hockey tournament
-
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీ ఫైనల్లో భారత్
జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్చాంపియన్ భారత జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. మస్కట్ వేదికగా శనివారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సింగ్ సారథ్యంలోని భారత జట్టు 3–1 తేడాతో జపాన్ను చిత్తు చేసి ముందంజ వేసింది. భారత్ తరఫున ముంతాజ్ ఖాన్ (4వ నిమిషంలో), సాక్షి రాణా (5వ ని.లో), దీపిక (13వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున నికో మరుయమా (23వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు రెండో నిమిషంలోనే గోల్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నా... మరో 2 నిమిషాల తర్వాత ముంతాజ్ ఖాన్ గోల్తో ఖాతా తెరిచింది. అదే ఊపులో తొలి క్వార్టర్లోనే మరో రెండు గోల్స్ చేసిన భారత్... ప్రత్యరి్థకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీపికకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
దీపిక ‘హ్యాట్రిక్’
మస్కట్ (ఒమన్): జూనియర్ మహిళల ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మలేసియా జట్టుతో సోమవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ రెండో లీగ్ మ్యాచ్లో జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దీపిక మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ నమోదు చేసింది. దీపిక 37వ, 39వ, 48వ నిమిషాల్లో గోల్స్ చేసింది. వైష్ణవి ఫాల్కే (32వ నిమిషంలో), కనిక సివాచ్ (38వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఎనిమిది పెనాల్టీ కార్నర్లు... రెండు పెనాలీ స్ట్రోక్లు లభించాయి. ఇందులో మూడు పెనాల్టీ కార్నర్లను, ఒక పెనాల్టీ స్ట్రోక్ను భారత జట్టు గోల్స్గా మలిచింది. మిగతా ఐదు పెనాల్టీ కార్నర్లను, మరో పెనాల్టీ స్ట్రోక్ను భారత్ లక్ష్యానికి చేర్చి ఉంటే విజయం తేడా మరింత భారీగా ఉండేది. మరో మ్యాచ్లో దక్షిణ కొరియా 7–2 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును ఓడించింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో రెండేసి విజయాలు సాధించిన భారత్, చైనా జట్ల ఖాతాలో ఆరు పాయింట్ల చొప్పున ఉన్నాయి. అయితే చైనా చేసిన గోల్స్ (27) సంఖ్యకంటే భారత్ చేసిన గోల్స్ (17) తక్కువగా ఉండటంతో చైనా టాప్ ర్యాంక్లో, భారత్ రెండో ర్యాంక్లో ఉన్నాయి. బుధవారం జరిగే మూడో లీగ్ మ్యాచ్లో చైనాతో భారత్ తలపడుతుంది. -
‘ఆసియా’ యువ భారత్దే
మస్కట్: ఒకే విజయంతో యువ భారత జట్టు రెండు లక్ష్యాలను సాధించింది. పురుషుల అండర్–21 ఆసియా కప్ హాకీ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత జట్టు టోర్నీని అజేయంగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో బుధవారం జరిగిన ఫైనల్లో శర్దానంద్ తివారి సారథ్యంలోని టీమిండియా 5–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ టోర్నీ టైటిల్ను ఐదోసారి సొంతం చేసుకుంది. గతంలో భారత జట్టు 2004, 2008, 2015, 2023లలో ఈ టైటిల్ను సాధించింది. తాజా విజయంతో భారత జట్టు వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి కూడా అర్హత సాధించింది. ఇదే టోర్నీలో గతంలో రెండుసార్లు ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన భారత జట్టు మూడోసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ ఏకంగా నాలుగు గోల్స్ (4వ, 18వ, 47వ, 54వ నిమిషాల్లో) సాధించగా... దిల్రాజ్ సింగ్ (19వ నిమిషంలో) ఒక గోల్ చేశాడు. పాకిస్తాన్ జట్టు తరఫున సూఫియాన్ ఖాన్ (30వ, 39వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... హన్నాన్ షాహిద్ (3వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో జపాన్ 2–1తో మలేసియాను ఓడించింది. పాకిస్తాన్, జపాన్, మలేసియా జట్లు కూడా వచ్చే ఏడాది జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందాయి. పాక్తో జరిగిన తుది పోరులో భారత జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. మూడో నిమిషంలో హన్నాన్ చేసిన గోల్తో పాకిస్తాన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే వెంటనే తేరుకున్న భారత జట్టు మరుసటి నిమిషంలోనే గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేసింది. 14 నిమిషాల తర్వాత భారత్ రెండు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 3–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం పాక్ పోరాడి మూడో క్వార్టర్ ముగిసేసరికి మరో రెండు గోల్స్ చేసి భారత ఆధిక్యాన్ని 3–4కి తగ్గించింది. చివరి క్వార్టర్లో భారత్ జోరు కొనసాగించి ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి 5–3తో ముందంజ వేసింది. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న టీమిండియా ఆసియా కప్ టైటిల్ను హస్తగతం చేసుకుంది. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో టీమిండియా నాలుగింటిని సది్వనియోగం చేసుకొని, రెండింటిని వృథా చేసింది. మరోవైపు పాక్ జట్టు సంపాదించిన రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచింది. -
భారత్ 16... తైపీ 0
మస్కట్: ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది. గత రెండు మ్యాచ్ల్లో విజయాలు సాధించిన భారత జట్టు... శనివారం మూడో మ్యాచ్లో 16–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీ జట్టును చిత్తు చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన పోరులో యువభారత్ సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. భారత్ తరఫున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దిల్రాజ్ సింగ్ (17వ, 40వ, 45వ, 57వ నిమిషాల్లో) నాలుగు గోల్స్తో చెలరేగగా... రోషన్ కుజుర్ (23వ, 32వ, 42వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుషా్వహా (20వ, 29వ, 58వ నిమిషాల్లో) చెరో మూడు గోల్స్తో అదరగొట్టారు. అర్ష్ దీప్ సింగ్ (37వ, 44వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... యోగేంబర్ రావత్ (7వ నిమిషంలో), ప్రియోబర్తా (31వ నిమిషంలో), శార్దానంద్ తివారి (39వ నిమిషంలో), అర్జీత్ సింగ్ హుండల్ (54వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మ్యాచ్ ప్రారంభమైన ఏడో నిమిషంలో రావత్ తొలి గోల్ సాధించి జట్టుకు మంచి ఆరంభం ఇవ్వగా... ఇక అక్కడి నుంచి మనవాళ్లు వరుస గోల్స్తో విజృంభించారు. ప్రత్యర్థి డిఫెన్స్ను కకావికలం చేస్తూ గోల్స్ వర్షం కురిపించారు. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. నేడు జరగనున్న చివరి లీగ్ మ్యాచ్లో కొరియాతో భారత్ తలపడుతుంది. మంగళవారం సెమీఫైనల్స్ జరగనున్నాయి. గతంలో ఆసియా జూనియర్ హాకీ టోరీ్నలో భారత్ నాలుగు సార్లు విజేతగా నిలిచింది. -
భారత్కు రెండో విజయం
ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. మస్కట్లో గురువారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో భారత జట్టు 3–2 గోల్స్ తేడాతో జపాన్ జట్టును ఓడించింది. భారత్ తరఫున థోక్చోమ్ కింగ్సన్ సింగ్ (12వ నిమిషంలో), రోహిత్ (36వ నిమిషంలో), అరిజిత్ సింగ్ హుండల్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు నియో సాటో (15వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించాడు. ఈ మ్యాచ్లో జపాన్ జట్టుకు ఏకంగా 16 పెనాల్టీ కార్నర్లు లభించాయి. అయితే జపాన్ రెండింటిని మాత్రమే గోల్స్గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు దక్కగా ఇందులో రెండింటిని సది్వనియోగం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గిన భారత జట్టు ఆరు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’లో అగ్రస్థానంలో ఉంది. శనివారం జరిగే మూడో లీగ్ మ్యాచ్లో చైనీస్ తైపీ జట్టుతో భారత్ తలపడుతుంది. -
భారీ విజయంతో భారత్ బోణీ
మస్కట్ (ఒమన్): ఆసియా కప్ జూనియర్ పురుషుల హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు భారీ విజయంతో బోణీ కొట్టింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం థాయ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారత్ 11–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున అరిజిత్ సింగ్ హుండల్ (2వ, 24వ నిమిషాల్లో), గుర్జోత్ సింగ్ (18వ, 45వ నిమిషాల్లో), సౌరభ్ ఆనంద్ కుశ్వాహ (19వ, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చొప్పున చేశారు.దిల్రాజ్ సింగ్ (21వ నిమిషంలో), ముకేశ్ టొప్పో (59వ నిమిషంలో), శారదానంద్ తివారీ (10వ నిమిషంలో), రోహిత్ (29వ నిమిషంలో), అర్‡్షదీప్ సింగ్ (8వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ ఆడుతుంది. -
దీపిక ఐదు గోల్స్... సెమీస్లో భారత్
రాజ్గిర్ (బిహార్): ఆద్యంతం ఆధిపత్యం చలాయిస్తూ భారత మహిళల హాకీ జట్టు ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. థాయ్లాండ్ జట్టుతో గురువారం జరిగిన మూడో రౌండ్ లీగ్ మ్యాచ్లో టీమిండియా 13–0 గోల్స్ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. భారత్ తరఫున దీపిక అత్యధికంగా ఐదు గోల్స్ (3వ, 19వ, 43వ, 45వ, 45వ నిమిషంలో) చేయగా ... ప్రీతి దూబే (9వ, 40వ నిమిషంలో), లాల్రెమ్సియామి (12వ, 56వ నిమిషంలో), మనీషా చౌహాన్ (55వ, 58వ నిమిషంలో) రెండు గోల్స్ చొప్పున సాధించారు. బ్యూటీ డుంగ్డుంగ్ (30వ నిమిషంలో), నవ్నీత్ (53వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. ఈ గెలుపుతో భారత జట్టు అధికారికంగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. ఆరు జట్ల మధ్య లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. ఆరు జట్లు మూడేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నాయి. ఆడిన మూడు మ్యాచ్ల్లో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా, భారత్ 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే గోల్స్ అంతరం కారణంగా చైనా (చేసిన గోల్స్ 22; ఇచ్చిన గోల్స్ 1) టాప్ ర్యాంక్లో, భారత్ (చేసిన గోల్స్ 20; ఇచ్చిన గోల్స్ 2) రెండో ర్యాంక్లో ఉన్నాయి. 3 పాయింట్లతో మలేసియా మూడో స్థానంలో, 2 పాయింట్లతో జపాన్ నాలుగో స్థానంలో, 1 పాయింట్తో కొరియా ఐదో స్థానంలో, 1 పాయింట్తో థాయ్లాండ్ ఆరో స్థానంలో ఉన్నాయి. నిర్ణీత ఐదు మ్యాచ్లు పూర్తయ్యాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్లోకి దూసుకెళ్తాయి. మిగిలిన రెండు మ్యాచ్ల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా చైనా, భారత జట్ల తొమ్మిది పాయింట్లను మిగతా జట్లు దాటే పరిస్థితి లేదు. దాంతో ఈ రెండు జట్లకు సెమీస్ బెర్త్లు ఖరారయ్యాయి. మూడో నిమిషంలో మొదలై... గత పదేళ్లలో ఏడోసారి థాయ్లాండ్తో తలపడిన భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. గతంలో ఆడిన ఆరు మ్యాచ్ల్లో థాయ్లాండ్కు ఒక్క గోల్ మాత్రమే సమర్పించుకొని 39 గోల్స్ సాధించిన భారత జట్టు ఏడోసారీ అదే దూకుడును కొనసాగించింది. మూడో నిమిషంలో దీపిక చేసిన గోల్తో భారత్ ఖాతా తెరిచింది. అటునుంచి టీమిండియా వెనుదిరిగి చూడలేదు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టుకు 11 పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఇందులో ఐదింటిని మాత్రమే భారత్ గోల్స్గా మలిచింది. లేదంటే విజయాధిక్యం మరింతగా ఉండేది. గురువారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో చైనా 2–1 గోల్స్తో జపాన్పై, మలేసియా 2–1 గోల్స్తో కొరియాపై గెలిచాయి. శనివారం జరిగే నాలుగో రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో మలేసియాతో జపాన్; కొరియాతో థాయ్లాండ్; చైనాతో భారత్ తలపడతాయి. -
భారత్ శుభారంభం
రాజ్గిర్ (బిహార్): ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి రౌండ్ లీగ్ మ్యాచ్లో సలీమా టెటె నాయకత్వంలోని భారత జట్టు 4–0 గోల్స్ తేడాతో మలేసియా జట్టుపై గెలిచింది. భారత్ తరఫున సంగీత కుమారి (8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ప్రీతి దూబే (43వ నిమిషంలో), ఉదిత (44వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఇతర తొలి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో పారిస్ ఒలింపిక్స్ రజత పతక విజేత చైనా 15–0తో థాయ్లాండ్ను చిత్తు చేయగా... జపాన్, కొరియా మధ్య మ్యాచ్ 2–2తో ‘డ్రా’గా ముగిసింది. మలేసియా చేతిలో ఓటమి ఎరుగని భారత జట్టు ఈసారీ పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఎనిమిదో నిమిషంలో లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను సంగీత లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ జోరు కొనసాగించినా ఫినిషింగ్ వేధించింది. ఫలితంగా 42వ నిమిషం వరకు భారత్ ఖాతాలో మరో గోల్ చేరలేదు. అయితే రెండు నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను ప్రీతి దూబే, ఉదిత సది్వనియోగం చేసుకోవడంతో భారత్ ఒక్కసారిగా 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా సంగీత ఫీల్డ్ గోల్తో భారత ఆధిక్యం 4–0కు పెరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో భారత్కు 11 పెనాల్టీ కార్నర్లు, మలేసియాకు ఒక పెనాల్టీ కార్నర్ లభించాయి. -
కాంస్యం కోసం యువ భారత్ పోరు
కౌలాలంపూర్: జొహర్ కప్ అండర్–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో రౌండ్ రాబిన్ లీగ్ దశ మ్యాచ్లు ముగిశాయి. టాప్–2లో నిలిచిన ఆ్రస్టేలియా, బ్రిటన్ జట్లు టైటిల్ కోసం పోటీపడనుండగా... మూడో స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ జట్లు కాంస్య పతకం కోసం తలపడతాయి. 5–6 స్థానాల కోసం జపాన్, ఆతిథ్య మలేసియా జట్లు ఆడతాయి. వరుసగా మూడు మ్యాచ్ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు నాలుగో మ్యాచ్లో ఆ్రస్టేలియా కళ్లెం వేసింది. ఒక్క గోల్ సమర్పించుకోకుండా భారత్ఫై నాలుగు గోల్స్ సాధించి ఆ్రస్టేలియా ఘనవిజయం నమోదు చేసుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిస్తే భారత జట్టు ఫైనల్కు చేరుకునేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్తో మ్యాచ్ను భారత జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.భారత్ తరఫున గుర్జోత్ సింగ్ (6వ నిమిషంలో), రోహిత్ (17వ నిమిషంలో), తాలెమ్ ప్రియోబర్తా (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. న్యూజిలాండ్ జట్టుకు జాంటీ ఎల్మెస్ (17వ, 32వ, 45వ నిమిషాల్లో) ఏకంగా మూడు గోల్స్ అందించాడు. కివీస్తో మ్యాచ్ ‘డ్రా’ కావడంతో భారత జట్టు ఫైనల్ బెర్త్ ఖరారయ్యేది ఇతర జట్ల మ్యాచ్ల ఫలితాలపై ఆధార పడింది. అయితే బ్రిటన్ జట్టు 3–1తో జపాన్పై, ఆ్రస్టేలియా 9–3తో మలేసియాపై ఘనవిజయం సాధించాయి. ఫలితంగా బ్రిటన్, ఆ్రస్టేలియా, భారత జట్లు 10 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఆ్రస్టేలియా, బ్రిటన్ తొలి రెండు స్థానాల్లో నిలువగా... భారత్కు మూడో స్థానం దక్కింది. -
హెడ్ కోచ్ శ్రీజేశ్ ఆధ్వర్యంలో...
బెంగళూరు: భారత సీనియర్ హాకీ జట్టు మేటి గోల్కీపర్, ఇటీవల ఆటకు వీడ్కోలు పలికిన పీఆర్ శ్రీజేశ్ కొత్త పాత్రలో కనిపించనున్నాడు. భారత జూనియర్ పురుషుల హాకీ జట్టుకు తొలిసారి హెడ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈనెల 19 నుంచి మలేసియాలో జరిగే సుల్తాన్ ఆఫ్ జొహోర్ కప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టుకు శ్రీజేశ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తాడు. ఈ టోర్నీలో పాల్గొనే 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆదివారం హాకీ ఇండియా ప్రకటించింది. డిఫెండర్లు అమీర్ అలీను కెపె్టన్గా, రోహిత్ను వైస్ కెపె్టన్గా నియమించారు. ఆతిథ్య మలేసియాతోపాటు భారత్, బ్రిటన్, జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్లు ముగిశాక టాప్–2లో నిలిచిన జట్లు 26న జరిగే ఫైనల్లో తలపడతాయి. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను 19న జపాన్తో ఆడుతుంది. ఆ తర్వాత బ్రిటన్ (20న), మలేసియా (22న), ఆ్రస్టేలియా (23న), న్యూజిలాండ్ (25న) జట్లతో భారత్ తలపడుతుంది. భారత జట్టు: అమీర్ అలీ (కెపె్టన్), రోహిత్ (వైస్ కెపె్టన్), బిక్రమ్జీత్ సింగ్, అలీఖాన్, తాలెమ్ ప్రియోబర్తా, శారదనాంద్ తివారి, సుఖ్వీందర్, అన్మోల్ ఎక్కా, అంకిత్ పాల్, మనీ్మత్ సింగ్, రోషన్ కుజుర్, ముకేశ్ టొప్పో, చందన్ యాదవ్, గుర్జోత్ సింగ్, సౌరభ్ ఆనంద్ కుశ్వా, దిల్రాజ్ సింగ్, అర్‡్షదీప్ సింగ్, మొహమ్మద్ కొనైన్ దడ్. -
పాకిస్తాన్కు షాకిచ్చిన చైనా
ఆసియా పురుషుల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో చైనా సంచలన విజయం సాధించింది. సెమీస్లో పాకిస్తాన్ను మట్టికరిపించి.. తొలిసారి ఈ టోర్నమెంట్ ఫైనల్కు అర్హత సాధించింది. ఉత్కంఠగా సాగిన షూటౌట్లో గోల్కీపర్ సైయూ వాంగ్ తన అద్భుత ప్రదర్శనతో చైనాకు ఈ చిరస్మరణీయ గెలుపు అందించాడు.సెమీస్లో ఆ నాలుగు జట్లుమరోవైపు.. పాకిస్తాన్కు కాంస్య పతక పోరు రూపంలో మెడల్ గెలిచేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. చైనాలోని హులున్బుయిర్లో గల మోకీ హాకీ ట్రెయినింగ్ బేస్లో ఆసియా చాంపియన్స్ హాకీ పోటీలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత్, పాకిస్తాన్, దక్షిణ కొరియా, చైనా టాప్-4లో నిలిచాయి.1-1తో సమం.. షూటౌట్లో ఫలితంఈ క్రమంలో తొలి సెమీస్లో చైనా సోమవారం పాకిస్తాన్తో తలపడింది. ఆట 18వ నిమిషంలో డ్రాగ్ఫ్లికర్ యువాన్లిన్ లూ గోల్ కొట్టి చైనాకు 1-0 ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత పాకిస్తాన్ ఐదుసార్లు పెనాల్టీ కార్నర్ల ద్వారా గోల్ కొట్టేందుకు ప్రయత్నించినా.. చైనా డిఫెన్స్ చేసింది. అయితే, 37వ నిమిషంలో అహ్మద్ నదీం అద్భుతంగా ఆడి గోల్ కొట్టగా.. ఆ తర్వాత చైనా మళ్లీ పాకిస్తాన్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు.ఈ నేపథ్యంలో మ్యాచ్ 1-1తో డ్రా కాగా.. షూటౌట్ నిర్వహించారు. చైనా తరఫున బెన్హాయి, చింగాలియాంగ్ లిన్ గోల్స్ కొట్టగా.. పాకిస్తాన్ ఒక్కటీ స్కోరు చేయలేకపోయింది. చైనా గోల్ కీపర్ సైయూ వాంగ్ పాక్ జట్టుకు అడ్డుగోడలా నిలిచి తమ జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. షూటౌట్లో చైనా 2-0తో పాకిస్తాన్పై గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది.మరో సెమీస్లో భారత్- కొరియా జట్లు తలపడుతున్నాయి. భారత్ ఇప్పటికే 4-0తో పటిష్ట స్థితిలో నిలిచి ఫైనల్కు చేరువైంది. ఇక ఈ మ్యాచ్లో ఓడిన జట్టు పాకిస్తాన్తో కాంస్య పతకం కోసం పోటీ పడుతుంది.చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. ఆ షాట్లు ఆడటంలో వాళ్లే బెస్ట్: అశ్విన్ -
Ind vs Pak: పాకిస్తాన్ను ఓడించిన భారత్
ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను చిత్తు చేసింది. టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్లో దాయాదిని 2-1తో ఓడించింది. తద్వారా లీగ్ దశలో ఓటమన్నదే లేకుండా.. సెమీస్ వరకు అజేయంగా నిలిచింది. కాగా ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత్- పాకిస్తాన్ ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే.చిరకాల ప్రత్యర్థిపై మరోసారి పైచేయిటీమిండియా పన్నెండు పాయింట్లతో.. పాక్ ఎనిమిది పాయింట్లతో టాప్-4 బెర్తులను ఖరారు చేసుకున్నాయి. అయితే, లీగ్ దశలో నామమాత్రపు పోరులో దాయాదులు పోటీపడటం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఈ నేపథ్యంలో ఆది నుంచి వరుస విజయాలతో జోరు మీదున్న హర్మన్ప్రీత్ సింగ్ సేన.. నామమాత్రపు మ్యాచ్లోనూ దుమ్ములేపింది. చిరకాల ప్రత్యర్థిపై 2-1తో పైచేయి సాధించి జయభేరి మోగించింది. ఆదిలో పాక్కు ఆధిక్యంచైనాలోని మోకీ వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో.. తొలి గోల్ పాక్ కొట్టింది. ఆట ఎనిమిదవ నిమిషంలో అహ్మద్ నదీం తమ జట్టుకు తొలి పాయింట్ అందించాడు. అయితే, భారత జట్టు కెప్టెన్, ఉత్తమ డ్రాగ్ఫికర్లలో ఒకడైన హర్మన్ప్రీత్ సింగ్ దాయాదిని పైచేయి సాధించనివ్వలేదు. హర్మన్ చేసెను అద్భుతం మ్యాచ్ తొలి అర్ధభాగంలోనే పెనాల్టీ కార్నర్ ద్వారా రెండు గోల్స్ కొట్టి భారత్ను ఆధిక్యంలో నిలిపాడు. మిగిలిన ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించి.. మ్యాచ్ ముగిసే వరకు పాక్కు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. ఫలితంగా 2-1తో భారత్ గెలుపొందింది.ఇక ఈ టోర్నీలో భారత్ అంతకుముందు చైనాను 3–0తో, జపాన్ను 5–1తో, మలేషియాను 8–1, కొరియాను 3–1తో ఓడించింది. ఇక భారత్తో పాటు పాకిస్తాన్, సౌత్ కొరియా సెమీ ఫైనల్ బెర్తులను ఇప్పటికే ఖరారు చేసుకున్నాయి. మలేషియా, చైనాలలో ఏదో ఒక జట్టు వీటితో పాటు సెమీస్లో నిలిచే అవకాశం ఉంది.చదవండి: టెన్నిస్ టోర్నమెంట్.. హెలికాప్టర్లలో స్టేడియానికిCaptain Harmanpreet gets us 🔙 in the game 🔥Harmanpreet led the Indian attack from the front with 2️⃣ beautiful penalty corner conversions which gave the #MenInBlue a well-deserved lead 💪Watch the intense clash LIVE on #SonyLIV 📲 pic.twitter.com/VINOMUPqbR— Sony LIV (@SonyLIV) September 14, 2024 -
భారత్ X పాక్
హులున్బుయిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ ఆఖరి లీగ్ మ్యాచ్లో నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత భారత్ ఈ టోర్నీలో నాలుగు వరుస విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు సాధించింది. టీమిండియా 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో ఉండగా... నాలుగింట రెండు మ్యాచ్లు గెలిచిన పాకిస్తాన్ 8 పాయింట్లతో సెమీఫైనల్కు అర్హత సంపాదించింది. ఈ నేపథ్యంలో ఇరుజట్లకు ఇది నామమాత్రమైన పోరే అయినప్పటికీ మైదానంలో జరిగే సమరం మాత్రం హైవోల్టేజీతో ఉంటుంది. భారత కెపె్టన్ సహా ఆటగాళ్లంతా సూపర్ ఫామ్లో ఉన్నారు. పారిస్ పతకం ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పటివరకు ఎదురైన అన్ని జట్లను మట్టికరిపించారు. ఆతిథ్య చైనాను 3–0తో చిత్తు చేసిన భారత్ 5–1తో జపాన్పై, 8–1తో మలేసియాపై తిరుగులేని విజయాలు సాధించింది. 3–1తో కొరియాను ఓడించిన భారత్ ఇప్పుడు ఇదే జోరుతో దాయాది జట్టును కంగుతినిపించాలని తహతహలాడుతోంది. గతేడాది చైనాలోనే జరిగే హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ 10–2తో పాకిస్తాన్పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. గత ఏడాది చెన్నైలో జరిగిన పోరులోనూ భారత్ 4–0తో ఘనవిజయం సాధించింది. టోర్నీ ఫేవరెట్గా బరిలోకి దిగిన దుర్భేధ్యమైన టీమిండియాను ఓడించడం పాకిస్తాన్కు అంత సులభం కాదు. ప్రపంచంలోనే ఉత్తమ డ్రాగ్ఫ్లికర్లలో ఒకడైన కెపె్టన్ హర్మన్ప్రీత్ చిరకాల ప్రత్యరి్థతో మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు. ఇప్పుడున్న పాక్ జట్టులోని ఆటగాళ్లను జూనియర్ స్థాయి నుంచే ఎదుర్కొన్న అనుభవం తనకుందని చెప్పాడు. దీంతో వారితో చక్కని అనుబంధం ఏర్పడిందని, సోదరభావంతో మెలుగుతామని అన్నాడు. అయితే మైదానంలోకి దిగగానే ప్రత్యర్థులపై చెలరేగేందుకు సై అంటామని చెప్పుకొచ్చాడు. -
సవిత సారథ్యంలో...
బెంగళూరు: స్వదేశంలో జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు జరిగే పారిస్ ఒలింపిక్స్ మహిళల హాకీ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు గోల్కీపర్ సవిత పూనియా నాయకత్వం వహిస్తుంది. ఈ టోర్నీలో టాప్–3లో నిలిచిన జట్లు పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు అర్హత సాధిస్తాయి. మొత్తం ఎనిమిది జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో చిలీ, చెక్ రిపబ్లిక్, జర్మనీ, జపాన్... గ్రూప్ ‘బి’లో భారత్, ఇటలీ, న్యూజిలాండ్, అమెరికా జట్లున్నాయి. భారత్ తమ తొలి లీగ్ మ్యాచ్ను 13న అమెరికాతో ఆడుతుంది. ఆ తర్వాత 14న న్యూజిలాండ్తో, 16న ఇటలీతో టీమిండియా తలపడుతుంది. భారత హాకీ జట్టు: సవిత పూనియా (కెపె్టన్, గోల్కీపర్), బిచ్చూ దేవి ఖరీబమ్ (గోల్కీపర్), నిక్కీ ప్రధాన్, ఉదిత, ఇషికా చౌధరీ, మోనిక, నిషా, వైష్ణవి విఠల్ ఫాలే్క, నేహా, నవ్నీత్ కౌర్, సలీమా టెటె, సోనిక, జ్యోతి, బ్యూటీ డుంగ్డుంగ్, లాల్రెమ్సియామి, సంగీత కుమారి, దీపిక, వందన కటారియా. -
భారత జట్టుకు నిరాశ
కౌలాలంపూర్: మూడోసారి జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. జర్మనీ జట్టు తరఫున బెన్ హాస్బాష్ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్ చేయగా... పాల్ గ్లాండర్ (41వ ని.లో), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది. -
భారత్ అదరహో
కౌలాలంపూర్: ఆద్యంతం అద్భుతమైన పోరాట పటిమ కనబరిచిన భారత జట్టు జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు 4–3 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున ఆదిత్య అర్జున్ లలాగే (34వ ని.లో), అరిజిత్ సింగ్ హుందల్ (35వ ని.లో), సౌరభ్ ఆనంద్ కుష్వా (52వ ని.లో), ఉత్తమ్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నెదర్లాండ్స్ జట్టుకు టిమో బోర్స్ (5వ ని.లో), వాన్ డెర్ హెజ్డెన్ (16వ ని.లో), ఒలివియర్ హోర్టెన్సియస్ (44వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. మిగతా క్వార్టర్ ఫైనల్స్లో జర్మనీ 2–1తో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై, ఫ్రాన్స్ 3–2తో ఆ్రస్టేలియాపై, స్పెయిన్ 4–2తో పాకిస్తాన్పై విజయం సాధించాయి. గురువారం జరిగే సెమీఫైనల్స్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ జర్మనీతో భారత్; స్పెయిన్తో ఫ్రాన్స్ తలపడతాయి. జూనియర్ స్థాయిలో చివరిసారి 2005లో నెదర్లాండ్స్పై గెలిచిన భారత జట్టుకు ఈసారీ గట్టిపోటీ ఎదురైంది. అయితే మ్యాచ్లో మూడుసార్లు వెనుకబడ్డ భారత్ ఏమాత్రం ఆందోళన చెందకుండా పోరాడింది. రెండు క్వార్టర్లు ముగిసేసరికి 0–2తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత నిమిషం వ్యవధిలో రెండు గోల్స్ చేసి స్కోరును సమం చేసింది. మూడో క్వార్టర్లో నెదర్లాండ్స్ మూడో గోల్ చేసి మరోసారి ఆధిక్యంలోకి వచ్చింది. మ్యాచ్ ముగిసేందుకు ఎనిమిది నిమిషాలు ఉన్నాయనగా భారత్ మళ్లీ స్కోరును సమం చేసింది. అదే జోరులో మ్యాచ్ ముగియడానికి మూడు నిమిషాలముందు నాలుగో గోల్తో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చింది. చివర్లో నెదర్లాండ్స్ జట్టు స్కోరును సమం చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. నెదర్లాండ్స్ ఏకంగా ఆరు పెనాల్టీ కార్నర్లు సంపాదించినా... భారత జట్టు గోల్కీపర్ మోహిత్తోపాటు రక్షణపంక్తి ఆటగాళ్లు అప్రమత్తంగా ఉండి నెదర్లాండ్స్కు గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. చివరి పది సెకన్లలోనూ నెదర్లాండ్స్కు పెనాల్టీ కార్నర్ లభించినా భారత ఆటగాళ్లు దానిని నిర్వీర్యం చేసి చిరస్మరణీయ విజయం అందుకున్నారు. మ్యాచ్ మొత్తంలో నెదర్లాండ్స్కు 12 పెనాల్టీ కార్నర్లు రాగా వాటిలో మూడింటిని గోల్స్గా మలిచింది. భారత జట్టుకు ఐదు పెనాల్టీ కార్నర్లు లభించగా... ఒక దానిని భారత్ లక్ష్యానికి చేర్చింది. 6 జూనియర్ ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్ సెమీఫైనల్ చేరడం ఇది ఆరోసారి. గతంలో భారత జట్టు 2001, 2016లలో విజేతగా, 1997లో రన్నరప్గా నిలిచింది. 2005, 2021లలో సెమీఫైనల్తోపాటు మూడో స్థానం కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత జట్టు ఓడిపోయింది. -
తొమ్మిదో స్థానంతో భారత్ ముగింపు... ‘షూటౌట్’లో అమెరికాపై విజయం
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టుకు తొమ్మిదో స్థానం దక్కింది. చిలీ ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో 9–10 స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ ‘షూటౌట్’లో 3–2 గోల్స్ తేడాతో అమెరికా జట్టును ఓడించింది. నిvత 60 నిమిషాలు ముగిశాక భారత్, అమెరికా జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున మంజు (11వ ని.లో), సునెలితా (57వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... అమెరికా జట్టుకు కిర్స్టెన్ థామసె (27వ, 53వ ని.లో) రెండు గోల్స్ అందించింది. ‘షూటౌట్’లో మొదటి ఐదు షాట్లు ముగిశాక కూడా రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున ముంతాజ్, రుతుజా గోల్స్ చేయగా... ప్రీతి, సాక్షి, అన్ను విఫలమయ్యారు. అమెరికా జట్టు తరఫున అబిగెయిల్, లారెన్ వడాస్, అండర్వుడ్ కొట్టిన షాట్లను భారత గోల్కీపర్ మాధురి నిలువరించగా... కేటీ డిక్సన్, ఒలివియా గోల్స్ చేశారు. ‘సడెన్డెత్’లో లారెన్ వడాస్ షాట్ను మాధురి అడ్డుకోగా... అనంతరం రుతుజా గోల్తో భారత విజయం ఖరారైంది. -
కొరియాపై భారత్ గెలుపు
సాంటియాగో (చిలీ): జూనియర్ మహిళల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత జట్టు 9–10వ స్థానాల కోసం పోటీపడనుంది. 9–13 స్థానాల మధ్య వర్గీకరణ మ్యాచ్లో భాగంగా దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున రోప్ని కుమారి (23వ ని.లో), ముంతాజ్ ఖాన్ (44వ ని.లో), అన్ను (46వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. కొరియా జట్టుకు జియున్ చోయ్ (19వ ని.లో) ఏకైక గోల్ సాధించింది. 9–10 స్థానాల కోసం శనివారం అమెరికా జట్టుతో భారత్ ఆడుతుంది. -
భారత్కు స్పెయిన్ షాక్
కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నీలో భారత్కు ఊహించని ఫలితం ఎదురైంది. గురువారం వరుసగా రెండో విజయం సాధించి దర్జాగా క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని ఆశించిన యువ భారత్ గ్రూప్ ‘సి’ రెండో లీగ్ మ్యాచ్లో 1–4 గోల్స్ తేడాతో స్పెయిన్ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండో విజయంతో స్పెయిన్ జట్టు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను దాదాపు ఖాయం చేసుకుంది. తొలి మ్యాచ్లో దక్షిణ కొరియాపై 4–2తో నెగ్గి శుభారంభం చేసిన భారత జట్టుకు రెండో మ్యాచ్లో స్పెయిన్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ఆట తొలి నిమిషంలోనే పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్తో స్పెయిన్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత 18వ నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్తో స్పెయిన్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 33వ నిమిషంలో రోహిత్ గోల్ సాధించడంతో భారత్ ఖాతా తెరిచింది. అయితే స్పెయిన్ జోరు తగ్గించకుండా ఆడుతూ ఎనిమిది నిమిషాల తర్వాత మూడో గోల్ చేసింది. పాల్ క్యాబిర్ వెర్డెల్ గోల్తో స్పెయిన్ 3–1తో ముందంజ వేసింది. మ్యాచ్ చివరి నిమిషంలో ఆండ్రెస్ రాఫి గోల్తో స్పెయిన్ 4–1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. భారత జట్టుకు ఈ మ్యాచ్లో ఏడు పెనాల్టీ కార్నర్లు రాగా కేవలం ఒక దానిని సహాకీ టోర్నీ నియోగం చేసుకుంది. మరో మ్యాచ్లో దక్షిణ కొరియా 4–1తో కెనడాను ఓడించి క్వార్టర్ ఫైనల్ రేసులో నిలిచింది. శనివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్ల్లో కెనడాతో భారత్; కొరియాతో స్పెయిన్ తలపడతాయి. కొరియా–స్పెయిన్ మ్యాచ్ తర్వాతే భారత జట్టు మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ స్పెయిన్ చేతిలో కొరియా ఓడితే భారత్ తమ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే చాలు క్వార్టర్ ఫైనల్ చేరుకుంటుంది. ఒకవేళ స్పెయిన్పై కొరియా గెలిస్తే మాత్రం భారత్ భారీ తేడాతో కెనడాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. -
యువ భారత్ శుభారంభం
కౌలాలంపూర్: జూనియర్ పురుషుల అండర్–21 ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో మాజీ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన పూల్ ‘సి’ తొలి మ్యాచ్లో టీమిండియా 4–2 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. భారత్ తరఫున అరైజీత్ సింగ్ హుండల్ మూడు గోల్స్తో ‘హ్యాట్రిక్’ సాధించాడు. అరైజీత్ 11వ, 16వ, 41వ నిమిషాల్లో గోల్స్ చేశాడు. మరో గోల్ను అమన్దీప్ (30వ ని.లో) సాధించాడు. కొరియా తరఫున డోహున్ లిమ్ (38వ ని.లో), మిన్క్వాన్ కిమ్ (45వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. రేపు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో స్పెయిన్తో భారత్ ఆడుతుంది. మంగళవారమే జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో ఫ్రాన్స్ 3–1తో ఈజిప్ట్పై, జర్మనీ 5–3తో దక్షిణాఫ్రికాపై, స్పెయిన్ 7–0తో కెనడాపై, అర్జెంటీనా 1–0తో ఆ్రస్టేలియాపై, మలేసియా 7–1తో చిలీపై గెలుపొందాయి. -
థాయ్లాండ్తో భారత్ తొలి పోరు
రాంచీ: భారత్ వేదికగా తొలిసారి జరగనున్న మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ షెడ్యూల్ను మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు జరిగే ఈ టోర్నీకి రాంచీ ఆతిథ్యమివ్వనుంది. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్లాండ్, మలేసియా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. అక్టోబర్ 27న థాయ్లాండ్ జట్టుతో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. అనంతరం 28న మలేసియాతో, 30న చైనాతో, 31న జపాన్తో, నవంబర్ 2న కొరియాతో భారత్ ఆడుతుంది. రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లు ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుకుంటాయి. సెమీఫైనల్స్ నవంబర్ 4న, ఫైనల్స్ నవంబర్ 5న జరుగుతాయి. 2010 నుంచి ఇప్పటి వరకు ఆసియా మహిళల చాంపియన్స్ ట్రోఫీ ఆరుసార్లు జరిగింది. భారత్ 2016లో టైటిల్ గెలిచింది. 2010లో మూడో స్థానం పొందగా.. 2013, 2018లో రన్నరప్గా నిలిచింది. -
అజేయంగా టైటిల్ పోరుకు భారత్
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. ఇప్పటికే మూడుసార్లు విజేతగా నిలిచిన భారత్ శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో 5–0 గోల్స్ తేడాతో జపాన్పై గెలిచింది. నేడు జరిగే ఫైనల్లో మలేసియా తో భారత్ ఆడుతుంది. తొలి సెమీఫైనల్లో మలేసియా 6–2తో డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించి ఈ టోర్నీలో మొదటిసారి ఫైనల్ చేరింది. 2018 ఆసియా క్రీడల సెమీఫైనల్లో చివరిసారి మలేసియా చేతిలో ఓడిన భారత్ ఆ తర్వాత ఈ జట్టుతో జరిగిన ఐదు మ్యాచ్ల్లో ఓటమి చవిచూడలేదు. 5–6 స్థానాల కోసం జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 6–1తో చైనాపై గెలిచి ఐదో స్థానాన్ని దక్కించుకోగా... చైనా చివరిదైన ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జపాన్పై గెలుపుతో హర్మన్ప్రీత్ సేన నాలుగో టైటిల్పై కన్నేసింది. ఈ టోర్నీలో లీగ్ దశలో 1–1తో తమని నిలువరించిన జపాన్పై టీమిండియా ఎదురు లేని విజయం సాధించింది. బంగ్లాదేశ్లో జరిగిన గత టోర్నీ (2021)లో సెమీస్లో ఎదురైన పరాజయానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. భారత శిబిరం అటాకింగ్కు జపాన్ వద్ద బదులే లేకపోయింది. తొలి క్వార్టర్ 0–0తో ముగిసింది. ఆ తర్వాత మూడు క్వార్టర్లు భారత ఆటగాళ్లదే జోరు. ఆకాశ్దీప్ సింగ్ (19వ ని.లో), కెపె్టన్ హర్మన్ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (30వ ని.లో), సుమిత్ (39వ ని.లో), కార్తీ సెల్వం (51వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. ఈ మ్యాచ్తో భారత జట్టు గోల్కీపర్ పీఆర్ శ్రీజేష్ 300 అంతర్జాతీయ మ్యాచ్లను పూర్తి చేసుకున్నాడు. -
పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడి.. భారత్ను నిలువరిస్తేనే సెమీఫైనల్ బెర్త్
చెన్నై: సాధారణంగా దాయాదుల మధ్య హాకీ మ్యాచ్ జరిగినా... క్రికెట్ పోరు జరిగినా... అది ఆ టోర్నీకే ఆసక్తికరమైన సమరమవుతుంది. కానీ ఈసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్లు బుధవారం తలపడుతున్నప్పటికీ మునుపటిలా ఇది మాత్రం భారత్ పక్షం నుంచి అవసరం, అంతటి ఆసక్తికరమని అనలేం! ఎందుకంటే ఇదివరకే భారత జట్టు అజేయంగా సెమీఫైనల్ చేరింది. పాక్తో మ్యాచ్ పూర్తిగా నామమాత్రమైంది. కానీ దాయాదికి మాత్రం ఇది చావోరేవోలాంటి పోరు. ఓడితే మాత్రం సెమీస్ దారులు మూసుకుపోతాయి. కనీసం ‘డ్రా’తో గట్టెక్కితేనే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచే అవకాశముంది. మరోవైపు ముందుకెళ్లడమో, ఇక్కడే ముగించుకోవడమో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కాబట్టి పాకిస్తాన్పై తీవ్రమైన ఒత్తిడి ఉంది. భారత్ ఫామ్, ఈ టోర్నిలో కనబరిచిన దూకుడు, ఆధిపత్యం దృష్ట్యా పాక్ గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డినా సరిపోదేమో! అసాధారణ ఆటతో పాటు అదృష్టం కూడా కలిసొస్తేనే పాక్ గెలిచేందుకు సాధ్యమవుతుంది. లేదంటే ఎదురేలేని భారత్ను ఎదురించడం అంత సులభం కానేకాదు. 2016 దక్షిణాసియా క్రీడల ఫైనల్లో చివరిసారి భారత్పై పాకిస్తాన్ గెలిచింది. భారత్–పాక్ మ్యాచ్ కంటే ముందు చైనాతో జపాన్; దక్షిణ కొరియాతో మలేసియా తలపడతాయి. మలేసియా కూడా సెమీఫైనల్ చేరడంతో మిగతా రెండు బెర్త్ల కోసం కొరియా, పాకిస్తాన్, జపాన్ రేసులో ఉన్నాయి. ఆసియా క్రీడల్లో ఒకే గ్రూప్లో... హాంగ్జౌలో జరగనున్న ప్రతిష్టాత్మక ఆసి యా క్రీడల్లో హాకీ ఈవెంట్లో భారత్, పాకిస్తాన్లు ఒకే గ్రూపులో తలపడనున్నాయి. గ్రూప్ ‘ఎ’లో దాయాదులతో పాటు జపాన్, బంగ్లాదేశ్, సింగపూర్, ఉజ్బెకిస్తాన్లు ఉన్నాయి. సెపె్టంబర్ 24న జరిగే తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో భారత్ తలపడుతుంది. ఆసియా క్రీడల ఈవెంట్కే హై లైట్ కాబోయే ఇండో–పాక్ పోరు సెపె్టంబర్ 30న జరుగుతుంది. టైటిల్ పోరు అక్టోబర్ 6న నిర్వహిస్తారు. మహిళల విభాగంలోనూ భారత్ ‘ఎ’ గ్రూపులో ఉంది. ఇందులో హాంకాంగ్, సింగ పూర్, కొరియా, మలేసియా ఇతర జట్లు కాగా... అమ్మాయిల బృందం 27న తమ తొలి పోరులో సింగపూర్తో ఆడుతుంది. -
ఎదురులేని భారత్
చెన్నై: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఎదురేలేని భారత్ మూడో విజయాన్ని సాధించి సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో టీమిండియా 3–2 గోల్స్తో దక్షిణ కొరియాపై గెలుపొందింది. భారత్ తరఫున నీలకంఠ శర్మ (6వ నిమిషంలో), హర్మన్ప్రీత్ సింగ్ (23వ ని.లో), మన్దీప్ సింగ్ (33వ ని.లో) తలా ఒక గోల్ చేశారు. కొరియా బృందంలో సంగ్హ్యూన్ కిమ్ (12వ ని.లో), జిహున్ యంగ్ (58వ ని.లో) చెరో గోల్ చేశారు. ఆడిన నాలుగు మ్యాచ్ల్లో 10 పాయింట్లతో భారత్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. రేపు తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో భారత్ ఆడుతుంది. ఇతర మ్యాచ్ల్లో పాకిస్తాన్ 2–1తో చైనాపై గెలుపొంది సెమీస్ ఆశల్ని నిలబెట్టుకుంది. మరోవైపు మలేసియా 3–1తో జపాన్ను ఓడించి సెమీఫైనల్కు అర్హత సంపాదించింది. -
FIH Hockey Nations Cup: అదరగొట్టిన అమ్మాయిలు.. సెమీ ఫైనల్ దిశగా భారత్
FIH Hockey Nations Cup: నేషన్స్ కప్ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. స్పెయిన్లో సోమవారం జరిగిన పూల్ ‘బి’ రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 2–1 గోల్స్ తేడాతో 2018 ఆసియా క్రీడల చాంపియన్ జపాన్పై గెలిచింది. భారత్ తరఫున సలీమా టెటె (5వ ని.లో), బ్యూటీ డుంగ్డుంగ్ (40వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. జపాన్ జట్టుకు రుయ్ తకషిమా (49వ ని.లో) ఏకైక గోల్ అందించింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగే చివరి లీగ్ మ్యాచ్ను ‘డ్రా’ చేసుకుంటే భారత్ సెమీఫైనల్ చేరుతుంది. చదవండి: Cristiano Ronaldo: వద్దనుకుంటే పుట్టిన బిడ్డ! ఎంతటి మొనగాడివైతేనేం! ఎన్ని రికార్డులు ఉన్నా ఏం లాభం? మరీ ఇలా... పర్లేదులే! -
Sultan of Johor Cup: ఫైనల్లో భారత్
జొహొర్ (మలేసియా): సుల్తాన్ ఆఫ్ జొహొర్ కప్ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం బ్రిటన్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ను భారత్ 5–5తో ‘డ్రా’గా ముగించినా తుది పోరుకు అర్హత సాధించడంలో సఫలమైంది. భారత్ తరఫున పూవన్న (7వ నిమిషం), అమన్దీప్ (50), అరైజీత్ సింగ్ (53), శార్దా నంద్ (56, 58) గోల్స్ సాధించారు. బ్రిటన్ ఆటగాళ్లలో మ్యాక్స్ అండర్నస్ (1వ నిమిషం, 40వ), జామీ గోల్డెన్ (54, 56) రెండేసి గోల్స్ కొట్టగా, హారిసన్ స్టోన్ (42) మరో గోల్ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్ల తర్వాత 7 పాయింట్లు సాధించిన భారత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్ల ద్వారానే 10 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ముందే ఫైనల్కు అర్హత సాధించగా, ఫైనల్ స్థానం కోసం దక్షిణాఫ్రికాతో భారత్ పోటీలో నిలిచింది. అయితే తర్వాత జరిగిన చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా 6–1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేయడంతో భారత్ ముందంజ వేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
Men Hockey World Cup 2023: హాకీ ప్రపంచకప్ డ్రా విడుదల
భువనేశ్వర్: వచ్చే ఏడాది భారత్లో నిర్వహించే పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు సంబంధించిన డ్రా గురువారం విడుదల చేశారు. భువనేశ్వర్, రూర్కెలా వేదికల్లో వచ్చే జనవరి 13 నుంచి 28వరకు ఈ మెగా ఈవెంట్ జరుగనుంది. ప్రపంచ ఐదో ర్యాంకర్, ఆతిథ్య భారత్ ‘పూల్–డి’లో ఇంగ్లండ్, స్పెయిన్, వేల్స్లతో తలపడనుంది. ఈ పూల్లో మెరుగైన ర్యాంకింగ్ జట్టు భారతే! ఇంగ్లండ్ (6), స్పెయిన్ (8), వేల్స్ (16)లు ఆతిథ్య జట్టుకు దిగువనే ఉన్నాయి. ‘పూల్–ఎ’లో ప్రపంచ నంబర్వన్ ఆస్ట్రేలియా, 2016 ఒలింపిక్ చాంపియన్ అర్జెంటీనా, ఫ్రాన్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ప్రపంచ చాంపియన్ బెల్జియం ‘పూల్–బి’లో ఉంది. ఈ పూల్లో జర్మనీ, కొరియా, జపాన్ మిగతా జట్లు. ‘పూల్–సి’లో గత రన్నరప్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్, మలేసియా, చిలీ ఉన్నాయి. -
భారీ విజయంతో భారత్ బోణీ
జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికాలో శనివారం జరిగిన పూల్ ‘డి’ తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 5–1 గోల్స్ తేడాతో వేల్స్ జట్టును ఓడించింది. భారత్ తరఫున లాల్రిన్డికి (32వ, 57వ ని.లో) రెండు గోల్స్ చేయగా... లాల్రెమ్సియామి (4వ ని.లో), ముంతాజ్ ఖాన్ (41వ ని.లో), దీపిక (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో జర్మనీతో భారత్ ఆడుతుంది. -
FIH Pro League: ఫ్రాన్స్ చేతిలో భారత్ ఓటమి
FIH Pro League: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ లీగ్లో భారత పురుషుల జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. దక్షిణాఫ్రికాలోని పాచెఫ్స్ట్రోమ్లో శనివారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలో టీమిండియా 2–5 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ చేతిలో పరాజయం పాలైంది. భారత్ తరఫున జెర్మన్ప్రీత్ సింగ్ (23వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (57వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. నాలుగో లీగ్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడనుంది. సాకేత్ మైనేని జంటకు డబుల్స్ టైటిల్ భారత డేవిస్కప్ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని తన కెరీర్ లో తొమ్మిదో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్ సాధించాడు. శనివారం ముగిసిన బెంగళూరు ఓపెన్ టోర్నీలో సాకేత్–రామ్కుమార్ రామనాథన్ (భారత్) జంట విజేతగా నిలిచింది. హుగో గ్రెనియర్–అలెగ్జాండర్ ముల్లర్ (ఫ్రాన్స్) జోడీతో జరిగిన ఫైనల్లో సాకేత్–రామ్కుమార్ ద్వయం 6–3, 6–2తో గెలిచింది. కేవలం 45 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సాకేత్ జంట తొమ్మిది ఏస్లు సంధించింది. చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్ -
‘గాయం వేధిస్తోంది.. మనసు బాధిస్తోంది’
న్యూఢిల్లీ: భారత మహిళల హాకీ జట్టు సీనియర్ డిఫెండర్, మాజీ కెప్టెన్ సునీతా లక్రా అంతర్జాతీయ కెరీర్ గుడ్ బై చెప్పేశారు. మోకాలి గాయం కారణంగా గత కొంతకాలంగా బాధపడుతున్న లక్రా.. ఇక ఆడలేనంటూ వీడ్కోలు ప్రకటించారు. ఒకవైపు మనసు ఆడాలని తపిస్తున్నా గాయం వేధిస్తూ ఉండటంతో ఇక ఆటకు రిటైర్మెంట్ ప్రకటించక తప్పడం లేదని పేర్కొంది. ఈ ఏడాది జరుగనున్న టోక్యో ఒలింపిక్స్లో ఆడాలనుకున్నానని, అందుకోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్న తరణంలో అర్థాంతరంగా వీడ్కోలు చెప్పడం కలిచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఈ రోజు నాకు చాలా భావోద్వేగమైన రోజు. అంతర్జాతీయ హాకీకి ముగింపు పలుకుతున్నా. టోక్యో ఒలింపిక్స్లో ఆడాలని భావించా. అందుకోసం సన్నద్ధం కూడా అవుతున్నా. నా మోకాలికి మరొకసారి సర్జరీ అవసరం అవుతుంది. దాంతో అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోక తప్పడం లేదు. ఒకవైపు గాయం వేధిస్తోంది. మరొకవైపు ఆటకు గుడ్ బై చెప్పడంతో మనసు బాధిస్తోంది’ అని సునీతా లక్రా తెలిపారు. కాగా, గాయం నయమైన తర్వాత దేశవాళీ టోర్నీలు ఆడతానని పేర్కొన్నారు. దాంతో పాటు తన కెరీర్లో ఎదగడానికి దోహదం చేసిన నాల్కో తరఫున కూడా ఆడతానంటూ ప్రకటించారు. 2008 నుంచి భారత్కు లక్రా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.. 2018లో ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్గా నిలిచిన భారత్కు ఆమె కెప్టెన్గా వ్యవహరించింది. 2018లో ఆసియా గేమ్స్లో లక్రా నేతృత్వంలో భారత మహిళల హాకీ జట్టు సిల్వర్ మెడల్ గెలిచింది. భారత్ తరఫున కెరీర్లో మొత్తం 139 మ్యాచ్లను లక్రా ఆడారు. -
భారత అమ్మాయిలకు రెండో విజయం
కాన్బెర్రా (ఆ్రస్టేలియా): మూడు దేశాల జూనియర్ మహిళల హాకీ టోర్నమెంట్లో భారత జట్టు అజేయ రికార్డు కొనసాగుతోంది. న్యూజిలాండ్తో శనివారం జరిగిన రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్లో భారత్ 4–1 గోల్స్ తేడాతో నెగ్గింది. ఈ టోర్నీ లో భారత్కిది రెండో విజయం కాగా... మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. నేడు ఆ్రస్టేలియాతో భారత్ తలపడుతుంది. కివీస్తో జరిగిన మ్యాచ్లో భారత అమ్మాయిలు ఆద్యంతం ఆధిపత్యం చలాయించారు. ప్రతి క్వార్టర్లో ఒక్కో గోల్ చేశారు. భారత్ తరఫున షర్మిలా దేవి (12వ, 43వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... డుంగ్డుంగ్ బ్యూటీ (27వ ని.లో), లాల్రిన్డికి (48వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. కివీస్ తరఫున షానన్ ఒలివియా (4వ ని.లో) ఏకైక గోల్ చేసింది. -
మళ్లీ ఒడిశాలోనే 2023 ప్రపంచ కప్ హాకీ
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్కు మళ్లీ తామే ఆతిథ్యమిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 2023లో జరిగే పురుషుల ప్రపంచకప్ పోటీలను భువనేశ్వర్, రూర్కేలా నగరాల్లో నిర్వహిస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. గతేడాది కూడా హాకీ మెగా ఈవెంట్కు భువనేశ్వరే ఆతిథ్యమిచ్చింది. ఇటీవల అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) వరుసగా రెండోసారి కూడా భారత్కే నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. 2023లో జనవరి 13 నుంచి 29 వరకు హాకీ పోటీలు జరుగుతాయి. బుధవారం కళింగ స్టేడియంలో జరిగిన మీడియా సమావేశంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ‘మేం 2018 ప్రపంచకప్ హాకీని నిర్వహించాం. అలాగే వచ్చే మెగా ఈవెంట్కు ఆతిథ్యమిస్తాం’ అని ప్రకటించారు. ఈ సమావేశంలో ఎఫ్ఐహెచ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్ బాత్రా, హాకీ ఇండియా (హెచ్ఐ) అధ్యక్షుడు మహ్మద్ ముస్తాక్ అహ్మద్ పాల్గొన్నారు. -
పంజాబ్ హాకీ ‘పోరు’
న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ ఫైనల్లో పంజాబ్ పోలీస్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) జట్ల ఆటగాళ్లు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. మ్యాచ్ మూడో క్వార్టర్లో పంజాబ్ పోలీస్ సర్కిల్లోకి దూసుకొచ్చిన పీఎన్బీ గోల్ అవకాశం సృష్టించుకునే ప్రయత్నంలో ఉండగా ఇది జరిగింది. ఒక్కసారిగా ఇరు జట్ల ఆటగాళ్లు మాటలను దాటి ముష్టిఘాతాలకు దిగారు. ఆ తర్వాత హాకీ స్టిక్లతో ఒకరితో మరొకరు తలపడ్డారు. మ్యాచ్ అధికారులు కలగజేసుకొని ఆపే వరకు ఇది కొనసాగింది. ఆ సమయంలో స్కోరు 3–3తో సమంగా ఉంది. రిఫరీలు ఇరు జట్ల నుంచి ముగ్గురేసి ఆటగాళ్లను రెడ్ కార్డుల ద్వారా బయటకు పంపి 8 మంది సభ్యుల జట్లతోనే మ్యాచ్ను కొనసాగించారు. చివరికి 6–3తో గెలిచిన పీఎన్బీ టైటిల్ సొంతం చేసుకుంది. తాజా ఘటనతో ఈ టోర్నీలో పాల్గొనకుండా నిర్వాహకులు పంజాబ్ పోలీస్పై నాలుగేళ్లు, పీఎన్బీపై రెండేళ్ల నిషేధం విధించారు. -
తొలి అడుగు పడింది
భువనేశ్వర్: సొంతగడ్డపై అశేష అభిమానుల సమక్షంలో భారత మహిళల, పురుషుల హాకీ జట్లు గెలుపు బోణీ కొట్టాయి. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి అంచె మ్యాచ్ల్లో భారత మహిళల జట్టు 5–1తో అమెరికాను ఓడించగా... భారత పురుషుల జట్టు 4–2తో రష్యాపై గెలుపొందింది. నేడు రెండో అంచె మ్యాచ్లు జరుగుతాయి. నేటి మ్యాచ్లను భారత జట్లు కనీసం ‘డ్రా’ చేసుకుంటే వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధిస్తాయి. మరోవైపు తొలి అంచె మ్యాచ్ల్లో ఓడినప్పటికీ... అమెరికా, రష్యా జట్లకు ‘టోక్యో’ దారులు ఇంకా సజీవంగానే ఉన్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో అమెరికా ఐదు గోల్స్ తేడాతో... రష్యా మూడు గోల్స్ తేడాతో భారత్పై గెలిస్తే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ‘టోక్యో’కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఒకవేళ అమెరికా నాలుగు గోల్స్ తేడాతో... రష్యా రెండు గోల్స్ తేడాతో గెలిస్తే మాత్రం గోల్స్ సగటు సమానం అవుతుంది. అలా జరిగిన పక్షంలో ‘షూటౌట్’ను నిర్వహించి దాని ద్వారా విజేతను తేలుస్తారు. ఆరు నిమిషాల్లో మూడు గోల్స్... తొలి క్వార్టర్లో నిదానంగా ఆడిన భారత మహిళల జట్టు రెండో క్వార్టర్ నుంచి వేగం పెంచింది. 28వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను లిలిమా మింజ్ లక్ష్యానికి చేర్చడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత భారత్ మరింత జోరు పెంచింది. మూడో క్వార్టర్లో మన అమ్మాయిలు చెలరేగిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో ఏకంగా మూడు గోల్స్ చేసి 4–0తో ఆధిక్యంలోకి వెళ్లారు. 51వ నిమిషంలో భారత్ ఖాతాలో ఐదో గోల్ చేరింది. మ్యాచ్ మరో ఆరు నిమిషాల్లో ముగుస్తుందనగా అమెరికా ఏకైక గోల్ సాధించింది. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం అమెరికాపై భారత మహిళల జట్టుకిదే అతి పెద్ద విజయం. తమ ర్యాంక్లకు తగ్గ ఆటతీరును ప్రదర్శించిన భారత మహిళల, పురుషుల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్ దిశగా అడుగు ముందుకేశాయి. క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా తొలి మ్యాచ్ల్లో భారత జట్లు గెలుపొందాయి. భారత మహిళల జట్టు అంచనాలకు మించి రాణించగా... భారత పురుషుల జట్టు మాత్రం బోణీ కొట్టడానికి శ్రమించాల్సి వచ్చింది. చెమటోడ్చి.... ప్రపంచ ర్యాంకింగ్స్లో 22వ స్థానంలో ఉన్న రష్యా పురుషుల జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత బృందానికి గట్టిపోటీనే ఎదురైంది. భారత బృందం గోల్స్ వర్షం కురిపిస్తుందని భావించినా అలాంటిదేమీ జరగలేదు. రష్యా డిఫెన్స్ను ఛేదించడంలో భారత ఫార్వర్డ్స్ ఇబ్బంది పడ్డారు. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఐదో స్థానంలో ఉన్న మన్ప్రీత్ సింగ్ బృందం మ్యాచ్ ముగియడానికి 12 నిమిషాలు ఉన్నాయనగా 2–1తో కేవలం ఒక గోల్ ఆధిక్యంలో ఉంది. అయితే ఐదు నిమిషాల వ్యవధిలో సునీల్, మన్దీప్ సింగ్ చెరో గోల్ సాధించి భారత్ను 4–1తో ఆధిక్యంలో నిలిపారు. అయితే చివరి నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను రష్యా లక్ష్యానికి చేర్చి తమ ఖాతాలో రెండో గోల్ను జమ చేసుకుంది. మహిళల విభాగం మహిళల విభాగం 5 ►లిలిమా మింజ్ (28వ ని.లో) ►షర్మిలా దేవి (40వ ని.లో) ►గుర్జీత్ కౌర్ (42వ ని.లో) ►నవనీత్ కౌర్ (46వ ని.లో) ►గుర్జీత్ కౌర్ (51వ ని.లో) అమెరికా 1 ►ఎరిన్ మాట్సన్ (54వ ని.లో) పురుషుల విభాగం భారత్ 4 ►హర్మన్ప్రీత్ సింగ్ (5వ ని.లో) ►మన్దీప్ సింగ్ (24వ ని.లో) ►ఎస్వీ సునీల్ (48వ ని.లో) ►మన్దీప్ సింగ్ (53వ ని.లో) రష్యా 2 ►ఆండ్రీ కురయెవ్ (17వ ని.లో) ►మత్కోవ్స్కీ (60వ ని.లో) -
భారత్కు మూడో విజయం
జొహర్ బారు (మలేసియా): సుల్తాన్ జొహర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత్ ఖాతాలో మూడో విజయం చేరింది. ఆ్రస్టేలియాతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా 5–1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున శిలానంద్ లాక్రా (26వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... దిల్ప్రీత్ సింగ్ (44వ ని.లో), గుర్సాహిబ్జిత్ సింగ్ (48వ ని.లో), మన్దీప్ మోర్ (50వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఆ్రస్టేలియాకు ఆరోన్ నైట్ (57వ ని.లో) ఏకైక గోల్ను అందించాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో భారత్ 9 పాయింట్లతో బ్రిటన్తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో బ్రిటన్తో భారత్ తలపడుతుంది. లీగ్ దశ పూర్తయ్యాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో ఆడతాయి. భారత్–బ్రిటన్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిస్తే రెండు జట్లు ఫైనల్కు చేరుతాయి. -
స్పెయిన్పై భారత్ ఘనవిజయం
అంట్వెర్ప్ (బెల్జియం): డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ అద్భుతంగా రాణించడంతో భారత పురుషుల హాకీ జట్టు 6–1తో స్పెయిన్పై ఘనవిజయం సాధించింది. బెల్జియం పర్యటనలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ టీమిండియా... ప్రపంచ ఎనిమిదో ర్యాంకు జట్టును చిత్తుగా ఓడించింది. హర్మన్ప్రీత్ 28వ, 32వ నిమిషాల్లో గోల్స్ సాధించగా, మన్ప్రీత్ సింగ్ (24వ ని.), నీలకంఠ శర్మ (39వ ని.), మన్దీప్ సింగ్ (56వ ని.), రూపిందర్పాల్ సింగ్ (59వ ని.) తలా ఒక గోల్ చేశారు. ఆట ఆరంభం నుంచే భారత్ ప్రత్యర్థి గోల్పోస్ట్పై దాడులకు పదునుపెట్టింది. రెండో క్వార్టర్లో గోల్స్ చేయడంలో భారత ఆటగాళ్లు సఫలమయ్యారు. ఆ తర్వాత జోరు పెంచడంతో ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. ఆదివారం మూడో మ్యాచ్ జరుగనుంది. గెలిపించిన గుర్జీత్ గోల్ మార్లో (ఇంగ్లండ్): ఇంగ్లండ్పై ఐదు మ్యాచ్ల హాకీ సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. శనివారం తొలి మ్యాచ్లో 2–1తో మన జట్టు విజయం సాధించింది. మ్యాచ్ మరో 48 క్షణాల్లో ముగుస్తుందనగా గుర్జీత్ కౌర్ (60వ ని.) అద్భుత గోల్తో ఫలితాన్ని మార్చింది. 46వ నిమిషంలో ఎమిలీ డెఫ్రాండ్ గోల్తో 1–0తో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి వెళ్లింది. వెంటనే షరి్మలా దేవి గోల్తో స్కోరు 1–1తో సమమైంది. -
భారత జూనియర్ అమ్మాయిల గెలుపు
న్యూఢిల్లీ: భారత జూనియర్ హాకీ అమ్మాయిలు ఐర్లాండ్ పర్యటనను ఘనంగా ముగించారు. మంగళవారం ముగిసిన కాంటర్ ఫ్రిట్జ్గెరాల్డ్ అండర్–21 అంతర్జాతీయ నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన భారత అమ్మాయిలు... ఐర్లాండ్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లోనూ ఘనవిజయం సాధించారు. లాల్రిండికా, ఇషికా చౌదరీ, ముంతాజ్ తలా ఓ గోల్ సాధించడంతో భారత్ 3–1తో ఐర్లాండ్పై గెలుపొందింది. తొలి క్వార్టర్లో ఇరు జట్లు అటాకింగ్ బదులుగా డిఫెన్స్కే ప్రాధాన్యత ఇవ్వడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో జోరు పెంచిన భారత్ అందివచ్చిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకుంది. లాల్రిండికా పెనాల్టీని గోల్గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే క్వార్టర్లో లభించిన మరో పెనాల్టీ కార్నర్ను ఇషికా చౌదరీ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2–0కు పెంచింది. ఈ దశలో పెద్ద ఎత్తున వచ్చిన వర్షం వల్ల ఆటకు ఆటంకం కలిగింది. విరామం తర్వాత పుంజుకున్న ఐర్లాండ్ దూకుడుగా ఆడింది. అయితే నిమిషాల వ్యవధిలో లభించిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను ఐర్లాండ్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. భారత గోల్ కీపర్ ఖుష్బూ వారి ప్రయత్నాలను విఫలం చేసింది. తర్వాత లభించిన మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచిన ఐర్లాండ్ గోల్ ఖాతా తెరిచింది. కానీ వెంటనే ముంతాజ్ చేసిన గోల్తో భారత్ పటిష్ట స్థితిలో నిలిచి విజయాన్ని ఖాయం చేసుకుంది. -
భారత మహిళల జోరు
కౌలాలంపూర్: మలేసియాతో జరుగుతోన్న ఐదు మ్యాచ్ల ద్వైపాక్షిక హాకీ సిరీస్లో భారత మహిళల జట్టు జోరు కనబరుస్తోంది. ఈ సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని సాధించి భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. శనివారం జరిగిన మ్యాచ్లో భారత్ 5–0తో మలేసియాపై ఘనవిజయం సాధించింది. నవ్జ్యోత్ కౌర్ (12వ ని.), వందన కటారియా (20వ ని.), నవ్నీత్ కౌర్, లాల్రెమ్సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) తలా ఓ గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ ప్రారంభించిన భారత్కు మూడో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే దీన్ని గోల్గా మలచలేకపోయింది. తర్వాత మరో రెండు గోల్ అవకాశాలు వచ్చినప్పటికీ భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరో మూడు నిమిషాల్లో తొలి క్వార్టర్ ముగుస్తుందనగా నవ్జ్యోత్ కౌర్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో క్వార్టర్లో స్ట్రయికర్ వందన కటారియా అద్భుత ఫీల్డ్ గోల్తో పాటు, నవ్నీత్కౌర్ మరో గోల్ చేయడంతో భారత్ 3–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ దశలో మలేసియా జట్టు పుంజుకుంది. భారత గోల్ పోస్టుపై దాడులు చేయడంతో పాటు, గోల్ చేయకుండా ప్రత్యర్థిని అడ్డుకుంది. దీంతో మూడో క్వార్టర్లో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. చివరి క్వార్టర్లో లాల్రెమ్సియామి (54వ ని.), నిక్కీ ప్రదాన్ (55వ ని.) వరుస గోల్స్తో చెలరేగడంతో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. -
భారత మహిళల శుభారంభం
కౌలాలంపూర్: మలేసియాతో గురువారం ప్రారంభమైన ఐదు మ్యాచ్ల హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. మ్యాచ్ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 3–0తో ఘనవిజయం సాధించి సిరీస్లో 1–0తో ముందంజ వేసింది. భారత్ తరఫున స్ట్రయికర్ వందన కటారియా (17వ ని., 60వ ని.) రెండు గోల్స్తో చెలరేగగా... లాల్రెమ్సియామి (38వ ని.) మరో గోల్తో ఆకట్టుకుంది. హోరాహోరీగా సాగిన తొలి క్వార్టర్లో ఇరు జట్లూ గోల్స్ చేయనప్పటికీ ఆధిక్యం సాధించేందుకు విఫలయత్నాలు చేశాయి. మ్యాచ్ మూడో నిమిషంలోనే మలేసియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే అనుభవజ్ఞురాలైన భారత గోల్ కీపర్ సవిత ప్రత్యర్థి గోల్ను నిలువరించింది. తర్వాత భారత్ నుంచి లాల్రెమ్సియామి, నవ్నీత్ కౌర్ గోల్ కోసం ప్రయత్నించినప్పటికీ ఫినిషింగ్ లోపంతో సఫలం కాలేకపోయారు. రెండో క్వార్టర్స్ ఆరంభంలోనే వందన కటారియా ఫీల్డ్ గోల్తో అలరించింది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మూడో క్వార్టర్స్లో భారత్కు మూడు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే లాల్రెమ్సియామి మరో ఫీల్డ్ గోల్ సాధించడంతో భారత్ 2–0తో పటిష్ట స్థితిలో నిలిచింది. కొద్ది సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా వందన మరో గోల్తో భారత్ విజయాన్ని పరిపూర్ణం చేసింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ శనివారం జరుగుతుంది. -
చివరి క్షణాల్లో తారుమారు
ఇపో (మలేసియా): ఎంతోకాలంగా భారత్ను వేధిస్తున్న చివరి నిమిషాల్లో తడబాటు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లోనూ కొనసాగింది. జపాన్తో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచి శుభారంభం చేసిన టీమిండియా... దక్షిణ కొరియాతో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్ను ‘డ్రా’తో సరిపెట్టుకుంది. ఆట 28వ నిమిషంలో మన్దీప్ సింగ్ చేసిన గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే మ్యాచ్ ముగియడానికి 22 సెకన్లు ఉందనగా కొరియా జట్టుకు భారత్ గోల్ సమర్పించుకుంది. చివరి నిమిషంలో కొరియాకు పెనాల్టీ కార్నర్ లభించగా... దానిని జాంగ్హున్ జాంగ్ గోల్గా మలిచాడు. దాంతో ఓడిపోయే మ్యాచ్ను కొరియా ‘డ్రా’గా ముగించగలిగింది. -
భారత్ శుభారంభం
ఇపో (మలేసియా): కొత్త సీజన్ను భారత పురుషుల హాకీ జట్టు విజయంతో ప్రారంభించింది. సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ వార్షిక టోర్నమెంట్లో మాజీ చాంపియన్ భారత్ శుభారంభం చేసింది. జకార్తా ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జపాన్తో శనివారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో టీమిండియా 2–0 గోల్స్ తేడాతో గెలుపొందింది. భారత్ తరఫున ఆట 24వ నిమిషంలో వరుణ్ కుమార్... 55వ నిమిషంలో సిమ్రన్జిత్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. జపాన్పై భారత్కిది వరుసగా 13వ విజయం కావడం విశేషం. నేడు జరిగే రెండో లీగ్ మ్యాచ్లో దక్షిణ కొరియాతో భారత్ ఆడుతుంది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా 2013లో చివరిసారి జపాన్ చేతిలో ఓడిన భారత్ ఈ టోర్నీలో చీఫ్ కోచ్, పలువురు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగింది. గతేడాది జకార్తా ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచి సంచలనం సృష్టించిన జపాన్ను ఏ దశలోనూ తేలిగ్గా తీసుకోని భారత్ ఆరంభం నుంచే ఓ ప్రణాళిక ప్రకారం ఆడింది. తొలి క్వార్టర్లో ఖాతా తెరవని భారత్కు రెండో క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్ను వరుణ్ కుమార్ డ్రాగ్ ఫ్లిక్తో బంతిని లక్ష్యానికి చేర్చాడు. అనంతరం మన్ప్రీత్ సింగ్, కొతాజిత్ సింగ్ మిడ్ ఫీల్డ్లో మంచి సమన్వయంతో ముందుకు దూసుకెళుతూ ఫార్వర్డ్ ఆటగాళ్లకు పలుమార్లు గోల్ చేసే అవకాశాలు సృష్టించారు. అయితే ఫినిషింగ్ లోపంతో భారత్ ఈ అవకాశాలను వృథా చేసుకుంది. 33వ నిమిషంలో జపాన్కు తొలి పెనాల్టీ కార్నర్ లభించగా... భారత గోల్కీపర్ శ్రీజేశ్ దానిని సమర్థంగా అడ్డుకున్నాడు. ఇక ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా జపాన్ తమ గోల్కీపర్ను తప్పించి అదనపు ఆటగాడితో ఆడింది. ఈ అవకాశాన్ని భారత్ సద్వినియోగం చేసుకుంది. మన్దీప్ అందించిన పాస్ను ‘డి’ సర్కిల్లో సిమ్రన్జిత్ సింగ్ డైవ్ చేస్తూ బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. -
చివర్లో ఉత్కంఠ... షూటౌట్లో మరింత
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ ఆశలు సెమీస్లో షూటౌటయ్యాయి. ఆఖరి క్షణాల్లో ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్లో నెదర్లాండ్స్ ‘సడెన్ డెత్’లో 4–3తో విజేతగా నిలిచింది. గత ప్రపంచకప్లో తమ సొంతగడ్డపై ఫైనల్లో (1–6తో) ఎదురైన పరాభవానికి నెదర్లాండ్స్ బదులు తీర్చుకుంది. అక్కడ టైటిల్ను దూరం చేసిన కంగారూ జట్టును ఇక్కడ సెమీస్లోనే కసిదీరా ఓడించి ఇంటిదారి పట్టించింది. 2–1తో ఆధిక్యంలో ఉన్న ‘డచ్’ జట్టు విజయానికి అర నిమిషం దూరంలోనే ఉంది. కానీ ఈ అర నిమిషమే మ్యాచ్ గతిని మార్చేసింది. 26 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా ఆస్ట్రేలియా గోల్ చేసింది. అంతే 2–2తో స్కోరు సమమైంది. నెదర్లాండ్స్ జట్టులో గ్లెన్ షుర్మన్ (9వ ని.), సీవ్ వాన్ అస్ (20వ ని.) చెరో గోల్ చేయగా, ఆసీస్ తరఫున టిమ్ హోవర్డ్ (45వ ని.), ఎడ్డి ఒకెండన్ (60వ ని.) ఒక్కో గోల్ సాధించారు. దీంతో ఫలితాన్ని తేల్చేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. నిర్ణీత 5 షాట్ల తర్వాత ఇక్కడ కూడా ఇరు జట్ల స్కోరు 3–3తో సమమైంది. ఆస్ట్రేలియా తరఫున డానియెల్ బీల్, టామ్ క్రెయిగ్, వెటన్... ‘డచ్’ జట్టులో జిరోన్ హెర్ట్బెర్గెర్, వాన్ అస్, తిజ్స్ వాన్ డామ్ స్కోరు చేశారు. ఇరు జట్లలో ఇద్దరు చొప్పున విఫలమయ్యారు. ఇక సడెన్ డెత్లో ముందుగా నెదర్లాండ్స్ ఆటగాడు హెర్ట్బెర్గెర్ గోల్ కొట్టగా... డానియెల్ బీల్ ఆస్ట్రేలియాను నిరాశపరిచాడు. ‘డచ్’ గోల్ కీపర్ పిర్మిన్ బ్లాక్ చాకచక్యంగా బంతిని వేగంగా లయ తప్పించగా బిత్తరపోవడం బీల్ వంతయింది. నెదర్లాండ్స్ మాత్రం సంబరాల్లో మునిగిపోయింది. అంతకుముందు జరిగిన తొలి సెమీస్లో బెల్జియం 6–0తో ఇంగ్లండ్ను చిత్తు చేసి మొదటిసారి ప్రపంచకప్లో ఫైనల్కు చేరింది. -
క్వార్టర్స్ బెర్త్ కొట్టేస్తారా?
భువనేశ్వర్: ప్రపంచకప్ హాకీ టోర్నీలో ఆకట్టుకునే ప్రదర్శనతో అడుగులు వేస్తున్న భారత్ నేడు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను తేల్చాలనుకుంటుంది. పూల్ ‘సి’లో శనివారం భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్లో కెనడాతో తలపడనుంది. ఇందులో గెలిస్తే పూల్ టాపర్గా టీమిండియా నేరుగా క్వార్టర్స్కు అర్హత సంపాదిస్తుంది. ఇదే పూల్లో రియో ఒలింపిక్స్ రన్నరప్ బెల్జియంతోపాటు 4 పాయింట్లతో ఉన్నప్పటికీ, గోల్స్ పరంగా భారతే అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం క్వార్టర్స్ కోసం క్రాస్ ఓవర్ నాకౌట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఎలాంటి అలసత్వానికి తావివ్వకుండా గెలవాలనే పట్టుదలతో ఉంది. ముఖాముఖి పోరులో కెనడాతో భారత్కు మంచి రికార్డే ఉంది. 2013 నుంచి ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడగా... మూడు భారత్ గెలిస్తే, ఒక్కటి మాత్రమే కెనడా నెగ్గింది. మరో మ్యాచ్ ‘డ్రా’ అయింది. కలిసొచ్చే ఈ రికార్డుతో స్వదేశంలో జరుగుతున్న మెగా ఈవెంట్లో సత్తా చాటాలని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఫార్వర్డ్లో మన్దీప్ సింగ్, సిమ్రన్జిత్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్లు బాగా ఆడుతున్నారు. మిడ్ ఫీల్డ్లో కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ ఫామ్లో ఉన్నప్పటికీ డిఫెన్స్ ఒత్తిడే జట్టును కలవరపెడుతోంది. మ్యాచ్ ముగిసేదశలో అనవసర ఒత్తిడికిలోనై గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకుంటున్న భారత్కు డిఫెన్సే సవాలుగా మారింది. బీరేంద్ర లాక్రా, సురేందర్, హర్మన్ప్రీత్ సింగ్లతో కూడిన రక్షణపంక్తి సమన్వయంతో బాధ్యత తీసుకుంటే సమస్యను అధిగమించవచ్చు. మరోవైపు కెనడా జట్టు ఇటీవలి కాలంలో బాగా మెరుగైంది. డిఫెన్స్ దుర్బేధ్యంగా ఉంది. రియో ఒలింపిక్స్లో భారత్తో 2–2తో ‘డ్రా’ చేసుకున్న కెనడా గతేడాది ‘హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్’ టోర్నమెంట్లో 3–2తో భారత్ను ఓడించింది. తాజా ప్రపంచకప్ టోర్నీ లోనూ ఆకట్టుకుంది. తొలి మ్యాచ్లో మేటి జట్టయిన బెల్జియంను ఒకానొక దశలో చక్కగా నిలువరించింది. చివరకు 1–2తో ఓడినప్పటికీ ప్రదర్శనతో ఆకట్టుకుంది. దక్షిణాఫ్రికాతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ను 1–1తో డ్రా చేసుకుంది. దీంతో భారత్ ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా ఆద్యంతం పోరాడితేనే క్వార్టర్స్ బెర్తు సులువవుతుంది. లేదంటే క్వార్టర్స్ కోసం మరో మ్యాచ్ దాకా వేచిచూడాల్సిన పరిస్థితి వస్తుంది. శనివారం ఇదే పూల్లో దక్షిణాఫ్రికాతో బెల్జియం తలపడనుంది. రాత్రి గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
భారత్ శుభారంభం
డాంఘయీ సిటీ (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. నవ్నీత్ కౌర్ ‘హ్యాట్రిక్’ గోల్స్తో చెలరేగడంతో తొలి మ్యాచ్లో జపాన్పై గెలుపొందింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో సునీత లాక్రా బృందం 4–1తో ప్రపంచ 12వ ర్యాంకర్ జపాన్ను మట్టికరిపించింది. నవ్నీత్ కౌర్ (7వ, 25వ, 55వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించింది. అనూప బర్లా (53వ ని.లో) మరో గోల్ నమోదు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు జపాన్ డిఫెన్స్ను ఛేదించడంలో సఫలీకృతమైంది. జపాన్ తరఫున అకి యమదా (58వ ని.లో) ఏకైక గోల్ చేసింది. ‘తొలి మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. ఏ టోర్నీలోనైనా శుభారంభం ముఖ్యం. ఇదే జోరు కొనసాగిస్తాం. టైటిల్ గెలవడమే మా లక్ష్యం’ అని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్నీత్ పేర్కొంది. ఈనెల 16న జరిగే తదుపరి మ్యాచ్లో చైనాతో భారత్ ఆడతుంది. -
పోరాడి ఓడిన భారత్
ఇఫో(మలేసియా): స్టార్ ఆటగాళ్లు లేకున్నా... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ తొలి లీగ్ మ్యాచ్లో రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనాకు భారత్ గట్టిపోటీ ఇచ్చింది. తుదికంటా పోరాడి ఓడిపోయినా ఆ ఓటమిలో గౌరవం కనిపించింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో సర్దార్ సింగ్ నాయకత్వంలోని టీమిండియా 2–3 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో పరాజయం పాలైంది. స్టార్ డ్రాగ్ ఫ్లికర్ గొంజాలో పిలాట్ (13వ, 24వ, 33వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్తో అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. భారత్ తరఫున అమిత్ రొహిదాస్ (26వ, 31వ నిమిషాల్లో) రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్గా మలిచాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో నమోదైన ఐదు గోల్స్ కూడా పెనాల్టీ కార్నర్ల రూపంలోనే రావడం విశేషం. ఆదివారం జరిగే తదుపరి మ్యాచ్లో ఇంగ్లండ్తో భారత్ తలపడనుంది. తొలి పది నిమిషాల్లో బంతిపై ఆధిపత్యం చలాయించిన భారత్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఆ సమయంలో అర్జెంటీనాకు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిలో తొలి షాట్ను భారత డిఫెండర్లు అడ్డుకోగా... పిలాట్ కొట్టిన రెండో షాట్కు తిరుగులేకుండా పోయింది. దీంతో మ్యాచ్ ప్రారంభమైన 13వ నిమిషంలో అర్జెంటీనా తొలి గోల్ నమోదు చేసి 1–0తో ముందంజ వేసింది. 24వ నిమిషంలో పిలాట్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలచడంతో 2–0తో అధిక్యాన్ని పెంచుకుంది. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలో భారత్కు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. వాటిలో తొలి రెండు వృథా కాగా... మూడో ప్రయత్నంలో అమిత్ రొహిదాస్ గోల్గా మలచడంతో భారత్ 1–2తో ఆధిక్యాన్ని తగ్గించింది. 31వ నిమిషంలో అమిత్ మరో గోల్ చేయడంతో 2–2తో స్కోరు సమమైంది. అనంతరం పిలాట్ మరో గోల్ చేయడంతో అర్జెంటీనా 3–2తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సమయంలో మ్యాచ్కు వర్షం అడ్డుపడటంతో దాదాపు గంట పాటు ఆట నిలిచిపోయింది. తిరిగి ఆట ఆరంభమయ్యాక భారత ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినా స్కోరును సమం చేయలేకపోయారు. -
భారత్(vs)అర్జెంటీనా
ఇఫో(మలేసియా): సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో ఈసారీ పతకం నెగ్గాలనే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతోంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్లో ప్రపంచ రెండో ర్యాంకర్ అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది. గతంలో సర్దార్ సింగ్ నాయకత్వంలో ఈ టోర్నీలో ఆడిన మూడుసార్లూ భారత్ పతకంతో తిరిగి వచ్చింది. 2008లో సర్దార్ కెప్టెన్సీలో టీమిండియా రజతం... 2015లో కాంస్యం, 2016లో రజతం గెలు పొందింది. భారత్తోపా టు అర్జెంటీనా, మలేసియా, ఆస్ట్రేలియా, ఇంగ్లం డ్, ఐర్లాండ్ ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. -
భారత్ శుభారంభం
హామిల్టన్: నాలుగు దేశాల ఇన్విటేషనల్ హాకీ టోర్నమెంట్ రెండో అంచెలో భారత్ శుభారంభం చేసింది. తొలి అంచె ఫైనల్లో బెల్జియం చేతిలో ఓటమి పాలైన భారత్... బుధవారం రెండో అంచె తొలి మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ పై 3–2తో విజయం సాధించింది. మన జట్టు తరఫున లలిత్ ఉపాధ్యాయ్ (7వ ని.లో), హర్జీత్ సింగ్ (32వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (36వ ని.లో) తలా ఓ గోల్ నమోదు చేశారు. -
ఫైనల్లో భారత్
తౌరంగ (న్యూజిలాండ్): నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్కు చేరింది. ఆతిథ్య న్యూజిలాండ్తో శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 3–1తో భారత్ జయభేరి మోగించింది. ఆరంభం నుంచి దూకుడుకు తోడు అద్భుతమైన డిఫెన్స్తో చెలరేగిన మన ఆటగాళ్లు... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ప్రారంభమైన రెండో నిమిషంలోనే భారత్ తొలి గోల్ నమోదు చేయడంతో ప్రత్యర్థి జట్టు వెనుకబడిపోయింది. ఆ తర్వాత కూడా దాడులు కొనసాగించిన భారత్ చివరకు 3–1తో గెలుపొందింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (2వ ని.లో), దిల్ప్రీత్ సింగ్ (12వ ని.లో), మన్దీప్ సింగ్ (47వ ని.లో) తలో గోల్ చేశారు. ఆదివారం జరిగే తుది పోరులో మన జట్టు బెల్జియంతో తలపడనుంది. లీగ్ దశలో భారత్ బెల్జియం చేతిలో 0–2తో ఓటమి పాలైన విషయం తెలిసిందే. -
భారత్ శుభారంభం
తౌరంగ (న్యూజిలాండ్): నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు శుభారంభం చేసింది. జపాన్తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్లో టీమిండియా 6–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున దిల్ప్రీత్ (35వ, 45వ ని.లో)... వివేక్ (12వ, 28వ ని.లో) రెండేసి గోల్స్ చేయగా... రూపిందర్ పాల్ సింగ్ (7వ ని.లో), హర్మన్ప్రీత్ సింగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. -
శ్రీజేశ్ పునరాగమనం
న్యూఢిల్లీ: భారత స్టార్ గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఎనిమిది నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్లో జరిగే నాలుగు దేశాల హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును హాకీ ఇండియా (హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. 20 మంది సభ్యులు గల ఈ జట్టుకు మిడ్ఫీల్డర్ మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. మోకాలి గాయంతో శ్రీజేశ్ గతేడాది కీలకమైన టోర్నీలకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో మళ్లీ జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. ఈ నెల 17 నుంచి జరిగే టోర్నీలో భారత్, కివీస్లతో పాటు బెల్జియం, జపాన్ జట్లు తలపడనున్నాయి. -
భారత్కు తొలి విజయం
డసెల్డార్ఫ్ (జర్మనీ): మూడు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత్కు తొలి విజయం దక్కింది. బెల్జియంతో సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో టీమిండియా 3–2తో గెలిచింది. భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ (34వ, 38వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... రమణ్దీప్ సింగ్ (49వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. -
తెలంగాణ హాకీ టోర్నమెంట్ ప్రారంభం
వరంగల్: వరంగల్ అర్బన్జిల్లా ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కాలేజీలో తెలంగాణ మొదటి రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ ప్రారంభమైంది. వరంగల్ మేయర్ నన్నపనేని నరేందర్, ఎంపీ పసునూరి దయాకర్లు టోర్నమెంట్ను ప్రారంభించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల నుంచి అనేకమంది క్రీడాకారులు ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. -
భారత అమ్మాయిల విజయం
బ్యాంకాంక్: ఆసియా కప్ అండర్ – 18 హాకీ టోర్నమెంట్లో భారత అమ్మాయిల హవా కొనసాగుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్లో 3–1తో మలేసియా జట్టుపై గెలిచి పూల్ ‘ఎ’లో అగ్రస్థానంలో నిలిచింది. భారత్ తరఫున మన్ప్రీత్ కౌర్, పూనమ్ (39వ ని.), లాల్రెమ్సియామి (46వ ని.) గోల్స్ చేయగా... మలేసియాకు నురామిరా షకీరా (40వ ని.) గోల్ను అందించింది. -
క్రీడలు
హాకీ అజ్లాన్ షా కప్: మలేసియాలోని ఇపోలో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఏప్రిల్ 16న జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 4–0తో భారత్పై విజయం సాధించింది. ఈ టైటిల్ను ఆస్ట్రేలియా గెలవడం ఇది తొమ్మిదోసారి. చాంపియన్స్ ట్రోఫీ: జూన్ 18న లండన్లో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 3–1 గోల్స్ తేడాతో భారత్పై గెలుపొంది ట్రోఫీని సాధించింది. ఇది ఆస్ట్రేలియాకు 14వ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్. భారత్ తొలిసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరుకుంది. లండన్లోనే జరిగిన మహిళల చాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. జూన్ 26న అర్జెంటీనా మహిళల జట్టు ఫైనల్లో నెదర్లాండ్స్ను ఓడించింది. ఇది అర్జెంటీనాకు 7వ చాంపియన్స్ ట్రోఫీ టైటిల్. అండర్–18 ఆసియాకప్: ఢాకాలో జరిగిన అండర్–18 ఆసియాకప్ హాకీ టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 30న జరిగిన ఫైనల్లో భారత్ 5–4 గోల్స్ తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్పై నెగ్గింది. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ: మలేసియాలోని క్వాంటన్లో జరిగిన పురుషుల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. అక్టోబర్ 30న జరిగిన ఫైనల్లో భారత్ 3–2 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. మహిళల ఆసియా హాకీ చాంపియన్స్ ట్రోఫీ సింగపూర్లో జరిగింది. నవంబర్ 5న జరిగిన ఫైనల్లో భారత్ 2–1 తేడాతో చైనాపై గెలుపొందింది. దక్షిణాసియా క్రీడలు 12వ దక్షిణాసియా క్రీడలు ఫిబ్రవరి 5 నుంచి 16 వరకు గువహటి, షిల్లాంగ్ నగరాల్లో జరిగాయి. వీటిలో ఎనిమిది దక్షిణాసియా దేశాలు పాల్గొన్నాయి. ఈ క్రీడల మస్కట్ ‘టిఖోర్’ (బేబీ రైనో). 188 బంగారు పతకాలు, 90 రజత పతకాలు, 30 కాంస్య పతకాలు సాధించి భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. లారెస్ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మక లారెస్ అవార్డులను 2016 ఏప్రిల్లో ప్రకటించారు. స్పోర్ట్స్మన్ ఆఫ్ ది ఇయర్æ– నొవాక్ జొకోవిచ్ (టెన్నిస్) స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ – సెరెనా విలియమ్స్ (టెన్నిస్) టీమ్ ఆఫ్ ది ఇయర్ – ఆల్బ్లాక్స్ (న్యూజిలాండ్ రగ్బీ జట్టు) బ్రేక్ త్రూ ఆఫ్ ది ఇయర్ – జోర్డాన్ స్పీత్ (గోల్ఫ్) స్పోర్ట్స్ పర్సన్ విత్ ఎ డిజేబిలిటీ ఆఫ్ ది ఇయర్ – డేనియల్ డయాస్ (స్విమ్మింగ్) యురేసియన్ బ్లిట్జ్ చెస్ కజకిస్తాన్లోని ఆల్మాతిలో జూన్లో యురేసియన్ బ్లిట్జ్ చెస్ టోర్నమెంట్ జరిగింది. ఇందులో భారత క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక విజేతగా నిలిచింది. ప్రొ కబడ్డీ లీగ్–4 ప్రొ కబడ్డీ లీగ్ నాలుగో సీజన్ టైటిల్ను పట్నా పైరేట్స్ జట్టు గెలుచుకుంది. జూలై 31న హైదరాబాద్లో జరిగిన ఫైనల్లో పట్నా పైరేట్స్.. జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. మహిళల టైటిల్ను స్టోర్మ్ క్వీన్స్ జట్టు గెలుచుకుంది. ప్రపంచకప్ కబడ్డీ అక్టోబర్ 22న అహ్మదాబాద్లో జరిగిన ప్రపంచకప్ కబడ్డీ ఫైనల్లో భారత్.. ఇరాన్ను ఓడించి టైటిల్ సాధించింది. ఫార్ములా వన్ 2016 ఫార్ములా వన్ రేసింగ్ ప్రపంచ చాంపియన్షిప్ను జర్మనీకి చెందిన నికో రోస్బర్గ్ (మెర్సిడెస్ జట్టు) గెలుచుకున్నాడు. ఆ తర్వాత రోస్బర్గ్ డిసెంబర్ 2న ఫార్ములా వన్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. రియో ఒలింపిక్స్ బ్రెజిల్లోని రియో డి జెనీరో నగరంలో ఆగస్టు 5 నుంచి 21 వరకు 31వ ఒలింపిక్స్ను నిర్వహించారు. ఈ వేసవి ఒలింపిక్స్లో 206 దేశాల జట్లతోపాటు ఒక శరణార్థుల జట్టు కూడా పాల్గొంది. 28 క్రీడల్లో 306 విభాగాల్లో పోటీలు నిర్వహించారు. తొలి స్వర్ణ పతకాన్ని అమెరికా క్రీడాకారిణి వర్జీనియా త్రాషర్ షూటింగ్తో సాధించింది. అమెరికా (46 స్వర్ణ పతకాలు), గ్రేట్ బ్రిటన్ (27), చైనా (26)లు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్తోపాటు మంగోలియా ఒక రజతం, ఒక కాంస్య పతకం సాధించి 67వ స్థానంలో సంయుక్తంగా నిలిచాయి. ప్రారంభోత్సవ వేడుకల్లో అభినవ్ బింద్రా, ముగింపు ఉత్సవాల్లో సాక్షి మాలిక్ పతాక ధారులుగా వ్యవహరించారు. అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్, సల్మాన్ ఖాన్, ఎ.ఆర్. రెహ్మాన్ రియో ఒలింపిక్స్కు ప్రచారకర్తలు. హరియాణా క్రీడాకారిణి సాక్షి మాలిక్ ఆగస్టు 17న మహిళల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ పోటీల్లో 58 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించింది. హైదరాబాద్కు చెందిన పి.వి. సింధు ఆగస్టు 19న మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో రజత పతకం సాధించింది. పారాలింపిక్స్ 15వ పారాలింపిక్స్ను రియో డి జెనీరోలో సెప్టెంబర్ 7 నుంచి 18 వరకు నిర్వహించారు. చైనా 107 బంగారు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలవగా, గ్రేట్ బ్రిటన్ (64) రెండో స్థానంలో, ఉక్రెయిన్ (41) మూడో స్థానంలో నిలిచాయి. భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించి 43వ స్థానంలో నిలిచింది. పురుషుల హైజంప్లో మరియప్పన్ తంగవేలు, పురుషుల జావెలిన్ త్రోలో దేవేంద్ర జజారియా... స్వర్ణ పతకాలు సాధించారు. మహిళల షాట్పుట్లో దీపా మాలిక్ రజత పతకం, పురుషుల హైజంప్లో వరుణ్ సింగ్ భాటి కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఫుట్బాల్ శాఫ్ కప్: జనవరి 3న తిరువనంతపురంలో జరిగిన ఫైనల్లో భారత్ 2–1 గోల్స్ తేడాతో అఫ్గానిస్తాన్ను ఓడించి దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) కప్ను కైవసం చేసుకుంది. భారత్ 7వసారి ఈ కప్ను గెలుచుకుంది. సంతోష్ ట్రోఫీ: నాగ్పూర్లో మార్చి 13న జరిగిన ఫైనల్లో సర్వీసెస్ జట్టు.. మహారాష్ట్రను 2–1తో ఓడించి సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ టైటిల్ను సాధించింది. ఇది సర్వీసెస్కు ఐదో సంతోష్ ట్రోఫీ. ఫిఫా నూతన అధ్యక్షుడు: ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) నూతన అధ్యక్షుడిగా గియానీ ఇన్ఫాంటినో (స్విట్జర్లాండ్) ఎన్నికయ్యారు. అవినీతి ఆరోపణల కారణంగా అధ్యక్ష పదవిని కోల్పోయిన సెప్బ్లాటర్ స్థానంలో ఆయన ఎంపికయ్యారు. ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్లో ఉంది. ఫెడరేషన్ కప్: గువహటిలో మే 21న జరిగిన ఫైనల్లో మోహన్ బగాన్ జట్టు.. ఐజాల్ ఎఫ్సీ జట్టును ఓడించి ఫెడరేషన్ కప్ను గెలుచుకుంది. మోహన్ బగాన్ జట్టు ఫెడరేషన్ కప్ గెలవడం ఇది 14వసారి. కోపా అమెరికా: కోపా అమెరికా సెంటెనరీ టోర్నమెంట్ 2016, జూన్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో జరిగింది. ఈ టోర్నీ తొలిసారి దక్షిణ అమెరికా ఖండం బయట జరిగింది. జూన్ 26న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చిలీ.. పెనాల్టీ çషూటౌట్లో 4–2తో అర్జెంటీనాపై గెలుపొంది టైటిల్ను వరుసగా రెండోసారి సాధించింది. యూరో–2016: ఫ్రాన్స్లో జరిగిన యూరో ఫుట్బాల్ టోర్నమెంట్లో తొలిసారి పోర్చుగల్ విజేతగా నిలిచింది. జూలై 10న జరిగిన ఫైనల్లో పోర్చుగల్.. ఆతి«థ్య జట్టు ఫ్రాన్స్ను 1–0 తేడాతో ఓడించి తొలిసారి ఓ అంతర్జాతీయ ట్రోఫీని గెలుచుకుంది. డ్యూరాండ్ కప్: ఆసియాలో అతి పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్ డ్యూరాండ్ కప్ను ఆర్మీ గ్రీన్ జట్టు గెలుచుకుంది. సెప్టెంబర్ 11న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో ఆర్మీగ్రీన్.. నెరోకా ఫుట్బాల్ క్లబ్ను ఓడించింది. -
హాకీ టోర్నీలో ఫైనల్కు ‘అనంత’జట్టు
ధర్మవరంటౌన్ : విశాఖపట్నంలోని ఎలమంచిలిలో జరుగుతున్న ఏపీ 7వ జూనియర్ బాలుర హాకీ ఇంటర్ డిస్ట్రిక్ టోర్నీలో అనంత జట్టు ఫైనల్కు చేరుకుంది. ఆదివారం సెమీఫైనల్లో జరిగిన పోరులో అనంత జట్టు గుంటూరు జట్టుతో తలపడింది. ఈ పోటీల్లో అనంతజట్టు 3–1తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. అనంత జట్టులో క్రీడాకారులు భానుప్రకాష్రెడ్డి–1, శివ–1, మహబూబ్బాష–1 గోల్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మంగâýæవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో అనంతజట్టు, వైజాగ్ జట్టుతో తలపడనుంది. ప్రతిభ కనబరిచిన అనంత జట్టు క్రీడాకారులను జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు మాంచూఫెర్రర్, ధర్మాంబ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లెం వేణుగోపాల్, బీవీఆర్ శ్రీనివాసులు, పరిశీలకుడు వడ్డే బాలాజీ అభినందించారు. -
కాంస్యం నెగ్గిన భారత హాకీ జట్టు
మెల్బోర్న్: వర్గీకరణ మ్యాచ్లో ఆద్యంతం ఆధిపత్యం చలారుుంచిన భారత పురుషుల జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో కాంస్య పతకాన్ని సాధించింది. మలేసియా జట్టుతో మూడు, నాలుగు స్థానాల కోసం ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ 4-1 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున ఆకాశ్దీప్ సింగ్ (2వ ని.లో), కెప్టెన్ రఘునాథ్ (45వ ని.లో), తల్విందర్ సింగ్ (52వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... మలేసియా జట్టుకు జోయెల్ వాన్ హుజెల్ (45వ ని.లో) ఏకై క గోల్ అందించాడు. మరోవైపు ఆస్ట్రేలియా మహిళల హాకీ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-2తో కోల్పోరుుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్లో టీమిండియా 1-3తో ఓడిపోరుుంది. భారత్ తరఫున మోనిక (30వ ని.లో) ఏకై క గోల్ చేసింది. -
పోరాడి ఓడిన భారత్
నాలుగు దేశాల హాకీ టోర్నీ మెల్బోర్న్: న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఓడిన భారత జట్టు నాలుగు దేశాల హాకీ టోర్నమెంట్లో టైటిల్ రేసు నుంచి వైదొలిగింది. శనివారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2-3 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. ఈ పరాజయంతో భారత్ ఆదివారం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగే వర్గీకరణ మ్యాచ్లో మలేసియాతో ఆడుతుంది. న్యూజిలాండ్తో జరిగిన పోరులో భారత్ తరఫున రూపిందర్ పాల్ సింగ్ (18వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... న్యూజిలాండ్ జట్టుకు నిక్ రాస్ (47వ ని.లో), జాకబ్ స్మిత్ (48వ ని.లో), ఇంగ్లిస్ హుగో (57వ ని.లో) ఒక్కో గోల్ అందించారు. ఆదివారం జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో ఆస్ట్రేలియా తలపడుతుంది. -
రఘునాథ్కు జట్టు పగ్గాలు
నాలుగు దేశాల హాకీ టోర్నీకి భారత జట్టు ప్రకటన బెంగళూరు: రెగ్యులర్ కెప్టెన్, గోల్కీపర్ శ్రీజేష్ గాయపడటంతో... నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ వీఆర్ రఘునాథ్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. ఈనెల 23న ఆస్ట్రేలియాలో మొదలయ్యే ఈ టోర్నీ కోసం 18 మంది సభ్యులుగల భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. శ్రీజేష్తోపాటు కీలక ఆటగాళ్లు ఎస్వీ సునీల్, రమణ్దీప్ సింగ్లు కూడా ఈ టోర్నీకి దూరమయ్యారు. డిఫెండర్ రూపిందర్ పాల్ సింగ్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఉంటాడు. శ్రీజేష్ స్థానంలో ఆకాశ్ చిక్టె రెగ్యులర్ గోల్కీపర్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన అభినవ్ కుమార్ పాండే రెండో గోల్కీపర్గా ఉంటాడు. ఈ టోర్నీలో ఆస్ట్రేలియాతోపాటు మలేసియా, న్యూజిలాండ్ జట్లు కూడా పాల్గొంటారుు. భారత హాకీ జట్టు: వీఆర్ రఘునాథ్ (కెప్టెన్), రూపిందర్పాల్ సింగ్ (వైస్ కెప్టెన్), ఆకాశ్ చిక్టె, అభినవ్ కుమార్ పాం డే, బీరేంద్ర లాక్రా, కొతాజిత్ సింగ్, సురేందర్ కుమార్, చింగ్లెన్సనా సింగ్, మన్ప్రీత్ సింగ్, సర్దార్ సింగ్, ఎస్కె ఉతప్ప, తల్విందర్ సింగ్, నికిన్ తిమ్మ య్య, అఫాన్ యూసుఫ్, మొహమ్మద్ అమీర్ ఖాన్, సత్బీర్ సింగ్, ఆకాశ్దీప్ సింగ్, ప్రదీప్ మోర్ -
భారత్కు రెండో విజయం
సింగపూర్: ఆసియా మహిళల చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మలేసియా జట్టుతో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ 2-0తో గెలిచింది. ఈ విజయంతో ఐదు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ ఏడు పారుుంట్లతో అగ్రస్థానంలో ఉంది. భారత్ తరఫున పూనమ్ రాణి (7వ నిమిషంలో), దీపిక (45వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. భారత్ తమ చివరిదైన నాలుగో లీగ్ మ్యాచ్లో ఈనెల 4న చైనాతో ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ కోసం తలపడతారుు. -
భారత్ సెమీస్ ప్రత్యర్థి కొరియా
కౌంటన్ (మలేసియా): ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నీ సెమీఫైనల్లో భారత్ జట్టు శనివారం కొరియాతో తలపడుతుంది. లీగ్ మ్యాచ్లు ముగిసిన తర్వాత భారత్ 13 పారుుంట్లతో అగ్రస్థానంలో నిలవగా... మలేసియా, పాకిస్తాన్, కొరియా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. గురువారం మలేసియా, కొరియా జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకవేళ ఈ మ్యాచ్లో కొరియా గెలిచి ఉంటే... సెమీస్లో భారత్కు పాక్ ప్రత్యర్థిగా ఎదురయ్యేది. మ్యాచ్ డ్రాగా ముగిసినందున కొరియా పారుుంట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. భారత్, కొరియాల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మరో సెమీస్లో మలేసియా, పాకిస్తాన్ తలపడతారుు. -
భారత జూనియర్ జట్టు ఓటమి
వాలన్సియా: నాలుగు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ జట్టు 2-4తో బెల్జియం చేతిలో ఓడిపోరుుంది. బెల్జియం తరఫున వెగ్నెజ్, బోక్రిక్, కినా, స్టోక్బ్రోక్స్ గోల్స్ సాధించగా... భారత్ తరఫున మర్మన్ప్రీత్ సింగ్, అజయ్ యాదవ్ గోల్స్ చేశారు. టోర్నీ తొలి మ్యాచ్లో భారత్ 3-1తో జర్మనీపై గెలిచింది. తర్వాతి మ్యాచ్లో భారత్ జట్టు స్పెరుున్తో ఆడుతుంది. -
జూనియర్ మహిళల జట్టుకు తొలి విజయం
వాలెన్సియా (స్పెరుున్): ఐదు దేశాల ఇన్విటేషనల్ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత జూనియర్ మహిళల జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆతిథ్య స్పెరుున్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 3-2తో గెలిచింది. భారత్ తరఫున జ్యోతి (28వ ని.లో), రితూ (42వ ని.లో), సంగీత కుమారి (62వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. గురువారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో జర్మనీతో భారత్ ఆడుతుంది. -
భళా.. భారత్
క్వాంటన్ (మలేసియా): ‘పాకిస్తాన్ చేతిలో ఓడి ఎట్టి పరిస్థితుల్లోనూ భారత సైనికులను నిరాశపరచనివ్వం. ముఖ్యంగా సరిహద్దు దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కోసమైనా గెలిచి తీరుతాం’ గత నెలలో భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ చేసిన ప్రతిజ్ఞ ఇది. అన్నమాట నిలబెట్టుకుంటూ మన హాకీ వీరులు ఆసియా చాంపియన్స ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ను 3-2తో చిత్తు చేశారు. తద్వారా సైనికుల్నే కాకుండా యావద్భారతాన్ని ఆనందంలో ముంచెత్తారు. తమ మూడో రౌండ్ రాబిన్ లీగ్లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ తరఫున ప్రదీప్ మోర్ (22వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (43వ ని.లో), రమణ్దీప్ సింగ్ (44వ ని.లో) గోల్స్ చేశారు. పాక్ నుంచి ముహమ్మద్ రిజ్వాన్ సీనియర్ (31వ ని.లో), ముహమ్మద్ ఇర్ఫాన్ జూనియర్ (39వ ని.లో) గోల్స్ సాధించారు. ఈనెల 25న జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో చైనాతో భారత్ ఆడుతుంది. ఆరంభంలో తడబడినా.. మ్యాచ్ ఆరంభంలో భారత ఆటగాళ్లు తమ స్థారుుకి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేదు. శ్రీజేష్ బృందం తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగడంతో తొలి క్వార్టర్లో ప్రత్యర్థి పాక్ పైచేరుు సాధించింది. వారి డిఫెండర్లు మెరుగ్గా రాణించడంలో భారత్కు గోల్స్ చేసే అవకాశం చిక్కలేదు. అటు పాక్కు లభించిన రెండు పెనాల్టీ కార్నర్ అవకాశాలను గోల్ కీపర్ శ్రీజేష్ తిప్పికొట్టాడు. రెండో క్వార్టర్లో భారత్ క్రమశిక్షణగా ఆడింది. మిడ్ఫీల్డ్లో ఒత్తిడి పెంచుతూ 22వ నిమిషంలో బోణీ చేసింది. రూపిందర్పాల్ నుంచి లాంగ్ షాట్ అందుకున్న ఎస్కే ఉతప్ప సహచరుడు ప్రదీప్కు పాస్ ఇవ్వగా తను జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ద్వితీయార్ధంలో ఎదురుదాడికి దిగిన పాక్ మరో తొమ్మిది నిమిషాల్లోనే ఫలితం సాధించింది. రిజ్వాన్ సీనియర్ గోల్తో స్కోరు సమమైంది. మరింత జోరును కనబరుస్తూ పాక్ 39వ నిమిషంలో రెండో గోల్ చేయడంతో భారత్ వెనుకబడింది. ఈ దశలో భారత్ కాస్త ఒత్తిడికి లోనయినా నిమిషం వ్యవధిలోనే రెండు గోల్స్తో విరుచుకుపడి పాక్ను కోలుకోలేకుండా చేసింది. 43వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా డ్రాగ్ఫ్లికర్ రూపిందర్ పాల్ సింగ్ గోల్ చేయగా మరో నిమిషంలో రమణ్దీప్ ఫీల్డ్ గోల్తో అదరగొట్టాడు. ఇక చివరి క్వార్టర్లో భారత్ చక్కడి డిఫెన్సివ్ ఆట కనబరచడంతో పాక్ ప్రయత్నాలు వృథా అయ్యాయి. -
జర్మనీ చేతిలో భారత్ ఓటమి
వలెన్సినా: ఆరు దేశాల ఇన్విటేషన్ హాకీ టోర్నమెంట్ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. సోమవారం జరిగిన మ్యాచ్లో జర్మనీ 4-0తో భారత్ను చిత్తు చేసింది. ప్రథమార్ధంలో 3-0తో ఆధిక్యంలో నిలిచిన జర్మనీ తర్వాతి అర్ధ భాగంలో మరో గోల్ చేసింది. గ్రమ్బష్ రెండు, మోరిట్జ్, విండ్ఫెడర్ చెరో గోల్ కొట్టారు. -
రజతమే బంగారం!
► చాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్ భారత్ షూటౌట్లో ఆసీస్ చేతిలో పరాజయం ► నిర్ణీత సమయంలో గోల్ ఇవ్వని టీమిండియా తొలిసారి రజత పతకం కైవసం లండన్: స్టార్ క్రీడాకారులు లేకపోయినా... అంచనాలకు మించి రాణించిన భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. 38 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్కు చేరుకోవడంతోపాటు రజత పతకం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఓవరాల్గా భారత్కిది ఈ మెగా ఈవెంట్ చరిత్రలో రెండో పతకం. గతంలో భారత్ 1982లో ఏకైకసారి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో... టీమిండియా పెనాల్టీ షూటౌట్లో 1-3తో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియా చేతిలో పోరాడి ఓడిపోయింది. మరోవైపు ఆస్ట్రేలియా రికార్డుస్థాయిలో 14వసారి చాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. లీగ్ మ్యాచ్లో భారత్పై భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియాకు ఫైనల్లో ఊహించని ప్రతిఘటన ఎదురైంది. రెండో క్వార్టర్లో ఆస్ట్రేలియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించినా ఆ జట్టు దానిని వృథా చేసుకుంది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ చేసేందుకు విఫలయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ముఖ్యంగా భారత గోల్కీపర్, కెప్టెన్ శ్రీజేష్ అద్భుత ప్రదర్శన చేసి పలుమార్లు ఆసీస్ దాడులను సమర్థంగా నిలువరించాడు. మన్దీప్, ఆకాశ్దీప్, సునీల్, హర్మన్ప్రీత్ సింగ్, తల్విందర్ సింగ్, నికిన్ తిమ్మయ్య అవకాశం దొరికినపుడల్లా ఆస్ట్రేలియా గోల్పోస్ట్పై దాడులు చేశారు. రెండు జట్లకు కలిపి 19 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. నిర్ణీత సమయంలోపు గోల్స్ నమోదు కాకపోవడంతో ఫలితాన్ని నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. భారత్ నిరసన... పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున హర్మన్ప్రీత్ సింగ్ ఒక్కడే గోల్ చేయగా... ఎస్కే ఉతప్ప, ఎస్వీ సునీల్, సురేందర్ కుమార్ విఫలమయ్యారు. ఆస్ట్రేలియా జట్టు నుంచి ఆరన్ జలెవ్స్కీ, డానియల్ బేల్, సిమోన్ ఆర్చిడ్ సఫలంకాగా... ట్రెంట్ మిటన్ షాట్ను భారత గోల్కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఫలితం తేలిపోవడంతో ఐదో స్ట్రోక్ను తీసుకోలేదు. షూటౌట్లో భాగంగా డానియల్ బేల్ తొలి ప్రయత్నాన్ని శ్రీజేష్ అడ్డుకున్నాడు. అయితే ఆసీస్ బృందం సమీక్షకు వెళ్లింది. రిప్లేను పరిశీలించాక టీవీ అంపైర్ షాట్ను మళ్లీ తీసుకోవాలని తెలిపారు. ఈసారి బేల్ గోల్ చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండో షాట్ సందర్భంగా అంపైర్ తీసుకున్న నిర్ణయంపై భారత్ నిరసన తెలిపింది. నిర్వాహకులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. దాంతో నిర్వాహకులు తుది ఫలితాన్ని గంటపాటు వాయిదా వేశారు. పలుమార్లు వీడియోను పరిశీలించాక అంపైర్ తీసుకున్న నిర్ణయం సరైందేనని స్పష్టం చేసిన జ్యూరీ కమిటీ ఆస్ట్రేలియాను అధికారికంగా విజేతగా ప్రకటించింది. హాకీ ఇండియా నజరానా చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తొలిసారి రజత పతకం నెగ్గిన భారత జట్టుకు హాకీ ఇండియా (హెచ్ఐ) నజరానా ప్రకటించింది. చీఫ్ కోచ్తోపాటు జట్టులోని ప్రతి సభ్యుడికి రూ. 2 లక్షల చొప్పున... మిగతా సహాయక సిబ్బందికి రూ. లక్ష చొప్పున నగదు పురస్కారం అందజేస్తామని హెచ్ఐ అధ్యక్షుడు నరేందర్ బాత్రా ప్రకటించారు. ‘యూత్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ పురస్కారం అందుకున్న భారత ఆటగాడు హర్మన్ప్రీత్ సింగ్కు అదనంగా మరో లక్ష రూపాయలు ఇవ్వనున్నారు. జట్టుపై ప్రశంసల జల్లు చాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించిన భారత జట్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో స్ఫూర్తిదాయక ఆటతీరు కనబరిచిన భారత జట్టుకు అభినందనలు. మీ ప్రయత్నం అద్భుతం. మీ ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు. భారత మేటి క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, భారత హాకీ జట్టు రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్ కూడా టీమిండియా ప్రదర్శనను ప్రశంసించారు. ► 1 ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో 116 మ్యాచ్ల్లో తలపడిన భారత్ నిర్ణీత సమయంలోపు ఆస్ట్రేలియాకు గోల్ సమర్పించుకోకపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ► 4 భారత జట్టు 11 సార్లు ఫైనల్స్లో షూటౌట్ను ఎదుర్కొంది. ఏడుసార్లు సఫలంకాగా, నాలుగుసార్లు విఫలమైంది. షూటౌట్ సాగిందిలా... భారత్ x స్కోరు ఆస్ట్రేలియా ఉతప్ప x 0-1 జలెవ్స్కీ సురేందర్ x 0-2 బేల్3 హర్మన్ప్రీత్3 1-2 మిటన్ x సునీల్ x 1-3 ఆర్చిడ్ 3 -
భారత్కు చేజారిన విజయం
► జర్మనీతో 3-3తో మ్యాచ్ ‘డ్రా’ ► చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ లండన్: పలువురు అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకుండానే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్లో ఆకట్టుకుంది. డిఫెండింగ్ చాంపియన్, ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ మూడో ర్యాంకర్ జర్మనీ జట్టుతో జరిగిన మ్యాచ్ను టీమిండియా 3-3తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున రఘునాథ్ (7వ నిమిషంలో), మన్దీప్ సింగ్ (26వ నిమిషంలో), హర్మన్ప్రీత్ సింగ్ (32వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. జర్మనీ జట్టుకు టామ్ గ్రామ్బుష్ (26వ, 36వ నిమిషాల్లో) రెండు గోల్స్, జొనాస్ గోమోల్ (57వ నిమిషంలో) ఒక గోల్ అందించాడు. ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను రఘునాథ్ సద్వినియోగం చేసుకోవడంతో భారత్ ఖాతా తెరిచింది. 26వ నిమిషంలో జర్మనీ స్కోరు సమం చేసినా... ఆ వెంటనే భారత్ మరో గోల్ చేసి 2-1తో ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్ ఆరంభంలో హర్మన్ప్రీత్ సింగ్ డ్రాగ్ ఫ్లిక్తో భారత్కు మూడో గోల్ను అందించాడు. ఈ దశలో జర్మనీ దూకుడును పెంచి భారత గోల్పోస్ట్పై దాడులు చేసి రెండో గోల్ను సాధించింది. ఆ తర్వాత కాసేపు జర్మనీ జోరును భారత్ అడ్డుకున్నా... చివర్లో తడబడింది. 57వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను జర్మనీ సద్వినియోగం చేసుకొని స్కోరును సమం చేసింది. చివరి 3 నిమిషాల్లో భారత్ మరో గోల్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. -
సుశీలా చానుకు సారథ్యం
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో ఈనెల 30 నుంచి జరిగే నాలుగు దేశాల మహిళల హాకీ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ రీతూ రాణికి విశ్రాంతి ఇచ్చి... ఆమె స్థానంలో సుశీలా చానుకు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రజని ఎతిమరపు గోల్కీపర్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. భారత మహిళల హాకీ జట్టు: సుశీలా చాను (కెప్టెన్), దీపిక (వైస్ కెప్టెన్), సవిత, రజని, సునీతా లాక్రా, నిక్కి, దీప్ గ్రేస్, హినియాలుమ్ లాల్, రాణి, నమిత, నవ్జ్యోత్, మోనికా, రేణుక, పూనమ్, వందన, అనురాధ, లిలిమా మింజ్. -
భారత్కు చావో.. రేవో
► నేడు మలేసియాతో పోరు గెలిస్తేనే ఫైనల్కు.. ఇపో (మలేసియా): సుల్తాన్ అజ్లా న్షా కప్ హాకీ టోర్నమెంట్లో ఫైనల్ బెర్త్పై దృష్టి సారించిన భారత జట్టు నేడు (శుక్రవారం) కీలక మ్యాచ్ ఆడనుంది. మలేసియాతో జరిగే ఈ పోరులో సర్దార్ సింగ్ సేన కచ్చితంగా నెగ్గితేనే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. నిజానికి బుధవారం జరిగిన మ్యాచ్లో కివీస్పై నెగ్గితే భారత్కు ఈ మ్యాచ్ నామమాత్రంగానే ఉండేది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫైనల్కు చేరింది. ప్రస్తుతం ఆరు మ్యాచ్లను పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్న కివీస్ను వెనక్కి నెట్టాలంటే భారత్కు ఈ మ్యాచ్ను గెలవడం తప్ప మరో దారి లేదు. మలేసియాతో ఆడిన చివరి రెండు మ్యాచ్ల్లో భారత్ గెలిచింది. అటు మలేసియా ఏడు గోల్స్ తేడాతో భారత్ను ఓడిస్తే ఫైనల్కు చేరుతుంది. -
అజ్లాన్ షా కప్: ఆసీస్ చేతిలో భారత్ ఓటమి
ఇఫో: తొలి మ్యాచ్లో జపాన్పై కష్టపడి గెలిచిన భారత్ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో 1-5తో చిత్తుగా ఓడిపోయింది. ఆసీస్... ఆట 5వ నిమిషంలో బ్లేక్ గోవర్స్ చేసిన గోల్తో ఖాతా తెరిచింది. అయితే కాసేపటికే భారత్కు లభించిన పెనాల్టీ కార్నర్ను రూపిందర్ సింగ్(8వ ని.) గోల్గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. 13వ నిమిషంలో రక్షణ పంక్తిని ఛేదిస్తూ ఆస్ట్రేలియా కెప్టెన్ జామీ డ్వేర్ ఇచ్చిన పాస్ను వెట్టన్ గోల్గా మలిచాడు. దీంతో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఎడ్డీ వొకెండెన్ (20వ ని.), సిమన్ ఆర్చడ్ (25వ ని.) చెరో గోల్ చేయడంతో తొలి అర్ధభాగాన్ని 4-1తో ముగించింది. ద్వితీయార్థంలో మ్యాట్ గోడ్స్ (53వ ని.) చేసిన గోల్తో ఆసీస్ ఘనవిజయం సాధించింది. -
భారత్కు మూడో స్థానం
బ్రెడా (నెదర్లాండ్స్): వోల్వో అంతర్జాతీయ అండర్-21 హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంగ్లండ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. దాంతో ఫలితం తేలేందుకు షూటౌట్ అనివార్యమైంది. ఈ షూటౌట్లో ఇంగ్లండ్ క్రీడాకారిణులు ఐదు ప్రయత్నాలను భారత గోల్కీపర్ ఇందర్ప్రీత్ కౌర్ అడ్డుకోవడం విశేషం. మరోవైపు భారత్ నుంచి దీప్ గ్రేస్ ఎక్కా కీలకమైన గోల్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించింది. -
భారత్కు రెండో గెలుపు
బ్రెడా (నెదర్లాండ్స్): వోల్వో అంతర్జాతీయ అం డర్-21 హాకీ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. న్యూజిలాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 3-0 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. 29వ నిమిషంలో సిమ్రన్జీత్ సింగ్ ఫీల్డ్ గోల్తో భారత ఆధిక్యం 2-0కు చేరుకుంది. 41వ నిమిషంలో లభించిన మరో పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ లక్ష్యానికి చేర్చాడు. మంగళవారం జరిగే తదుపరి లీగ్ మ్యాచ్లో బెల్జియంతో భారత్ తలపడుతుంది. -
హాకీ చాంప్ బెంగళూరు
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్లైన్: దక్షిణ భారత అంతర్ విశ్వవిద్యాలయాల హాకీ టోర్నమెంటు విజేతగా బెంగళూరు యూనివర్సిటీ జట్టు నిలిచింది. టోర్నీలో ఒక్క ఓటమి కూడా లేకుండా తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. నాలుగు పాయింట్లతో భారతీదాసన్ యూనివర్సిటీ జట్టు రన్నరప్ సాధించింది. ఎస్కే యూనివర్సిటీ మూడు పాయింట్లతో మూడో స్థానం, అన్నా యూనివర్సిటీ జట్టు ఒక పాయింట్తో నాల్గో స్థానంలో నిలిచాయి. శుక్రవారం అనంత క్రీడాగ్రామంలో జరిగిన మ్యాచ్లో బెంగళూరు, భారతీదాసన్ యూనివర్సిటీల జట్లు తలపడ్డాయి. బెంగళూరు 3-1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. కుష మూడు గోల్స్ చేశాడు. భారతీదాసన్ తరఫున రామచంద్రన్ ఒక గోల్ సాధించాడు. మూడోస్థానం కోసం అన్నా యూనివర్సిటీ, ఎస్కేయూ జట్లు పోటీపడ్డాయి. ఎస్కేయూ జట్టు 4-2 గోల్స్ తేడాతో జయకేతనం ఎగురవేసింది. అన్నా వర్సిటీ తరఫున చరణ్ కుమార్ 2 గోల్స్ చేశాడు. ఎస్కేయూ తరఫున కుళ్లాయప్ప, అమర్నాథ్ చెరో గోల్ సాధించారు. అన్నా జట్టు రెండు సెల్ఫ్ గోల్స్ చేసి పరాజయాన్ని మూటగట్టుకుంది. బహుమతుల ప్రదానం టోర్నీ ముగింపు కార్యక్రమానికి ఎస్కేయూ వైస్ ఛాన్సలర్ రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్కేయూ జట్టు అఖిల భారత విశ్వవిద్యాలయాల హాకీ టోర్నీకి ఎంపిక కావడం అభినందనీయమన్నారు. టోర్నీ పరిశీలకుడు చిన్నప్పరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత హాకీ టోర్నీకి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్, హాకీ సంఘం జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయబాబు, ఎస్కేయూ రిజిస్ట్రార్ గోవింద ప్ప, వీసీ సతీమణి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. 3