
న్యూఢిల్లీ: భారత స్టార్ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్లో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. 20 మంది సభ్యులు గల ఈ జట్టుకు మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు.
మోకాలి గాయంతో శ్రీజేశ్ గతేడాది కీలకమైన టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ నెల 17 నుంచి జరిగే టోర్నీలో భారత్, కివీస్లతో పాటు బెల్జియం, జపాన్ జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment