మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం | mithali gets great honour | Sakshi
Sakshi News home page

మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం

Sep 18 2017 10:47 AM | Updated on Sep 19 2017 4:44 PM

మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం

మిథాలీ రాజ్‌కు ఘన సన్మానం

భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు శనివారం రాత్రి ఘన సన్మానం జరిగింది.

హైదరాబాద్‌: భారత మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌కు శనివారం రాత్రి ఘన సన్మానం జరిగింది. మాజీ రంజీ క్రికెటర్‌ రాజేశ్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బేగంబజార్‌లోని మాన్‌సింగ్‌ హోటల్‌ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో మిథాలీ రాజ్‌తో పాటు నగరానికి చెందిన టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను కూడా సత్కరించారు.

 

దినేశ్‌ మాన్‌సింగ్‌ మిథాలీ రాజ్‌కు వెండి బ్యాట్‌ను బహుకరించగా, నక్మల్‌ గెహ్లాట్‌ ఆమెకు బంగారు గొలుసును అందజేశారు. ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎస్‌ఎం ఆరిఫ్, కోచ్‌ ఆర్‌. మూర్తి, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి జాన్‌ మనోజ్, అంతర్జాతీయ బాడీబిల్డర్‌ మోతేషామ్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.   


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement