
జ్యోతి సురేఖకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ ఆర్చరీ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి సురేఖ సత్తా చాటింది. చైనీస్ తైపీలో జరిగిన ఈ టోర్నమెంట్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో దిగ్విజయ్తో కలిసి స్వర్ణ పతకంతో పాటు, మహిళల టీమ్ విభాగంలో రజతాన్ని సాధించింది. మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో భారత జోడి 146-133 స్కోరుతో చైనీస్ తైపీ జంటపై విజయం సాధించింది. టీమ్ విభాగం ఫైనల్లో జ్యోతి సురేఖ, కుష్బు, షిండేలతో కూడిన భారత జట్టు 183-207 స్కోరుతో మలేసియా జట్టు చేతిలో ఓడిపోయింది.