ప్రియాంక్‌ సెంచరీ: ఇండియా ‘రెడ్‌’ 232/5 | Priyanka Century: India 'Red' 232/5 | Sakshi
Sakshi News home page

ప్రియాంక్‌ సెంచరీ: ఇండియా ‘రెడ్‌’ 232/5

Sep 8 2017 12:55 AM | Updated on Sep 29 2018 5:44 PM

దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఇండియా ‘గ్రీన్‌’ జట్టుతో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల లీగ్‌ మ్యాచ్‌

లక్నో: దులీప్‌ ట్రోఫీ క్రికెట్‌ టోర్నమెంట్‌లో భాగంగా ఇండియా ‘గ్రీన్‌’ జట్టుతో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల లీగ్‌ మ్యాచ్‌లో తొలి రోజు ఇండియా ‘రెడ్‌’ జట్టు ఆచితూచి ఆడింది. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పింక్‌ బంతితో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్‌’ 86 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది.

ఓపెనర్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (105; 12 ఫోర్లు) సెంచరీ చేయగా... సుదీప్‌ చటర్జీ (52; 5 ఫోర్లు) రాణించాడు. దినేశ్‌ కార్తీక్‌ (15 బ్యాటింగ్‌), గౌతమ్‌ (10 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇండియా ‘గ్రీన్‌’ జట్టులో పార్ట్‌టైమ్‌ బౌలర్లు కరుణ్‌ నాయర్, మురళీ విజయ్‌లకు రెండేసి వికెట్లు దక్కడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement