duleep trophy
-
సాయి సుదర్శన్ పోరాటం వృధా.. దులీప్ ట్రోఫీ 2024 విజేత ఇండియా-ఏ
2024 దులీప్ ట్రోఫీని ఇండియా-ఏ జట్టు కైవసం చేసుకుంది. ఇవాళ (సెప్టెంబర్ 22) ముగిసిన మూడో రౌండ్ మ్యాచ్లో ఇండియా-ఏ.. ఇండియా-సిపై 132 పరుగుల తేడాతో గెలుపొంది, టైటిల్ చేజిక్కించుకుంది.350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-సి.. ప్రసిద్ద్ కృష్ణ (3/50), తనుశ్ కోటియన్ (3/47), ఆకిబ్ ఖాన్ (2/26), షమ్స్ ములానీ (1/46) ధాటికి 217 పరుగులకే కుప్పకూలింది. సాయి సుదర్శన్ సెంచరీతో (111) వీరోచితంగా పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతనికి జట్టులో ఎవ్వరి నుంచి సహకారం లభించలేదు. కెప్టెన్ రుతురాజ్ ఒక్కడు (44) కాస్త పర్వాలేదనించాడు. గుర్తింపు ఉన్న ఆటగాళ్లు రజత్ పాటిదార్ (7), ఇషాన్ కిషన్ (17), అభిషేక్ పోరెల్ (0) నిరాశపరిచారు.శాశ్వత్ సెంచరీఈ మ్యాచ్లో తొలుత తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఏ.. 297 పరుగులకు ఆలౌటైంది. శాశ్వత్ రావత్ సెంచరీతో (124) కదంతొక్కగా.. ఆవేశ్ ఖాన్ అజేయ అర్ద సెంచరీతో (51) రాణించాడు. ఇండియా-సి బౌలర్లలో విజయ్కుమార్ వైశాక్ 4, అన్షుల్ కంబోజ్ 3, గౌరవ్ యాదవ్ 2 వికెట్లు తీశారు.నిరాశపరిచిన రుతురాజ్, ఇషాన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-సి.. 234 పరుగులకే ఆలౌటైంది. స్టార్ బ్యాటర్లు రుతురాజ్ గైక్వాడ్ (17), సాయి సుదర్శన్ (17), రజత్ పాటిదార్ (0), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచగా.. అభిషేక్ పోరెల్ ఒక్కడే అర్ద సెంచరీతో (82) రాణించాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆకిబ్ ఖాన్ తలో 3, షమ్స్ ములానీ 2, తనుశ్ కోటియన్ ఓ వికెట్ పడగొట్టారు.రాణించిన రియాన్63 పరుగుల ఆధిక్యంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా-ఏ..రియాన్ పరాగ్ (73), శాశ్వత్ రావత్ (53) అర్ద సెంచరీలతో రాణంచడంతో 8 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. కుషాగ్రా (42), మయాంక్ అగర్వాల్ (34), తనుశ్ కోటియన్ (26 నాటౌట్) ఓ మోస్తరు పరుగులు చేశారు. ఇండియా-సి బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అన్షుల్ కంబోజ్, మానవ్ సుతార్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.That Winning Feeling! 🤗 India A captain Mayank Agarwal receives the coveted #DuleepTrophy 🏆 The celebrations begin 🎉@IDFCFIRSTBank Scorecard ▶️: https://t.co/QkxvrUmPs1 pic.twitter.com/BH9H6lJa8w— BCCI Domestic (@BCCIdomestic) September 22, 2024సాయి సుదర్శన్ పోరాటం వృధా350 పరుగుల లక్ష్య ఛేదనలో ఇండియా-సి 217 పరుగులకే ఆలౌటై, 132 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సాయి సుదర్శన్ (111) ఒంటరి పోరాటం చేసి ఇండియా-సిని గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.రన్నరప్గా నిలిచిన ఇండియా-సిమూడు రౌండ్ల మ్యాచ్లు ముగిశాక 12 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఇండియా-ఏ టైటిల్ గెలుచుకోగా.. 9 పాయింట్లు సాధించిన ఇండియా-సి రన్నరప్తో సరిపెట్టుకుంది. చదవండి: Duleep Trophy 2024: ఆరేసిన అర్షదీప్.. ఇండియా-డి ఘన విజయం -
సెంచరీకి చేరువలో సంజూ.. భారీ స్కోర్ దిశగా భారత్-డి
దులీప్ ట్రోఫీ-2024లో అనంతపురం వేదికగా భారత్ ‘బి’ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ‘డి’ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘డి’ జట్టు 77 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.వికెట్ కీపర్ సంజు సామ్సన్ (83 బంతుల్లో 89 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకం సాధించగా... ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (105 బంతుల్లో 52; 9 ఫోర్లు), రికీ భుయ్ (87 బంతుల్లో 56;9 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీలు చేశారు. ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (95 బంతుల్లో 50; 8 ఫోర్లు) కూడా రాణించాడు. అయితే ఇండియా-డి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఈ మ్యాచ్లో డకౌట్గా అయ్యర్ వెనుదిరిగాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన శ్రీకర్ భరత్, పడిక్కల్తో కలిసి తొలి వికెట్కు 105 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందివ్వగా.. రికీ భుయ్, సంజు సామ్సన్ దాన్ని కొనసాగించారు. భారత్ ‘బి’ బౌలర్లలో రాహుల్ చహర్ 3, ముకేశ్ కుమార్, నవ్దీప్ సైనీ చెరో వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం సామ్సన్తో పాటు సారాంశ్ జైన్ (56 బంతుల్లో 26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.చదవండి: AUS vs ENG: హెడ్ విధ్వంసకర సెంచరీ.. ఇంగ్లండ్ను చిత్తు చేసిన ఆసీస్ -
భారత్-ఎ vs భారత్-సి టెస్టు మ్యాచ్ హైలైట్స్ (ఫోటోలు)
-
అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్లు.. ఫోటోలు
-
అనంతపురం : దులీప్ ట్రోఫీ అభిమానులతో కిక్కిరిసిన స్టేడియం గ్యాలరీ (ఫొటోలు)
-
ఇషాన్ కిషన్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా ఇండియా-సి టీమ్
సాక్షి, అనంతపురం: యువ ఆటగాడు ఇషాన్ కిషన్ (126 బంతుల్లో 111; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అనంతపురంలో భారత్ ‘బి’ జట్టుతో గురువారం మొదలైన దులీప్ ట్రోఫీ రెండో రౌండ్ మ్యాచ్లో భారత్ ‘సి’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ‘సి’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఫస్ట్క్లాస్ క్రికెట్ పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఇషాన్ కిషన్ శతక్కొట్టగా... మిగతా బ్యాటర్లు కూడా విలువైన పరుగులు చేయడంతో భారత్ ‘సి’ జట్టు మెరుగైన స్కోరు చేయగలిగింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 46 బ్యాటింగ్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), సాయి సుదర్శన్ (75 బంతుల్లో 43; 8 ఫోర్లు), రజత్ పాటిదార్ (67 బంతుల్లో 40; 8 ఫోర్లు), బాబా ఇంద్రజిత్ (136 బంతుల్లో 78; 9 ఫోర్లు) రాణించారు. మ్యాచ్ ఆరంభంలో రెండు బంతులు ఎదుర్కోగానే మడమ నొప్పితో మైదానాన్ని వీడిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్... కోలుకొని తిరిగి క్రీజులో అడుగు పెట్టి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మానవ్ సుతార్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గాయం కారణంగా దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయిన ఇషాన్ కిషన్... రెండో రౌండ్ మ్యాచ్లో చక్కటి ఆటతీరు కనబర్చాడు. ఇంద్రజిత్తో కలిసి మూడో వికెట్కు 189 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు. ఇటీవల బుచ్చిబాబు టోర్నమెంట్లో జార్ఖండ్ తరఫున సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్... ఇక్కడే అదే జోరు కొనసాగించాడు. భారత్ ‘బి’ బౌలర్లలో ముఖేశ్ కుమార్ 3 వికెట్లు పడగొట్టగా... నవ్దీప్ సైనీ, రాహుల్ చహర్ చెరో వికెట్ తీశారు. స్కోరు వివరాలు భారత్ ‘సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (బ్యాటింగ్) 46; సాయి సుదర్శన్ (సి) నవ్దీప్ సైనీ (బి) ముకేశ్ కుమార్ 43; రజత్ పాటిదార్ (బి) నవ్దీప్ సైనీ 40; ఇషాన్ కిషన్ (బి) ముకేశ్ కుమార్ 111; బాబా ఇంద్రజిత్ (బి) రాహుల్ చాహర్ 78; అభిషేక్ పొరేల్ (ఎల్బీడబ్ల్యూ) ముకేశ్ కుమార్ 12; మానవ్ సుతార్ (బ్యాటింగ్) 8; ఎక్స్ట్రాలు 19; మొత్తం (79 ఓవర్లలో 5 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–96, 2–97, 3–286, 4–311, 5–345. బౌలింగ్: ముకేశ్ కుమార్ 21–3–76–3; నవ్దీప్ సైనీ 17–2–78–1; వాషింగ్టన్ సుందర్ 10–0–55–0; నితీశ్ కుమార్ రెడ్డి 14–2–58–0; సాయికిశోర్ 12–0–46–0; రాహుల్ చహర్ 5–0–35–1. -
ఆదుకున్న ములానీ
సాక్షి, అనంతపురం: ఆల్రౌండర్ షమ్స్ ములానీ (174 బంతుల్లో 88 బ్యాటింగ్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో దులీప్ ట్రోఫీలో భాగంగా భారత్ ‘డి’తో గురువారం మొదలైన రెండో రౌండ్ మ్యాచ్లో భారత్ ‘ఎ’ జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 82 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రధాన ఆటగాళ్లు విఫలమైన చోట... ములానీ చక్కటి ఇన్నింగ్స్తో చెలరేగాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ‘ఎ’ జట్టుకు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (7)తో పాటు మరో ఓపెనర్ ప్రథమ్ సింగ్ (7) సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో 21 పరుగులకే ఆ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), శాశ్వత్ రావత్ (15) ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో భారత్ ‘ఎ’ జట్టు 93 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. కాసేపటికే కుమార్ కుశాగ్ర (28) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో తనుశ్ కొటియాన్ (53; 6 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి షమ్స్ ములానీ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. టాపార్డర్ సత్తా చాటలేకపోయిన చోట సంయమనంతో క్రీజులో నిలిచి ఒక్కో పరుగు జోడి స్తూ స్కోరు బోర్డు ను ముందుకు నడిపించాడు. అతడికి తనుశ్ నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఏడో వికెట్కు 91 పరుగులు జోడించారు. ఆట ముగిసే సమయానికి షమ్స్ ములానీతో పాటు ఖలీల్ అహ్మద్ (15 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) అర్‡్షదీప్ (బి) విద్వత్ 7; మయాంక్ (సి) సామ్సన్ (బి) విద్వత్ 7; తిలక్ వర్మ (సి) శ్రేయస్ (బి) సారాంశ్ జైన్ 10; రియాన్ పరాగ్ (సి) పడిక్కల్ (బి) అర్‡్షదీప్ 37; శాశ్వత్ రావత్ (సి) శ్రేయస్ (బి) హర్షిత్ రాణా 15; కుశాగ్ర (సి) యశ్ దూబే (బి) అర్‡్షదీప్ 28; షమ్స్ ములానీ (బ్యాటింగ్) 88; తనుశ్ (సి) అర్‡్షదీప్ (బి) సౌరభ్ 53; ప్రసిద్ధ్ కృష్ణ (సి) (సబ్) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 8; ఖలీల్ అహ్మద్ (బ్యాటింగ్) 15; ఎక్స్ట్రాలు: 20; మొత్తం: (82 ఓవర్లలో 8 వికెట్లకు) 288. వికెట్ల పతనం: 1–18, 2–21, 3–65, 4–69, 5–93, 6–144, 7–235, బౌలింగ్: హర్షిత్ రాణా 16–4–49–2; విద్వత్ 14–5–30–2; అర్‡్షదీప్ 18–3–73–2; సారాంశ్ జైన్ 14–3–55–1; సౌరభ్ కుమార్ 20–1–65–1. -
DT 2024: అనంతపురంలో దులిప్ ట్రోఫీ రెండో మ్యాచ్ (ఫొటోలు)
-
రీఎంట్రీ ఇచ్చిన రుతురాజ్
ఇండియా-బితో జరుగుతున్న రెండో రౌండ్ దులీప్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా-సి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను ఇన్నింగ్స్ ఆరంభంలో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. సింగిల్ తీసే క్రమంలో రుతురాజ్ కాలి మడమ మెలిక తిరగడంతో పెవిలియన్కు చేరాడు. అయితే, సెంచరీ హీరో ఇషాన్ కిషన్ ఔటయ్యాక రుతురాజ్ తిరిగి క్రీజ్లోకి వచ్చాడు. ప్రస్తుతం అతను 46 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-సి 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. రుతురాజ్తో పాటు మానవ్ సుతార్ (8) క్రీజ్లో ఉన్నాడు. ఇండియా-సి ఇన్నింగ్స్లో సాయి సుదర్శన్ 43, రజత్ పాటిదార్ 40, ఇషాన్ కిషన్ 111, బాబా ఇంద్రజిత్ 78, అభిషేక్ పోరెల్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, నవ్దీప్ సైనీ, రాహుల్ చాహర్ తలో వికెట్ పడగొట్టారు.ఇషాన్ సూపర్ సెంచరీఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ 126 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి ఔటయ్యాడు. గాయం కారణంగా ఇషాన్ తొలి రౌండ్ మ్యాచ్ ఆడలేదు. తొలి రౌండ్ మ్యాచ్కు ముందు బుచ్చిబాబు టోర్నీలోనూ ఇషాన్ సెంచరీతో మెరిశాడు.ఆదుకున్న ములానీఇవాళే మొదలైన మరో మ్యాచ్లో ఇండియా-ఏ, ఇండియా-డి జట్లు తలపడుతున్నాయి. అనంతపురం వేదికగానే జరుగుతున్న ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఇండియా-ఏ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. ప్రథమ్ సింగ్ (7), మయాంక్ అగర్వాల్ (7), తిలక్ వర్మ (10), రియాన్ పరాగ్ (37), షాశ్వత్ రావత్ (15), కుమార్ కుషాగ్రా (28), తనుశ్ కోటియన్ (53), ప్రసిద్ధ్ కృష్ణ (8) ఔట్ కాగా.. షమ్స్ ములానీ (88), ఖలీల్ అహ్మద్ (15) క్రీజ్లో ఉన్నారు. ఇండియా-డి బౌలర్లలో విధ్వత్ కావేరప్ప, అర్ష్దీప్ సింగ్, హర్షిత రాణా తలో 2, సరాన్ష్ జైన్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: ఇండియా-సికి బిగ్ షాక్.. రుతురాజ్కు గాయం -
రింకూ సింగ్కు లక్కీ ఛాన్స్.. ఆ జట్టు నుంచి పిలుపు?
టీమిండియా విధ్వంసకర ఆటగాడు రింకూ సింగ్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఇండియా-బి జట్టు తరపున రింకూ ఆడనున్నాడు. భారత-బి జట్టులోని చాలా మంది ఆటగాళ్లు బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లనున్నారు.ప్రస్తుతం బి జట్టులో భాగంగా ఉన్న యశస్వీ జైశ్వాల్, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ దయాల్లకు బంగ్లాతో టెస్టు సిరీస్కు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 12 నుంచి జరగనున్న తదుపరి రౌండ్ మ్యాచ్లకు వీరిందరూ అందుబాటులో ఉండరు.ఈ నేపథ్యంలోనే రింకూ సింగ్తో పాటు మరో ఉత్తరప్రదేశ్ ఆటగాడు ఆకిబ్ ఖాన్కు దులీప్ ట్రోఫీలో ఆడేందుకు పిలుపు వచ్చింది అయితే ఈ దేశీవాళీ టోర్నీకి ముందు ఎంపిక చేసిన జట్లలో రింకూకు చోటు దక్కలేదు. దీంతో అతడు యూపీ టీ20లో లీగ్లో భాగమయ్యాడు. కానీ ఇప్పుడు సెలక్టర్లు నుంచి పిలుపు రావడంతో అతడు ఇండియా బి జట్టుతో చేరనున్నాడు."దులీప్ ట్రోఫీలో ఆడేందుకు అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడి పనిచేయడమే నా పని. మొదట జట్లను ప్రకటించినప్పుడు.. నా పేరు లేకపోవడం కాస్త నిరుత్సాహపడ్డాను. కానీ ఇప్పడు మళ్లీ పిలుపు రావడంతో సంతోషంగా ఉంది" అని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ పేర్కొన్నాడు. అతడు త్వరలోనే అనంతపూర్లో ఉన్న భారత జట్టుతో చేరనున్నాడు.చదవండి: IND vs BAN: అప్పుడు జీరో.. కట్ చేస్తే..! ఇప్పుడు ఏకంగా టీమిండియాలో ఎంట్రీ? -
ఒకే ఇన్నింగ్స్లో 7 క్యాచ్లు.. ధోని రికార్డు సమం చేసిన ధ్రువ్
టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అరుదైన రికార్డు సాధించాడు. దేశీవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు అందుకున్న వికెట్ కీపర్గా ఎంఎస్ ధోని రికార్డును జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024లో ఈ అరుదైన ఫీట్ను ధ్రువ్ నమోదు చేశాడు. ఈ టోర్నీలో ఇండియా- A జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్.. భారత-బి జట్టుపై ఈ ఘనతను అందుకున్నాడు. ఇండియా బి సెకెండ్ ఇన్నింగ్స్లో ధ్రువ్ ఏకంగా 7 క్యాచ్లు అందుకున్నాడు. తద్వారా మిస్టర్ కూల్ సరసన ఈ యంగ్ వికెట్ కీపర్ నిలిచాడు. దులీప్ ట్రోఫీ 200-2005 సీజన్లో ఈస్ట్జోన్ తరపున ఒకే ఇన్నింగ్స్లో ధోని 7 క్యాచ్లు అందుకున్నాడు. ఇక ప్రస్తుత మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా ఎ జట్టు విజయానికి 169 పరుగులు అవసరమవ్వగా.. ఇండియా బి జట్టు గెలపునకు 4 వికెట్ల దూరంలో ఉంది. ఇండియా ఎ ఆశలు అన్నీ కేఎల్ రాహుల్పైనే ఉన్నాయి. రాహుల్ 34 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.చదవండి: IND vs BAN: బంగ్లాతో తొలి టెస్టు.. టీమిండియా క్యాంపులోకి యువ ఆటగాడు! ఎవరంటే? -
ముషీర్ ఖాన్@181.. 321 పరుగులకు భారత్-బి ఆలౌట్
దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఎ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్-బి జట్టు తొలి ఇన్నింగ్స్లో 321 పరుగులకు ఆలౌటైంది. 202/7 ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-బి టీమ్.. అదనంగా 119 పరుగులు చేసి తమ మొదటి ఇన్నింగ్స్ను ముగించింది.ముషీర్ ఖాన్ అదుర్స్..ఇక తొలి రోజు ఆటలో సెంచరీతో చెలరేగిన భారత-బి జట్టు బ్యాటర్ ముషీర్ ఖాన్.. రెండో రోజు కూడా తన మార్క్ను చూపించాడు. ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. బి జట్టు 321 పరుగులు చేయడంలో ముషీర్ కీలక పాత్ర పోషించాడు.ఓ దశలో డబుల్ సెంచరీ చేసేలా కన్పించిన ముషీర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో పరాగ్కు క్యాచ్ ఇచ్చి ఓటౌయ్యాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో 373 బంతులు ఎదుర్కొన్న ముషీర్ ఖాన్.. 16 ఫోర్లు, 5 సిక్స్లతో 181 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు టెయిలాండర్ నవ్దీప్ సైనీ కీలక నాక్ ఆడాడు. 144 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 56 పరుగులు చేశాడు. ఇక టీమ్-ఎ బౌలర్లలో ఆకాష్ దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్, ఖాలీల్ ఆహ్మద్ తలా రెండు వికెట్లు సాధించారు. A 6⃣ that hits the roof & then caught in the deep!Kuldeep Yadav bounces back hard and a magnificent innings of 181(373) ends for Musheer Khan 👏#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️ https://t.co/eQyu38Erb1 pic.twitter.com/OSJ2b6kmkk— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2024 -
Duleep Trophy 2024: అక్షర్ ఆల్రౌండ్ షో..
సాక్షి, అనంతపురం: దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ అటు బ్యాట్తో ఇటు బంతితో సత్తా చాటాడు. అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ స్టేడియంలో గురువారం భారత్ ‘సి’ జట్టుతో ప్రారంభమైన మ్యాచ్లో భారత్ ‘డి’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అక్షర్ పటేల్ (118 బంతుల్లో 86; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అర్ధశతకంతో మెరిశాడు. టాపార్డర్ విఫలమైన చోట అక్షర్ ఆదుకోవడంతో భారత్ ‘డి’ జట్టు తొలి ఇన్నింగ్స్లో 164 పరుగులు చేసింది. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (9), దేవదత్ పడిక్కల్ (0), యశ్ దూబే (10), అథర్వ (4)తో పాటు ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్ (13), రికీ భుయ్ (4) ఆకట్టుకోలేకపోయారు.76 పరుగులకే 8 వికెట్లు కోల్పోయిన దశలో అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అర్‡్షదీప్ సింగ్ (13)తో తొమ్మిదో వికెట్కు 84 పరుగులు జోడించి జట్టుకు ఓ మాదిరి స్కోరు అందించాడు. భారత్ ‘సి’ బౌలర్లలో విజయ్ కుమార్ వైశాఖ్ 3, అన్షుల్ కంబోజ్, హిమాన్షు చౌహాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ‘సి’ జట్టు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. కెపె్టన్ రుతురాజ్ గైక్వాడ్ (5), సాయి సుదర్శన్ (7), ఆర్యన్ జుయెల్ (12), రజత్ పాటిదార్ (13) విఫలం కాగా... బాబా ఇంద్రజీత్ (15 బ్యాటింగ్), అభి పొరెల్ (32 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. చేతిలో 6 వికెట్లు ఉన్న భారత్ ‘సి’ జట్టు... భారత్ ‘డి’ స్కోరుకు 73 పరుగులు వెనుకబడి ఉంది. స్కోరు వివరాలు భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (సి) విజయ్ కుమార్ (బి) అన్షుల్ 4; యశ్ దూబే (సి) పొరెల్ (బి) అన్షుల్ 10; శ్రేయస్ అయ్యర్ (సి) పొరెల్ (బి) విజయ్ కుమార్ 9; దేవదత్ పడిక్కల్ (సి) రుతురాజ్ గైక్వాడ్ (బి) విజయ్ కుమార్ 0; రికీ భుయ్ (సి) అన్షుల్ (బి) హిమాన్షు 4; శ్రీకర్ భరత్ (సి) ఇంద్రజీత్ (బి) మానవ్ 13; అక్షర్ పటేల్ (సి) మానవ్ సుతార్ (బి) హృతిక్ షోకీన్ 86; సారాంశ్ జైన్ (రనౌట్) 13; హర్షిత్ రాణా (సి) రజత్ పాటిదార్ (బి) హిమన్షు 0; అర్ష్దీప్ సింగ్ (సి) మానవ్ సుతార్ (బి) విజయ్ కుమార్ 13; ఆదిత్య (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు: 12, మొత్తం: (48.3 ఓవర్లలో ఆలౌట్) 164. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–23, 4–23, 5–34, 6–48, 7–76, 8–76, 9–160, 10–164, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 12–0–47–2; విజయ్ కుమార్ వైశాఖ్ 12–3–19–3; హిమాన్షు చౌహాన్ 9–2–22–2; మానవ్ సుతార్ 7–2–34–1; హృతిక్ షోకీన్ 8.3–1–32–1. భారత్ ’సి’ తొలి ఇన్నింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (సి) అథర్వ (బి) హర్షిత్ రాణా 5; సాయి సుదర్శన్ (సి) శ్రీకర్ భరత్ (బి) హర్షిత్ రాణా 7; ఆర్యన్ జుయెల్ (సి అండ్ బి) అక్షర్ పటేల్ 12; రజత్ పాటిదార్ (బి) అక్షర్ పటేల్ 13; బాబా ఇంద్రజీత్ (బ్యాటింగ్) 15; అభిõÙక్ పొరెల్ (బ్యాటింగ్) 32; ఎక్స్ట్రాలు: 7, మొత్తం: (33 ఓవర్లలో 4 వికెట్లకు) 91. వికెట్ల పతనం: 1–11, 2–14, 3–40, 4–43, బౌలింగ్: హర్షిత్ రాణా 7–5–13–2; అర్‡్షదీప్ సింగ్ 8–1–24–0; ఆదిత్య 7–1–18–0, అక్షర్ పటేల్ 6–2–16–2; సారాంశ్ జైన్ 5–1–14–0. -
అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో దులీప్ ట్రోఫీ ప్రారంభం (ఫొటోలు)
-
అనంతపురం : దులీప్ ట్రోఫీలో భాగంగా క్రీడాకారులు సాధన (ఫొటోలు)
-
#DuleepTrophy2024 : అనంతపురం చేరుకున్న క్రికెటర్లు (ఫొటోలు)
-
ఉత్తమ స్పిన్నర్లలో ఒకడిని.. జట్టులో చోటివ్వండి: భారత బౌలర్
తనకు టెస్టుల్లో ఆడే అవకాశం ఇవ్వాలని టీమిండియా యువ ఆల్రౌండర్ ఆర్. సాయి కిశోర్ సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. భారత్లో ఉన్న ఉత్తమ స్పిన్నర్లలో తానూ ఒకడినని.. ఒక్క అవకాశం ఇస్తే తనను తాను నిరూపించుకుంటానని మేనేజ్మెంట్ను అభ్యర్థించాడు. తమిళనాడుకు చెందిన సాయి కిశోర్ ఆసియా క్రీడలు-2023 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి తొలిసారి పంపిన క్రికెట్ జట్టులో భాగమైన ఈ లెఫ్టార్మ్ స్పిన్ బౌలర్.. మొత్తంగా మూడు టీ20లు ఆడి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సాయి కిశోర్.. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా అత్యుత్తమ గణాంకాలు(4/33) నమోదు చేశాడు.మెడకు తీవ్ర గాయంఅయితే, ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. మ్యాచ్ల విరామ సమయంలో గోల్ఫ్ ఆడేందుకు వెళ్లిన సాయి కిశోర్.. మెడకు తీవ్రమైన గాయమైంది. ఫలితంగా ఐపీఎల్-2024 మిగిలిన మ్యాచ్లన్నింటికీ అతడు దూరం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందిన సాయి.. ఈ ఏడాది జూలైలో తమిళనాడు ప్రీమియర్ లీగ్ సందర్భంగా తిరుప్పూర్ తమిళన్స్ తరఫున పునరాగమనం చేశాడు.తదుపరి దులిప్ ట్రోఫీ-2024లో సాయి భాగం కానున్నాడు. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమ్-బిలో ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడిన సాయి కిశోర్.. తీవ్రమైన గాయం నుంచి కోలుకోవడం వెనుక ఎన్సీఏ ఫిజియోల కృషి ఎంతగానో ఉందని తెలిపాడు. వారితో పాటు తన భార్య కూడా కంటికి రెప్పలా కాచుకుని తనను తిరిగి మామూలు స్థితికి తీసుకువచ్చిందన్నాడు.భయపడ్డాను‘‘మనం నడవాలన్నా.. నిద్రించాలన్నా.. దేనికైనా మెడనే ఉపయోగిస్తాం. మెడకు గాయమైన తర్వాత.. క్రికెట్ మాట పక్కనపెడితే.. నేనసలు తిరిగి సాధారణ జీవితం గడపుతానో లేదోనని భయపడ్డాను. ఆటకు దూరమైనా బాధను దిగమింగుకోవాలని నా మనసును సన్నద్ధం చేసుకున్నాను. అయితే, తులసి అన్న(తులసిరామ్ యువరాజ్, ఎన్సీఏలో ఫిజియో) నేను కోలుకోవడంలో ఎంతో తోడ్పాటునందించారు.నా వ్యక్తిగత మసాజర్, ట్రైనర్ హర్షా.. ఇలా అందరూ నాకు సహాయం అందించారు. గాయం వల్ల అసలు ఎక్కువ సేపు కూర్చునే వీలు కూడా ఉండేది కాదు. ప్రతి పనికీ ఇతరుల మీద ఆధారపడాల్సి వచ్చేది. నా భార్య సహకారం వల్లే ఇప్పుడిలా కోలుకోగలిగాను’’ అని సాయి కిశోర్ తెలిపాడు.ఒక్క ఛాన్స్ ఇవ్వండిఇక తనకు టెస్టుల్లో ఆడాలని ఉందన్న సాయి కిశోర్.. రవీంద్ర జడేజాతో కలిసి ఒక్క మ్యాచ్లో భాగమైనా సంతోషంగా ఉంటుందని పేర్కొన్నాడు. ‘‘దేశంలోని ఉత్తమ స్పిన్నర్లలో నేనూ ఒకడినని భావిస్తా. టెస్టుల్లో నన్ను ఆడించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. జడేజాతో కలిసి ఆడటం నాకు ఇష్టం. అతడిని దగ్గరగా గమనిస్తూ.. తన నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది’’ అని సాయి కిశోర్ తన మనసులోని మాటను వ్యక్తపరిచాడు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
రోహిత్, కోహ్లికి విశ్రాంతి అవసరమా?: టీమిండియా దిగ్గజం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్లో పాల్గొనాల్సిందని భారత జట్టు మాజీ సారథి సునిల్ గావస్కర్ అన్నాడు. తద్వారా బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు ఈ ఇద్దరు సీనియర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదని పేర్కొన్నాడు. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం ఈ రెడ్బాల్ టోర్నీ నుంచి విశ్రాంతినిచ్చి మంచి పని చేశారని సెలక్టర్ల నిర్ణయాన్ని గావస్కర్ సమర్థించాడు.ఆ నలుగురు మినహాకాగా.. జాతీయ జట్టు తరఫున విధుల్లో లేనపుడు.. ఫిట్గా ఉన్న సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్లంతా దేశవాళీ టోర్నమెంట్లలో ఆడాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5 నుంచి మొదలుకానున్న దులిప్ ట్రోఫీలో దాదాపు టీమిండియా ఆటగాళ్లంతా భాగం కానున్నారు.కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు మాత్రం సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు దులిప్ ట్రోఫీ జరుగబోతోంది. కానీ సెలక్టర్లు మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మినహాయింపు ఇచ్చారు.తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేదినిజానికి ఈ టోర్నీలో ఆడితే బంగ్లాతో సిరీస్కు ముందు వారికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించేది. జస్ప్రీత్ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్కు విశ్రాంతినిచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అతడికి గాయాల ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ బ్యాటర్లకు అలా కాదు. ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసు దాటిన ఏ ఆటగాడైనా సరే ఫిట్నెస్పై మరింత దృష్టి సారించడం అవసరం.ఆ సమస్యలు వస్తాయిసుదీర్ఘ విరామం తీసుకుని.. ఒకేసారి బరిలోకి దిగితే కండరాల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువగా మ్యాచ్లు ఆడితేనే మంచిది’’ అని అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లికి విశ్రాంతినివ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు. కాగా కోహ్లి 2012, రోహిత్ 2016లో చివరగా దేశవాళీ క్రికెట్ ఆడారు.లంకలో రో‘హిట్’..ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత కోహ్లి- రోహిత్ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విరామం అనంతరం.. శ్రీలంకతో వన్డే సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, లంకతో మూడు వన్డేల్లో 37 ఏళ్ల రోహిత్ 58, 64, 35 పరుగులు చేయగా.. 35 ఏళ్ల కోహ్లి మాత్రం 24, 14, 20 రన్స్తో పూర్తిగా నిరాశపరిచాడు. కాగా సెప్టెంబరు 19 నుంచి స్వదేశంలో బంగ్లాదేశ్తో జరుగనున్న టెస్టు సిరీస్లో రోహిత్- కోహ్లి ద్వయం మైదానంలో దిగనున్నారు.చదవండి: తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ -
తారలు దిగివచ్చే వేళ.. అనంతపురంలో దులీప్ ట్రోఫీ
బ్యాటుతో రప్ఫాడేస్తారు. పరుగులతో హోరెత్తిస్తారు. కళ్లు చెదిరే సిక్సులు, ఫోర్లతో అలరించేస్తారు. ఎప్పుడూ టీవీలో కనిపించే అలాంటి తారలు మన నగరానికే వస్తున్నారు. వినోదం పంచనున్నారు. అనంతపురంలోని ఆర్డీటీ క్రీడా గ్రామం దేశవాళీ క్రీడా సంరంభానికి సిద్ధమవుతుండగా, తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం క్రికెట్ ప్రేమి కులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.అనంతపురం: దేశవాళీ క్రికెట్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే దులీప్ ట్రోఫీ క్రికెట్ పోటీలు అనంతపురంలో జరగనున్నాయి. వచ్చే నెల 5న టోర్నీ ప్రారంభం కానుండగా, అనంతపురం ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఐదు మ్యాచ్లు జరుగుతాయి. ఒక మ్యాచ్ నాలుగు రోజుల పాటు (మల్టీడే మ్యాచ్) నిర్వహిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే టెస్ట్ మ్యాచ్గా పరిగణిస్తారు. ఒక మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగుతుంది. క్రీడా గ్రామం ఖ్యాతి.. దులీప్ ట్రోఫీ మ్యాచ్లు తొలిసారిగా అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తుండడంతో జిల్లా పేరు దేశస్థాయిలో మార్మోగనుంది. 2003లో ప్రారంభించిన ఆర్డీటీ క్రీడా గ్రామం అనతి కాలంలోనే తన కీర్తిని ఇనుమడింపజేసుకుంది. స్టేడియంలో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలు పాటిస్తుండడంతో దులీప్ ట్రోఫీ నిర్వహణకు అవకాశం దక్కింది. పేద, మధ్య తరగతి క్రీడాకారులకు దన్నుగా నిలుస్తూ ఎంతో మంది ప్రతిభావంతులను క్రీడల వైపు ఆసక్తి పెరిగేలా కృషి చేసిన ఫాదర్ ఫెర్రర్ ఆశయం నెరవేరుతోందని క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులకు పండగే.. టోర్నీ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, పంత్ తదితర క్రికెట్ స్టార్లు నగరానికి రానున్నారు. తమ ఆటతో అభిమానులను మురిపించనున్నారు. భారత జట్టు క్రికెటర్లలో ముగ్గురు మినహా అందరూ దులీప్ ట్రోఫీలోని జట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలో తమ అభిమాన క్రికెటర్ల రాక కోసం యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నగరంలోని రెండు త్రీ స్టార్ హోటళ్లలో భారత క్రికెటర్లకు బస ఏర్పాట్లు చేస్తున్నారు.గర్వకారణం ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం అనంతపురం జిల్లా చరిత్రలోనే తొలిసారి. ఇటువంటి మ్యాచ్లు జరుగుతాయని ఊహించలేదు. ఇంత మంది స్టార్ క్రికెటర్లు వస్తారని కలలో కూడా అనుకోలేదు. దులీప్ ట్రోఫీ వంటి వాటి నిర్వహణకు కేవలం గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. క్రికెటర్లకు అధునాతన సౌకర్యాలు కల్పించాలి. ఇటువంటి టోర్నీల వల్ల జిల్లా క్రికెటర్లకు స్ఫూర్తి కలుగుతుంది. ఆర్డీటీ క్రీడా గ్రామంలో రెండు గ్రౌండ్లు ఉన్నాయి. ఒకే సమయంలో రెండు మ్యాచ్లు జరుగుతాయి. చాలా పెద్ద పని. చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందరి సహకారంతో ఈ టోర్నమెంట్ను విజయవంతం చేస్తాం. సెపె్టంబర్ 5 నుంచి 22 వరకూ టోర్నీ జరుగుతుంది. భారత జట్టులోని ముగ్గురు క్రీడాకారులు మినహా తక్కిన వారందరూ ఈ టోర్నీలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. – మాంఛో ఫెర్రర్, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ మెంబర్ దులీప్ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించే జట్లు ఇవే..టీమ్–ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ ధూబే, తనుస్ కోటియన్, కులదీప్ యాదవ్, ఆకాష్ దీప్, ప్రసిద్్ధకృష్ణ, ఖలీల్ అహమ్మద్, అవేశ్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుషగ్ర, షస్వత్ రావత్. టీమ్–బీ: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, సిరాజ్, యశ్ దయాల్, ముకేష్ కుమార్, రాహుల్ చహార్, ఆర్ సాయి కిశోర్, మోహిత్ అశ్విత్, ఎన్. జగదీషన్ (వికెట్ కీపర్) టీమ్–సీ: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, అభిష్క్ పోరెల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, బి. ఇంద్రజిత్, హార్ధిక్ షోకీన్, మనవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైశాఖ్ విజయ్కుమార్, అన్సుల్ కాంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మార్ఖండే, ఆర్యన్ జుయాల్ (వికెట్ కీపర్), సందీప్ వారియర్ టీమ్ –డీ: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అతర్వ టైడ్, యష్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రికీ భూయి, షరాన్స్ జైన్, ఆక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఆదిత్య థాక్రే, హర్షిత్ రాణా, తుషార్దేశ్పాండే, ఆకాష్ సేన్గుప్తా, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), సౌరభ్ కుమార్. -
జడ్డూనే ముందుగా అడిగా.. నా నిర్ణయాల వల్లే ఇలా: జై షా
తమ కఠిన వైఖరి కారణంగానే టీమిండియా స్టార్లలో మార్పు వచ్చిందని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. యువ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ దేశవాళీ టోర్నీల్లో ఆడటమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. కేవలం వీరిద్దరిని దృష్టిలో పెట్టుకుని నిబంధనలు ప్రవేశపెట్టలేదని.. అందరి కంటే ముందుగా రవీంద్ర జడేజా విషయంలో తాను ఈ వైఖరి అవలంబించినట్లు తెలిపాడు.బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదుసెంట్రల్ కాంట్రాక్టు ఉన్న భారత క్రికెటర్లు ఫిట్గా ఉండి, జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ నిబంధనలు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ బోర్డు ఆదేశాలను లెక్కచేయలేదు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారన్న కారణంగా ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పొరపాటు సరిచేసుకున్న శ్రేయస్ ఇప్పటికే రంజీల్లో ఆడి శ్రీలంకతో వన్డే సిరీస్ జట్టులో చోటు దక్కించుకోగా.. ఇషాన్ సైతం దులిప్ ట్రోఫీ-2024 బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం గురించి జై షా స్పందిస్తూ... ‘‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మినహా మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారు.నా కఠిన నిర్ణయాల వల్లే ఇలానేను కఠినమైన నిర్ణయాలు తీసుకున్నందు వల్లే ఇది సాధ్యమైంది. శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కూడా ఈ టోర్నీలో భాగమయ్యారు. మేము స్ట్రిక్ట్గా ఉండాలనే నిర్ణయించుకున్నాం. నిజానికి రవీంద్ర జడేజా గాయం కారణంగా జట్టుకు దూరమైనపుడు.. నేను తనకి కాల్ చేశాను.కోలుకున్న తర్వాత ముందుగా దేశవాళీ క్రికెట్ ఆడాలని సూచించాను. జడేజా అందుకు తగ్గట్లుగా ముందుగా రంజీ మ్యాచ్ ఆడి ఆ తర్వాత టీమిండియాలోకి వచ్చాడు. ఆటగాళ్లు గాయపడటం సహజం. అయితే, గాయం కారణంగా జట్టుకు దూరమైన ఆటగాళ్లు తిరిగి ఫిట్నెస్ సాధించడంతో పాటు డొమెస్టిక్ క్రికెట్ ఆడితేనే జాతీయ జట్టుకు ఎంపిక చేస్తామని చెప్పాం’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. సెప్టెంబరు 5 నుంచిఅయితే, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి మాత్రం ఇందుకు మినహాయింపు అని జై షా స్పష్టం చేశాడు. కాగా సెప్టెంబరు 5 నుంచి దేశవాళీ రెడ్బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. స్వదేశంలో బంగ్లాదేశ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందుకు టీమిండియా స్టార్లు ఈ టోర్నమెంట్ బరిలో దిగనున్నారు. చదవండి: Ind vs Ban: టీమిండియాలో చోటు దక్కదని తెలుసు.. అయినా! -
రోహిత్, కోహ్లి అందుకే ఆడటం లేదు: జై షా
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా యువ క్రికెటర్లందరూ భాగం కాబోతున్నారు. సీనియర్లు మినహా కీలక ఆటగాళ్లంతా ఈ రెడ్బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. శుబ్మన్ గిల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ తదితరులతో పాటు.. అగ్రశ్రేణి ఆటగాళ్లు రవీంద్ర జడేజా, మహ్మద సిరాజ్, కేఎల్ రాహుల్ కూడా ఈ దులిప్ ట్రోఫీలో ఆడనున్నారు.ఇందుకు సంబంధించి ఏ,బి,సి,డి జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. ఈ జట్లకు వరుసగా శుబ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. అయితే, ఈ ప్రకటనకు ముందు.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి కూడా దులిప్ ట్రోఫీ ఆడబోతున్నారనే వార్తలు వినిపించాయి.బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు సన్నాహకంగా ఈ నవతరం దిగ్గజాలు కూడా దేశవాళీ క్రికెట్ ఆడతారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, రోహిత్, కోహ్లితో పాటు జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ మాత్రం ఈ టోర్నీకి దూరంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వారికి మాత్రమే మినహాయింపు ఎందుకనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా స్పందించారు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికి మినహాయింపు ఇవ్వడం గురించి చెబుతూ.. ‘‘వాళ్లు తప్ప మిగతా వాళ్లంతా దులిప్ ట్రోఫీలో ఆడుతున్నారు. ఇందుకు వారందరిని ప్రశంసించాలి. అంతేకాదు.. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ బుచ్చిబాబు టోర్నమెంట్ ఆడేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇది హర్షించదగ్గ పరిణామం.ఇక రోహిత్, కోహ్లి వంటి మేటి ఆటగాళ్లను కూడా దులిప్ ట్రోఫీలో ఆడాలని పట్టుబట్టడం సమంజసం కాదు. వాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బోర్డుపై ఉంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లలోని అంతర్జాతీయ క్రికెటర్లందరూ దేశవాళీ టోర్నీలు ఆడరు. బోర్డులు కూడా వారిని ఆడమని బలవంతపెట్టవు. ఆటగాళ్లకు తగిన గౌరవం ఇవ్వాలి కదా!’’ అని జై షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.ఇక బంగ్లాదేశ్లో పరిస్థితుల దృష్ట్యా భారత్తో టెస్టు సిరీస్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘ఇంతవరకు మేము బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారులతో మాట్లాడలేదు. అక్కడ కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంది. వాళ్లు మమ్మల్ని సంప్రదిస్తారేమో చూడాలి. లేదంటే.. మేమే వాళ్లను సంప్రదిస్తాం. ఎందుకంటే టీమిండియాకు బంగ్లాదేశ్తో సిరీస్ అత్యంత ముఖ్యమైనది’’ అని జై షా బదులిచ్చారు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా పటిష్ట స్థితిలో నిలవాలంటే బంగ్లాతో రెండు మ్యాచ్ల సిరీస్ తప్పనిసరి. ఈ రెండింటిలో గెలిచి అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. -
దులీప్ ట్రోఫీలో అగ్రశ్రేణి క్రికెటర్లు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు భారత దేశవాళీ క్రికెట్ సీజన్ దులీప్ ట్రోఫీతో మొదలుకానుంది. వచ్చేనెల 5 నుంచి బెంగళూరు, అనంతపురంలో ఈ టోర్నీ జరగనుంది. దీనికోసం జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం నాలుగు జట్లను ప్రకటించింది. శుబ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ వరుసగా ‘ఎ’ ‘బి’ ‘సి’ ‘డి’ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకొని స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, బుమ్రా, అశి్వన్లకు ఈ టోర్నీ నుంచి విశ్రాంతి ఇచ్చారు. శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా కోలుకోని సీనియర్ పేసర్ షమీని కూడా ఎంపిక చేయలేదు. ఇక కారు ప్రమాదం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ చాలా రోజులకు ఎర్రబంతితో ఆడనున్నాడు. గత సీజన్లో రంజీ ట్రోఫీ ఆడకుండా.. ఐపీఎల్పై దృష్టి పెట్టి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన ఇషాన్ కిషన్ టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్నాడు. సెపె్టంబర్ 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లో మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని ‘బి’ జట్టుకు ఎంపిక చేశారు. హైదరాబాద్ ఆటగాళ్లు సిరాజ్ ‘బి’ జట్టులో చోటు పొందగా.. తిలక్ వర్మ ‘ఎ’ జట్టులో ఉన్నాడు. ఆంధ్ర ఆటగాళ్లు శ్రీకర్ భరత్, రికీ భుయ్ టీమ్ ‘డి’లో చోటు దక్కించుకున్నారు. -
అన్నకు పోటీగా తమ్ముడు.. టీమిండియాలో ఛాన్స్ కోసం!
దేశవాళీ క్రికెట్ టోర్నీ దులిప్ ట్రోఫీ-2024లో టీమిండియా స్టార్లు భాగం కానున్నారు. జాతీయ జట్టుకు ఎంపికవ్వాలంటే దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిందే అని బీసీసీఐ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వచ్చే నెల 5 నుంచి ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీలో.. రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్, సూర్యకుమార్ యాదవ్, రజత్ పటిదార్ తదితరులు దులీప్ ట్రోఫీలో పాల్గొననున్నారు.ఇందుకు సంబంధించి బీసీసీఐ తాజాగా జట్లను ప్రకటించింది. టీమ్-’ఎ’ కెప్టెన్గా శుబ్మన్ గిల్, టీమ్-బి సారథిగా అభిమన్యు ఈశ్వరన్, టీమ్-సి నాయకుడిగా రుతురాజ్ గైక్వాడ్, టీమ్-డి కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. అయితే, ఈ ట్రోఫీ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. అన్నకు పోటీగా ఓ తమ్ముడు బరిలోకి దిగనున్నాడు. అంతేకాదు ఇద్దరూ ఒకే జట్టుకు ఆడబోతున్నారు.అన్నదమ్ముల మధ్య పోటీ?వారు మరెవరో కాదు ఖాన్ సోదరులు.. సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్. టీమ్-బి లో వీరిద్దరు భాగం కానున్నారు. అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్సీలో సర్ఫరాజ్తో పాటు ముషీర్ కూడా దులిప్ ట్రోఫీ ఆడనున్నాడు. అయితే, గతంలో వీరిద్దరు ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహించినా.. సర్ఫరాజ్ టీమిండియా అరంగేట్రం చేసిన తర్వాత ముషీర్తో కలిసి ఆడటం ఇదే తొలిసారి.ఈ ఏడాది ఫిబ్రవరిలో స్వదేశంలో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. అజేయ అర్ధ శతకంతో మెరిసి సత్తా చాటాడు. మొత్తంగా మూడు టెస్టులాడి ఐదు ఇన్నింగ్స్లో కలిపి 200 పరుగులు సాధించాడు.తమ్ముడు ఆల్రౌండర్నాడు కేఎల్ రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్.. ఈసారి బంగ్లాదేశ్తో సిరీస్లో చోటు దక్కించుకోవాలంటే గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో సొంత తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధం కావడం విశేషం. అండర్-19 వరల్డ్కప్ టోర్నీలో దుమ్ములేపిన ముషీర్.. ఫస్ట్క్లాస్ రికార్డు కూడా మెరుగ్గానే ఉంది.అన్న సర్ఫరాజ్ ఖాన్.. ఇప్పటిదాకా 48 ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో కలిపి 68.53 సగటుతో 4112 పరుగులు చేయగా.. ముషీర్ ఆడిన ఆరు ఫస్ట్క్లాస్ మ్యాచ్లలోనే సగటు 58తో 529 పరుగులు రాబట్టాడు. అంతేకాదు.. ఈ ఆల్రౌండర్ ఖాతాలో ఏడు వికెట్లు కూడా ఉండటం విశేషం. ఇక సర్ఫరాజ్ స్పెషలిస్టు బ్యాటర్ కాగా.. ముషీర్ స్పిన్ ఆల్రౌండర్ కావడం గమనార్హం. -
దులీప్ ట్రోఫీ జట్ల ప్రకటన.. కెప్టెన్లుగా గిల్, రుతురాజ్, శ్రేయస్.. సీనియర్లకు విశ్రాంతి
సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకాబోయే దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను (టీమ్ ఏ, బి, సి, డి) ఇవాళ (ఆగస్ట్ 14) ప్రకటించారు. ఈ జట్లకు శుభ్మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నారు. ఈ టోర్నీలో చాలామంది టీమిండియా స్టార్లు పాల్గొననున్నారు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ మినహా టీమిండియా మొత్తం ఈ టోర్నీలో పాల్గొంటుంది. ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగానే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కు జట్టు ఎంపిక ఉంటుందని తెలుస్తుంది.టీమ్ ఏ: శుభమన్ గిల్ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, తనుష్ కోటియన్, కుల్దీప్ యాదవ్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్, విద్వత్ కావేరప్ప, కుమార్ కుశాగ్రా , శాశ్వత్ రావత్.టీమ్ బి: అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, ముఖేష్ కుమార్, రాహుల్ చాహర్, ఆర్ సాయి కిషోర్, మోహిత్ అవస్తి , ఎన్ జగదీసన్ (వికెట్కీపర్).టీమ్ సి: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, అభిషేక్ పోరెల్ (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, బాబా ఇంద్రజిత్, హృతిక్ షోకీన్, మానవ్ సుతార్, ఉమ్రాన్ మాలిక్, వైషాక్ విజయ్కుమార్, అన్షుల్ ఖంబోజ్, హిమాన్షు చౌహాన్, మయాంక్ మర్కండే, ఆర్యన్ జుయల్ (వికెట్కీపర్), సందీప్ వారియర్.టీమ్ డి: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబే, దేవదత్ పడిక్కల్, ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), రికీ భుయ్, సరాంశ్ జైన్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, ఆదిత్య ఠాకరే, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, ఆకాష్ సేన్ గుప్తా, కేఎస్ భరత్ (వికెట్కీపర్), సౌరభ్ కుమార్.షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి -
దులీప్ ట్రోఫీలో ఆడనున్న టీమిండియా స్టార్లు వీరే..!
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ముందు చాలామంది టీమిండియా స్టార్లు దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ పాల్గొననున్నారని తెలుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొనేందుకు భారత సెలెక్టర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరిద్దరు మినహా ఇటీవలికాలంలో టీమిండియాకు ఆడిన దాదాపు అందరు ప్లేయర్లను ఈ టోర్నీలో పాల్గొనాలని బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తుంది. విరాట్, రోహిత్తో పాటు అశ్విన్, బుమ్రా, హార్దిక్ పాండ్యా కూడా ఈ టోర్నీకి అందుబాటులో ఉండరని తెలుస్తుంది. షెడ్యూల్ ప్రకారం దులీప్ ట్రోఫీ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే అవకాశం ఉంది. ఈ టోర్నీలో మొత్తం నాలుగు జట్లు (ఇండియా ఏ, బి, సి, డి) పాల్గొననున్నాయి. క్రికెట్ వర్గాల సమాచారం మేరకు జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది.ఇండియా ఏ: రుతురాజ్ గైక్వాడ్, దేవ్దత్ పడిక్కల్, చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్కీపర్), సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, సరాన్ష్ జైన్, హర్షిత్ రాణా, తుషార్ దేశ్పాండే, నవ్దీప్ సైనీఇండియా బి: శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, అజింక్య రహానే, రింకూ సింగ్, రికీ భుయ్, రవీంద్ర జడేజా, కేఎస్ భరత్ (వికెట్కీపర్), పుల్కిత్ నారంగ్, ఉమ్రాన్ మాలిక్, ఆవేశ్ ఖాన్, యశ్ దయాల్ఇండియా సి: పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), దృవ్ జురెల్ (వికెట్కీపర్), సౌరభ్ కుమార్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, విధ్వత్ కావేరప్ప, ప్రసిద్ద్ కృష్ణఇండియా డి: యశస్వి జైస్వాల్, మయాంక్ అగర్వాల్, ప్రదోశ్ రంజన్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, మానవ్ సుతార్, ఆకాశ్దీప్, అర్ష్దీప్ సింగ్, ముకేశ్కుమార్షెడ్యూల్..సెప్టెంబర్ 5-8: తొలి మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ బిరెండో మ్యాచ్- టీమ్ సి వర్సెస్ టీమ్ డిసెప్టెంబర్ 12-15: మూడో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ డినాలుగో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ సిసెప్టెంబర్ 19-22: ఐదో మ్యాచ్- టీమ్ బి వర్సెస్ టీమ్ డిఆరో మ్యాచ్- టీమ్ ఏ వర్సెస్ టీమ్ సి -
బంగ్లాతో సిరీస్కు బుమ్రా దూరం! కారణం ఇదే
శ్రీలంక పర్యటన అనంతరం టీమిండియా సుదీర్ఘ విరామం లభించింది. దాదాపు నలభై రోజుల తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్తో వరుస సిరీస్లు ఆడనుంది. సెప్టెంబరు 19- అక్టోబరు 12 మధ్య రెండు మ్యాచ్ల టెస్టు, మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. అంతకంటే ముందు టీమిండియా క్రికెటర్లు దేశవాళీ టోర్నీలతో బిజీకానున్నట్లు సమాచారం.కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం దులిఫ్ ట్రోఫీ బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఈ రెడ్బాల్ టోర్నమెంట్కు మాత్రం దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. బంగ్లాదేశ్తో సిరీస్కు కూడా అతడు అందుబాటులో ఉండడం లేదని సమాచారం.రోహిత్- కోహ్లి రీఎంట్రీకాగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ విజేతగా నిలవడంలో ఫాస్ట్ బౌలర్ బుమ్రాది కీలక పాత్ర. ఈ ఈవెంట్లో అతడు అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. ఇక ఈ ఐసీసీ టోర్నీ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు బుమ్రా కూడా విశ్రాంతి తీసుకున్నాడు. అయితే, శ్రీలంకతో వన్డే సిరీస్ సందర్భంగా రోహిత్- కోహ్లి రీఎంట్రీ ఇవ్వగా.. బుమ్రా మాత్రం సెలవులోనే ఉన్నాడు.ఆసీస్తో సిరీస్ మరింత కీలకంబంగ్లాదేశ్తో సిరీస్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని భావించగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం విశ్రాంతి పొడిగించేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ చేరే క్రమంలో టీమిండియాకు ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ కీలకం కానుంది. అందుకే విశ్రాంతిఅంతకంటే ముందే బంగ్లాదేశ్తో సిరీస్ ఆడాల్సి ఉన్నా.. ఆ జట్టుపై భారత్కు ఘనమైన రికార్డు ఉంది కాబట్టి.. బుమ్రా వంటి ప్రధాన బౌలర్ సేవలు అవసరం లేదని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అతడిపై పని భారం తగ్గించి.. గాయాల బారిన పడకుండా కాపాడుకునేందుకే మేనేజ్మెంట్.. బుమ్రాకు విశ్రాంతి పొడిగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే బుమ్రా సెలవులు పొడిగించుకునేందుకు అనుమతినిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బుమ్రా గనుక నిజంగానే బంగ్లాతో సిరీస్కు దూరమైతే హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపించనున్నాడు. అలాకాకుండా.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గనుక పునరాగమనం చేస్తే.. సిరాజ్ను పక్కనపెట్టే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. శ్రీలంకలో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్ను మాత్రం 0-2తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. ఇరవై ఏడేళ్ల తర్వాత మరోసారి లంక చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయింది.చదవండి: న్యూజిలాండ్ జట్టు ప్రకటన.. 18 నెలల తర్వాత స్టార్ క్రికెటర్ రీ ఎంట్రీ? -
దులీప్ ట్రోఫీ ఆడండి.. టెస్ట్ స్పెషలిస్ట్లకు బీసీసీఐ ఆదేశం
సెప్టెంబర్లో స్వదేశంలో మొదలయ్యే టెస్ట్ సీజన్కు ముందు భారత టెస్ట్ స్పెషలిస్ట్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. టెస్ట్ జట్టు రెగ్యులర్ సభ్యులందరూ ఆగస్ట్ నెలలో జరిగే దులీప్ ట్రోఫీలో పాల్గొనాలని సూచించింది. ప్రతి ఆటగాడు కనీసం ఒకటి లేదా రెండు మ్యాచ్లు ఆడేలా ప్లాన్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ విషయంలో సీనియర్లు రోహిత్, విరాట్, బుమ్రాలకు మినహాయింపు ఉన్నట్లు తెలుస్తుంది. కీలక ఆటగాళ్లైన ఈ ముగ్గురు గాయాల బారిన పడకుండా ఉండేందుకే మినహాయింపు ఇస్తున్నట్లు సమాచారం.కాగా, భారత టెస్ట్ సీజన్ సెప్టెంబర్లో స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో మొదలవుతుంది. అనంతరం భారత్.. స్వదేశంలోనే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. నవంబర్ 22-వచ్చే ఏడాది జనవరి 7 మధ్యలో భారత్.. ఆస్ట్రేలియా పర్యటనుకు వెళ్తుంది. ఈ పర్యటనలో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనుంది.ఇదిలా ఉంటే, టీమిండియా టీ20 వరల్డ్కప్ విజయానంతరం బిజీ షెడ్యూల్ కలిగి ఉంది. పొట్టి ప్రపంచకప్ ముగిశాక జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడిన భారత్.. జులై 27 నుంచి శ్రీలంకతో మూడు మ్యాచ్ల టీ20, వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం సెప్టెంబర్లో బంగ్లాదేశ్ జట్టు భారత్లో పర్యటించనుంది. లంకతో టీ20, వన్డే సిరీస్ల కోసం భారత జట్టుకు ఇవాళ (జులై 16) ప్రకటించే అవకాశం ఉంది. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను భారత్ 4-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. -
2024-25 దేశవాళీ సీజన్ షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ
2024-25 దేశవాళీ సీజన్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ నిన్న (జూన్ 6) విడుదల చేసింది. ఈ సీజన్ సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో మొదలై 2025 ఏప్రిల్ 1న జరిగే సీనియర్ మహిళల ఛాలెంజర్ ట్రోఫీతో ముగుస్తుంది. ఈ మధ్యలో సీనియర్ పురుషులు, మహిళలకు సంబంధించిన పలు మల్టీ ఫార్మాట్ ట్రోఫీలతో పాటు పలు జూనియర్ స్థాయి టోర్నీలు జరుగనున్నాయి. 2024-25 క్యాలెండర్ ఇయర్కు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది.దేశవాళీ క్రికెట్లో ప్రముఖ టోర్నీలైన రంజీ ట్రోఫీ ఈ ఏడాది అక్టోబర్ 11న మొదలై వచ్చే ఏడాది మార్చి 2న ముగుస్తుంది. రంజీ ట్రోఫీకి ముందు దులీప్ ట్రోఫీ, ఇరానీ కప్.. రంజీ ట్రోఫీ మధ్యలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ జరుగనున్నాయి.2024-25 దేశవాళీ సీజన్ క్యాలెండర్..ముఖ్యమైన టోర్నీలకు సంబంధించిన వేదికల వివరాలు..VENUES & DATES OF INDIAN DOMESTIC CRICKET 2024-25...!!!! pic.twitter.com/LBuRy4hSjg— Johns. (@CricCrazyJohns) June 6, 2024 -
ప్రియాంక్ కెప్టెన్ ఇన్నింగ్స్ వృధా.. దులీప్ ట్రోఫీ విజేతగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ-2023 విజేతగా సౌత్ జోన్ నిలిచింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో వెస్ట్జోన్పై 75 పరుగుల తేడాతో సౌత్ జోన్ విజయం సాధించింది. ఇది సౌత్జోన్కు 14వ దులీప్ ట్రోఫీ విజయం కావడం గమనార్హం. 182/5 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్జోన్.. అదనంగా కేవలం 40 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవి చూసింది. వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ (95), సర్ఫరాజ్ ఖాన్ (48) పోరాడినా.. ఓటమి తప్పలేదు. సౌత్ జోన్ బౌలర్లు వాసుకి కౌషిక్ (4/36), సాయి కిశోర్ (4/57) చెలరేగడంతో వెస్ట్జోన్ కుప్పకూలింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 213 పరుగులకు ఆలౌటైంది. అనంతరం వెస్ట్జోన్ తన మొదటి ఇన్నింగ్స్లో 146 పరుగులకే చాపచుట్టేసింది. సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప ఏకంగా ఏడు వికెట్లు తీసి వెస్ట్ జోన్ను దెబ్బకొట్టాడు. దీంతో 67 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌత్ జోన్ 230 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్ ముగించింది. దీంతో వెస్ట్జోన్ ఎదుట 298 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. అనంతరం వెస్ట్జోన్ 222 పరుగులకే పరిమితమైంది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ అవార్డులను సౌత్ జోన్ బౌలర్ కావేరప్ప సొంతం చేసుకున్నాడు. చదవండి: Ind Vs Wi: ఇంత తక్కువ ప్రైజ్మనీ ఎందుకివ్వడం.. మిక్సీలు, గ్రైండర్లు ఇవ్వడం బెటర్! -
పుజారా, సూర్య విఫలం.. కెప్టెన్ ఇన్నింగ్స్తో అదరగొట్టిన ప్రియాంక్.. ఇంకా..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: సౌత్ జోన్తో నువ్వా- నేనా అన్నట్లుగా సాగుతున్న దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ గెలుపు అవకాశాలను సజీవంగా ఉంచాడు కెప్టెన్ ప్రియాంక్ పాంచల్. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడి కష్టాల్లో కూరుకుపోయిన జట్టును గట్టెక్కించాడు. టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా(15), సూర్యకుమార్ యాదవ్ (4) విఫలమైన వేళ తానున్నానంటూ కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు. బెంగళూరు వేదికగా సాగుతున్న ఫైనల్ మ్యాచ్లో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఓపెనింగ్ బ్యాటర్ ప్రియాంక్ 92 పరుగులతో క్రీజులో ఉన్నాడు. సౌత్ జోన్ను ఓడించి టైటిల్ గెలవాలంటే వెస్ట్ జోన్ 116 పరుగులు చేయాలి. ఇంకా ఒకరోజు ఆట మిగిలి ఉండటం, చేతిలో ఐదు వికెట్లు ఉండటంతో వెస్ట్ జోన్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అయితే, ప్రియాంక్ను త్వరగా పెవిలియన్కు పంపిస్తే మాత్రం హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ పైచేయి సాధించే అవకాశం ఉంది. వెస్ట్ జోన్ కీలక బ్యాటర్లంతా ఇప్పటికే పెవిలియన్ చేరడం ప్రత్యర్థికి కలిసి వచ్చే అంశం. కాగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ బుధవారం ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ టాస్ గెలిచి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇక వెస్ట్ జోన్ తరఫున ఓపెనర్ పృథ్వీ షా(65) ఒక్కడే రాణించడం.. పుజారా(9), సూర్య(8) సహా ఇతర బ్యాటర్లు చేతులెత్తేయడంతో 146 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో మెరుగైన ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌత్ జోన్ 230 పరుగులకు కథ ముగించింది. ఈ క్రమంలో వెస్ట్ జోన్ టాప్ బ్యాటర్లు మరోసారి విఫలం కావడం ప్రభావం చూపింది. అయితే, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 92 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్నాడు. ఆఖరి రోజు 116 పరుగులు సాధిస్తేనే టైటిల్ గెలుస్తుంది. లేదంటే సౌత్ జోన్ ఈసారి చాంపియన్గా అవతరిస్తుంది. చదవండి: రహానేను కించపరిచిన ఇషాన్! ఇవే తగ్గించుకుంటే మంచిది.. మొన్న కోహ్లికే.. అతడిని టెస్టుల్లోకి తీసుకురావాలి.. ఎందుకంటే: కుంబ్లే కీలక వ్యాఖ్యలు 𝐒𝐭𝐮𝐦𝐩𝐬 𝐨𝐧 𝐃𝐚𝐲 𝟒 The match is nicely poised 👍 Priyank Panchal's fighting 92* has taken West Zone to 182/5 💪. They need 116 more to win. South Zone need 5 wickets.#WZvSZ | #DuleepTrophy | #Final 💻 Ball by ball updates - https://t.co/ZqQaMA6B6M pic.twitter.com/eGRmdrpQVh — BCCI Domestic (@BCCIdomestic) July 15, 2023 -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 67 పరుగుల లీడ్తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్కుమార్ వైశాఖ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్ను దెబ్బకొట్టారు. -
Test Match: విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. 8 పరుగులకే అవుట్..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్లో వెస్ట్ జోన్ బ్యాటర్ పృథ్వీ షా అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సౌత్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో 101 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 65 పరుగులతో రాణించాడు ఈ ఓపెనర్. అయితే, మిగతా బ్యాటర్ల నుంచి పృథ్వీ షాకు సహకారం లభించలేదు. 8 పరుగులకే అవుట్ మరో ఓపెనర్, కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ 11 పరుగులకే పెవిలియన్ చేరగా.. వన్డౌన్లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ హర్విక్ దేశాయ్ 21 పరుగులు చేయగలిగాడు. ఇక నాలుగో స్థానంలో దిగిన టీమిండియా నయావాల్ ఛతేశ్వర్ పుజారా పోరాడుతుండగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్ చేసిన మరో భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా నిరాశపరిచాడు. 6 బంతులు ఎదుర్కొన్న ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. సౌత్ జోన్ బౌలర్ విధ్వత్ కవెరప్ప బౌలింగ్లో కెప్టెన్ హనుమ విహారికి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్ను కవెరప్ప వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. తిలక్, విహారి ఇన్నింగ్స్తో ఇలా కీలక బ్యాటర్లు విఫలం కావడంతో వెస్ట్ జోన్ 119 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దులిప్ ట్రోఫీ-2023 ఫైనల్ రెండో రోజు ఆటను వెలుతురులేమి కారణంగా నిలిపివేసే సమయానికి పుజారా 7, అతిత్ సేత్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ(40), హనుమ విహారి(63) ఆదుకోవడంతో సౌత్ జోన్ 213 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగించింది. వెస్ట్ జోన్ ప్రస్తుతం 94 పరుగులు వెనుకబడి ఉంది. ఇలాగైతే.. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్-2023లో విఫలమైన కారణంగా పుజారా టెస్టు జట్టులో చోటు కోల్పోయాడు. ఇక వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించిన సూర్యకుమార్ యాదవ్కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పుజారా, సూర్య దేశవాళీ క్రికెట్పై దృష్టి సారించడం గమనార్హం. ఇక దులిప్ ట్రోఫీ ముగిసిన తర్వాత సూర్య కరేబియన్ దీవికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్ -
మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి! ఫైనల్లో జట్టును..
Duleep Trophy 2023- West Zone vs South Zone, Final: ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2023లో భాగంగా వెస్ట్ జోన్- సౌత్ జోన్ మధ్య బుధవారం ఫైనల్ ఆరంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన వెస్ట్ జోన్ కెప్టెన్ ప్రియాంక్ పాంచల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన సౌత్ జోన్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ రవికుమార్ సమర్త్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. మరో ఓపెనింగ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 28 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో తెలుగు తేజాలు తిలక్ వర్మ, హనుమ విహారి జట్టును ఆదుకునే బాధ్యత తీసుకున్నారు. మార్కు చూపించిన తిలక్ వర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్తో విహారి వన్డౌన్లో వచ్చిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ 87 బంతుల్లో 40 పరుగులు సాధించగా.. విహారి 63 పరుగుల(130 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో)తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు కలిసి మూడో వికెట్కు 79 పరుగులు జతచేశారు. ఇక నగ్వాస్వల్లా బౌలింగ్లో వికెట్ కీపర్ హర్విక్ దేశాయ్కు క్యాచ్ ఇచ్చి తిలక్ పెవిలియన్ చేరగా.. షామ్స్ ములాని విహారి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెలుతురు లేమి కారణంగా వీరిద్దరు అవుటైన తర్వాత సౌత్ జోన్ వరుసగా వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ 9, సచిన్ బేబి 7, సాయి కిషోర్ 5 పరుగులు మాత్రమే చేశారు. తొలిరోజు ఆట ముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోరు చేసింది సౌత్ జోన్ జట్టు. వాషింగ్టన్ సుందర్(9), విజయ్కుమార్ వైశాక్(5) క్రీజులో ఉన్నారు. వెస్ట్ జోన్ బౌలర్లలో అర్జాన్ నగ్వాస్వల్లా, చింతన్ గజా, షామ్స్ ములాని రెండేసి వికెట్లు తీయగా.. అతిత్ సేత్కు ఒక వికెట్ దక్కింది. ఇక వెలుతురు లేమి కారణంగా మొదటి రోజు 25 ఓవర్ల ఆట సాధ్యపడలేదు. విహారి 46వ ఫిఫ్టీ వెస్ట్ జోన్తో దులిప్ ట్రోఫీ సందర్భంగా సౌత్ జోన్ కెప్టెన్ హనుమ విహారి అర్ధ శతకంతో మెరిశాడు. ఫస్ట్క్లాస్ కెరీర్లో అతడికి ఇది 46వ ఫిఫ్టీ. ఇక ఈ మ్యాచ్లో 63 పరుగులు సాధించడం ద్వారా విహారి ఫస్ట్క్లాస్ క్రికెట్లో 8706 రన్స్ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 23 సెంచరీలు, 46 అర్ధ శతకాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI: దవడ పగిలినా బౌలింగ్ చేసి.. దిగ్గజ బ్యాటర్ వికెట్ తీసి! -
జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Ind Vs WI Test Series 2023: ‘‘జట్టు నుంచి నన్నెందుకు తప్పించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. టీమిండియాలో స్థానం లేనందుకు ఎంతగా నిరాశ చెందానో.. అందుకు గల కారణం తెలియక అంతకంటే ఎక్కువగానే బాధపడుతున్నాను. ఈ విషయం గురించి మేనేజ్మెంట్ నుంచి నన్నెవరూ సంప్రదించలేదు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపళ్లాలు సహజం. అయితే, ఇలాంటి చేదు అనుభవాలను జీర్ణించుకోవడానికి కాస్త సమయం పడుతుంది. మొదట్లో చాలా బాధపడేవాడిని. కానీ ఇప్పుడిప్పుడే అన్నీ అర్థమవుతున్నాయి. భారత జట్టులో నాకు చోటుందా లేదా అన్న విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు. ఒత్తిడికి లోనుకావడం లేదు. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ట్రోఫీలు గెలిచే దిశగా ముందుకు సాగడమే నా తక్షణ కర్తవ్యం’’ అని టీమిండియా క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారి అన్నాడు. కాకినాడకు చెందిన హనుమ విహారి 2018లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో అర్ధ శతకంతో లండన్లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ తొలి ఇన్నింగ్స్లోనే అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. 2022లో బర్మింగ్హాంలో ఇంగ్లండ్తో రీషెడ్యూల్డ్ టెస్టు తర్వాత హనుమ విహారికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్నప్పటికీ అతడికి అవకాశాలు కరువయ్యాయి. వెస్టిండీస్తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఛాన్స్ వస్తుందని ఎదురుచూసిన 29 ఏళ్ల విహారికి నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో హనుమ విహారీ మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. సౌత్ జోన్ కెప్టెన్గా ఇదిలా ఉంటే.. దులిప్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విహారి జట్టును విజేతగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వెస్ట్ జోన్తో ఆరంభమైన ఫైనల్లో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. కాగా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 16 టెస్టులాడిన హనుమ విహారి 839 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 111. చదవండి: అర్జున్ టెండూల్కర్కు గోల్డెన్ చాన్స్ -
ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా
బెంగళూరు: దేశవాళీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ దులీప్ ట్రోఫీ ఫైనల్ నేడు బెంగళూరులో మొదలుకానుంది. హనుమ విహారి సారథ్యంలోని సౌత్ జోన్ జట్టు ప్రియాంక్ పాంచాల్ కెప్టెన్సీలోని డిఫెండింగ్ చాంపియన్ వెస్ట్ జోన్ జట్టుతో తలపడనుంది. గత ఏడాది ఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు 294 పరుగుల తేడాతో సౌత్ జోన్ జట్టును ఓడించింది. సౌత్ జోన్ చివరిసారి 2011లో దులీప్ ట్రోఫీ టైటిల్ గెలిచింది. వెస్ట్ జోన్ జట్టు 19సార్లు చాంపియన్గా నిలిచింది. విహారితోపాటు మయాంక్ అగర్వాల్, తిలక్ వర్మ, రికీ భుయ్, సాయి సుదర్శన్ ఆటతీరుపై సౌత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పృథ్వీ షా, పుజారా, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్లతో వెస్ట్ జోన్ కూడా పటిష్టంగా ఉంది. చదవండి: విండీస్తో తొలి టెస్టు.. ఓపెనర్గా జైశ్వాల్, గిల్ మూడో స్థానంలో -
సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా!
Rinku Singh Highlights Of 40 Off 30 Balls In Duleep Trophy Video: కోల్కతా నైట్ రైడర్స్ సంచలనం రింకూ సింగ్ బీసీసీఐ సెలక్టర్లపై పరోక్షంగా విమర్శలు సంధించాడు. దేశవాళీ క్రికెట్లో సిక్సర్లు బాదుతున్న వీడియోను ఇన్స్టాలో షేర్ చేశాడు. తన ఆటలో ఎలాంటి లోపం లేదని.. మరి తనకెందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో నెట్టింట చర్చకు దారి తీసింది. కాగా ఐపీఎల్-2023లో రింకూ సింగ్ అద్భుత ఆట తీరు కనబరిచిన విషయం తెలిసిందే. కేకేఆర్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బ్యాటర్.. 14 మ్యాచ్లలో కలిపి 474 పరుగులు సాధించాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చిన తీరు అభిమానులను ఫిదా చేసింది. ఫినిషర్గా తానున్నానంటూ కేకేఆర్ స్టార్లంతా విఫలమైన వేళ డెత్ ఓవర్లలో రింకూ చూపిన తెగువ క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో సీజన్ ఆసాంతం ఆకట్టుకున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్కు టీమిండియాలో చోటు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. క్యాష్ రిచ్ లీగ్ టోర్నీ ముగిసిన తర్వాత భారత జట్టు తొలిసారి ఆడనున్న వెస్టిండీస్తో టీ20 సిరీస్ నేపథ్యంలో రింకూ సెలక్టర్ల పిలుపు అందుకుంటాడని అంతా భావించారు. కానీ ఐపీఎల్-2023లో అదరగొట్టిన యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), తిలక్ వర్మ(ముంబై ఇండియన్స్)కు ఎంపిక చేశారే తప్ప రింకూకు మాత్రం మొండిచేయి చూపారు. దులిప్ ట్రోఫీలో ఈ నేపథ్యంలో దులిప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్కు ప్రాతినిథ్యం వహించిన రింకూ సింగ్.. వెస్ట్ జోన్తో సెమీ ఫైనల్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 69 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 48 పరుగులు సాధించిన 25 ఏళ్ల ఈ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్లో 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్లో తన ఇన్నింగ్స్కు సంబంధించిన హైలైట్స్ వీడియోను రింకూ సింగ్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లకు దిమ్మతిరిగేలా బ్యాట్తోనే సమాధానం ఇచ్చావు కదా బ్రో అంటూ ఫ్యాన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా రింకూకు విండీస్ చోటు దక్కని నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తగా.. ఐర్లాండ్తో టీ20 సిరీస్కు అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: Ind Vs WI: విండీస్తో తొలి టెస్టు.. అత్యంత అరుదైన రికార్డు ముంగిట కోహ్లి రహానే వైస్ కెప్టెన్ అయినపుడు మరి కోహ్లి ఎందుకు..?: మాజీ చీఫ్ సెలక్టర్ View this post on Instagram A post shared by Rinku 🧿 (@rinkukumar12) -
''పుజారా సార్' నాలా బ్యాటింగ్ చేయలేడు.. నేను అంతే!'
కెరీర్ ఆరంభంలో ఒక మెరుపులా వచ్చి భవిష్యత్తు స్టార్ క్రికెటర్గా తయారవుతాడనుకున్న పృథ్వీ షా పాతాళానికి పడిపోయాడు. అగ్రెసివ్ ఆటతీరుతో ఆకట్టుకున్న పృథ్వీ ప్రస్తుతం టీమిండియా జట్టులో చోటు కోల్పోయాడు. ఇటవలే ముగిసిన ఐపీఎల్లోనూ పృథ్వీ షా పెద్దగా రాణించింది లేదు. దీనికి తోడు వివాదాలు అతన్ని చుట్టుముట్టాయి. ఇక 2021లో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ పుజారాకు ఆఖరిది. ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయాడు. తాజాగా దులీప్ ట్రోపీలో వెస్ట్జోన్ తరపున పాల్గొంటున్న పృథ్వీ షా ఆ తర్వాత దేవదర్ ట్రోపీలోనూ ఆడాలనుకుంటున్నాడు. అటుపై ఇంగ్లండ్లో జరిగే కౌంటీ క్రికెట్లో తొలిసారి నార్తంప్టన్షైర్ తరపున బరిలోకి దిగనున్నాడు. కౌంటీల్లో రాణించి మళ్లీ టీమిండియాలోకి రావాలని పృథ్వీ షా నిశ్చయించుకున్నాడు. జూలై 12 నుంచి వెస్ట్జోన్, సౌత్జోన్ల మధ్య దులీప్ ట్రోపీ ఫైనల్ జరగనుంది. ఇక సెంట్రల్ జోన్తో సెమీఫైనల్ ముగిశాకా విజయంపై స్పందించిన పృథ్వీ షా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను నా ఆటను మార్చుకోవాలనుకోవడం లేదు. కాకపోతే నా గేమ్కు కాస్త స్మార్ట్నెస్ను యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తా. నేను పుజారా సార్లా బ్యాటింగ్ చేయలేను.. ఆయన నాలా బ్యాటింగ్ చేయలేడు. ఈ విషయంలో ఎవరి బ్యాటింగ్ స్టైల్ వారికి ఉంటుంది. ఇన్నేళ్లుగా నాకున్న అగ్రెసివ్నెస్ బ్యాటింగ్ను వదులుకోలేను.. కానీ స్మార్ట్గా ఆడడానికి ప్రయత్నిస్తా. ఇక వెస్ట్జోన్ దులీప్ ట్రోపీలో ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. నేను ముంబైకి ఆడొచ్చు.. లేదంటే వెస్ట్జోన్కు ప్రాతినిధ్యం వహిస్తుండొచ్చు.. కానీ ఆట అనేది చాలా ముఖ్యం. ఒక రకంగా నా కెరీర్కు ఈ ఫైనల్ ఉపయోగపడుతుందంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తా. ఇక గత ఏడాదిగా రెడ్బాల్ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్నా. ఒక మ్యాచ్లో త్రిబుల్ సెంచరీ(370 పరుగులు Vs అస్సాం) మరిచిపోలేని ఇన్నింగ్స్. కానీ వైట్బాల్లో అంత ప్రభావాన్ని చూపించలేకపోయా. కానీ రెడ్బాల్ క్రికెట్లో నా బ్యాటింగ్ మెరుగుపరుచుకోవడం కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నా.. త్వరలోనే మళ్లీ టీమిండియా నుంచి పిలుపు వస్తుందని ఆశిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: #DuleepTrophy: 5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా? -
5 ఓవర్లకు 53 నిమిషాలు.. గెలుపు అడ్డుకోవడం కోసం ఇన్ని కుట్రలా?
మాములుగా క్రికెట్లో ఐదు ఓవర్లు బౌలింగ్ వేయడానికి 20 నిమిషాలు పడుతుంది. మహా అయతే మరో ఐదు నిమిషాలు అదనంగా పట్టొచ్చు. కానీ ఆ ఐదు ఓవర్లు బౌలింగ్ చేయడానికి దాదాపు 53 నిమిషాలు తీసుకోవడం అంటే ఎంత సమయం వృథా చేశారో అర్థమయి ఉంటుంది. ఈ సంఘటన దులీప్ ట్రోపీ సెమీఫైనల్లో చోటుచేసుకుంది. మ్యాచ్లో సౌత్ జోన్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెప్టెన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్కు 6.05 పరుగుల రన్రేట్తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరకు జయంత్ బౌలింగ్లోనే భారీ సిక్స్తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించడం విశేషం. అయితే నార్త్జోన్ కెప్టెన్ జయంత్ యాదవ్ వైఖరిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యర్థి జట్టు గెలుపును అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నించాడు. తన కపటబుద్ధి బయటపెట్టాడు.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం అంటూ కామెంట్ చేశారు.. సౌత్జోన్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెప్టెన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు ఔటైన తిలక్ వర్మ, సాయికిషోర్లు జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: 39 ఏళ్ల తర్వాత.. యూరో అండర్-21 చాంపియన్ ఇంగ్లండ్ Womens Ashes 2023: యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్లో ఆసీస్ ఓటమి -
మయాంక్ అగర్వాల్ సూపర్ ఇన్నింగ్స్.. ఫైనల్లో సౌత్జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ విజయలక్ష్యం 215 పరుగులు...మూడో రోజు 21 పరుగులు చేయగా, చివరి రోజు శనివారం చేతిలో 10 వికెట్లతో మరో 194 పరుగులు సాధించాలి. అయితే రెండు సార్లు మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. చివర్లో కూడా వర్షసూచన కనిపించింది. మ్యాచ్ ‘డ్రా’ అయితే తొలి ఇన్నింగ్స్లో 3 పరుగుల ఆధిక్యం సాధించిన నార్త్జోన్ ముందంజ వేసేది. కానీ సౌత్ ఆ అవకాశం ఇవ్వలేదు. చివరి రోజు ఓవర్కు 6.05 పరుగుల రన్రేట్తో దూకుడుగా ఆడి ఆటను ముగించింది. చివరి రోజు సౌత్ 36.1 ఓవర్లలో 8 వికెట్లకు 219 పరుగులు చేసి విజయాన్నందుకుంది. మయాంక్ అగర్వాల్ (57 బంతుల్లో 54; 7 ఫోర్లు), కెపె్టన్ హనుమ విహారి (42 బంతుల్లో 43; 8 ఫోర్లు), రికీ భుయ్ (29 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్), తిలక్ వర్మ (19 బంతుల్లో 25; 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మయాంక్, విహారి మూడో వికెట్కు 47 బంతుల్లోనే 59 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. విహారి వెనుదిరిగే సమయానికి సౌత్ మరో 74 పరుగులు చేయాలి. ఈ దశలో భుయ్, తిలక్ 33 బంతుల్లోనే 50 పరుగులు జోడించి మళ్లీ గెలుపు బాట వేశారు. సౌత్ విజయానికి చేరువవుతున్న దశలో నార్త్ కెపె్టన్ జయంత్ యాదవ్ బంతి బంతికీ ఫీల్డింగ్ను మారుస్తూ సమయం వృథా చేసేందుకు ప్రయత్నించాడు. వెలుతురులేమి, వర్షం కారణంగా ఆట నిలిచిపోవాలని అతను ఆశించాడు. అయితే చివరకు జయంత్ బౌలింగ్లోనే భారీ సిక్స్తో సాయికిషోర్ (15 నాటౌట్) మ్యాచ్ ముగించాడు. ఫైనల్లో వెస్ట్జోన్... సెంట్రల్ జోన్, వెస్ట్జోన్ మధ్య జరిగిన మరో సెమీస్ ‘డ్రా’గా ముగిసింది. దాంతో తొలి ఇన్నింగ్స్లో 92 పరుగుల ఆధిక్యం సాధించిన వెస్ట్జోన్ ఫైనల్ చేరింది. 390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్ 4 వికెట్లకు 128 పరుగులే చేసింది. రింకూ సింగ్ (30 బంతుల్లో 40; 3 ఫోర్లు, 3 సిక్స్లు) ధాటిగా ఆడాడు. -
5 వికెట్లతో చెలరేగిన వైశాక్..! పుజారా జట్టుకు ఓటమి తప్పదా?!
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: సౌత్జోన్ సీమర్ వైశాక్ విజయ్కుమార్ (5/76) నిప్పులు చెరిగే బౌలింగ్తో నార్త్జోన్ను కూల్చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 56.4 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 51/2తో శుక్రవారం మూడో రోజు ఆట కొనసాగించిన నార్త్ జట్టు 160 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ప్రభ్సిమ్రాన్ సింగ్ (63; 11 ఫోర్లు), హర్షిత్ రాణా (38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. మూడు పరుగుల స్వల్ప ఆధిక్యంతో కలిపి నార్త్ జట్టు సౌత్ జట్టుకు 215 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా... ఆట ముగిసే సమయానికి సౌత్జోన్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ కోల్పోకుండా 21 పరుగులు చేసింది. ఆఖరి రోజు విజయానికి 194 పరుగుల దూరంలో ఉంది. పుజారా శతకం సెంట్రల్ జోన్తో జరుగుతున్న మరో సెమీఫైనల్లో చతేశ్వర్ పుజారా (133; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కగా, సూర్యకుమార్ యాదవ్ (52; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ సాధించాడు. దీంతో వెస్ట్ భారీ లక్ష్యంవైపు దూసుకెళుతోంది. ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 292 పరుగులు చేసింది. సౌరభ్ 4, సారాంశ్ 3 వికెట్లు తీశారు. ప్రస్తుతం వెస్ట్ 384 పరుగుల ఆధిక్యంలో ఉంది. వర్షం కారణంగా చివరి రోజు ఆట సాధ్యంకాకుండా మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో వెస్ట్ జోన్ జట్టుకు ఫైనల్ బెర్త్ ఖరారవుతుంది. చదవండి: బజ్బాల్ ఆట చూపించాడు.. అరుదైన రికార్డు కొల్లగొట్టాడు -
టీమిండియా నుంచి ఉద్వాసన.. కసితో శతక్కొట్టిన పుజారా
దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా సెంచరీతో కదంతొక్కాడు. టీమిండియా నుంచి ఉద్వాసనకు గురయ్యానన్న కసితో ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన పుజారా.. తన అనుభవాన్నంత రంగరించి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన 60వ శతకాన్ని నమోదు చేశాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్ట్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా.. 13 బౌండరీల సహకారంతో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇన్నింగ్స్లో పుజారాకు మరో ఎండ్ నుంచి సహకారం లేనప్పటికీ.. ఒంటిపోరాటం చేసి, తన జట్టుకు 300 పరుగులకు పైగా లీడ్ను అందించాడు. ఈ ఇన్నింగ్స్లో నోటెడ్ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్ (6), పృథ్వీ షా (25) విఫలం కాగా.. టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. కాగా, ఇటీవల వెస్టిండీస్ టూర్ కోసం ప్రకటించిన భారత టెస్ట్ జట్టులో పుజారాకు చోటు దక్కని విషయం తెలిసిందే. -
రాణించిన పుజారా.. సత్తా చాటిన సూర్యకుమార్, నిరాశపరిచిన పృథ్వీ షా
సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ-2023 తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పట్టు బిగించింది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు సెకెండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసి, 241 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. చతేశ్వర్ పుజారా (50), సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజ్లో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా చిచ్చరపిడుగు సూర్యకుమార్ యాదవ్ (58 బంతుల్లో 52; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. పృథ్వీ షా (25) నిరాశపరిచాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో సౌరభ్ కుమార్ 2, యశ్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 220 పరుగులకు ఆలౌటైంది. శివమ్ మావి (6/43) వెస్ట్ జోన్ పతనాన్ని శాశించాడు. ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, సౌరభ్ కుమార్, సరాన్ష్ జైన్ తలో వికెట్ పడగొట్టారు. వెస్ట్ జోన్ బ్యాటర్లలో అతీత్ సేథ్ (74) టాప్ స్కోరర్గా నిలువగా.. పృథ్వీ షా (26), పుజారా (28) ఓ మోస్తరు స్కోర్లకే పరిమితమయ్యారు. సూర్యకుమార్ యాదవ్ (7), సర్ఫరాజ్ ఖాన్ (0) నిరాశపరిచారు. ఆతర్వాత బ్యాటింగ్కు దిగిన సెంట్రల్ జోన్.. నగ్వస్వల్లా (5/74), అతీత్ సేథ్ (3/27), చింతన్ గజా (2/25) ధాటికి 128 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ హీరో రింకూ సింగ్ (48) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్జోన్ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్కు తమీమ్ గుడ్బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
ఐపీఎల్లో అదరగొట్టాడు.. జట్టులో చోటు కొట్టేశాడు!
దులీప్ ట్రోఫీ-2023లో భాగంగా సెంట్రల్ జోన్తో సెమీఫైనల్కు ముందు వెస్ట్జోన్కు బిగ్ షాక్ తగిలింది. వెస్ట్జోన్ ఫాస్ట్ బౌలర్, సౌరాష్ట్ర పేసర్ చేతన్ సకారియా గాయం కారణంగా సెమీఫైనల్ మ్యాచ్కు దూరమమయ్యాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సకారియాకు నెట్ప్రాక్టీస్లో చేతికి గాయమైంది. అతడు కోలుకోవడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పట్టనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అతడు సెమీఫైనల్కు దూరమయ్యాడు. ఇక గాయం కారణంగా సెమీఫైనల్కు దూరమైన సకారియా స్ధానాన్ని ముంబై పేసర్ తుషార్ దేశ్పాండేతో భర్తీ చేశారు. 28 ఏళ్ల దేశ్పాండే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించిన దేశ్పాండే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఓవరాల్గా ఈ ఏడాది సీజన్లో 16 మ్యాచ్లు ఆడిన అతడు 21 వికెట్లు పడగొట్టాడు. దేశ్పాండేకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో కూడా మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన దేశ్పాండే 3.16 ఎకానమీతో 80 వికెట్లు సాధించాడు. ఇక వెస్ట్జోన్, సెంట్రల్ జోన్ మధ్య దులీప్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ జూలై 5నుంచి ప్రారంభం కానుంది. చదవండి: WC 2023: వరల్డ్ కప్ ఆడేందుకు వెస్టిండీస్కు ఇంకా ఛాన్స్.. అది ఎలా అంటే? -
11 వికెట్లతో చెలరేగిన సౌరభ్ కుమార్.. సెమీస్లో నార్త్, సెంట్రల్ జోన్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్లాయి. శనివారం ముగిసిన క్వార్టర్ ఫైనల్స్లో నార్త్ జోన్ 511 పరుగుల తేడాతో నార్త్ ఈస్ట్ జోన్ జట్టుపై... సెంట్రల్ జోన్ 170 పరుగుల తేడాతో ఈస్ట్ జోన్ జట్టుపై విజయం సాధించాయి. ఈనెల 5 నుంచి జరిగే సెమీఫైనల్స్లో సౌత్ జోన్తో నార్త్ జోన్; వెస్ట్ జోన్తో సెంట్రల్ జోన్ తలపడతాయి. సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో 300 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 41.2 ఓవర్లలో 129 పరుగులకే కుప్ప కూలింది. ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 64 పరుగులిచ్చి 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు) పడగొట్టి సెంట్రల్ జోన్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నార్త్ జోన్తో మ్యాచ్లో 666 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ 47.5 ఓవర్లలో 154 పరుగులకు ఆలౌటైంది. నార్త్ జోన్ బౌలర్లలో పుల్కిత్ నారంగ్ నాలుగు, నిశాంత్ రెండు వికెట్లు పడగొట్టారు. -
రాణించిన మంత్రి.. తిప్పేసిన సౌరభ్ కుమార్
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో సెంట్రల్ జోన్, నార్త్జోన్ జట్లు గెలుపు దిశగా పయనిస్తున్నాయి. ఈస్ట్జోన్తో జరుగుతున్న పోరులో సెంట్రల్ ఆటగాళ్లు హిమాన్షు మంత్రి (68; 7 ఫోర్లు), వివేక్ సింగ్ (56; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాటింగ్లో రాణించగా, సౌరభ్ కుమార్ (4/33) స్పిన్ బౌలింగ్తో తిప్పేశాడు. శుక్రవారం 64/0 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆటప్రారంభించిన సెంట్రల్జోన్ రెండో ఇన్నింగ్స్లో 87.5 ఓవర్లలో 239 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు హిమాన్షు మంత్రి, వివేక్సింగ్ తొలి వికెట్కు 124 పరుగులు జోడించారు. అనంతరం 300 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈస్ట్జోన్ సౌరభ్ స్పిన్ ఉచ్చులో పడింది. ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 69 పరుగులే చేసింది. నార్త్ ఆల్రౌండ్ దెబ్బకు... నార్త్జోన్ ఆల్రౌండ్ దెబ్బకు నార్త్ ఈస్ట్జోన్ కుదేలైంది. దీంతో మూడో రోజు ఆటలోనే నార్త్ ఈస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లను కోల్పోయింది. మొదట 65/3 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన నార్త్ ఈస్ట్జోన్ 39.2 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో నార్త్కు 406 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ను నార్త్జోన్ 55.1 ఓవర్లలో 259/6 వద్ద డిక్లేర్ చేసింది. ప్రభ్ సిమ్రన్సింగ్ (59; 9 ఫోర్లు, 1 సిక్స్), అంకిత్ (70; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో ప్రత్యర్థికి 666 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, నార్త్ ఈస్ట్జోన్ ఆట నిలిచే సమయానికి 18 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. -
నిశాంత్, హర్షిత్ సెంచరీలు.. ప్రత్యర్థి జట్టుకు తప్పని తిప్పలు
బెంగళూరు: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 306/6 రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 8 వికెట్లకు 540 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. నిశాంత్ సింధు (245 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్లు), హర్షిత్ రాణా (86 బంతుల్లో 122 నాటౌట్; 12 ఫోర్లు, 9 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కారు. నిశాంత్తో కలిసి హర్షిత్ ఎనిమిదో వికెట్కు 104 పరుగులు... సిద్ధార్థ్ కౌల్ (9 నాటౌట్)తో కలిసి తొమ్మిదో వికెట్కు 64 పరుగులు జోడించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. సెంట్రల్ జోన్కు ఆధిక్యం ఈస్ట్ జోన్ జట్టుతో జరగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఓవరాల్గా 124 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు జవాబుగా ఈస్ట్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 42.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటైంది. సెంట్రల్ జోన్ బౌలర్లలో అవేశ్ ఖాన్, సౌరభ్ కుమార్ మూడు వికెట్ల చొప్పున తీశారు. 60 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన సెంట్రల్ జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 64 పరుగులు సాధించింది. -
కేకేఆర్ బౌలర్ ఊచకోత.. తొమ్మిదో నంబర్లో వచ్చి విధ్వంసకర శతకం
దులీప్ ట్రోఫీ-2023లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్ హర్షిత్ రాణా విధ్వంసం సృష్టించాడు. తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చి ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. భారీ షాట్లతో విరుచుకుపడి సూపర్ సెంచరీ సాధించాడు. కేవలం 86 బంతుల్లో 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 122 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న నార్త్ జోన్ జట్టు భారీ స్కోర్ చేసింది. హర్షిత్ కంటే ముందు ఇదే ఇన్నింగ్స్లో మరో ఐపీఎల్ ఆటగాడు కూడా శతక్కొట్టాడు. సీఎస్కే ఆటగాడు నిశాంత్ సింధు (150) భారీ శతకం బాదాడు. వీరిద్దరి కంటే ముందు సీఎస్కేకే చెందిన మాజీ ప్లేయర్ ధృవ్ షోరే (135) కూడా సెంచరీ చేశాడు. ఫలితంగా నార్త్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్ను 540/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో ఈ స్కోర్ నమోదైంది. ఇదిలా ఉంటే, 21 ఏళ్ల హర్షిత్ రాణాను 2022 ఐపీఎల్ మెగా వేలంలో కేకేఆర్ సొంతం చేసుకుంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అడపాదడపా బ్యాటింగ్ చేసే హర్షిత్.. ఐపీఎల్లో 8 మ్యాచ్లు ఆడి 6 వికెట్టు పడగొట్టాడు. -
సీఎస్కే ప్లేయర్ సూపర్ సెంచరీ
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సభ్యుడిగా ఉన్న ఆటగాడు దులీప్ ట్రోఫీ-2023లో సూపర్ సెంచరీతో మెరిశాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో నార్త్ జోన్ ఆటగాడు నిశాంత్ సింధు (111 నాటౌట్) అద్భుతమైన శతకం బాదాడు. రెండో రోజు ఆటలో (ఇవాళ) నిశాంత్ సెంచరీ మార్కును అందుకున్నాడు. అంతకుముందు తొలి రోజు ఆటలో ధృవ్ షోరే (135) సెంచరీ చేశాడు. రెండో రోజు తొలి సెషన్ సమయానికి (103 ఓవర్లు) నార్త్ జోన్ 6 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నిశాంత్కు జతగా పుల్కిత్ నారంగ్ (39) క్రీజ్లో ఉన్నాడు. కాగా, ఐపీఎల్-2023 వేలంలో నిశాంత్ సింధును చెన్నై సూపర్ కింగ్స్ 60 లక్షల ధరకు కొనుగోలు చేసింది. అయితే ఆ సీజన్లో అతని ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. 2022 అండర్-19 వరల్డ్కప్లో కనబర్చిన అద్భుతమైన ప్రదర్శన కారణంగా నిశాంత్కు ఐపీఎల్ ఆఫర్ వచ్చింది. నాటి వరల్డ్కప్ ఫైనల్లో నిషాంత్ వీరోచితంగా పోరాడి హాఫ్ సెంచరీ సాధించాడు. నిషాంత్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటివరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు (2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు), 7 లిస్ట్-ఏ మ్యాచ్లు, 8 టీ20లు ఆడాడు. -
శతక్కొట్టిన సీఎస్కే మాజీ ప్లేయర్.. తుస్సుమన్న రింకూ సింగ్
దులీప్ ట్రోఫీ 2023లో ఐపీఎల్ ఆటగాళ్ల నుంచి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఓ మాజీ ఆటగాడు సెంచరీతో కదంతొక్కితే.. మరొకరు అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయారు. సీఎస్కే మాజీ ఆటగాడు, నార్త్ జోన్ ఓపెనర్ ధృవ్ షోరే సెంచరీతో కదంతొక్కగా.. 2023 సీజన్ కేకేఆర్ స్టార్, సెంట్రల్ జోన్ ఆటగాడు రింకూ సింగ్ (38) ఓ మోస్తరు స్కోర్కే పరిమితమయ్యాడు. బెంగళూరు: భారత క్రికెట్ దేశవాళీ సీజన్ 2023–2024 దులీప్ ట్రోఫీ మ్యాచ్లతో బుధవారం మొదలైంది. చిన్నస్వామి స్టేడియంలో నార్త్ ఈస్ట్ జోన్తో ప్రారంభమైన క్వార్టర్ ఫైనల్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. 90 ఓవర్లు ఆడిన నార్త్ జోన్ 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. ఓపెనర్ ధ్రువ్ షోరే (211 బంతుల్లో 136; 22 ఫోర్లు) సెంచరీ సాధించాడు. నిశాంత్ సింధు (113 బంతుల్లో 76 బ్యాటింగ్; 9 ఫోర్లు, 2 సిక్స్లు), పుల్కిత్ నారంగ్ (23 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. సెంట్రల్ జోన్ 182 ఆలౌట్ ఆలూర్లో ఈస్ట్ జోన్ జట్టుతో జరుగుతున్న మరో క్వార్టర్ ఫైనల్లో సెంట్రల్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 71.4 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌటైంది. ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్ (38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈస్ట్ జోన్ బౌలర్ మణిశంకర్ మురాసింగ్ 42 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈస్ట్ జోన్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 32 పరుగులు సాధించింది. -
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్
భారత క్రికెట్ అభిమానులకు చేదు వార్త. ఇవాల్టి నుంచి (జూన్ 28) ప్రారంభంకానున్న దేశవాలీ టోర్నీ దులీప్ ట్రోఫీ-2023 మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. స్వదేశంలో జరిగే మ్యాచ్ల కోసం బీసీసీఐకి ప్రసార భాగస్వామి లేనందున ఈ మ్యాచ్ల ప్రత్యక్ష ప్రసారం ఉండటం లేదు. బీసీసీఐ లోకల్ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ దక్కించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో భారత క్రికెట్ అభిమానులు దులీప్ ట్రోఫీ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించలేకపోతున్నారు. సూర్యకుమార్ యాదవ్ (వెస్ట్ జోన్), చతేశ్వర్ పుజారా (వెస్ట్ జోన్) లాంటి అంతర్జాతీయ స్టార్లు, రింకూ సింగ్ (సెంట్రల్ జోన్), తిలక్ వర్మ (సౌత్ జోన్), సాయి సుదర్శన్ (సౌత్) లాంటి ఐపీఎల్ స్టార్లు ఉండటంతో ఈ మ్యాచ్లపై అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తూ టీమిండియాకు ఎంపిక కాలేకపోతున్న సర్ఫరాజ్ ఖాన్ (వెస్ట్) దులీప్ ట్రోఫీ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలువనున్నాడు. కాగా, దులీప్ ట్రోఫీలో ఇవాళ సెంట్రల్ జోన్-ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్ మధ్య మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. మొదటి మ్యాచ్ KSCA క్రికెట్ గ్రౌండ్లో, ఆలుర్ (కర్ణాటక), రెండో మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగనున్నాయి. ఈస్ట్ జోన్తో మ్యాచ్లో సెంట్రల్ జోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నార్త్ జోన్తో మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. -
టీమిండియాకు దూరం.. పుజారా కీలక నిర్ణయం, సూర్య కూడా
టీమిండియా నయావాల్గా పేరుగాంచిన చతేశ్వర్ పూజారాకు షాక్ తగిలిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఫామ్లో లేక సతమతమవుతున్న పుజారాను విండీస్తో టెస్టు సిరీస్కు పక్కనబెట్టారు. ఇది పుజారా కెరీర్కు ఎండ్లా కనిపిస్తుందని సోషల్ మీడియాలో హోరెత్తుతున్నప్పటికి తాను మాత్రం పట్టించుకోలేదు. మళ్లీ ఎలాగైనా జట్టులోకి తిరిగి రావాలని ప్రయత్నంలో పూజరా కీలక నిర్ణయం తీసుకున్నాడు. తనపై వేటు వేయడంతో అసంతృప్తికి గురైన అతను దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఓకే చెప్పాడు. త్వరలో ప్రారంభం కానున్న దులీప్ ట్రోఫీ(Duleep Trophy)లో సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు. ఈ టోర్నీలో అతను వెస్ట్ జోన్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. పూజరాతో పాటు సూర్యకుమార్ యాదవ్ కూడా అదే జట్టులో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆరు జట్లు పాల్గొంటున్న దులీప్ ట్రోఫీ బెంగళూరు వేదికగా జూన్ 28న మొదలవ్వనుంది. విండీస్తో టెస్టులకు ఎంపిక్వని సూర్య.. వన్డే జట్టుతో మాత్రం కలవనున్నాడు. కౌంటీల్లో రాణించి… ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పూజారా తీవ్రంగా నిరాశ పరిచాడు. రెండు ఇన్నింగ్స్ల్లో తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. అంతకు ముందు ఇంగ్లండ్ గడ్డపై కౌంటీల్లో అద్భుతంగా రాణించి సెంచరీల మీద సెంచరీలు సాధించాడు. ఏ ఇంగ్లండ్లో అయితే చెలరేగాడో అదే గడ్డపై డబ్ల్యూటీసీ ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. ఇప్పటివరకు పుజారా 103 టెస్టుల్లో 43.60 సగటు, 19 సెంచరీలతో పుజారా 7195 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సార్లు టెస్టు సిరీస్ విజయాల్లో ప్రధాన పాత్ర పోషించడం అతని కెరీర్లో అత్యుత్తమ క్షణాలు. ఇక వెస్టిండీస్ టూర్కు టెస్టు, వన్డేలకు 16 మందితో కూడిన బృందాన్ని ఈరోజు కమిటీ ప్రకటించింది. భారత జట్టు విండీస్ గడ్డపై 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 ఆడనుంది. చదవండి: #CheteshwarPujara: కెరీర్ ముగిసినట్లే! ..'కొత్త గోడ'కు సమయం ఆసన్నం -
భారత క్రికెట్ పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది.. సిగ్గుతో తలదించుకోవాలి..!
టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ భారత దేశవాలీ సెలెక్టర్ల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. గడిచిన రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన కేరళ ఆఫ్ స్పిన్నర్ జలజ్ సక్సేనాను సౌత్ జోన్ తరఫున దులీప్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడంపై ధ్వజమెత్తాడు. మధ్యప్రదేశ్, భారత-ఏ జట్ల తరఫున అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినా జలజ్ను ఎంపిక చేయకపోవడంపై సెలక్టర్లను నిలదీశాడు. జట్ల ఎంపికలో సెలెక్టర్లు అవళింభిస్తున్న తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో హాస్యాస్పదమైన విషయాలు చాలా జరుగుతున్నాయని, జలజ్ ఉదంతం ఇందుకు ఓ ఉదాహరణ మాత్రమే అని అన్నాడు. రంజీల్లో రాణించినా మిగతా దేశవాలీ టోర్నీలకు ఎంపిక చేయకపోతే రంజీ ట్రోఫీ ఆడటంలో అర్ధమే లేదని తెలిపాడు. భారత క్రికెట్లో ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుందని వాపోయాడు. There are many laughable things happening in Indian cricket. The highest wicket taker in Ranji Trophy not being picked even for the South Zone team is as baffling as it gets. Just renders the Ranji Trophy useless..what a shame https://t.co/pI57RbrI81 — Venkatesh Prasad (@venkateshprasad) June 18, 2023 ఈ విషయాలను ఇండియన్ డొమెస్టిక్ క్రికెట్ ఫోరమ్కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. బీసీసీఐ జూనియర్ సెలెక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ అయిన వెంకటేశ్ ప్రసాద్ ఈ ఏడాది ఆరంభంలో టీమిండియాకు కేఎల్ రాహుల్ను ఎంపిక చేసినప్పుడు కూడా ఇలాగే సెలెక్టర్లను నిలదీశాడు. కేఎల్ రాహుల్ ఫామ్లో లేకపోయినా టీమిండియాకు ఎలా ఎంపిక చేస్తారని ప్రసాద్ నాడు సెలెక్టర్లను ప్రశ్నించాడు. కాగా, 36 ఏళ్ల జలజ్ సక్సేనా 2022-23 రంజీ సీజన్లో 7 మ్యాచ్ల్లో 6 సార్లు 5 వికెట్ల ఘనత సాధించి 50 వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్లో ఇతనే లీడింగ్ వికెట్టేకర్. ఓవరాల్గా జలజ్ తన దేశవాలీ కెరీర్లో 133 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, 104 లిస్ట్-ఏ, 66 టీ20లు ఆడాడు. ఈ మధ్యప్రదేశ్ ఆల్రౌండర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఓ మ్యాచ్ ఆడాడు. I DONT understand selection committee these days BABA INDRAJITH plays for Rest of India against MP in the first week of March 2023. There has been no first class matches post that , but he doesn't feature for SOUTH ZONE in the duleep trophy. Can someone tell me why??#bcci — DK (@DineshKarthik) June 14, 2023 ఇదిలా ఉంటే, దులీప్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన సౌత్ జోన్ జట్టుపై టీమిండియా వెటరన్ వికెట్కీపర్ దినేశ్ కార్తీక్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమిళనాడు ఆటగాడు బాబా ఇంద్రజిత్ను జట్టుకు ఎంపిక చేయకపోవడంపై డీకే సౌత్ జోన్ సెలెక్టర్లను నిలదీశాడు. -
అతడి కోసమే ఇలా! భారత క్రికెట్ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా? క్రికెటర్ ట్వీట్ వైరల్
Duleep Trophy 2023: అద్భుతంగా రాణించినప్పటికీ తనకు దులిప్ ట్రోఫీ టోర్నీ ఆడే జట్టులో చోటు కల్పించకపోవడంపై కేరళ ఆల్రౌండర్ జలజ్ సక్సేనా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘోరం ఎప్పుడైనా జరిగిందా అంటూ సెలక్టర్ల తీరును ప్రశ్నించాడు. తానెవరినీ తప్పుబట్టడం లేదని, అయితే.. తనను ప్రతిష్టాత్మక ట్రోఫీ ఆడే జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పగలరా ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా 2022-23 రంజీ ట్రోఫీ ఎడిషన్లో కేరళ తరఫున వెటరన్ ఆల్రౌండర్ జలజ్ ఏడు మ్యాచ్లు ఆడి 50 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కోసం? బ్యాట్తోనూ రాణించి కేరళ విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, దులిప్ ట్రోఫీ ఆడే క్రమంలో సౌత్ జోన్ జట్టును ఎంపిక చేసే క్రమంలో 36 ఏళ్ల జలజ్ను సెలక్టర్లు విస్మరించారు. తమిళనాడు ఆల్రౌండర్, టీమిండియా క్రికెటర్ వాషింగ్టన్ సుందర్కు చోటు కల్పించేందుకు ఈ కేరళ ప్లేయర్ను పక్కనపెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు జట్టులో స్థానం లేకపోవడాన్ని జీర్ణించుకోలేని జలజ్ సక్సేనా ట్విటర్ వేదికగా ఆవేదనను పంచుకున్నాడు. ‘‘భారత్లో రంజీ ట్రోఫీ(ఎలైట్ గ్రూప్) టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిని దులిప్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక చేయలేదు. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? చరిత్రను తిరగేయండి దయచేసి.. నాకోసం ఒక్కసారి చరిత్రను తిరగేయండి! కేవలం ఈ విషయం గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నానంతే! ఎవరినీ నిందించే ఉద్దేశం నాకైతే లేదు’’ అంటూ జలజ్ ఆవేదనభరిత ట్వీట్ చేశాడు. కాగా దులిప్ ట్రోఫీ సౌత్ జోన్ సెలక్షన్ విషయంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న జలజ్తో పాటు తమిళనాడు ప్లేయర్ బాబా ఇంద్రజిత్ను కూడా పక్కనపెట్టడంతో సెలక్టర్ల తీరుపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ ఈ విషయంపై స్పందిస్తూ.. సెలక్షన్ కమిటీ అసలు ఏం చేస్తుందో అర్థం కావడం లేదంటూ ఘాటు విమర్శలు చేశాడు. రెస్టాఫ్ ఇండియాకు ఆడిన బాబా ఇంద్రజిత్ను ఎందుకు ఎంపికచేయలేదో ఎవరైనా చెప్పగలరా అంటూ బీసీసీఐని ట్యాగ్ చేశాడు. సెలక్టర్లు ఏం చేస్తున్నారో వాళ్లకైనా అర్థమవుతోందా అంటూ ఫైర్ అయ్యారు. కాగా బెంగళూరు వేదికగా జూన్ 28 నుంచి దులిప్ ట్రోఫీ ఆరంభం కానుంది. జూలై 12-16 వరకు ఫైనల్ జరుగనుంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్, నార్త్ ఈస్ట్, సౌత్ జోన్ల జట్లు ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. చదవండి: Ind vs WI: రోహిత్, కోహ్లి ఆడతారు.. అయితే! వాళ్లిద్దరి అరంగేట్రం ఫిక్స్! ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్లో ఇరు జట్లు Highest wicket taker in Ranji trophy in India( Elite Group) didn't get picked in Duleep trophy. Can you please check whether it has ever happened in the Indian Domestic history? Just wanted to know. Not blaming anyone 🙏 https://t.co/Koewj6ekRt — Jalaj Saxena (@jalajsaxena33) June 17, 2023 -
బీసీసీఐలోకి చేతన్ శర్మ.. మరోసారి సెలెక్టర్గా బాధ్యతలు
భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్ రౌండర్, బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తిరిగి సెలక్షన్ బాధ్యతలను చేపట్టాడు. ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో చేతన్ శర్మ అడ్డంగా బుక్కైన విషయం తెలిసిందే. టీమిండియా ఫేక్ ఫిట్ నెస్ సీక్రెట్స్, ఆటగాళ్ల ఎంపిక, విశ్రాంతి పేరుతో ఆటగాళ్లను ఆటకూ దూరం చేసే అదృష్టశక్తులు, ఎవరిని డ్రాప్ చేయాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలని అనేది నిర్ణయించేది ఎవరు? బిసీసీఐ చీఫ్ గా సౌరబ్ గంగూలీకి, విరాట్ కోహ్లీకి మధ్య జరిగిన ఘర్షణల గురించి.. విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మ మధ్య ఉన్న ఈగో క్లాషెస్ గురించి.. ఇలా చెప్పుకుంటూపోతే బిసిసిఐకి సంబంధించిన ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీంతో అతడు బీసీసీఐ చీఫ్ సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. చేతన్ స్వయంగా బీసీసీఐకి తన రాజీనామాను సమర్పించాడు. అప్పటి నుంచి నాలుగు నెలల పాటు ఎవరికి కనిపించని చేతన్ శర్మ కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేడు.అయితే తాజాగా మరోసారి సెలక్షన్ కమిటీలో బాధ్యతలు చేపట్టాడు. కానీ జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్గా కాకుండా నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చైర్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా నార్త్ జోన్ టీమ్ కు సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ భాగమయ్యాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా చేతన్ శర్మ సారథ్యంలోని నార్త్ జోన్.. తమ జట్టుకు మన్దీప్ సింగ్ ను సారథిగా ఎంపిక చేసింది. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున అదగరొట్టిన పంజాబ్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ తో పాటు ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ సంచలనం నెహల్ వధెరా లు కూడా నార్త్ జోన్ లో ఉన్నారు. కాగా ఈ టీమ్ లో జయంత్ యాదవ్ ఒక్కడే క్యాప్డ్ ప్లేయర్ గా ఉన్నాడు. చదవండి: భార్య జెర్సీతో బరిలోకి.. తొలి మ్యాచ్లోనే ఉతికారేశాడు -
294 పరుగులతో సౌత్జోన్ ఓటమి.. దులీప్ ట్రోఫీ విజేత వెస్ట్జోన్
దులీప్ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్జోన్ నిలిచింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్జోన్రెండో ఇన్నింగ్స్లో 234 పరుగులకే కుప్పకూలింది. దీంతో 294 పరుగులతో వెస్ట్జోన్ ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగుల క్రితం రోజు స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన సౌత్జోన్ మరో 80 పరుగులు చేసి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్జోన్ బ్యాటింగ్లో రోహన్ కన్నుమ్మల్ 93 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. హైదరాబాద్కు చెందిన రవితేజ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీతో మెరిసిన రవితేజ 53 పరుగులు చేసి ఔటయ్యాడు. వెస్ట్జోన్ బౌలర్లలో షామ్స్ ములాని 4, జైదేవ్ ఉనాద్కట్, అతిత్ సేత్ తలా రెండు వికెట్లు తీయగా.. తనుస్ కొటేన్, చింతన్ గజా చెరొక వికెట్ తీశారు. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవగా.. జైదేవ్ ఉనాద్కట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్లు) తన ఓవర్నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో సౌత్జోన్ 327 పరుగులకు ఆలౌట్ కాగా.. వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'అండర్సన్ రిటైర్ అయితే ఇలానే ఏడుస్తానేమో!' BGT in 2021, Duleep Trophy in 2022 - Rahane continues to dominate as a captain in red ball format. pic.twitter.com/s3V6bxsUEE — Johns. (@CricCrazyJohns) September 25, 2022 -
ఓటమి దిశగా సౌత్జోన్
కోయంబత్తూర్: వెస్ట్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్జోన్ ఓటమి దిశగా సాగుతోంది. 529 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన సౌత్జోన్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. నేడు చివరిరోజు సౌత్జోన్ గెలవాలంటే మరో 375 పరుగులు చేయాలి. వెస్ట్జోన్ నెగ్గాలంటే మరో నాలుగు వికెట్లు తీయాలి. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 376/3తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్ట్జోన్ 4 వికెట్లకు 585 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (265; 30 ఫోర్లు, 4 సిక్స్లు) తన ఓవర్నైట్ స్కోరుకు మరో 56 పరుగులు జోడించి అవుటయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ (127 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్) సెంచరీతో చెలరేగగా... హెట్ పటేల్ (51 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో రాణించాడు. -
శతకం బాదిన సర్ఫరాజ్ ఖాన్.. సౌత్జోన్ విజయలక్ష్యం 529
దులీప్ ట్రోఫీ ఫైనల్ 2022లో భాగంగా వెస్ట్జోన్.. సౌత్జోన్ ముందు 529 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 3 వికెట్ల నష్టానికి 376 పరుగుల క్రితంరోజు స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన వెస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా వెస్ట్జోన్కు 528 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించినట్లయింది. డబుల్ సెంచరీతో మెరిసిన యశస్వి జైశ్వాల్ 265 పరుగులు చేసి ఔటవ్వగా.. శ్రేయాస్ అయ్యర్ 71 పరుగులు స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ శతకంతో చెలరేగాడు. సౌత్జోన్ బౌలర్లను ఉతికారేసిన సర్ఫరాజ్ 178 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. సర్ఫరాజ్కు తోడుగా హేల్ పటేల్ కూడా అర్థ సెంచరీతో రాణించాడు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 318/7తో ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 327 పరుగులకు ఆలౌటైంది. చదవండి: ఫెదరర్ మ్యాచ్కు ముందు నాటకీయ పరిణామం.. పిచ్చి పరాకాష్టకు డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్.. -
డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైశ్వాల్..
కోయంబత్తూర్ వేదికగా సౌత్జోన్తో జరుగుతోన్న దులీప్ ట్రోపీ ఫైనల్లో వెస్ట్జోన్ భారీ అధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్లో భారత యువ ఆటగాడు.. వెస్ట్జోన్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. జైస్వాల్ 235 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 23 ఫోర్లు, మూడు సిక్స్లు ఉన్నాయి. జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఫలితంగా వెస్ఠ్జోన్ మూడో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 376 పరుగులు సాధించింది. ప్రస్తుతం వెస్ట్జోన్ ఓవరాల్గా 319 పరుగుల అధిక్యం సాధించింది. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్(209), సర్ఫరాజ్ ఖాన్(30) పరుగులతో క్రీజులో ఉన్నారు. అదే విధంగా వెస్ట్జోన్ బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 71 పరుగులతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో సౌత్జోన్ 327 పరుగులకు ఆలౌటైంది. దీంతో కేవలం 57 పరుగుల స్వల్ప ఆధిక్యం మాత్రమే లభించింది. సౌత్ జోన్ బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో మెరిశాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్లో వెస్ట్ జోన్ 270 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. కాగా తొలి ఇన్నింగ్స్లో జైస్వాల్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. Yashasvi Jaiswal. Duleep Trophy final. 209* 🔥💗pic.twitter.com/liHFLoalL2 — Rajasthan Royals (@rajasthanroyals) September 23, 2022 చదవండి: భారత్, ఇంగ్లండ్, పాకిస్తాన్ కాదు.. టీ20 ప్రపంచకప్ విజేత ఆ జట్టే: భారత మాజీ ఆటగాడు -
యశస్వి జైశ్వాల్ సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్జోన్
సౌత్ జోన్, వెస్ట్జోన్ మధ్య జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతుంది. టీమిండియా యువ క్రికెటర్.. వెస్ట్జోన్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సూపర్ సెంచరీతో మెరిశాడు. 119 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం 140 పరుగుల లీడ్లో ఉన్న వెస్ట్ జోన్ భారీ ఆధిక్యం దిశగా పయనిస్తోంది. కాగా శ్రేయాస్ అయ్యర్.. యశస్వి జైశ్వాల్కు సహకరిస్తూ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అంతకముందు సౌత్జోన్కు తొలి ఇన్నింగ్స్లో 57 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. 7 వికెట్ల నష్టానికి 318 పరుగుల క్రితం రోజు స్కోరుతో మూడోరోజు ఆటను కొనసాగించిన సౌత్జోన్ జట్టు మరో 9 పరుగులు మాత్రమే జత చేసి 327 పరుగులకు ఆలౌట్ అయింది.బాబా ఇంద్రజిత్ (125 బంతుల్లో 118; 14 ఫోర్లు) సెంచరీతో చెలరేగాడు. మనీశ్ పాండే (48), కృష్ణప్ప గౌతమ్ (43), రోహిన్ కున్నుమ్మల్ (31) రాణించారు. వెస్ట్జోన్ బౌలర్లో ఉనాద్కట్ 4 వికెట్లు తీయగా.. సేత్ 3, చింతన్ గజా రెండు వికెట్లు తీశారు. అంతకు ముందు వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్లో 270 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'బేబీ ఏబీ' విధ్వంసం.. మరొక్క బంతి మిగిలి ఉంటేనా! సచిన్ క్లాస్..యువీ మాస్; ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
645 పరుగుల తేడాతో భారీ విజయం: కొత్త రికార్డు నమోదు
కోయంబత్తూర్: దేశవాళీ జోనల్ ఫస్ట్క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీలో కొత్త రికార్డు నమోదైంది. ఆదివారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్జోన్ ఏకంగా 645 పరుగుల భారీ తేడాతో నార్త్జోన్ను చిత్తుగా ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. దులీప్ ట్రోఫీ చరిత్రలో పరుగుల తేడాపరంగా ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. ఓవర్నైట్ స్కోరు 157/1తో ఆదివారం ఆట కొనసాగించిన సౌత్జోన్ తమ రెండో ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 316 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ సాధించడం విశేషం. అనంతరం 740 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్జోన్ 30.4 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్, సాయికిశోర్, కృష్ణప్ప గౌతమ్ తలా 3 వికెట్లు పడగొట్టారు. మ్యాచ్లో 10 వికెట్లు తీసిన సాయికిశోర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మరో సెమీస్లో సెంట్రల్జోన్ను 279 పరుగులతో ఓడించి వెస్ట్జోన్ ఫైనల్ చేరింది. -
రవితేజ మెరుపు శతకం, పదేసిన సాయికిషోర్.. ఫైనల్లో సౌత్ జోన్, వెస్ట్ జోన్
హైదరాబాద్ ఆటగాడు తెలుకపల్లి రవితేజ (120 బంతుల్లో 104 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), తమిళనాడు యువ కిషోరం రవి శ్రీనివాసన్ సాయికిషోర్ (10/98) రెచ్చిపోవడంతో నార్త్ జోన్తో జరిగిన దులీప్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్లో సౌత్ జోన్ 645 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49) చెలరేగడంతో కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్తో జరిగిన తొలి సెమీ ఫైనల్లో వెస్ట్ జోన్ 279 పరుగుల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ రెండు జట్లు (సౌత్ జోన్, వెస్ట్ జోన్) ఈనెల 21 నుంచి 25 వరకు కొయంబత్తూర్ వేదికగా జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. వికెట్ నష్టానికి 157 పరుగుల వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సౌత్ జోన్.. మరో 159 పరుగులు జోడించి 316/4 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. మయాంక్ అగర్వాల్ ఓవర్నైట్ స్కోర్కు మరో 11 పరుగులు జోడించి 64 పరుగుల వద్ద ఔటవగా.. రవితేజ సూపర్ ఫాస్ట్గా సెంచరీ సాధించి ప్రత్యర్ధికి 740 పరుగుల భారీ టార్గెట్ను నిర్ధేశించారు. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నార్త్ జోన్ కృష్ణప్ప గౌతమ్ (3/50), సాయికిషోర్ (3/28), తనయ్ త్యాగరాజన్ (3/12) దెబ్బకు కేవలం 94 పరుగులు మాత్రమే చేసి ఆలౌటై ఓటమిపాలైంది. నార్త్ జోన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు యష్ దుల్ (59), మనన్ వోహ్రా (11) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్: 630/8 డిక్లేర్ (కున్నుమ్మల్ 143, హనుమ విహారి 134, రికీ భుయ్ 103) నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్: 207 ఆలౌట్ (నిషాంత్ సింధు 40, సాయికిషోర్ 7/70) సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 316/4 డిక్లేర్ (రవితేజ 104, కున్నుమ్మల్ 77) నార్త్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 94 ఆలౌట్ (యశ్ ధుల్ 59, సాయికిషోర్ 3/28) ఇక వెస్ట్ జోన్-సెంట్రల్ జోన్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ విషయానికొస్తే.. వెస్ట్ జోన్ నిర్ధేశించిన 500 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్ల నష్టానికి 22 పరుగుల స్కోర్ వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సెంట్రల్ జోన్ మరో 199 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. రింకూ సింగ్ (65) ఒక్కడే హాఫ్ సెంచరీతో ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. వెస్ట్ జోన్ బౌలర్లలో షమ్స్ ములానీ (5/72), చింతన్ గజా (3/49), ఉనద్కత్ (1/44), అతిత్ సేథ్ (1/20) వికెట్లు పడగొట్టారు. వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్: 257 ఆలౌట్ (పృథ్వీ షా 60, రాహుల్ త్రిపాఠి 67, కుమార్ కార్తీకేయ 5/66) సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్: 128 ఆలౌట్ (కరణ్ శర్మ 34 , ఉనద్కత్ 3/24, తరుష్ కోటియన్ 3/17) వెస్ట్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 371 ఆలౌట్ (పృథ్వీ షా 142, హెథ్ పటేల్ 67, కుమార్ కార్తీకేయ 3/105) సెంట్రల్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్: 221 ఆలౌట్ (రింకూ సింగ్ 65, షమ్ ములానీ 5/72) -
Duleep Trophy 2022: సాయికిశోర్కు 7 వికెట్లు
సేలం (తమిళనాడు): ఎడంచేతి వాటం స్పిన్నర్ ఆర్.సాయికిశోర్ (7/70) ఏడు వికెట్లతో తిప్పేయడంతో... నార్త్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్లో సౌత్ జోన్ జట్టుకు భారీ ఆధిక్యం లభించింది. ఓవర్నైట్ స్కోరు 17/0తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన నార్త్ జోన్ జట్టు 67 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. యశ్ ధుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), నిశాంత్ (40; 4 ఫోర్లు, 2 సిక్స్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. 423 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన సౌత్ జోన్ జట్టు ప్రత్యర్థిని ఫాలోఆన్ ఆడించకుండా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. రోహన్ (77; 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మయాంక్ అగర్వాల్ (53 బ్యాటింగ్; 6 ఫోర్లు), టి.రవితేజ (19 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సౌత్ జోన్ ఓవరాల్ ఆధిక్యం 580 పరుగులకు చేరుకుంది. -
మ్యాజిక్ చేసిన హార్ధిక్ పాండ్యా బౌలర్.. భారీ ఆధిక్యంలో సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా నార్త్ జోన్తో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో సౌత్ జోన్ పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 580 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతుంది. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 157 పరుగులు చేసింది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (72 బంతుల్లో 77; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడి హాఫ్ సెంచరీతో అలరించగా.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76 బంతుల్లో 53 నాటౌట్; 6 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీతో రాణించాడు. అంతకుముందు స్పిన్నర్ రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు (7/70) నమోదు చేయడంతో నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 207 పరుగులకే చాపచుట్టేసింది. నార్త్ జోన్ ఇన్నింగ్స్లో నిశాంత్ సింధు (40) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత జోన్.. రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (255 బంతుల్లో 134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్కీపర్ రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) సూపర్ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్ను 630 పరుగుల వద్ద (8 వికెట్ల నష్టానికి) డిక్లేర్ చేసింది. పృథ్వీ షా మెరుపు శతకం.. ఓటమి దిశగా సెంట్రల్ జోన్ కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో వెస్ట్ జోన్ జట్టు పట్టుబిగించింది. పృథ్వీ షా మెరుపు శతకంతో మెరవడంతో ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ను 371 పరుగుల వద్ద ముగించి, ప్రత్యర్ధి ముందు 500 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సెంట్రల్ జోన్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తుంది. మరో రెండు రోజు ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తుంది. సెంట్రల్ జోన్ గెలవాలంటే మరో 468 పరుగులు చేయాలి ఉంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులు చేసి ఆలౌటైంది. పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (67) అర్ధశతకాలతో రాణించారు. కుమార్ కార్తీకేయ (5/66) వెస్ట్ జోన్ను దారుణంగా దెబ్బకొట్టాడు. అనంతరం వెస్ట్ జోన్ బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కరణ్ శర్మ (34) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఉనద్కత్, తనుశ్ కోటియన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. -
పృథ్వీ షా సెంచరీ.. భారీ ఆధిక్యం దిశగా వెస్ట్జోన్
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా దులీప్ ట్రోఫీలో అద్భుత శతకంతో మెరిశాడు. సెంట్రల్ జోన్తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో ఈ వెస్ట్జోన్ ఓపెనర్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఫలితంగా వెస్ట్జోన్ భారీ ఆధిక్యం దిశగా పరిగెడుతుంది. ఈ మధ్యన పృథ్వీ షా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. టీమిండియాలో ఎక్కువగా ఓపెనింగ్లో వచ్చిన పృథ్వీ షా.. ఓపెనింగ్ స్థానానికి పోటీ పెరిగిపోవడం.. అతను ఫామ్ కోల్పోవడంతో క్రమక్రమంగా జట్టుకు దూరమయ్యాడు. మూడోరోజు తొలి సెషన్లో వెస్ట్జోన్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పృథ్వీ షా(131 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్లతో 136 నాటౌట్), ఆర్మాన్ జాఫర్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం వెస్ట్జోన్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలపుకొని 314 పరుగుల లీడ్లో ఉంది. అంతకముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ కర్ణ్శర్మ 34 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఉనాద్కట్,తనుష్ కొటెన్లు చెరో 3 వికెట్లు తీయగా.. షెత్ 2, చింతన్ గజా, షామ్స్ ములాని చెరొక వికెట్ తీశారు. ఇక వెస్ట్జోన్ తమ తొలి ఇన్నింగ్స్లో 257 పరుగులకు ఆలౌటైంది. చదవండి: 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' 'డైరెక్టర్ గారూ.. ఫెదరర్కు, బాలీవుడ్ నటుడికి తేడా తెలియదా?' -
Duleep Trophy: రికీ భుయ్ సెంచరీ
సేలం (తమిళనాడు): ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ (170 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ శతకంతో కదంతొక్కాడు. దీంతో దులీప్ ట్రోఫీలో నార్త్జోన్ తో జరుగుతున్న మ్యాచ్లో సౌత్జోన్ భారీస్కోరు చేసింది. ఓవర్నైట్ స్కోరు 324/2తో శుక్రవారం రెండో రోజు ఆటకొనసాగించిన సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 172.5 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 630 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. హనుమ విహారి (134; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) తన ఓవర్నైట్ స్కోరుకు 27 పరుగులు జతచేసి నిష్క్రమించాడు. అనంతరం రికీ .. కృష్ణప్ప గౌతమ్ (48; 4 ఫోర్లు, 2 సిక్స్లు), హైదరాబాద్ క్రికెటర్ టి.రవితేజ (42; 4 ఫోర్లు, 1 సిక్స్)లతో కలిసి జట్టు స్కోరును 600 పరుగుల పైచిలుకు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్కు దిగిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. -
వెంకటేశ్ అయ్యర్కు గాయం.. నొప్పితో విలవిల్లాడుతూ! అంబులెన్స్ వచ్చినప్పటికీ!
దులీప్ ట్రోఫీలో భాగంగా వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్లో ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సెంట్రల్ జోన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత యువ ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఈ మ్యాచ్లో గాయపడ్డాడు. వెస్ట్ జోన్ పేసర్ చింతన్ గజా వేసిన ఓవర్లో అయ్యర్ బౌలర్ దిశగా ఢిపెన్స్ ఆడాడు. వెంటనే బంతిని అందుకున్న గజా.. అయ్యర్ వైపు బంతిని త్రో చేశాడు. అయితే బంతి నేరుగా అయ్యర్ మెడకు బలంగా తాకింది. దీంతో అయ్యర్ తీవ్ర నొప్పితో గ్రౌండ్లో విలవిలాడాడు. ఫిజియో వచ్చి వైద్యం అందించినప్పటికీ అతడి నొప్పి తగ్గలేదు. ఈ క్రమంలో అతడిని తీసుకువెళ్లడాననికి అంబులెన్స్ కూడా గ్రౌండ్లోకి వచ్చింది. అయితే అయ్యర్ మాత్రం నెమ్మదిగా నడుస్తునే ఫీల్డ్ను వదిలాడు. ఈ ఘటన అతడు 6 పరుగులు వద్ద బ్యాటింగ్ చేస్తుండగా చోటుచేసుకుంది. కాగా ఈ మ్యాచ్లో రిటైర్ హార్ట్గా వెనుదిరిగిన అయ్యర్ తిరిగి మళ్లీ ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. అతడి గాయం తీవ్రమైనది కాకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. Unpleasant scene here. Venkatesh Iyer has been hit on the shoulder as Gaja throws the ball defended ball back at the batter. Venkatesh is down on the ground in pain and the ambulance arrives. #DuleepTrophy pic.twitter.com/TCvWbdgXFp — Dhruva Prasad (@DhruvaPrasad9) September 16, 2022 చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా ట్రెవర్ బేలిస్! -
హనుమ విహారి అజేయ శతకం.. భారీ స్కోర్ దిశగా సౌత్ జోన్
దులీప్ ట్రోఫీ 2022లో భాగంగా సేలం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 15) సౌత్ జోన్-నార్త్ జోన్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌత్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ రోహన్ కున్నమ్మల్ (225 బంతుల్లో 143; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హనుమ విహారి (220 బంతుల్లో 107 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్) సూపర్ శతకాలతో చెలరేగారు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (59 బంతుల్లో 49; 6 ఫోర్లు, సిక్స్) పరుగు తేడాతో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ జోన్ 2 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా సాగుతుంది. విహారికి జతగా బాబా ఇంద్రజిత్ (37 బంతుల్లో 20; ఫోర్) క్రీజ్లో ఉన్నాడు. నార్త్ జోన్ బౌలర్లలో నవ్దీప్ సైనీ, నిశాంత్ సింధుకు తలో వికెట్ దక్కింది. మరోవైపు, కొయంబత్తూర్ వేదికగా సెంట్రల్ జోన్-వెస్ట్ జోన్ జట్ల మధ్య ఇవాళే మొదలైన తొలి సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న వెస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (78 బంతుల్లో 60; 10 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (64 నాటౌట్) అర్ధశతకాలతో రాణించగా.. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు షమ్స్ ములానీ (41), తనుష్ కోటియన్ (36) పర్వాలేదనిపించారు. వెస్ట్ జోన్ను సెంట్రల్ జోన్ స్పిన్నర్ కుమార్ కార్తీకేయ (5/66) దారుణంగా దెబ్బకొట్టగా.. అంకిత్ రాజ్పుత్, అనికేత్ చౌదరీ, గౌరవ్ యాదవ్, కరణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రాహుల్ త్రిపాఠికి జతగా చింతన్ గజా (5) క్రీజ్లో ఉన్నాడు. -
డబుల్ సెంచరీతో చెలరేగిన అజింక్య రహానే...
చెన్నై: భారత టెస్టు జట్టులో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ సాధించాలని పట్టుదలగా ఉన్న అజింక్య రహానే దేశవాళీ సీజన్ను ఘనంగా ప్రారంభించాడు. నార్త్ ఈస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో వెస్ట్జోన్ బ్యాటర్ రహానే (264 బంతుల్లో 207 బ్యాటింగ్; 18 ఫోర్లు, 6 సిక్స్లు) డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. అతనికి తోడు యశస్వి జైస్వాల్ (321 బంతుల్లో 228; 22 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా ద్విశతకం బాదడం విశేషం. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి వెస్ట్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 590 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (121 బంతుల్లో 113; 11 ఫోర్లు, 5 సిక్స్లు) కూడా శతకం సాధించాడు. బలమైన వెస్ట్జోన్ బ్యాటింగ్ లైనప్ ముందు అనామక జట్టుగా నార్త్ ఈస్ట్ తేలిపోయింది. చదవండి: Asia Cup 2022: పాక్కు షాకిచ్చిన శ్రీలంక.. 5 వికెట్ల తేడాతో ఘన విజయం -
ధోనీ కోసం గంగూలీని పది రోజులు బతిమాలాను..
ముంబై: టీమిండియా సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ కోసం నాటి ఈస్ట్ జోన్ సారధి సౌరవ్ గంగూలీని పది రోజుల పాటు బతిమాలానని భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే వెల్లడించాడు. 2003-04 దులీప్ ట్రోఫీ ఫైనల్లో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ దీప్దాస్ గుప్తా బదులు ధోనీని ఆడించేందుకు చాలా ప్రయాసపడ్డానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంగూలీ, దీప్దాస్ గుప్తా ఇద్దరు బెంగాల్కు చెందిన వారే అని తెలిసి కూడా గంగూలీని ఒప్పించేందుకు ప్రయత్నించానని, చివరకు గంగూలీ ఒప్పుకోవడం.. ధోనీ జట్టులోకి రావడం చకచకా జరిగిపోయాయని పేర్కొన్నాడు. అంతకుముందు ఓ స్నేహితుడు చెప్పడంతో ధోనీ ఆటను చూడటానికి తాను ప్రత్యక్షంగా వెళ్లానని, ఆ మ్యాచ్లో జట్టు మొత్తం 170 పరుగులు చేస్తే, ధోని ఒక్కడే 130 పరుగులు సాధించాడని మోరే తెలిపాడు. ఆ మ్యాచ్లో బౌలర్లపై ధోనీ విరుచుకుపడిన తీరు చూసి చాలా ముచ్చటేసిందని, అందుకే అతన్ని దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఎలాగైనా ఆడించాలని కంకణం కట్టుకున్నాని వివరించాడు. ఎట్టకేలకు గంగూలీని ఒప్పించాక ఫైనల్స్ బరిలో దిగిన ధోనీ తొలి ఇన్నింగ్స్లో 21 పరుగులు, రెండో ఇన్నింగ్స్లో 47 బంతుల్లోనే 60 పరుగులు చేసి సత్తా చాటాడన్నాడు. దీంతో ఆ వెంటనే ధోనీని ఇండియా ఎ తరఫున కెన్యాలో జరిగిన ట్రయాంగిల్ టోర్నీకి పంపించామని, ఆ టోర్నీయే అతని కెరీర్ను మలుపు తిప్పిందని మోరే చెప్పుకొచ్చాడు. అందులో ధోనీ ఏకంగా 600 పరుగులు సాధించి, జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడని వెల్లడించాడు. ఆ సమయంలో (2003 వన్డే ప్రపంచకప్ తర్వాత) టీమిండియాకు రెగ్యులర్ వికెట్ కీపర్ లేకపోవడం ధోనీకి మరింత కలిసొచ్చిందని, అందివచ్చిన అవకాశాలకు అతను ఒడిసి పట్టుకుని భారత దేశం గర్వించే స్థాయికి ఎదిగాడంటూ ధోనీపై మోరే ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, తాను అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేయడానికి నాటి చీఫ్ సెలక్టర్ మోరే చాలా సహయపడ్డాడని ధోనీ కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. చదవండి: ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు.. -
దులీప్ ట్రోఫీ విజేత ఇండియా రెడ్
బెంగళూరు: దేశవాళీ క్రికెట్ సీజన్ ఆరంభ టోర్నీ దులీప్ ట్రోఫీని ఇండియా రెడ్ కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ ముగిసిన ఫైనల్లో ఆ జట్టు ఇన్నింగ్స్ 38 పరుగుల తేడాతో ఇండియా గ్రీన్పై విజయం సాధించింది. ఓవర్నైట్ స్కోరు 345/6 తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన రెడ్ 388 పరుగులకు ఆలౌటైంది. దీంతో 157 పరుగుల ఆధిక్యం దక్కింది. అనంతరం రెండో ఇన్నిం గ్స్కు దిగిన గ్రీన్ను ఆఫ్ స్పిన్నర్ అక్షయ్ వాఖరే (5/13) హడలెత్తించాడు. పేసర్ అవేశ్ ఖాన్ (3/38) కూడా ఓ చేయి వేయడంతో గ్రీన్ 39.5 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. సిద్దేశ్ లాడ్ (80 బంతుల్లో 42; 6 ఫోర్లు), హైదరాబాదీ బ్యా ట్స్మన్, ఓపెనర్ అక్షత్ రెడ్డి (47 బంతుల్లో 33; 7 ఫోర్లు) మాత్రమే కాస్త ప్రతిఘటన కనబర్చారు. అక్షయ్, అవేశ్ ధాటికి వీరిద్దరు కాక కెప్టెన్ ఫైజ్ ఫజల్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు. స్పిన్నర్ మయాంక్ మార్కండే గాయంతో బ్యాటింగ్కు దిగలేదు. రెడ్ తరఫున భారీ శతకంతో అదరగొట్టిన ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (153)కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. సంక్షిప్త స్కోర్లు ఇండియా గ్రీన్ తొలి ఇన్నింగ్స్: 231; ఇండియా రెడ్ తొలి ఇన్నింగ్స్: 388 (ఈశ్వరన్ 153; అంకిత్ రాజ్పుత్ 3/101, ధర్మేంద్ర జడేజా 3/93), ఇండియా గ్రీన్ రెండో ఇన్నింగ్స్: 119 (అక్షత్ రెడ్డి 33; అక్షయ్ వాఖరే 5/13). -
‘డ్రా’ దిశగా...
బెంగళూరు: దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా గ్రీన్, ఇండియా రెడ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ‘డ్రా’ దిశగా సాగుతోంది. మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి ‘రెడ్’ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 404 పరుగులు చేసింది. మహీపాల్ లోమ్రోర్ (126; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... కరుణ్ నాయర్ (90; 16 ఫోర్లు) శతకం కోల్పోయాడు. ఆంధ్ర ఆటగాడు శ్రీకర్ భరత్ (38), అవేశ్ (34 బ్యాటింగ్), ఉనాద్కట్ (30) ఫర్వాలేదని పించారు. ధర్మేంద్ర సింగ్ జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మూడు రోజుల తర్వాత కూడా రెండు ఇన్నింగ్స్లు పూర్తి కాకపోవడంతో మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయమైంది. ఆదివారం మ్యాచ్కు చివరి రోజు. ‘గ్రీన్’ జట్టు తొలి ఇన్నింగ్స్లో సాధించిన 440 పరుగులకు ‘రెడ్’ మరో 36 పరుగుల దూరంలో ఉంది. అయితే చేతిలో ఒకే వికెట్ ఉండటంతో గ్రీన్ ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే గ్రీన్ జట్టుకు 3, రెడ్ జట్టుకు 1 పాయింట్ దక్కుతాయి. అప్పుడు చెరో 4 పాయింట్లతో ఈ రెండు జట్లు బ్లూ (2)ను వెనక్కి నెట్టి ఫైనల్కు అర్హత సాధిస్తాయి. -
దులీప్ ట్రోఫీకి రికీ భుయ్, అక్షత్
న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్ సీజన్ 2019–20 ఆరంభ టోర్నీ అయిన దులీప్ ట్రోఫీలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఆడనున్నారు. భారత్ ‘గ్రీన్’ జట్టుకు హైదరాబాదీ బ్యాట్స్మన్ అక్షత్ రెడ్డి... ‘బ్లూ’ జట్టుకు ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్ ఎంపికయ్యారు. ఈ రెండు జట్లతో పాటు భారత్ ‘రెడ్’ కూడా పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్లు ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరుగుతాయి. మ్యాచ్ లన్నీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే నిర్వహిస్తారు. ‘బ్లూ’ జట్టుకు శుబ్మన్ గిల్... ‘గ్రీన్’ జట్టుకు ఫయాజ్ ఫజల్... ‘రెడ్’ జట్టుకు ప్రియాంక్ పాంచల్ నాయకత్వం వహిస్తారు. గత మూడు సీజన్ల పాటు డేనైట్ ఫార్మాట్లో పింక్ బాల్తో జరిగిన ఈ ఫస్ల్క్లాస్ టోర్నీ ఇప్పుడు మళ్లీ పాత పద్ధతిలోనే జరుగనుంది. రెడ్ బాల్తో డే ఫార్మాట్లో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్) సాబా కరీమ్ మాట్లాడుతూ ‘చిన్నస్వామి స్టేడియంలో ఫ్లడ్లైట్లున్నప్పటికీ లైవ్ కవరేజ్ లేకే డేనైట్ మ్యాచ్లు ఆడించడం లేదు. అయితే సెప్టెంబర్ 5 నుంచి 9 వరకు జరిగే ఒక్క ఫైనల్ మ్యాచ్ మాత్రం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది’ అని చెప్పారు. భారత్లో ఇకపై పింక్ బాల్తో డే నైట్ టెస్టులకు దారులు మూసుకుపోయినట్లేనా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘అలా అని ఏం లేదు. అంతా కోరితే మళ్లీ ఆ ఫార్మాట్లోనే మ్యాచ్లు జరగొచ్చు. ఎవరైనా డేనైట్ కావాలని బోర్డును సంప్రదిస్తే భారత్ ‘ఎ’ ఫస్ట్క్లాస్ మ్యాచ్లు పింక్బాల్తో నిర్వహించవచ్చు. కానీ అందరు అదే కోరరు’ అని అన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భారత్ ఆడే మ్యాచ్లన్నీ డే ఫార్మాట్లోనే జరగనున్నాయని అందుకే మళ్లీ దేశవాళీలోనూ ఈ పద్ధతికే మొగ్గుచూపినట్లు బోర్డు అధికారి ఒకరు తెలిపారు. -
ఇండియా ‘బ్లూ’ 260/5
దిండిగల్: ఇండియా ‘రెడ్’తో మంగళవారం మొదలైన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ తొలి రోజు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. మంగళవారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్లో ఆట ముగిసే సమయానికి ఇండియా ‘బ్లూ’ ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ అన్మోల్ప్రీత్ సింగ్ (147 బంతుల్లో 96; 14 ఫోర్లు, 1 సిక్స్), ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్ (136 బంతుల్లో 53 బ్యాటింగ్, 5 ఫోర్లు) ఐదో వికెట్కు 144 పరుగులు జోడించి ‘బ్లూ’ జట్టును ఆదుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ‘బ్లూ’ జట్టుకు ఓపెనర్లు ఫైజ్ ఫజల్ (32), స్మిత్ పటేల్ (22) అర్ధ శతక భాగస్వామ్యం అందించారు. అయితే వీరిద్దరితో పాటు ధ్రువ్ షోరే (18), దీపక్ హుడా (26) వెంటవెంటనే ఔటవ్వడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో అన్మోల్ప్రీత్, రికీ భుయ్ బాధ్యతాయుత ఆటతో జట్టును ఆదుకున్నారు. శతకానికి కొద్ది దూరంలో అన్మోల్ను ప్రసిధ్ కృష్ణ (2/49) ఔట్ చేశాడు. మరో బౌలర్ పర్వేజ్ రసూల్ (2/65) రెండు వికెట్లు పడగొట్టాడు. -
నేటి నుంచి దులీప్ ట్రోఫీ సమరం
దిండిగుల్ (తమిళనాడు): భారత దేశవాళీ క్రికెట్ సీజన్ (2018–19)కు రంగం సిద్ధమైంది. నేటినుంచి జరిగే దులీప్ ట్రోఫీతో కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో ఇండియా ‘గ్రీన్’తో డిఫెండింగ్ చాంపియన్ ఇండియా ‘రెడ్’ తలపడనుంది. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో పింక్ బంతితో మూడు మ్యాచ్లు నిర్వహించనున్నారు. లీగ్ మ్యాచ్లన్నీ నాలుగు రోజులు... సెప్టెంబర్ 4నుంచి ఫైనల్ ఐదు రోజులు జరుగుతుంది. ఇండియా ‘రెడ్’కు అభినవ్ ముకుంద్ సారథి కాగా... ‘గ్రీన్’కు పార్థివ్ పటేల్, ‘బ్లూ’కు ఫైజ్ ఫజల్ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత ఓపెనర్ల పేలవ ప్రదర్శన కొనసాగుతున్న నేపథ్యంలో అభినవ్ ముకుంద్, పార్థివ్ పటేల్లు తాము ఆ స్థానాలకు అర్హులమే అని నిరూపించుకునేందుకు ఇది సరైన అవకాశం. భారత రెగ్యులర్ టెస్టు వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా గాయం కారణంగా ఆటకు దూరమవ డంతో... అతని స్థానంలో ఎంపికైన దినేశ్ కార్తీక్ ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించలేకపోతున్న నేపథ్యంలో పార్థివ్ పటేల్ను పరిగణనలోకి తీసుకోవాలంటే అతను సత్తా చాటక తప్పదు. వీళ్లతో పాటు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న ఫైజ్ ఫజల్, ధవల్ కులకర్ణి, పర్వేజ్ రసూల్, బాసిల్ థంపి, గుర్బాని, గణేశ్ సతీశ్, బి. సందీప్, ఎ. మిథున్, అంకిత్ రాజ్పుత్, జైదేవ్ ఉనాద్కట్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఆంధ్ర క్రికెటర్లు శ్రీకర్ భరత్, అయ్యప్ప ఇండియా ‘బ్లూ’ జట్టుకు, పృథ్వీరాజ్ ‘రెడ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు రోజులు ఆలస్యంగా... సాక్షి, విజయవాడ: ఆస్ట్రేలియా ‘ఎ’, దక్షిణాఫ్రికా ‘ఎ’లతో పాటు భారత ‘ఎ’, ‘బి’ జట్లు పాల్గొంటున్న క్వాడ్రాంగులర్ వన్డే టోర్నీ కూడా నేటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వాతావరణం ప్రతికూలంగా మారడంతో నేడు, రేపు జరగాల్సిన మ్యాచ్లను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మూలపాడులో జరిగే ఈ టోర్నీ ఫైనల్ ఈ నెల 29న నిర్వహిస్తారు. దక్షిణాఫ్రికా జట్టుకు జోండో కెప్టెన్ కాగా... ఆస్ట్రేలియాకు ట్రవిస్ హెడ్ సారథ్యం వహిస్తున్నాడు. భారత్ ‘ఎ’ జట్టుకు శ్రేయస్ అయ్యర్, ‘బి’ జట్టుకు మనీశ్ పాండే కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. -
దులీప్ ట్రోఫీ విజేత ఇండియా ‘రెడ్’
లక్నో: దేశవాళీ క్రికెట్ సీజన్లో తొలి టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో ఇండియా ‘రెడ్’ జట్టు విజేతగా నిలిచింది. ఇండియా ‘బ్లూ’తో జరిగిన డే నైట్ ఫైనల్లో ఇండియా ‘రెడ్’ 163 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు రోజులపాటు జరగాల్సిన ఫైనల్ నాలుగో రోజే ముగిసింది. 393 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ‘బ్లూ’ 48 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. ‘రెడ్’ జట్టు ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ 87 పరుగులకు 6 వికెట్లు తీసి ‘బ్లూ’ జట్టును దెబ్బతీశాడు. ‘బ్లూ’ జట్టులో సురేశ్ రైనా (51 బంతుల్లో 45; 7 ఫోర్లు), భార్గవ్ భట్ (41 బంతుల్లో 51; ఫోర్, 5 సిక్స్లు) ధాటిగా ఆడారు. ఫైనల్లో ఆల్రౌండ్ ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్కు (130 పరుగులు; 11 వికెట్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. అంతకుముందు నాలుగో రోజు ఓవర్నైట్ స్కోరు 187/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘రెడ్’ జట్టు 208 పరుగులకు ఆలౌటై ‘బ్లూ’ జట్టుకు 393 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. -
ఇండియా ‘రెడ్’ 187/7
లక్నో: ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘రెడ్’ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ తమ రెండో ఇన్నింగ్స్లో ఏడు వికెట్లకు 187 పరుగులు చేసి ఓవరాల్ ఆధిక్యాన్ని 371 పరుగులకు పెంచుకుంది. సుందర్ (42 బ్యాటింగ్), సిద్ధార్థ్ (5 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు. అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 181/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా ‘బ్లూ’ 299 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇండియా ‘రెడ్’ జట్టుకు 184 పరుగుల ఆధిక్యం లభించింది. -
ఇండియా ‘బ్లూ’ 181/5
లక్నో: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ బ్యాటింగ్ తడబడింది. ఇండియా ‘రెడ్’తో జరుగుతున్న ఈ మ్యాచ్లో రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి బ్లూ తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. అభిమన్యు (87 బ్యాటింగ్; 10 ఫోర్లు) మినహా ప్రధాన బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. కెప్టెన్ సురేశ్ రైనా (1), మనోజ్ తివారి (25), దీపక్ హుడా (12), కేఎస్ భరత్ (8), ఇషాన్ కిషన్ (0) పెవిలియన్కు చేరుకున్నారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 317/5తో ఆట కొనసాగించిన రెడ్ తొలి ఇన్నింగ్స్లో 483 పరుగులకు ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (118 బంతుల్లో 88; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) దూకుడుగా బ్యాటింగ్ చేయడం విశేషం. -
పృథ్వీ షా అద్భుత సెంచరీ
క్నో: కుర్ర సంచలనం పృథ్వీ షా దేశవాళీ క్రికెట్లో మళ్లీ అదరగొట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన అతను, తన తొలి దులీప్ ట్రోఫీ మ్యాచ్లో కూడా శతకం బాదాడు. పృథ్వీ షా (249 బంతుల్లో 154; 18 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీతో పాటు సీనియర్ దినేశ్ కార్తీక్ (155 బంతుల్లో 111; 12 ఫోర్లు) కూడా శతకం సాధించడంతో ఇండియా ‘బ్లూ’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘రెడ్’ తొలి రోజు భారీ స్కోరు సాధించింది. సోమవారం ఆట ముగిసే సమయానికి రెడ్ 5 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. సచిన్ టెండూల్కర్ (17 ఏళ్ల 262 రోజులు) తర్వాత అతి పిన్న వయసులో (17 ఏళ్ల 320 రోజులు) దులీప్ ట్రోఫీలో సెంచరీ సాధించిన ఆటగాడిగా పృథ్వీ షా నిలిచాడు. సచిన్లాగే ఈ ముంబైకర్ కూడా తన తొలి రంజీ, దులీప్ ట్రోఫీ మ్యాచ్లలో శతకాలు చేయడం విశేషం. బ్లూ బౌలర్లలో భార్గవ్ భట్కు 3 వికెట్లు దక్కాయి. -
మూడో రోజూ వర్షార్పణం
కాన్పూర్: ఇండియా ‘గ్రీన్’... ఇండియా ‘బ్లూ’ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ మ్యాచ్ను వర్షం వదలడం లేదు. మ్యాచ్ మూడో రోజూ గురువారం వాన కారణంగా ఒక్క బంతి ఆట కూడా సాధ్యపడలేదు. వర్షంవల్ల రెండో రోజు ఆట కూడా పూర్తిగా రద్దయిన సంగతి తెలిసిందే. తొలి రోజు ఇండియా ‘బ్లూ’ జట్టు 177 పరుగులకే ఆలౌట్ కాగా... ఇండియా ‘గ్రీన్’ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. మరో రోజు ఆట మాత్రమే మిగిలి ఉన్న ఈ మ్యాచ్ ‘డ్రా’ కావడం లాంఛనమే.