచ్ నిర్వహణ బాధ్యతను అప్పగించారు. ‘ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కగా టెస్టు మ్యాచ్ జరిగేలా చూడటమే నా పని. నా బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తా’ అని శెట్టి వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి తీసుకున్నారు. అయితే పరిస్థితులను బట్టి అవసరమైతే టెస్టును హైదరాబాద్ నుంచి తరలించే అధికారాన్ని కూడా శెట్టికి అప్పగించారు. తమ వద్ద నిధులు లేవంటూ ఇటీవలే హెచ్సీఏ బోర్డుకు లేఖ రాయడంతో టెస్టు నిర్వహణపై సందేహాలు తలెత్తినా... హెచ్సీఏ తాము అలా రాయలేదని, మ్యాచ్కు సిద్ధమంటూ వివరణ ఇచ్చింది. -
అజహరుద్దీన్ న్యాయ పోరాటం
ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులను కొట్టేయండి కేసు తేలే వరకు ఫలితాలు వెల్లడి కాకుండా చూడండి సాంకేతిక కారణాలతో నా నామినేషన్ను తిరస్కరించారు హైకోర్టులో పిటిషన్... విచారణ సోమవారానికి వాయిదా సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఎన్నికల విషయంలో మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజహరుద్దీన్ న్యాయ పోరాటం ప్రారంభించారు. హెచ్సీఏ ఎన్నికల నిర్వహణ, వాటి పర్యవేక్షణ నిమిత్తం అడ్వొకేట్ కమిషనర్ను ఏర్పాటు చేస్తూ రంగారెడ్డి జిల్లా ఐదవ అదనపు జిల్లా, సెషన్స జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు తేలేంత వరకు ఎన్నికల ఫలితాలను వెల్లడించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై గురువారం న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి.శేషసాయి విచారణ జరిపారు. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా కింది కోర్టు ఉత్తర్వులున్నాయని అజహరుద్దీన్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కింది కోర్టు ముందు పెండింగ్లో ఉన్న కేసులో పిటిషనర్ సైతం ప్రతివాదిగా చేరారని వివరించారు. ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఇచ్చిన నోటిఫికేషన్కు అనుగుణంగా పిటిషనర్ హెచ్సీఏ అధ్యక్ష స్థానానికి నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లారని, అయితే రిటర్నింగ్ అధికారి సాంకేతిక కారణాలతో నామినేషన్ ఇవ్వడానికి తిరస్కరించారన్నారు. ఈ నెల 17న జరిగిన ఎన్నికల్లో పాల్గొనేందుకు పిటిషనర్ అన్ని విధాలుగా అర్హులని, ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారికి తెలిపినా అతను పట్టించుకోలేదన్నారు. నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లు చెప్పిన రిటర్నింగ్ అధికారి అందుకు కారణాలను మాత్రం వివరించలేదన్నారు. సరైన ఓటర్ల జాబితా లేకుండా, ఓటర్ల వివరాలు ప్రచురించకుండా, ఎన్నికల అధికారులను నియమించకుండా, లోధా కమిటీ సిఫారసులకు విరుద్ధంగా రిటర్నింగ్ అధికారి ఎన్నికలను నిర్వహించారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు కింది కోర్టును తప్పుదోవ పట్టించి ఎన్నికల నిర్వహణ ఉత్తర్వులు తీసుకొచ్చారన్నారు. కోర్టు ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
హైదరాబాద్ ఘనవిజయం
సాక్షి, అంబర్పేట: రాజీవ్గాంధీ అఖిల భారత అండర్–19 టి20 ఫెడరేషన్ కప్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు శుభారంభం చేసింది. అంబర్పేట వాటర్ వర్క్స్ క్రికెట్ మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో మలేసియా జట్టుపై 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. సాగర్ చౌరాసియా (55) అర్ధసెంచరీతో చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లలో సంజయ్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 143 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మలేసియా జట్టు 13.1 ఓవర్లలో 49 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. హైదరాబాద్ బౌలర్లలో అజయ్దేవ్ గౌడ్ (4/18), నితిన్ గోపాల్ (2/6) విజృంభించారు. అంతకుముందు జరిగిన టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వి. హనుమంతరావు (వీహెచ్), మాజీ ఎంపీ వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి... నేటి యువత క్రీడలపై ఆసక్తి చూపడం శుభపరిణామమని... అంతర్జాతీయ స్థాయిలోనూ వీరందరూ తమ సత్తా చూపాలని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బరామిరెడ్డి అన్నారు. క్రికెట్ నేడు ఉన్నత వర్గాలకు చెందిన క్రీడాకారుల ఆటగానే భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సత్తా ఉన్న ప్రతి క్రికెటర్ను ప్రోత్సహించేందుకు గత నాలుగేళ్లుగా రాజీవ్గాందీ క్రికెట్ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. వీహెచ్.. మాట్లాడుతూ... క్రీడాకారులను ప్రోత్సహించి వారు అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు. -
హైకోర్టును ఆశ్రయించిన మాజీ క్రికెటర్!
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్ష ఎన్నికల్లో తన నామినేషన్ ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ టీమిండియా మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. హెచ్సీఏ ఎన్నికల్లో అజారుద్దీన్ దరఖాస్తును రిటర్నింగ్ అధికారి కే రాజీవ్ రెడ్డి తిరస్కరించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారంలో అజార్ పై బీసీసీఐ నిషేధం ఎత్తివేసిందా? లేదా? ఆయన హెచ్సీఏ ఓటరు అవునా? కాదా? అన్నది స్పష్టత లేకపోవడంతో ఆయన నామినేషన్ ను తిరస్కరించినట్టు తెలిపారు. అయితే, దీనిని తప్పుబడుతూ అజార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2000 సంవత్సరంలో భారత క్రికెట్ ను కుదిపేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో అజారుద్దీన్ ప్రమేయం ఉందంటూ ఆయనపై బీసీసీఐ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల జస్టిస్ లోధా కమిటీ సిఫారసుల నేపథ్యంలో హెచ్సీఏ ప్రస్తుత అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ పదవి నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీపడాలని అజార్ నిర్ణయించారు. అయితే, ఆయన ఈ ఎన్నికల్లో పోటీకి ఎంతవరకు అర్హులన్నది తెలియకపోవడం వల్లే ఆయన నామినేషన్ తిరస్కరణకు గురయినదని ఆయూబ్ ఖాన్ అంటున్నారు. ముగిసిన హెచ్సీఏ ఎన్నికలు కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ఎన్నికలు ముగిశాయి. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఈ ఎన్నికలు జరిగాయి. మొత్తం 17 మంది అభ్యర్థులు పోటీపడగా.. అందులో జి వివేకానంద్, విద్యుత్ జైసింహాలు అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 218 మంది సభ్యులకు ఓటు హక్కు ఉంది. వివాదాల నడుమ ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. వివాదాల నేపథ్యంలో హైకోర్టు తుది ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు. బుధవారం మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే అవకాశముంది. -
ముగిసిన క్రికెట్ అసోసియేషన్ ఎన్నికిలు
-
హెచ్సీఏ ఎన్నికలు ప్రారంభం
-
నేడు హెచ్సీఏ ఎన్నికలు
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ హైకోర్టు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని ఆదేశించింది. దాంతో నేడు (మంగళవారం) ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు నిర్వహిస్తారు. అధ్యక్ష పదవికి జి.వివేకానంద్, విద్యుత్ జైసింహ పోటీ పడుతుండగా, కార్యదర్శిగా శేష్ నారాయణ్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. మరోవైపు తన నామినేషన్ తిరస్కరణపై హైకోర్టుకు వెళ్లిన వంకా ప్రతాప్కు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఆయన సంయుక్త కార్యదర్శి పదవికి ఇచ్చిన నామినేషన్ను స్వీకరించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తూ నరేశ్ శర్మ కోర్టును ఆశ్రయించగా... దీనిపై రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారిని కూడా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు లోధా సిఫారసుల అమలుకు సంబంధించి మరింత స్పష్టత కోరుతూ హైదరాబాద్, తమిళనాడు, గోవా, మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. -
అజహర్ నామినేషన్ తిరస్కరణ
కోర్టుకెక్కనున్న మాజీ కెప్టెన్! హైదరాబాద్: భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్కు ఎన్నికలకు ముందే చుక్కెదురైంది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు అతను వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో అతనిపై నిషేధం తొలగించడానికి సంబంధించి ‘సంతృప్తికర వివరణ’ ఇవ్వకపోవడంతో అజహర్ నామినేషన్ను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి కె.రాజీవ్ రెడ్డి ప్రకటించారు. ‘తిరస్కరణకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. బీసీసీఐ తనపై నిషేధం ఎత్తివేసిందని రుజువు చేసే పత్రాలేవీ ఆయన ఇవ్వలేకపోయారు. నిషేధం తొలగిస్తున్నట్లు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మాత్రమే ఆయన చూపించారు. కానీ నేను అదే విషయంలో బీసీసీఐ ఇచ్చిన డాక్యుమెంట్లు అడిగాను. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న క్లబ్లో అజహర్ ఓటింగ్ హక్కు గురించి కూడా స్పష్టత లేకపోవడం మరో కారణం’ అని రాజీవ్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17న హెచ్సీఏ ఎన్నికలు జరగనున్నాయి. అజహర్ తీవ్ర అసంతృప్తి... తన నామినేషన్ను తిరస్కరించడం అంటే లోధా ప్యానెల్ సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లే అని అజహర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే ఈ అంశంపై కోర్టులో ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు. ‘సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మాజీ టెస్టు క్రికెటర్ ఎవరైనా పదవుల కోసం పోటీ పడవచ్చు. నా దరఖాస్తును తిరస్కరించడం గురించి స్పష్టత ఇవ్వమంటూ రిటర్న్ అధికారిని ఎన్ని సార్లు కోరినా ఆయన స్పందించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో సౌకర్యాలు పొందుతున్న జి.వివేకానంద్కు నిబంధనల ప్రకారం అసలు పోటీ పడే అర్హతే లేదు. కానీ ఆయన దరఖాస్తును సరైనదిగా తేల్చారు. భారత మాజీ కెప్టెన్తో ఈ రకంగా వ్యవహరించడం దుర్మార్గం. అసలు హెచ్సీఏలో మొత్తం ఒక వర్గం కుట్ర జరిపి ప్రజాస్వామ్యవిరుద్ధంగా ఎన్నికలు జరుపుకుంటున్నారు. నేను దీనిపై న్యాయ పోరాటం చేస్తా. ఈ పరిణామాలపై ఇప్పటికే లోధా కమిటీకి లేఖ రాశా’ అని అజహర్ వ్యాఖ్యానించారు. -
హెచ్సీఏ ఎన్నికలకు పచ్చ జెండా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఎన్నికలను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, అయితే ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేశారు. హెచ్సీఏ ఎన్నికల నిర్వహణకు కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అసోసియేషన్ కార్యదర్శి జాన్ మనోజ్ హైకోర్టులో పిటిషన్ దాఖ లు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం బుధవారం విచారణ జరిపారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న పిటిషనర్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఎన్నికలను యథాతథంగా జరుపుకోవచ్చన్నారు. ఫలితాలను మాత్రం ప్రకటించవద్దని ఆదేశిస్తూ.. విచారణను 18కి వాయిదా వేశారు. అధ్యక్ష పదవికి భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ పోటీ పడుతుండటంతో ఒక్కసారిగా హెచ్సీఏ ఎన్నికలు ఆసక్తిని పెంచాయి. -
ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు
-
ఎన్నికలు పెట్టండి.. ఫలితాలు ఇప్పుడే వద్దు
హైదరాబాద్: హెచ్సీఏ ఎన్నికలకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. అయితే ఫలితాలు మాత్రం ఇప్పుడే వెల్లడించొద్దని ఆంక్షలు విధించింది. ఈ నెల 15న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. హెచ్సీఏ కొత్త కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయకపోవడంతోపాటు, పదవీకాలం ముగిసినా అధ్యక్షుడిగా ఉన్న అర్షద్ అయూబ్ కొనసాగతుండటంపై హైకోర్టు గతంలో తీవ్రంగా మండిపడింది. హెచ్సీఏలో కోట్లాది రూపాయల దుర్వినియోగానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న అర్షద్ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 7నే ముగిసింది. అయినప్పటికీ ఆయన పదవిలో కొనసాగారు. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో తేలింది. దీంతో హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. మరోపక్క, లోధా కమిటీ సిఫారసు ప్రకారం హెచ్సీఏ ఎన్నికలు ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉన్నా అలా చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ హెచ్సీఏ ఎన్నికల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కూడా పాల్గొంటున్నారు. హెచ్సీఏ అధ్యక్ష పదవికి ఇప్పటికే అజహర్ నామినేషన్ వేశారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్ను నిర్దోషిగా తేల్చింది. అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఆయన పోటీకి బీసీసీఐ అనుమతిస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంది. -
హైదరాబాద్ రాతను మారుస్తా!
సాక్షి, హైదరాబాద్: దశాబ్ద కాలం పాటు భారత జట్టు కెప్టెన్గా చిరస్మరణీయ విజయాలు అందించిన మొహమ్మద్ అజహరుద్దీన్ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్తో బంధం కలుపుకునేందుకు సిద్ధమయ్యారు. క్రికెట్ పరిపాలనపై ఆసక్తితో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో తొలిసారి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నారు. హెచ్సీఏ ఎన్నికల బరిలోకి దిగిన అజహర్ మంగళవారం అధ్యక్ష పదవి కోసం తన నామినేషన్ను దాఖలు చేశారు. మాజీ రంజీ క్రికెటర్ వంకా ప్రతాప్ తదితరులతో కలిసి ఆయన రిటర్నింగ్ అధికారి రాజీవ్రెడ్డికి సంబంధిత పత్రాలు అందజేశారు. హెచ్సీఏకు అనుబంధంగా ఉన్న ‘నేషనల్ క్రికెట్ క్లబ్’ తరఫున అజ్జూ నామినేషన్ వేశారు. ఈ నెల 17న హెచ్సీఏ ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్ మళ్లీ వెలగాలి... తాను హెచ్సీఏ అధ్యక్షుడిగా ఎన్నికైతే క్రికెటేతర అంశాలు కాకుండా కేవలం ఆటపైనే దృష్టి పెడతానని అజహర్ అన్నారు. చాలా కాలంగా ఇక్కడ క్రికెట్కే ప్రాధాన్యత దక్కడం లేదని, పరిస్థితిని మార్చేందుకే తాను పరిపాలనలోకి అడుగు పెడుతున్నట్లు ఆయన చెప్పారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ క్రికెట్ ప్రస్తుతం గందరగోళ పరిస్థితుల్లో ఉంది. నేను క్రికెట్కు సేవ చేద్దామనుకుంటున్నాను. హెచ్సీఏలో అవినీతి కారణంగా ఆటను పట్టించుకోవడం లేదు. హైదరాబాద్తో పాటు తెలంగాణలో కూడా క్రికెట్ అభివృద్ధి కావాలనేదే నా కోరిక’ అని అజహర్ వ్యాఖ్యానించారు. ఇక్కడి నుంచి ముగ్గురు క్రికెటర్లు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోకుండా హెచ్సీఏ ఆపలేకపోయిందన్న అజ్జూ, టెస్టు నిర్వహించేందుకు హెచ్సీఏ వద్ద నిధులు లేవంటూ వచ్చిన వార్తల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘బోర్డు భారీగా ఇచ్చే నిధులు ఏమయ్యాయో తెలీదు. ఇక్కడ బంధుప్రీతి కూడా చాలా ఎక్కువగా ఉంది. అండర్–14 జట్టులో కూడా ప్రతీ మ్యాచ్కు ఆరుగురిని మార్చడం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడిదంతా గతం కావాలి. నేను మార్పు తీసుకొస్తా’ అని ఈ మాజీ కెప్టెన్ స్పష్టం చేశారు. బీసీసీఐ అంగీకరిస్తుందా? అజహర్ నామినేషన్ అనగానే ముందుగా చర్చకు వచ్చిన అంశం అతనిపై కొనసాగుతున్న నిషేధం. మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో 2000లో అతడిపై బోర్డు నిషేధం విధించింది. 2012లో అది చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చినా, బోర్డు మాత్రం నిషేధం ఎత్తివేతపై స్పష్టత ఇవ్వలేదు. కొన్ని బోర్డు కార్యక్రమాలకు అజహర్ను ఆహ్వానించినా, గత ఏడాది రంజీ ట్రోఫీ సందర్భంగా ఢిల్లీలో కొంత మంది క్రికెటర్లు అజహర్ను కలవడంతో గట్టిగా మందలించింది కూడా. కాబట్టి అజహర్ భవిష్యత్తు కార్యకలాపాలకు బోర్డు వంద శాతం ఆమోదముద్ర వేయలేదనేది తెలుస్తోంది. అయితే నాటి కోర్టు తీర్పును బోర్డు సవాల్ చేయకపోవడమే నిషేధం తొలగినట్లుగా అతని సన్నిహితులు చెబుతున్నారు. ‘హెచ్సీఏ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో బోర్డు నిషేధం అంశం అడ్డు రాదని నమ్ముతున్నా. నాలుగేళ్ల క్రితమే కోర్టు నిషేధాన్ని తొలగించింది కాబట్టి సమస్య లేదు’ అని అజహర్ దీనిపై స్వయంగా వివరణ ఇచ్చారు. అయితే అజహర్ అర్హతపై స్పష్టత కోరుతూ హెచ్సీఏ కార్యదర్శి జాన్ మనోజ్, లోధా కమిటీకి లేఖ రాయగా, ఇంకా వారి నుంచి స్పందన రాలేదు. అర్హత ఉందా? నిషేధం అంశాన్ని పక్కన పెడితే మరోవైపు ఎన్నికలకు సంబంధించిన కొన్ని ప్రాథమిక అంశాలు కూడా అజహర్కు వ్యతిరేకంగా ఉన్నాయి. హెచ్సీఏ నియమావళి ప్రకారం అధ్యక్ష పదవికి ముందు సదరు వ్యక్తి ఈసీ సభ్యుడిగా, ఆఫీస్ బేరర్గా పని చేసి ఉండాలి. తాను ఏ క్లబ్ తరఫున నామినేషన్ దాఖలు చేస్తున్నాడో అక్కడి నుంచి అతనికి ఓటు హక్కు ఉండాలి. ఓటర్ల జాబితాకు ఈనెల 8 ఆఖరు తేదీ కాగా... అప్పటికి అజహర్ ఓటర్గా నమోదు చేయించుకోకపోగా, సదరు నేషనల్ క్లబ్ నుంచి ఓటరుగా మరో వ్యక్తి పేరు అప్పటికే ఉంది. లోధా సంస్కరణలతో ఇటీవలే పదవి కోల్పోయిన అర్షద్ అయూబ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అయితే లోధా కమిటీ సిఫారసులు అమలు చేయడంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ పాత నిబంధనలన్నీ చెల్లకుండా పోతాయని, మాజీ ఆటగాళ్లు నేరుగా పోటీ పడవచ్చనే నిబంధనతోనే అజహర్ ముందుకు వచ్చినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే సుప్రీం ఆదేశించిన విధంగా ముఖ్యమైన తొమ్మిది అంశాలు మినహా రాష్ట్ర సంఘాలు నియమావళి ఒక్కసారిగా మారిపోదని, వాటిని అమలు చేస్తూనే తమ సొంత నియమావళిని పాటించవచ్చని అయూబ్ చెబుతున్నారు. ఎన్నికలు జరిగేనా? ఒకవైపు ఇంత హడావిడి సాగుతుండగా అసలు ఈ నెల 17న ఎన్నికలు జరగడమే సందేహంగా మారింది. ఈ ఎన్నికను నిలిపేయాలంటూ హెచ్సీఏ కార్యదర్శి సోమవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘ఎలక్టోరల్ అధికారి నియామకం నుంచి ఈసీ సమావేశం నిర్వహణ, ఓటర్ల జాబితా వెల్లడి తదితర అంశాలన్నింటిలో సుప్రీం నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అందుకే ఎన్నికలు ఆపమని కోరుతున్నాం’ అని జాన్ చెప్పారు. వాస్తవానికి డిసెంబర్ 23న రంగారెడ్డి ఐదో అడిషనల్ చీఫ్ జడ్జి ఉత్తర్వుల మేరకు ఈ ఎన్నిక జరిపేందుకు హెచ్సీఏ సిద్ధమైంది. కానీ ఆ తర్వాత జనవరి 2న సుప్రీం కోర్టు తీర్పు రావడంతో పరిస్థితులు మారిపోయాయి. ఈ నెల 19న సుప్రీం కోర్టు బోర్డులో కొత్త అధికారులను నియమించనుంది. ఆ తర్వాతే రాష్ట్ర సంఘాలు ఏం చేయాలనే దానిపై స్పష్టత వస్తుందని, ఆలోగా ఎన్నికలు జరపడం నిబంధనలకు విరుద్ధమని ఒక వర్గం వాదిస్తోంది. తాజా పిటిషన్ నేడు (బుధవారం) విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పిటిషన్ వేసిన జాన్ మనోజ్ మాత్రం తన వర్గంతో సహా ముందు జాగ్రత్తగా నామినేషన్లు కూడా దాఖలు చేయడం విశేషం! -
హైదరాబాద్ టెస్టుకు సమస్య లేదు..!
నిధులివ్వాలని మాత్రమే కోరామన్న హెచ్సీఏ హైదరాబాద్: భారత్, బంగ్లాదేశ్ మధ్య ఫిబ్రవరిలో జరగాల్సిన టెస్టు మ్యాచ్కు ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) స్పష్టం చేసింది. వచ్చే నెల 8 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. తమ దగ్గర తగినన్ని నిధులు లేవు కాబట్టి టెస్టు నిర్వహించలేమంటూ వచ్చిన వార్తలను హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ఖండించారు. ఇంగ్లండ్తో సిరీస్ తరహాలోనే బీసీసీఐ రాష్ట్ర సంఘానికి డబ్బులు ఇస్తే మ్యాచ్ నిర్వహణలో సమస్య లేదని ఆయన అన్నారు. లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తామంటూ మొదట్లోనే అంగీకరించిన రాష్ట్ర సంఘాల్లో హైదరాబాద్ కూడా ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘మేం లోధా కమిటీ సిఫారసులు అమలు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడి తాజా పరిస్థితిని వివరిస్తూ బీసీసీఐకి లేఖ రాసిన మాట వాస్తవం. మ్యాచ్ నిర్వహణ కోసం డబ్బులు ఇవ్వమని కూడా కోరాం. ఇంగ్లండ్తో సిరీస్ సమయంలో లోధా కమిటీ వద్ద ముందస్తు అనుమతి తీసుకొని బోర్డు నిధులు విడుదల చేసింది. ఈసారి కూడా అలాగే ఇవ్వాల్సి ఉంటుందనే కోణంలోనే అడిగాం తప్ప మేం నిర్వహించలేమంటూ ఎక్కడా చెప్పలేదు. బోర్డు నుంచి నిధులు వస్తే మ్యాచ్కు ఎలాంటి సమస్యా ఉండదు’ అని నరేందర్ గౌడ్ వెల్లడించారు. -
హెచ్సీఏలో భారీ కుంభకోణం!
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు రూ.120 కోట్ల కుంభకోణం జరిగినట్లు డిలైట్ సంస్థ దర్యాప్తులో వెల్లడి కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయుబ్, సెక్రటరీ జాన్ మనోజ్ పై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. గత శుక్రవారం కూడా హెచ్సీఏ సభ్యులపై ఉప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్సీఏ సర్వసభ్య సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై అడ్హక్ కమిటీ చైర్మన్గా ప్రకాష్చంద్ జైన్ (56)ను నియమించారు. ఈ నెల 5వ తేదీన, 16వ మరోసారి విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారని, కుట్ర జరుగుతుందంటూ ప్రకాష్చంద్ ఫిర్యాదులో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కుంభకోణం జరిగినట్లు ప్రైవేట్ సంస్థ దర్యాప్తులో వెల్లడికావడం పలు అనుమానాలకు దారితీసింది. -
క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో భారీ కుంభకోణం
-
హెచ్సీఏ కమిటీ సభ్యులపై కేసు నమోదు
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) సభ్యులపై ఉప్పల్ పోలీస్స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పోలీసులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్-12 ఎమ్మెల్యే కాలనీకి చెందిన వ్యాపారి ప్రకాష్చంద్ జైన్ (56)ను గత నెల 20వ తేదీన నిర్వహించిన హెచ్సీఏ సర్వసభ్య సమావేశంలో రోజూవారీ బాధ్యతల నిర్వహణకై అడ్హక్ కమిటీ చైర్మన్గా నియమించారు. అరుుతే ఈ నెల 5వ తేదీన, 16వ తేదీన విధుల నిమిత్తం స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడ వుండే సెక్యూరిటీ లోనికి వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నారు. సెక్యూరిటీని ప్రశ్నించగా హెచ్సీఏ అధ్యక్షులు అర్షద్ అయూబ్, కార్యదర్శి జాన్ మనోజ్, సంయుక్త కార్యదర్శి పురుషోత్తం అగర్వాల్, ఉపాధ్యక్షుడు నరేందర్గౌడ్, కోశాధికారి దేవరాజ్, ఈసీ సభ్యుడు మహమూద్లు లోనికి అనుమతించవద్దని తెలిపారని సెక్యూరిటీ వివరించాడు. దాంతో ప్రకాష్చంద్ జైన్ శుక్రవారం ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అడ్హక్ కమిటీ చైర్మన్ అరుున తనను స్టేడియంలోకి వెళ్లకుండా అడ్డుకొని అవమానించారని వారిపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హెచ్సీఏలో ఎన్నికలు నిర్వహించండి
హైదరాబాద్: లోధా కమిటీ సిఫారసులను అనుసరించి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అధ్యక్షుడు అర్షద్ అయూబ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు జి.వినోద్ డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారం ఆయనకు పదవిలో కొనసాగే అర్హత లేదని ఆయన అన్నారు. హెచ్సీఏలో ప్రకాశ్ చంద్ జైన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న అడ్హాక్ కమిటీతో కలసి ఆయన శుక్రవారం ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ‘ఈ నెల 20న నిర్వహించిన హెచ్సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని అయూబ్ రెండు నిమిషాల్లోనే ముగించారు. లోధా కమిటీ సూచనలను పాటిస్తామని అసోసియేషన్ అంగీకరించింది. ఇదే జరిగితే ఆ వెంటనే అయూబ్ అనర్హులవుతారు. ఇంకా ఆయనకు కొనసాగే నైతిక హక్కు లేదు. అందుకే డిసెంబర్ 24న ఎన్నికలు జరపాలని అడ్హాక్ కమిటీ నిర్ణరుుంచింది’ అని వినోద్ వ్యాఖ్యానించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హెచ్సీఏలో అవకతవకలు జరగకుండా ప్రభుత్వం తరఫున సలహాదారుడిని నియమించాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శేష్ నారాయణ్, బాబూరావు సాగర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
హచ్సీఏ పచ్చ జెండా
హైదరాబాద్: భారత క్రికెట్లో పలు మార్పులు సూచిస్తూ జస్టిస్ లోధా కమిటీ చేసిన ప్రతిపాదనలను అమలు చేస్తామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది. ఈ మేరకు జులై 18న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనున్నట్లు హెచ్సీఏ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆదివారం ఉప్పల్ స్టేడియంలో హెచ్సీఏ ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరిగింది. లోధా సిఫారసులను అమలు చేయనున్నట్లు సమావేశంలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడింది. ఈ అంశంపై ఎటువంటి చర్చ అవసరం లేదని, సుప్రీం ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నట్లు చెప్పిన అధ్యక్షుడు అర్షద్ అయూబ్... లోధా ప్రతిపాదనలను అంగీకరిస్తున్నట్లు ఏకవాక్యంలో ప్రకటించి సమావేశం నుంచి నిష్క్రమించారు. ఆ తర్వాత అయూబ్ ప్రత్యర్థి వర్గం మాత్రం సొంతంగా సమావేశం నిర్వహించుకుంది. లోధా సిఫారసులు అమలులోకి వస్తే ప్రస్తుత కార్యవర్గం రద్దరుుపోతుందని కాబట్టి అయూబ్ పదవీ కాలం ముగిసిపోరుుందని తేల్చేసింది. డిసెంబర్ 24న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యక్షుడు ప్రకాశ్చంద్ జైన్ తేదీని ప్రకటించగా... తాజా పరిణామాలపై లోధా కమిటీకి లేఖ రాయాలని సభ్యులు నిర్ణరుుంచారు. -
పీఠం.. త్రిముఖం
డీసీసీ అధ్యక్ష పదవి రేసులో ముగ్గురు నేతలు పోటీలో ఇనుగాల, కొండేటి, బిల్లా హన్మకొండ: కాంగ్రెస్ పార్టీ వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం నాయకులు ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన వరంగల్ రూరల్ జిల్లాలోని పలువురు నాయకులు ఈ పదవిపై ఆశలు పెంచుకున్నారు. ఈ మేరకు తమ సంబంధాలను ఉపయోగించుకుంటూ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు నాయకులు ప్రధానంగా ఈ పదవిని ఆశిస్తున్నారు. పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గంలోని నుంచి రాయపర్తి మండలానికి చెందిన నేతల పేర్లు పోటీలో ప్రముఖంగా వినవస్తున్నారుు. త్రిముఖ పోటీ వరంగల్ రూరల్ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం త్రిముఖ పోటీ నెలకొంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి హయాంలో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగారు. కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించిన శ్రీధర్ వర్ధన్నపేట సర్పంచ్గా పనిచేసిన అనంతరం రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకుని విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓటమి చెందిన ఆయన ప్రస్తుతం క్రియాశీలకంగా పార్టీలో కొనసాగుతున్నారు. అదేవిధంగా జిల్లాలోని పరకాల నియోజకవర్గం ఆత్మకూరుకు చెందిన ఇనుగాల వెంకట్రాంరెడ్డి డీసీసీ రేసులో ముందంజలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నుంచి పూర్తి మద్దతు ఉన్న ఇనుగాల పదవి కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. గత సాధారణ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోరుున ఇనుగాల గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా, బీసీసీఐ ఫైనాన్స కమిటీ సభ్యుడిగాా పని చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పరకాల నియోజకవర్గ ఇన్చార్జిగా క్రియాశీలకంగా కొనసాగుతూ జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. ఇక జిల్లాలోని రాయపర్తి మండలం మైలారానికి చెందిన బిల్లా సుధీర్రెడ్డి సైతం డీసీసీ పీఠం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సుధీర్రెడ్డి శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి డీసీసీ పదవి కోసం దరఖాస్తు అందజేశారు. గత 23 ఏళ్లుగా కాంగ్రెస్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న సుధీర్రెడ్డి రాయపర్తి పీఏసీఎస్ చైర్మన్గా, డీసీసీబీ డైరక్టర్గా కొనసాగుతున్నారు. మండల ప్రధాన కార్యదర్శి, అధ్యక్షుడిగా, పనిచేసి ఎదిగిన సుధీర్రెడ్డి యువజన విభాగం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షునిగా, ఉమ్మడి డీసీసీ కార్యదర్శి గా పనిచేసి ప్రస్తుతం ఉమ్మడి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. -
హైదరాబాద్ కెప్టెన్గా నితీశ్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ అండర్-19 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును బుధవారం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ప్రకటించింది. నవంబర్ 5న ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. కె. నితీశ్ రెడ్డి కెప్టెన్గా... చందన్ సహాని వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. ఈ జట్టుకు అబ్దుల్ వహాబ్ కోచ్గా వ్యవహరించనున్నారు. జట్టు: కె. నితీశ్ రెడ్డి (కెప్టెన్), జీవీ వినీత్, చందన్ సహాని (వైస్ కెప్టెన్), కె. భగత్ వర్మ, అలంకృత్ అగర్వాల్, అమ్మార్ ఆయూబ్, నిలేశ్, అజయ్ దేవ్, రాజమణి ప్రసాద్, అజర్ అలీ (వికెట్ కీపర్), షేక్ సొహైల్, రిషబ్, టి. సంతోష్, ప్రణీత్ రాజ్, సారుు వికాస్, సయ్యద్ హుస్సేన్ (వికెట్ కీపర్). -
హైదరాబాద్ కెప్టెన్గా బద్రీనాథ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్ (2016-17) అఖిల భారత రంజీ ట్రోఫీ చాంపియన్షిప్లో పాల్గొనే హైదరాబాద్ జట్టును గురువారం ప్రకటించారు. ఈ జట్టుకు బద్రీనాథ్ కెప్టెన్గా, భరత్ అరుణ్ కోచ్గా వ్యవహరించనున్నారు. అక్టోబర్ 6 నుంచి నాగ్పూర్లో జరిగే తమ తొలిమ్యాచ్లో హైదరాబాద్ జట్టు... గోవా జట్టుతో తలపడుతుంది. హైదరాబాద్ జట్టు: ఎస్. బద్రీనాథ్, పి. అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, బి. సందీప్, బి. అనిరుధ్, కె. సుమంత్ (వికెట్ కీపర్), బెంజమిన్ సి థామస్, హిమాలయ్ అగర్వాల్, మెహదీ హసన్, ఆకాశ్ భండారి, విశాల్ శర్మ, సీవీ మిలింద్, ఎం. రవికిరణ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ ముదస్సిర్, హబీబ్ అహ్మద్ (వికెట్ కీపర్). -
హెచ్సీఏ టోర్నీల్లో జోరు!
గత సీజన్లో నాలుగు టైటì ళ్లు గెలిచిన పాలమూరు ఈ ఏడాది అండర్–19, అండర్–23 టోర్నీల్లోనూ చాంపియన్ కంబైన్డ్ జట్టులో జిల్లాదే ఆధిపత్యం మహబూబ్నగర్ క్రీడలు: మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్ విస్తరిస్తోంది. అండర్–12, అండర్–14, అండర్–16, అండర్–20, అండర్–25 విభాగాల క్రీడాకారులకు మహర్దశ కలగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాజట్లు రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీల్లో సత్తాచాటుతున్నారు. గతేడాది ఒకే సీజన్లో జిల్లా జట్లు అండర్–23, అండర్–19, అండర్–16, అండర్–14 టోర్నీల్లో టైటిళ్లు కైవసం చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోనే రికార్డు సృష్టించింది. అండర్–23 సీనియర్ లీగ్ టోర్నీల తొలిసారిగా విజేత నిలిచిన జిల్లా జట్టు నుంచి కంబైన్ట్ జట్టుకు నలుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. అండర్–19 జట్టులో ఆరుగురు, అండర్–16లో నలుగురు క్రీడాకారులు కంబైన్డ్ రాష్ట్ర జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించారు. ఈ ఏడాది అండర్–23 టోర్నీలో ఎక్కువపాయింట్ల పొంది తొలిస్థానంలో నిలవగా ఇటీవల జిల్లా కేంద్రంలో జరిగిన అండర్–19టోర్నీలో గెలుపొందింది. గతంలో 9సార్లు చాంపియన్ జిల్లా జట్టు అద్వితీయ ప్రతిభతో గతంలో హెచ్సీఏ రాష్ట్రస్థాయి టోర్నీల్లో తొమ్మిది సార్లు విజేతగా నిలిచింది. తొలిసారిగా 1986లో జిల్లా కేంద్రంలో జరిగిన సీనియర్ క్రికెట్ టోర్నీలో విజేతగా నిలిచిన జిల్లా జట్టు 1991లో నల్లగొండ, 1993లో మహబూబ్నగర్, 2000లో హైదరాబాద్లలో జరిగిన సీనియర్ టోర్నీల్లో జిల్లా చాంపియన్గా నిలిచింది. 2010లో హైదరాబాద్లో జరిగిన అండర్–16, అండర్–19 టోర్నీలతో పాటు 2011లో హైదరాబాద్లో వరుసగా అండర్–25, అండర్–19 గెలిచి అండర్–16, అండర్–14 టోర్నీల్లో రన్నరప్గా నిలిచింది. 2013లో హైదరాబాద్లో జరిగిన ట్వీ–20లో గెలుపొందింది. జిల్లాకేంద్రంలో హెచ్సీఏ మైదానం... జిల్లాకేంద్రంలో హెచ్సీఏ క్రికెట్ మైదానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మైదానంలో లేవలింగ్ పనులను పూర్తిచేశారు. ఇటీవల పనులను హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్ పరిశీలించారు. డిసెంబర్లోగా మైదానం పనులను పూర్తి చేసి క్రికెట్ మ్యాచ్లు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మైదానంలో ప్రేక్షకుల గ్యాలరీ, పెవిలియన్ బిల్డింగ్ తదితర నిర్మాణాలను చేపట్టనున్నారు. ఇక్కడే అకాడమీని ఏర్పాటు చేసి ప్రతిభ కనబరిచిన 40 నుంచి 60 మంది క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేసి కోచ్లతో మెరుగైన శిక్షణ ఇవ్వనున్నారు. ఓపెనర్గా రాణిస్తున్న షాకీర్ఖాన్ షాకీర్ఖాన్ 2009లో జిల్లాస్థాయి క్రికెట్లో ప్రవేశించాడు. కొద్దికాలంలోనే మంచి ప్రతిభ కనబరుస్తూ ఓపెనర్గా స్థానం దక్కించుకున్నాడు. 2011లో జిల్లాస్థాయి టోర్నీ బ్యాట్స్మెన్గా రాణించాడు. హైదరాబాద్లో జరిగిన కోకకోలా కప్లో రెండు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఈ టోర్నీ రాణింపుతో 2012లో తొలిసారిగా హెచ్సీఏ అండర్–14 జట్టుకు ఎంపికయ్యాడు. ఇదే ఏడాది సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ జట్టుకు ఎంపికయ్యాడు. 2014లో హైదరాబాద్ సిండికేట్ బ్యాంక్ జట్టుకు ఆడి రెండు అర్ధసెంచరీలు చేశాడు. గతేడాది జిల్లా కేంద్రంలో జరిగిన ఎంపీఏల్ టోర్నీలో సెంచరీ, రెండు అర్ధసెంచరీలు చేశాడు. అలాగే హెచ్సీఏ అండర్–19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఎండీసీఏ లీగ్ టోర్నీలో సెంచరీ చేసి ఉత్తమ బ్యాట్స్మన్గా ఎంపికయ్యాడు. ఇటీవలæజరిగిన అండర్–19 టోర్నీలో 190పరుగులు చేసి రాణించాడు. భవిష్యత్లో ఓపెనర్గా మరిన్ని సెంచరీలు సాధించి రంజీజట్టుకు ఎంపికవుతానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు షాకీర్ఖాన్. అండర్–19 సారథి గణేష్... గణేష్ ఇటీవల జరిగిన అండర్–19 టోర్నీలో కెప్టెన్గా జట్టు గెలుపొందడంతో కీలకపాత్ర పోషించాడు. డాషింగ్ బ్యాట్స్మెన్గా జట్టులో ఉన్న గణేశ్ బౌలింగ్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. 96పరుగులు చేయడంతో పాటు ఏడు వికెట్లు తీసి రాణించాడు. 2015 ఏడాదిలో హెచ్సీఏ అండర్–16, అండర్–19, ఈ ఏడాది అండర్–23జట్టుకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది అండర్–16 జట్టు కెప్టెన్గా వ్యవహరించాడు. రంజీ జట్టులో ఆడాలన్నదే తన లక్ష్యమంటున్నాడు గణేష్. నాలుగు టైటిళ్లు గెలవడం గర్వంగా ఉంది... తెలంగాణ జిల్లాల పరిధిలో గతేడాది సీజన్లో నాలుగు టైటిళ్లు గెలవడం గర్వంగా ఉంది. ఈ ఏడాది అండర్–19 టోర్నీ విజయాల పరంపరను ప్రారంభించాం. ఇక్కడి క్రీడాకారుల ఉన్న ప్రతిభను చూసి జిల్లా కేంద్రంలో హెచ్సీఏ మైదానానికి శ్రీకారం చుట్టారు. డిసెంబర్లోగా మైదానం పనులు పూర్తయి క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుంది. అకాడమీని ప్రారంభించి క్రీడాకారులకు వసతి ఏర్పాటు చేసి శిక్షణ అందిస్తాం. – రాజశేఖర్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి -
బ్లూ టీమ్ కెప్టెన్గా చైతన్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం అండర్-23 ప్రాబబుల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో తలపడే జట్లను శుక్రవారం ఎంపిక చేసింది. బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, గ్రీన్ టీమ్లుగా ఆటగాళ్లను విభజించింది. బ్లూ టీమ్ కెప్టెన్గా వై. చైతన్య కృష్ణ, రెడ్ టీమ్ కెప్టెన్గా బి. యతిన్ రెడ్డి, ఎల్లో టీమ్ కెప్టెన్గా పి.ఎస్.చైతన్య రెడ్డి, గ్రీన్ టీమ్ కెప్టెన్గా తనయ్ త్యాగరాజన్ వ్యవహరిస్తారు. బ్లూ టీమ్: వై. చైతన్య కృష్ణ, కె. రోహిత్, డి. అరుణ్, ఎ. వంశీ వర్ధన్, రాకేశ్, కేఎస్కే చైతన్య, మోహిత్ సోని, రజనీశ్ యాదవ్, సయ్యద్ చాంద్పాషా, అనిరుధ్, రాధకృష్ణ, బరణ్ కుమార్, త్రినాథ్ (వికెట్కీపర్), అకాశ్, సందీప్ మనోహర్, టి. దిలీప్ (కోచ్). రెడ్ టీమ్: బి. యతిన్ రెడ్డి, ఎస్. విక్రమ్, జె. మల్లికార్జున్, బి. చంద్రశేఖర్, అకేందర్, పి.రోహిత్, విష్ణు, సారుు అనూప్, టి.వి. కృష్ణ చరిత్, పి. ప్రణీత్, యశ్వంత్, శ్రావణ్ కుమార్, సాత్విక్, ఫైజల్ (వికెట్ కీపర్), రిషబ్ శర్మ. ఎల్లో టీమ్: చైతన్య రెడ్డి, సమర్థ్ సింగ్, అభిరథ్, రోహన్, బెనిటో, వివేక్, సుఖేన్ జైన్, సయ్యద్ అహ్మద్, కార్తీకేయ, రవితేజ, అజారుద్దీన్, మనీశ్ కుమార్, సారుు శ్రవణ్, రాజేశ్, ప్రతీక్ పవార్, గణేశ్ (కోచ్). గ్రీన్ టీమ్: తనయ్, డి.లోహిత్, శశిధర్, అంకుర్, ఆశిష్, హర్ష్, రవీందర్, ప్రశాంత్, జి. విదత్, శ్రీధరహాస్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, సారుుతేజ, భిక్షపతి సంకేత్, ప్రణవ్ (వికెట్కీపర్). -
హైదరాబాద్ కెప్టెన్గా బద్రీనాథ్
భరత్ అరుణ్కు కోచ్ బాధ్యతలు సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ’సి’ గ్రూప్లో ఉన్న హైదరాబాద్ జట్టు కొత్త ఏడాది కొత్త కెప్టెన్ నేతృత్వంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. భారత జట్టు మాజీ ఆటగాడు, తమిళనాడు వెటరన్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ 2015-16 సీజన్లో హైదరాబాద్ టీమ్కు నాయకత్వం వహించనున్నాడు. 136 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల అనుభవం ఉన్న 36 ఏళ్ల బద్రీనాథ్ ప్లేయర్ కం మెంటర్గా వ్యవహరించనున్నాడు. గత సీజన్ వరకు కెప్టెన్గా ఉన్న హనుమ విహారి ఈసారి ఆంధ్రాకు తరలి వెళ్లిపోయాడు. అయితేమరో రాష్ట్రానికి చెందిన ఆటగాడిని ఇలా మెంటర్ పేరుతో నాయకత్వ బాధ్యతలు అప్పగించడం హైదరాబాద్ జట్టుకు ఇదే మొదటిసారి. ఆంధ్రా జట్టు కూడా వరుసగా రెండు సీజన్లు సీనియర్లు అమోల్ మజుందార్, మొహమ్మద్ కైఫ్లను ఇలాగే తీసుకుంది. అనుభవం తక్కువగా ఉన్న తమ యువ క్రికెటర్లను నడిపించేందుకు సీనియర్ ఆటగాడి అవసరం ఉందంటూ హెచ్సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ విజ్ఞప్తి చేయడంతో అతను హైదరాబాద్ తరఫున ఆడేందుకు అంగీకరించినట్లు తెలిసింది. తమిళనాడు జట్టు తర్వాత గత రెండేళ్లు విదర్భ తరఫున ఆడిన బద్రీనాథ్... వాస్తవానికి తమిళనాడు బ్యాటింగ్ కోచ్ పదవి కోసం పోటీ పడినా అవకాశం దక్కలేదు. భారత్ తరపున బద్రీనాథ్ 2 టెస్టులు, 7 వన్డేలు, 1 టి20 మ్యాచ్ ఆడాడు. 136 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 56.19 సగటుతో 9,778 పరుగులు చేశాడు. ఇందులో 31 సెంచరీలు ఉన్నారుు. ప్రస్తుతం జరుగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అతను కరైకుడి కాలై జట్టు తరఫున ఆడుతున్నాడు. అరుణ్కు అవకాశం... జట్టు కోచ్ పదవి కోసం కూడా హెచ్సీఏ పత్రికా ప్రకటన ఇచ్చింది. ఇంటర్వ్యూల అనంతరం భరత్ అరుణ్ను ఎంపిక చేసినట్లు హెచ్సీఏ అధ్యక్షుడు అయూబ్ వెల్లడించారు. మీడియం పేస్ బౌలర్ అరుున అరుణ్ ఇటీవలి టి20 ప్రపంచ కప్ వరకు భారత సీనియర్ జట్టు బౌలింగ్ కోచ్గా వ్యవహరించారు. భారత్ తరఫున 2 టెస్టులు, 4 వన్డేలు ఆడిన ఆయన 48 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 110 వికెట్లు పడగొట్టారు. -
హైదరాబాద్ కెప్టెన్గా ఆశిష్ రెడ్డి
బుచ్చిబాబు క్రికెట్ టోర్నీకి జట్టు ఎంపిక సాక్షి, హైదరాబాద్: ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషనల్ క్రికెట్ టోర్నమెంట్కు హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు ఆశిష్ రెడ్డి కెప్టెన్గా, తన్మయ్ అగర్వాల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. 2016-17 సీజన్లో ఇదే తొలి టోర్నీ. వచ్చే నెల 5 నుంచి 18వ తేదీ వరకు చెన్నైలో ఈ టోర్నీ జరుగుతుంది. ఎంపికైన జట్టు సభ్యులందరూ ఆదివారం ఉదయం 9 గంటలకల్లా ఉప్పల్ స్టేడియంలో కోచ్ అర్జున్ యాదవ్కు రిపోర్టు చేయాలి. జట్టు: ఆశిష్ రెడ్డి (కెప్టెన్), అక్షత్ రెడ్డి, తన్మయ్ అగర్వాల్, అనిరుధ్, బి. సందీప్, కొల్లా సుమంత్, మెహదీ హసన్, విశాల్ శర్మ, ఆకాశ్ భండారి, సి.వి.మిలింద్, రవి కిరణ్, సిరాజ్, డానీ డెరిక్ ప్రిన్స్, బెంజమిన్ థామస్, యతిన్ రెడ్డి, హబీబ్ అహ్మద్; స్టాండ్బైస్: ముదస్సిర్ హుస్సేన్, టి. రవితేజ, పి.సాకేత్ సాయిరామ్, రోహిత్ రాయుడు, తనయ్ త్యాగరాజన్, కోచ్: అర్జున్ యాదవ్, అసిస్టెంట్ కోచ్: జకీర్ హుస్సేన్, మేనేజర్: సూర్యప్రకాశ్. -
హెచ్సీఏ ప్రతినిధులపై కేసు
ఉప్పల్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ క్రికెట్ స్టేడియంలో నిబంధనలకు విరుద్ధంగా ఆహార పదార్థాలను సరఫరా చేసిన స్టేడియం ప్రతినిధులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల కథనం మేరకు... భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లోనే ఆహార పదార్థాలను సరఫరా చేయడానికి అనుమతి ఉంది. ఈ నెల 23న స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా హెచ్సీఏ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) సభ్యులు పీకే శాస్త్రి, కోటిరెడ్డి స్టేడియంలోని సౌత్ గ్రౌండ్ఫ్లోర్, మొదటి అంతస్తులో నిబంధనలను పక్కన పెట్టి ఆహారాన్ని సరఫరా చేశారు. ఈ విషయాన్ని భద్రతా పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కానీ, ఆలస్యంగా మీడియాకు వెల్లడించడం గమనార్హం. -
ఒక్కడు... ఒకే రోజు 393 పరుగులు
హెచ్సీఏ లీగ్స్లో రేవంత్ సాయి సంచలన బ్యాటింగ్ హైదరాబాద్: సెంచరీ కాదు, డబుల్ సెంచరీ కాదు... ఒక్క రోజులో ఒక బ్యాట్స్మన్ దాదాపు 400 పరుగులు చేయడం అసాధారణ విషయం. పిచ్ ఎలాంటిదైనా, ఎంత బలహీన బౌలింగ్ అయినా ఇది అద్భుతం కిందే లెక్క. దానిని సుసాధ్యం చేసి చూపించాడు హైదరాబాద్ క్రికెటర్ రేవంత్ సాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) 2 రోజుల లీగ్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్లో భారీ ట్రిపుల్ సెంచరీ చేసిన అతను త్రుటిలో ‘క్వాడ్రాపుల్ సెంచరీ’ కోల్పోయాడు. పీ అండ్ టీ కాలనీ జట్టుతో జరిగిన మ్యాచ్లో విశాక జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగిన 25 ఏళ్ల రేవంత్ సాయి రెచ్చిపోయాడు. 336 బంతుల్లో ఏకంగా 393 పరుగులు సాధిం చాడు. ఇందులో 44 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. హెచ్సీఏ లీగ్స్ లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, దానిని ఒకే రోజు చేసిన రికార్డును సాయి సొంతం చేసుకున్నాడు. దాదాపు ఐదున్నర గంటల పాటు క్రీజ్లో గడిపిన అతను 236 పరుగులు బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం. చివరకు మరో భారీ షాట్కు ప్రయత్నించి డీప్ కవర్స్లో క్యాచ్ ఇవ్వడంతో నాలుగొందలు పరుగుల మైలురాయి చేజారింది. రేవంత్ అద్భుత ప్రదర్శనతో విశాక జట్టు తొలి రోజు 88.4 ఓవర్లలో 5 వికెట్లకు 664 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. -
చీకటి రాజ్యం!
హెచ్సీఏలో అన్నింటా అంధకారం నిధుల లేమితో ఇక్కట్లు లెక్కాపత్రం లేని ఖర్చులు అంతులేని అవినీతి ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: రెండు నెలలుగా సిబ్బందిలో చాలా మందికి జీతాలు లేవు... కరెంట్ చౌర్యం కేసులో జరిమానా కట్టకపోవడంతో అంధకారంలో ప్రధాన స్టేడియం... ఏ పని చేసినా అవినీతి ఆరోపణలు.... బీసీసీఐని సాయం కోరదామంటే అక్కడి నుంచీ కనిపించని స్పందన... ఇదీ ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో ప్రస్తుత పరిస్థితి. సాధారణంగా దేశంలోని ఏ క్రికెట్ సంఘం అయినా ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటుంది. బీసీసీఐనుంచి వచ్చే నిధులతో పాటు మ్యాచ్ల నిర్వహణ ద్వారా కూడా వచ్చే ఆదాయంతో కళకళ్లాడుతుంటుంది. కానీ డబ్బులు లేని ఇలాంటి స్థితి మాత్రం ఒక్క హెచ్సీఏలోనే కనిపిస్తోంది. అసోసియేషన్ మొత్తం అవినీతిలో కూరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణమనే విమర్శలు వెల్లువెతున్నాయి. అర్షద్ జమానాలోనే... సాధారణంగా బీసీసీఐ ప్రతీ ఏటా అసోసియేషన్లకు ఇచ్చే మొత్తం బోర్డు ఆదాయాన్ని బట్టి స్వల్పంగా మారుతూ ఉంటుంది. 2014-15 సంవత్సరానికి బోర్డునుంచి హెచ్సీఏకు రూ. 26 కోట్లు వచ్చాయి. అయితే అధికారంలోకి వచ్చిన నాటినుంచి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు అనవసరపు ఖర్చులు, హంగామా కోసమే వీటిని ఇష్టానుసారంగా ఖర్చు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేశారని చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంచిన కనోపి బిల్లు రూ. 1.2 కోట్లను కూడా కొత్త కమిటీ రాగానే చెల్లించేసింది. స్టేడియం పెయింటింగ్, ఆఫీస్ బేరర్ల కార్యాలయాల ఆధునీకరణ, లీగల్ ఫీజులు, లీగ్ మ్యాచ్ల నిర్వహణకు గ్రౌండ్ల ఖర్చు, జిల్లాలో క్రికెట్ నిర్వహణ... ఇలా ఒక్కో కమిటీ సభ్యుడు ఒక్కోదానిని పంచుకొని ఎలాంటి టెండర్లు లేకుండానే భారీ మొత్తాలను కొల్లగొట్టినట్లు సమాచారం. దీంతో మొత్తం డబ్బు ఖర్చయింది. బీసీసీఐ నుంచి రాబోయే ఏడాది బడ్జెట్లో నుంచి కూడా రూ.10 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ తెచ్చుకున్నట్లు సమాచారం. అయినా నిధుల కోసం అల్లాడుతున్నారు. గతంలోనూ అయూబ్ అధ్యక్షుడిగా ఉన్న (2010-12) సమయంలోనే జరిగిన అవినీతి ఆరోపణలపై హెచ్సీఏపై పలు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. అయితే నిండా మునిగినవాడికి చలేంటి... అన్నట్లుగా కొందరు మరింత అవినీతికి పాల్పడుతుండగా, గత ఏడాది ఆగస్టు తర్వాత ఏసీబీనుంచి ఒక్క నోటీసు కూడా రాకపోవడం వీరికి ధైర్యాన్ని ఇచ్చిందని హెచ్సీఏ సభ్యులే చెబుతున్నారు. లెక్కాపత్రం లేదు విద్యుత్ చౌర్యం కారణంగా అధికారులు విధించిన రూ. 2.11 కోట్ల జరిమానా చెల్లించే పరిస్థితి లేక ఉప్పల్ స్టేడియం ప్రస్తుతం అంధకారంలో ఉంది. పెద్దలంతా ఇప్పుడు జింఖానా మైదానానికి తరలిపోయారు. అడుగడుగునా తప్పుడు బిల్లులు, అసలు బిల్లులే లేకపోవడంతో అకౌంట్స్ను ఆడిట్ చేయడం తమ వల్ల కాదంటూ ఆడిటర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. గత ఏడాది లీగ్ మ్యాచ్ల నిర్వహణ కోసం అంపైర్లకే రూ. 75 లక్షలు చెల్లించినట్లుగా ఉండడం అవినీతికి పరాకాష్ట అని ఒక ఈసీ సభ్యుడు ఆరోపించారు. ఈ కారణాలతో ఎప్పుడో మే నెలలో సభ్యుల ముందు ఉంచాల్సిన అకౌంట్లకు ఇప్పటికీ మోక్షం కలగలేదు. దీనిపై స్పష్టత వస్తే గానీ ఫైనాన్స్ సబ్ కమిటీకి వెళ్లడం, ఆపై ఏజీఎం నిర్వహించడం సాధ్యం కాదు. అది జరిగిన తర్వాతే పరిస్థితి వివరించి బీసీసీఐని సహాయం అర్థించే అవకాశం ఉంటుంది. అయినా...బోర్డు రాజకీయాల కారణంగా కూడా అక్కడా అయూబ్కు అనుకూల వాతావరణం ఏమీ లేదు. హెచ్సీఏ ముందు అన్ని అకౌంట్లను ప్రవేశపెట్టాకే లెక్కలపై పూర్తి స్పష్టత రావచ్చు. ప్రస్తుతానికి మాత్రం సీజన్ ఆరంభానికి ముందే ఎటూ పాలుపోని పరిస్థితిలో హెచ్సీఏ ఉంది. కొత్త సంఘాల ఒత్తిడి మరో వైపు తెలంగాణలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన హెచ్సీఏ కేవలం జంట నగరాలకే పరిమితమైందన్న విమర్శ ఉంది. జిల్లాల్లో క్రికెట్ను అభివృద్ధి చేయకపోగా, అక్కడి ప్రతినిధులను ఏ మాత్రం లెక్కలోకి తీసుకోకుండా హెచ్సీఏ వ్యవహరిస్తోందనేది ఆరోపణ. దీంతో తెలంగాణలోని రాజకీయ నాయకుల అండతో ఇప్పుడు జిల్లాల్లో ప్రతిభాన్వేషణ పేరుతో రెండు కొత్త క్రికెట్ సంఘాలు పుట్టుకొచ్చాయి. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అనే ఈ సంఘాలకు ఇప్పటికిప్పుడు బీసీసీఐ గుర్తింపు దక్కకపోయినా...హెచ్సీఏ పరిస్థితి ఇలాగే సాగితే భవిష్యత్తులో ఇవి ప్రత్యామ్నాయంగా ముందుకు రావడం ఖాయం. అయూబ్, జాన్పై శివలాల్ ఫిర్యాదు మరో వైపు హెచ్సీఏ అధ్యక్ష, కార్యదర్శులుగా ఉంటూ సొంత అకాడమీలు నిర్వహిస్తున్నారంటూ అర్షద్ అయూబ్, జాన్ మనోజ్లపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ లోధా కమిటీకి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’గా దీనిని కూడా తీసుకోవాలని ఆయన కమిటీకి విజ్ఞప్తి చేశారు. వీరి అకాడమీల్లో చేరితేనే జట్టుకు ఎంపికవుతారని తల్లిదండ్రులు భావించడం వల్ల వేసవిలో హెచ్సీఏ సొంత అకాడమీ మూత పడిందని శివలాల్ ఆరోపించారు. -
'ఓటుకు కోట్లు కేసుతో సంబంధం లేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగు యువత రాష్ట్ర నాయకుడు జిమ్మిబాబుపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) తెలిపింది. ఈ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్ సీఏ స్పష్టం చేసింది. జిమ్మిబాబు సోమవారం సాయంత్రంలోగా తమ ఎదుట హాజరు కావాలని ఏసీబీ అల్టిమేటం జారీచేసిన నేపథ్యంలో హెచ్ సీఏ స్పందించింది. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన జిమ్మిబాబు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కో ఆర్డినేటర్గా ఉన్నారు.