![Indian women's compound team reaches final of Archery World Cup - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/20/SUREKHA_3139.jpg.webp?itok=4lDwF-MH)
బెర్లిన్లో జరుగుతోన్న ప్రపంచకప్ ఆర్చరీ పోటీల్లో తెలుగుతేజం వెన్నం జ్యోతిసురేఖ సభ్యురాలిగా ఉన్న భారత మహిళల బృందం ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సెమీఫైనల్లో సురేఖ, త్రిషాదేబ్, ముస్కాన్ కిరార్లతో కూడిన భారత కాంపౌండ్ జట్టు 231–228 స్కోరుతో టాప్ సీడ్ టర్కీ జట్టుపై విజయం సాధించింది. శనివారం జరిగే ‘పసిడి’ పోరులో ఫ్రాన్స్ జట్టుతో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment