క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య | sai dedeepya at all India tennis tournament | Sakshi
Sakshi News home page

క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య

Published Wed, Aug 3 2016 9:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య

క్వార్టర్ ఫైనల్లో సాయిదేదీప్య

హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి వై. సాయిదేదీప్య రెండు విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. హరియాణాలోని కర్నాల్‌లో నిర్వహిస్తున్న ఈ టోర్నీలో మంగళవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-0, 7-6 (7/5)తో విభశ్రీ గౌడ (కర్ణాటక)ను కంగుతినిపించింది.

బుధవారం జరగనున్న క్వార్టర్ ఫైనల్లో దేదీప్య... పశ్చిమ బెంగాల్‌కు చెందిన యుబ్రాని బెనర్జీతో తలపడనుంది. డబుల్స్‌లోనూ దేదీప్య-హిమానీ మోర్ (హరియాణా) జంట క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement