న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ... ఫేస్బుక్లో భారత్ నుంచి అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీగా నిలిచాడు. అతను బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ను అధిగమించాడు. ప్రస్తుతం 3 కోట్ల 57 లక్షల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. ఓవరాల్గా ప్రధాని నరేంద్ర మోదీ (4 కోట్ల 22 లక్షలు) నంబర్వన్గా ఉన్నారు.