Facebook Followers
-
ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే అకౌంట్లపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జూన్ 16 నుంచి జులై 31 మధ్య కాలంలో సుమారు 33.3 మిలియన్ల కంటెంట్ పీస్ (ఇమేజ్)లను అకౌంట్ల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. యూజర్లు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండేందుకు ఫేస్ బుక్ గత కొంత కాలంగా యూజర్లు టెక్నాలజీ, ఏఐలపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. తద్వారా ఫేస్ బుక్ యూజర్లకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా ఇమేజెస్, కంటెంట్లపై కన్నేసింది. ఈ రెండింటిలో ఫేస్బుక్కు చెందిన 10 కంటెంట్ పాలసీ నిబంధనలతో పాటు ఆ సంస్థకు చెందిన మరో సోషల్ నెట్ వర్క్ ఇన్ స్టాగ్రామ్లో 8 పాలసీల నిబంధనల్ని ఉల్లంఘించిన అకౌంట్లపై చర్యలు తీసుకుంటుంది. సోషల్ మీడియా వల్ల హింస పెరిగిపోతుందా? కరోనా కారణంగా సోషల్ మీడియా వినియోగం రోజురోజుకి పెరిగిపోయింది. సరైన అవగాహన ఉన్నవారు మనీ ఎర్నింగ్ కోసం ఫేస్బుక్ను ఓ వేదికగా మార్చుకుంటున్నారు. అదే సమయంలో మరికొందురు రెచ్చగొడుతూ హింసను ప్రేరేపించేలా ఉన్న కంటెంట్లను భారీగా తొలగించామంటూ ఇటీవల ఫేస్బుక్ స్పోక్ పర్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జులై 16 నుంచి జులై 31 మధ్య కాలంలో 25.6 మిలియన్ల ఇమేజ్ కంటెంట్, హింసను రెచ్చగొట్టేలా ఉన్న 3.5 మిలియన్ల గ్రాఫికల్ ఇమేజెస్పై, 2.6 మిలియన్ల అడల్ట్ కంటెంట్ ఉన్న ఇమేజెస్లను తొలగించినట్లు తెలిపారు. వీటితో పాటు 1లక్షా 23,400 హరాస్ మెంట్ కంటెంట్ ఉన్న అకౌంట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు,1504 రిపోర్ట్ల ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. ఫేస్బుక్కే కాదు.. ఇన్ స్టాగ్రామ్ లో కూడా.. ఫేస్బుక్కే కాదు..ఇన్ స్టాగ్రామ్ పోస్ట్లపై చర్యలు తీసుకుంటున్నట్లు ఫేస్బుక్ యాజమాన్యం వెల్లడించింది. 1.1 మిలియన్ల హింసాత్మక పోస్ట్లు, 8,11,000 వేల సూసైడ్, సెల్ఫ్ ఇంజూరీ ఇమేజ్ కంటెంట్ లపై చర్యలకు ఉపక్రమించింది. జూన్ 16 నుంచి జులై 31 వరకు 265 అకౌంట్లపై యూజర్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ లో సైతం ఫేస్బుక్ కు చెందిన మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్లో జూన్ 16 నుంచి జులై 31 వరకు 3 మిలియన్ కంటే ఎక్కువ అకౌంట్లును తొలగించింది. ఇదే సమయంలో సెర్చ్ ఇంజిన్ గూగుల్ కు 36,934 ఫిర్యాదులు అందగా..95,680 ఇమేజెస్ను తొలగించింది. చదవండి: ఇకపై ఈజీగా ఎలక్ట్రిక్ వెహికల్ను సొంతం చేసుకోవచ్చు! -
ఫేస్బుక్లో మరో సూపర్ ఫీచర్, వాయిస్,వీడియో కాలింగ్..
మనం ఫోన్ తో చేసే వాయిస్ కాల్, వీడియోకాల్ను ఇకపై ఫేస్ బుక్ నుంచి చేసే అవకాశం ఉంది. ఎస్. ఫేస్ బుక్ ను మరింత అందంగా తీర్చిదిద్దేందుకు ఆ సంస్థ సీఈఓ మార్క్ జూకర్ బెర్గ్ ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో భాగంగా యుజర్లను మరింత అట్రాక్ట్ చేసేందుకు వాయిస్ - వీడియా కాలింగ్ ఆప్షన్ పై వర్క్ చేస్తున్నారని బ్లూమ్ బెర్గ్ తెలిపింది. వాస్తవానికి ఈ ఫీచర్ను ఫేస్బుక్..'ఫేస్బుక్ మెసేంజర్'కు అటాచ్ చేసింది. దీంతో యూజర్లు వీడియో కాలింగ్ చేసుకోవాలంటే ఫేస్బుక్ మెయిన్ పేజ్ను క్లోజ్ చేసి మెసేంజర్లోకి వెళ్లేవారు. అలా వెళ్లడం వల్ల యూజర్లు ఫేస్బుక్ ను వినియోగించడం తగ్గిస్తున్నారని మార్క్ జూకర్ బెర్గ్ గుర్తించారు. అయితే అప్పటి వరకు ఒకటిగా ఉన్న ఫేస్ బుక్ ను - ఫేస్ బుక్ మెసెంజర్ ను 2014లో వేరు చేశారు. వాయిస్ - వీడియో కాలింగ్ ఆప్షన్ ను ఫేస్ బుక్ మెసెంజర్కు జోడించారు. ఇప్పుడు మళ్లీ ఇదే ఫీచర్ ను ఫేస్బుక్ డెవలప్ చేసే పనిలో పడిందని బ్లూమ్ బెర్గ్ తన కథనంలో ప్రస్తావించింది.త్వరలో ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని పేర్కొంది. -
ఫేస్‘బుక్'పై భారీ జరిమానా
-
ఫేస్‘బుక్'కు అమెరికా కోర్టు షాక్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఫేస్బుక్ కు అమెరికా కోర్టు షాక్ ఇచ్చింది. ఫేసుబుక్ వినియోగదారుల అనుమతి లేకుండా ఫోటో ఫేస్-ట్యాగింగ్, ఇతర బయోమెట్రిక్ డేటాను ఉపయోగించడంపై 650 మిలియన్ డాలర్లు(సుమారు రూ.4,780 కోట్లు) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ అమెరికా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్బుక్ భంగం కలిగిందంటూ అమెరికాలోని ఇల్లినాయిస్లో 2015లో దాఖలు చేసిన క్లాస్-యాక్షన్ పిటిషన్పై యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో విచారణ చేపట్టారు. ఇల్లినాయిస్లో దాదాపు 1.6 మిలియన్ల మంది ఫేసుబుక్ వినియోగదారులు వాదనలు సమర్పించారు. విచారణ చేపట్టిన యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి జేమ్స్ డొనాటో ఫేస్బుక్ ప్రైవసీ పాలసీ నిబంధనలను పాటించలేదని తీర్పునిచ్చారు. ఇది యూజర్ల గోప్యత భంగం కలిగించడమే అని పేర్కొన్నారు. ఫేసుబుక్ వల్ల భంగం కలిగిన ప్రతి ఒక్కరికి 345 డాలర్ల చొప్పున మొత్తం 650 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో నష్ట పరిహారం చెల్లించడం ఇదే తొలిసారని జడ్జి డొనాటో వెల్లడించారు. పిటీషన్ వేసిన చికాగో న్యాయవాది జే ఎడెల్సన్ చికాగో ట్రిబ్యూన్తో మాట్లాడుతూ తీర్పును అప్పీల్ చేయకపోతే ఫేస్బుక్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి ఉంటుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఫేస్బుక్ ప్రతినిధి స్పందిస్తూ.. తమ వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడమే కర్తవ్యమన్నారు. ఈ విషయంపై పునరాలోచన చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: రూ.299కే బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మార్చి నెలలో 11 రోజులు బ్యాంకులకు సెలవు -
నాటి రాళ్లు నేటి పూలు.. మన్నించు మారియా!
ఆరేళ్ల క్రితం.. ‘సచిన్ ఎవరో నాకు తెలీదు’ అని టెన్నిస్ తార మారియా షరపోవా అన్నందుకు ఆగ్రహించిన సచిన్ అభిమానులు ఇప్పుడు ఆ షరపోవాకే.. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు నీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని ఆమె ఫేస్బుక్లో పోస్టుల మీద పోస్టులు పెడుతున్నారు. ఆమెకు లైకుల మీద లైకులు కొడుతున్నారు. రైతు ఉద్యమానికి మద్దతుగా నిలిచిన విదేశీ ప్రముఖుల్ని హెచ్చరిస్తూ.. ‘ఇది మా సొంత విషయం’ అని సచిన్ ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. ఢిల్లీ సరిహద్దులలో కొన్ని నెలలుగా రైతు ఉద్యమం జరుగుతోంది. ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలు తమ మెడకు ఉరి వంటివి కనుక వాటిని రద్దు చేయాలని రైతుల డిమాండ్. ప్రభుత్వానికి, రైతులకు మధ్య ఎన్ని విడతలుగా చర్చలు జరిగినా ఒక ఫలవంతమైన ముగింపు రావడం లేదు. ఈలోపు వివిధ కారణాల వల్ల కనీసం 170 మంది ఉద్యమ రైతులు మరణించారని వస్తున్న వార్తలతో ప్రపంచం నలుమూలల నుంచి రైతుల డిమాండ్కు ట్వీట్ల ద్వారా మద్దతు లభిస్తోంది. స్వీడన్ నుంచి పర్యావరణ పరిరక్షణ ఉద్యమ కార్యకర్త గ్రెటా థన్బర్గ్, బార్బడోస్ పాప్ గాయని రిహాన్నా వంటివారు రైతులకు తమ సంఘీభావం ప్రకటించారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. విదేశీ సానుభూతి పరులకు వ్యతిరేకం గా పెట్టిన ట్వీట్ ఆయన అభిమానుల ఆగ్రహానికి కారణం అయింది. ‘భారత్ తన సార్వభౌమాధికారం విషయంలో రాజీకి రానవసరం లేదు. బయటి శక్తులు వీక్షకులుగా ఉండొచ్చు కానీ, భాగస్వాములు కాదగరు’ అని థన్బర్గ్, రిహాన్నాలను ఉద్దేశించే సచిన్ ఆ ట్వీట్ పెట్టారు. ∙∙ నిప్పు జ్వాల గాలి దిశను బట్టి వ్యాíపిస్తుంది. ఆగ్రహ జ్వాల ఎటువైపు అధాటున మళ్లుతుందో ఎవరూ ఊహించలేరు. సచిన్ను ‘క్రికెట్ దేవుడు’ అని ఆరాధించిన ఆయన అభిమానులు.. రైతులకు మద్దతు ఇస్తున్న విదేశీయుల్ని సచిన్ ‘హద్దుల్లో ఉండండి’ అని అర్థం వచ్చేలా హెచ్చరించినందుకు ఆయనపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ నిరసన నేరుగా లేదు. పరోక్షంగా ఉంది. పరోక్షంగా ఉన్నప్పటికీ శక్తిమంతంగా ఉంది. రష్యన్ టెన్నిస్ దిగ్గజం మారియా షరపోవా ఆరేళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా ‘సచిన్ ఎవరో నాకు తెలియదు’ అని అన్నందుకు ఆగ్రహోదగ్రులైన భారతీయులు, ముఖ్యంగా మలయాళీలు షరపోవా ఫేస్బుక్ వాల్పై కూర్చొని ఆనాడు ఆమెను అనరాని మాటలు అన్నారు. చాలావరకు అవి భారతీయ భాషల్లో ఉన్నాయి కనుకు షరపోవాకు అర్థమయ్యే అవకాశం లేదు. ఇంగ్లిష్లో ఉన్న కామెంట్స్నైనా ఆమె పట్టించుకున్న దాఖలాలు లేవు. కాని ఇప్పుడు అదే సచిన్ అభిమానులు.. అదే షరపోవా ఫేస్ బుక్ వాల్ మీదకు వెళ్లి ఆమెకు సారీ చెబుతున్నారు. ‘మన్నించు మారియా, నువ్వన్నది కరెక్టే. అతడు మీకు తెలిసి ఉండాల్సినంత మనిషి కాదు’ అని పోస్ట్ల మీద పోస్ట్లు పెడుతున్నారు. ఒకరైతే.. ‘మారియా, ఇండియా రండి. నా రెస్టారెంట్లో మీ కోసం ప్రత్యేకంగా షవర్మా, కుళిమంతీ (బిర్యానీ) చేయించి పెడతాను’ అని ఆమెను ఆహ్వానించారు. నాడు మారియాపై పడిన రాళ్లే, ఇప్పుడు పూలుగా మారుతున్నాయి. ‘డియర్ మారియా, వి ఆర్ సారీ. సచిన్కి సపోర్ట్ చేస్తూ ఆనాడు మీపై సైబర్ అటాక్ చేసినందుకు బాధపడుతున్నాం’ అని ఒకరు; ‘మారియా, ఆరోజు నాకు పరిణతి లోపించింది. సచిన్ తెలియదు అన్నందుకు నిన్ను నానా మాటలు అన్నాను. నన్ను క్షమించు’ అని ఇంకొకరు పోస్టు పెట్టారు. ఒక మహిళ అయితే.. ‘సారీ సిస్టర్, యువర్స్ ట్రూలీ’ అంటూ షరపోవాకు లైకుల మీద లైకులు కొట్టారు. ఈ ప్రేమ జ్వాల అంతకంతకూ పెరిగిపోయి, సచిన్ ఉండే ముంబై మీదుగా రైతులు పోరాడుతున్న ఢిల్లీ వరకు వ్యాపించేలా మారియాపై పూల వర్షం కురుస్తోంది. ఆ పూల వానను రైతుల పోరాటానికి ఆశీస్సులనే అనుకోవాలి. రిహాన్నా, గ్రెటా థన్బర్గ్ -
కూల్గా.. కామ్గా..!
ఎన్నికల ప్రచారం అంటే మైకుల హోరు.. డప్పువాయిద్యాలు.. బాణసంచా చప్పుళ్లు వినిపించేవి. కాలం మారింది. కొంత పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని క్షణాల్లో ఓటర్లు, కార్యకర్తలకు చేరిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు వాట్సప్, ఫేస్బుక్లను ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ మేనిఫోస్టోతో పాటు.. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కామ్గా.. కూల్గా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మిర్యాలగూడ... టీఆర్ఎస్ అభ్యర్థి : నల్లమోతు భాస్కర్రావు ఫేస్బుక్ ఖాతా : నల్లమోతు భాస్కర్రావు ఫేస్ బుక్ ఫెండ్స్ : 35,678 పోస్టింగ్లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఫొటోలతో పాటు వీడియోలు ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తిరిగి అధికారంలో వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలను కూడా ప్రచారంలో పెట్టారు. వ్యూవర్స్ : ఎక్కువగా పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుస్తాడని, మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి : ఆర్.కృష్ణయ్య ఫేస్బుక్ ఖాతా : ర్యాగా కృష్ణయ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ : 38,521 పోస్టింగ్లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారం ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా వచ్చిన వీడియో క్లిప్పింగ్లు, మహాకూటమి అధికారంలోకి వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. వ్యూవర్స్ : బీసీలంతా ఏకమై గెలిపించాలని కోరుతూ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యను గెలిపించాలని కోరుతూ పోస్టింగ్లు పెడుతున్నారు. నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి : కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేరు : నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5,000 మంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి తన పేరు మీద ఫేస్బుక్ ప్రారంభించారు. ఫేస్బుక్లో 5వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజు ఉత్తమ్కుమార్రెడ్డి రాష్ట్ర, నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పోస్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, మేనిఫెస్టో అంశాలను వివరించడంతోపాటు లైవ్ ప్రోగ్రామ్లు కూడా నిర్వహిస్తూ నేరుగా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అంతేగాక ఉత్తమ్సేన, ఉత్తమ్ యువసేన పేరుతో మరో రెండు ఫేస్బుక్ ఖాతాలు కూడా ఆయన అనుచరులు ప్రారంభించి విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. హూజూర్నగర్... శానంపూడి సైదిరెడ్డి : టీఆర్ఎస్ పార్టీ ఫేస్బుక్ పేరు : శానంపూడి సైదిరెడ్డి, అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5,000 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి తన పేరుమీద ప్రారంభించిన ఫేస్బుక్లో తన ప్రచార పోస్టింగ్లు పెడుతున్నారు. స్థానికత నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన ఫేస్బుక్లోని తన ఫాలోవర్స్ను చైతన్యం చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల వల్ల నియోజకవర్గం ఏ విధంగా నష్టపోయిందనే అంశాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పోస్టింగ్ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్త అంశాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేగాక సైదిరెడ్డి తన తండ్రి పేరు మీద ప్రారంభించిన అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్ పేర్లపై కూడా ఫేస్బుక్లు ప్రారంభించారు. ఈ రెండు సోషల్ మీడియా ఖాతాలను సుమారు 10 వేల మంది ఫాలో అవుతున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ సభ్యులతో పాటు సై యూత్ సభ్యులు కూడా సైది రెడ్డికి మద్దతుగా విస్తృతంగా పోస్టింగ్లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. భువనగిరి... ఫేస్బుక్ పేరు : అనిల్కుమార్రెడ్డి కుంభం ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 22,802 ఫేస్బుక్లో పెడుతున్న పోస్టింగ్లు: ప్రస్తుతం ఎన్నికల ప్రచార చిత్రాలు. ఎన్నికల ప్రచార లైవ్ కార్యక్రమాలు. ఎన్నికల ప్రచా రాలకు సంబంధించిన లైవ్ వీడియోలు. నాలుగేళ్ల కాలంలో భువనగిరి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలు, పాదయాత్రలు, సమావేశాలు. ధర్నాలు, రాస్తారోకోలు వంటి పోస్టింగ్లు పెడుతున్నారు. వీటితో సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలు ఫేస్బుక్లో పోస్టింగ్ చేస్తున్నారు. జోరుగా ప్రచారం.. తిరుమలగిరి (తుంగతుర్తి) : తుంగతుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫేస్బుక్, వాట్సప్లలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిశోర్కుమార్ తన పేరు మీదనే ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలు తెరిచి ప్రతిరోజు ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, కార్యక్రమాల వివరాలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ, జీకే యూత్, అన్ని మండలాల గ్రూపులతో వాట్సప్ ఖాతాలు తెరిచి ప్రతిరోజు కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ ఫేస్బుక్, వాట్సప్లలో 25 గ్రూపుల ద్వారా తన ప్రచార కార్యక్రమాన్ని, పర్యటన వివరాలను తెలియజేస్తున్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య సామాజికమాద్యమాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి పేరు : గాదరి కిశోర్కుమార్. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేర్లు : గాదరి కిశోర్కుమార్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 4448 ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య : 2560 అభ్యర్థి పేరు : అద్దంకి దయాకర్ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేరు : అద్దంకిదయాకర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5 వేలు ట్విట్టర్ఫాలోవర్ల సంఖ్య : 1670 అభ్యర్థి పేరు :కడియం రామచంద్రయ్య ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేరు : కడియం రామచంద్రయ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 3859 -
ఫేస్బుక్ తంటా..యువకుడిపై పాశవిక దాడి!
మహబూబ్నగర్ క్రైం: పాతకక్ష్యలను మనసులో పెట్టుకుని కొందరు ఇద్దరు యువకులపై పాశవిక దాడికి పూనుకున్నారు. ఈ సంఘటన పట్టణంలో హల్చల్ సృష్టించింది. రూరల్ ఎస్ఐ భాస్కర్రెడ్డి కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పీర్లబాయికి చెందిన శ్యాంసుందర్ అతని స్నేహితుడు రోహిత్ మంగళవారం లైసెన్స్ కోసం ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మర్లుకు చెందిన చాణక్య అతని స్నేహితులు జగదీష్, పల్లె నరేష్, పల్లె దేవ, కృతిక్తోపాటు మరికొందరు కలిసి శ్యాంసుదర్, రోహిత్ను పట్టుకుని వారి కాలనీకి తీసుకుకెళ్లారు. దుస్తులు తొలగించి నగ్నంగా చేసి చేతులతో, కర్రలతో దాడిచేశారు. అంతటితో ఆగకుండా వీడియో చిత్రీకరించారు. బయటికి వచ్చిందిలా.. ఆగస్టు 25న చాణిక్య, వేపూర్గేరికి చెందిన బంటి ఫొటోలను గుర్తుతెలియని వ్యక్తులు ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. అయితే అందులో చాణక్య ఫొటోను ఎక్కువ మంది లైక్ కొట్టడంతో పాటు కామెంట్లు చేశారు. నాకంటే ఎక్కువ లైక్లు అతనికి వచ్చాయని బంటి తట్టుకోలేక చాణక్యను కొట్టాలని పతకం రచించాడు. అందులో భాగంగానే చాణక్య స్నేహితుడు శ్రీకాంత్చారిని వెంట పెట్టుకొని బంటి అతని స్నేహితులు దత్తు, శ్యామ్సుందర్, జగదీష్, శివ, సందీప్, శివసాయి, రోహిత్, విష్ణు, మధుచారి, నందివర్ధన్రెడ్డిలతో కలిసి ఆగస్టు 25న రాత్రి 9.30గంటలకు చాణక్య ఇంటికి వెళ్లారు. శ్రీకాంత్ చారితో అతనిని బయటకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేసి కొంత దూరం మాటల్లో పెట్టి తీసుకెళ్లారు. బంటికి సారీ చెప్పాలని అతని స్నేహితులు చాణక్యతో గొడవ పడ్డారు. వినకపోవడంతో ఇనుప రాడ్లు, కట్టెలతో చాణక్యపై దాడి చేశారు. బట్టలు తీసి నగ్నంగా చేసి కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. ఈ విషయం బయటికి పొక్కలేదు. ప్రతికారం తీర్చుకోవాలని చాణక్య అదేపద్ధతిలో చాణక్య అతని స్నేహితులు కలిసి శ్యాంసుందర్, రోహిత్పై దాడి చేశారు. శ్యాంసుందర్ తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హోమో సెక్స్లో పాల్గొనలేదని చంపేశారు!
ప్రకాశం, దర్శి: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడిని పార్టీ ఉందంటూ పిలిచారు. అనంతరం హోమో సెక్స్(స్వలింగ సంపర్కం)లో పాల్గొనాలంటూ అతడిపై ఒత్తిడి తెచ్చారు. అందుకు ఒప్పుకోని ఆ యువకుడు, విషయాన్ని అందరికీ చెబుతానని హెచ్చరించడంతో గొంతునులిమి చంపేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో గత జూన్ 26న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బ్రహ్మారెడ్డి కేసును పోలీసులు ఛేదించారు. ఓ మైనర్ సహా నలుగురు నిందితులతో పాటు వారికి సహకరించిన ఓ నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దర్శి మండలం లంకోజనపల్లికి చెందిన పెదరామిరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (27) ఇటీవల టెట్లో ఉత్తీర్ణత సాధించాడు. డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నాడు. గత జూన్ 26న దర్శి నుంచి తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని ఓ సుబాబుల్ తోటలో అనుమానస్పద స్థితిలో అతడు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో దర్శికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అందరికీ చెబుతానని హెచ్చరించడంతో... దర్శికి చెందిన సాయికిరణ్కు ఫేస్బుక్లో బ్రహ్మారెడ్డితో పరిచయం ఏర్పడింది. జూన్ 26న పార్టీ ఉందంటూ అతడు బ్రహ్మారెడ్డిని తూర్పువీరాయపాలెం వెళ్లే రోడ్డులోని సుబాబుల్ తోట వద్దకు తీసుకెళ్లాడు. అతడితో పాటు తన స్నేహితులు జలపాటి శ్రావణ్కుమార్, పందిటి నరసింహారావు, మరో మైనర్ బాలుడితో కలిసి మద్యం సేవించారు. అనంతరం బ్రహ్మారెడ్డిని తమతో పాటు స్వలింగ సంపర్కంలో పాల్గొనాలని ఒత్తిడి చేశారు. అందుకు అతడు నిరాకరించడంతో చెట్టుకు కట్టేశారు. మీరు ఇలాంటి వారని అందరికీ చెబుతానంటూ హెచ్చరించడంతో.. పరుపు పోతుందని భావించిన వారు అతడి గొంతు నులిమి చంపేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయాన్ని శ్రావణ్ తన తండ్రి బ్రహ్మయ్యకు చెప్పడంతో అతడు నిందితులు పారిపోయేందుకు సహకరించడంతోపాటు సాక్ష్యాలు దొరక్కుండా చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో నిందితులతో పాటు బ్రహ్మయ్యను కూడా అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. -
రెండు కోట్ల నలభై లక్షలురెండు కోట్ల నలభై లక్షలు
రెండు కోట్ల నలభై లక్షలంటే కాజల్ అగర్వాల్ తీసుకుంటున్న పారితోషికం గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? అదేం కాదు. ఆ మాటకొస్తే.. దక్షిణాది హీరోయిన్లు 2 కోట్లు టచ్ చేయడం కష్టమే. మరి.. ఏ విషయంలో కాజల్ అగర్వాల్ ఈ రికార్డ్ సాధించారు అంటే.. ‘ముఖ పుస్తకం’ ద్వారా అన్నమాట. అంటే.. ఫేస్బుక్ అండీ. ‘‘ నా ఫాలోయర్ల సంఖ్య 24 మిలియన్స్కు చేరుకుంది. చాలా ఆనందంగా ఉంది’’ అని కాజల్ అగర్వాల్ పేర్కొన్నారు. 24 మిలియన్స్ అంటే అక్షరాల 2 కోట్ల 40 లక్షల మంది. ఈ లెవల్లో కాజల్ ఫాలోయర్స్ని సంపాదించుకున్నారంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉండి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ బ్యూటీ ఎక్కువగా ఫేస్బుక్ లైవ్ చాట్స్ను ప్రిఫర్ చేస్తుంటారు. ఫాలోయర్స్ సంఖ్య పెరగడానికి ఇదో కారణం అని ఊహించవచ్చు. ఈ సంగతి ఇలా ఉంచితే.. బుధవారం తన తల్లి సుమన్ అగర్వాల్ బర్త్డే సెలబ్రేట్ చేశారు కాజల్. ‘‘నాకు తెలిసిన అందమైన మహిళ మా అమ్మనే. ఆమెను అమ్మా అని పిలుస్తున్నందుకు అదృష్టంగా ఫీలవుతున్నాను. నా రోల్ మోడల్, గైడ్, స్ట్రెంత్ అన్నీ మా అమ్మగారే’’అని పేర్కొన్నారు కాజల్. ఇక సినిమాల విషయానికొస్తే... ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ, బాలీవుడ్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్..ప్యారిస్’లోనూ ఆమె కథానాయికగా నటిస్తున్నారు. -
ఇల్లు కట్టించిన ఫేస్బుక్ మిత్రులు..
ఆనందంలో నిరుపేద పుష్ప కుటుంబీకులు బెల్లంపల్లి (మంచిర్యాల): పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి ఫేస్బుక్ స్నేహితులు గూడు కల్పించారు. రూ.లక్షా ఆరు వేల రూపాయలతో ఇంటిని నిర్మించారు. ఆదివారం గృహ ప్రవేశం చేయనున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాలబస్తీకి చెందిన లక్కపట్ల పుష్పది నిరుపేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పుష్పకు ఇద్దరు చెల్లెళ్లు. వారి వివాహ బాధ్యతలను స్వీకరించిన పుష్ప పెళ్లి చేసుకోలేదు. ఓ చెల్లెలికి పెళ్లి చేయడంతో ఆమె ఓ కూతురు రమ్యకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చెల్లెలు భర్త అకాల మరణం చెందాడు. రమ్య పుట్టుకతోనే వికలాంగురాలు కావడంతో పుష్ప ఆమెను దత్తత తీసుకుంది. వీరి దుస్థితిని గమనించిన బెల్లంపల్లి మైహార్ట్ బీట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుదర్శన్, కల్పన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో రమేశ్ ఈ నెల 1న పుష్ప దీనస్థితిని ఫేస్బుక్లో పోస్ట్ చేసి మిత్రుల సహకారం అర్థించగా.. రూ.1.06 లక్షలు జమయ్యాయి. వీటితో పుష్పకు ఇల్లు నిర్మించారు. -
ప్రధాని తర్వాత కోహ్లినే...
న్యూఢిల్లీ: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ... ఫేస్బుక్లో భారత్ నుంచి అత్యధిక మంది ఫాలో అవుతున్న సెలబ్రిటీగా నిలిచాడు. అతను బాలీవుడ్ సూపర్స్టార్ సల్మాన్ ఖాన్ను అధిగమించాడు. ప్రస్తుతం 3 కోట్ల 57 లక్షల మంది కోహ్లిని ఫాలో అవుతున్నారు. ఓవరాల్గా ప్రధాని నరేంద్ర మోదీ (4 కోట్ల 22 లక్షలు) నంబర్వన్గా ఉన్నారు. -
ఒక లైక్ ఖరీదు.. రూ. 2.58 లక్షలు!
మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? అందులో వచ్చే అప్డేట్లకు లైకులు కొడుతున్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. కాస్తంత జాగ్రత్తగా చూసి అందులో కంటెంట్ ఏముందో చూసుకుని మరీ లైక్ కొట్టండి. లేకపోతే మీరు కూడా భారీ మొత్తంలో జరిమానా కట్టుకోవాల్సి ఉంటుంది. వేలు ఉంది కదా, దాంతో టచ్ చేస్తే చాలు లైక్, లవ్ లాంటి బటన్లు యాక్టివేట్ అవుతాయని అనుకోకండి. స్విట్జర్లండ్లో ఇలాగే లైక్ కొట్టినందుకు ఓ వ్యక్తి ఏకంగా రెండున్నర లక్షల రూపాయల జరిమానా కట్టుకోవాల్సి వచ్చింది. పరువునష్టం కలిగించేవిగా ఉన్న వ్యాఖ్యలకు లైక్ కొట్టినందుకు జడ్జి ఆ మొత్తంలో జరిమానా విధించారు. విషయం ఏమిటంటే.. ఎర్విన్ కెస్లర్ అనే వ్యక్తి జంతువుల హక్కుల గ్రూపు నడిపిస్తుంటారు. ఆయన చేసిన పోస్టుల మీద కొంతమంది వివక్షాపూరితమైన కామెంట్లు చేస్తారు. అలాంటి వ్యాఖ్యల మీద ఓ వ్యక్తి లైక్ కొట్టినందుకు జడ్జిగారికి అతడి మీద కోపం వచ్చింది. లైక్ చేయడం ద్వారా ఆ వివక్షాపూరిత వ్యాఖ్యలను సమర్థిచినట్లు అయిందని జడ్జి చెప్పారు. ఆ చర్చలలో పాల్గొన్న చాలామంది మీద కెస్లర్ దావాలు వేశారు. కెస్లర్ గురించి కామెంట్లు చేసిన కొంతమందిని కూడా కోర్టు దోషులుగా నిర్ణయించింది. సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యల మీద పరువునష్టం దావాలు బాగానే పడుతున్నాయి. ఇంతకుముందు ఒక ఫ్యాషన్ డిజైనర్ మీద ఇలాగే సోషల్ మీడియాలో అవమానకరంగా వ్యాఖ్యలు చేసినందుకు గాయన కోర్ట్నీ లవ్కు ఏకంగా 3.50 లక్షల డాలర్ల జరిమానా పడింది. అలాగే ట్విట్టర్లో అవమానకరమైన కామెంట్లు చేసినందుకు బ్రిటిష్ పత్రికలోని కాలమిస్టుకు 30వేల డాలర్ల జరిమానా విధించారు. ఇప్పటివరకు ఇలా కామెంట్లు చేసినందుకు జరిమానాలు పడ్డాయి గానీ, ఒక కామెంటును లైక్ చేసినందుకు జరిమానా పడటం మాత్రం ఇదే తొలిసారి అని స్విస్ న్యాయవాదులు చెబుతున్నారు. దాన్ని బట్టి చూస్తే ఇక మీద ఫేస్బుక్లో ఏమైనా లైక్ చేయాలన్నా కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండక తప్పదని అంటున్నారు. -
ఫేస్బుక్ ద్వారా కిలాడీ లేడీ మోసాలు
-
ఫైవ్స్టార్ హోటల్లో.. ఫేస్బుక్ స్నేహితురాలిపై అత్యాచారం
గుజరాత్కు చెందిన ఓ వ్యాపారవేత్త తనకు ఫేస్బుక్లో పరిచయమైన గృహిణిని ముంబైలో ఓ ఫైవ్స్టార్ హోటల్కు పిలిపించుకుని అక్కడ అత్యాచారం చేశాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడేళ్ల క్రితం వీళ్లిద్దరికీ ఫేస్బుక్లో పరిచయమైంది. కొన్నాళ్ల తర్వాత ఫోన్ నంబర్లు కూడా ఇచ్చిపుచ్చుకుని తరచు మాట్లాడుకునేవారు. వాట్సప్లో కూడా ఇద్దరూ చాట్ చేసుకునేవారని ఓ పోలీసు అధికారి తెలిపారు. తాను ముంబైకి వచ్చానని, ఒకసారి కలుద్దామని అతడు చెప్పడంతో ఆమె సరేనన్నారు. కాఫీ తాగేందుకు ఫైవ్ స్టార్ హోటల్లోని తన గదికి రావాలని పిలిచాడు. తొలుత ఆలీబాగ్లోని ఫాంహౌస్లో తన కుటుంబంతో కలిసి వారాంతం గడిపేందుకు వచ్చిన ఆమె.. అతడు కాల్ చేయడంతో ముంబైకి వెళ్లారు. అతడిని కలిసిన తర్వాత మళ్లీ అలీబాగ్ వచ్చేయాలని ఆమె అనుకున్నారు. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఆమెను కలిసి, అక్కడినుంచి క్యాబ్లో హోటల్కు తీసుకెళ్లాడు. ముందు మంచినీళ్లు తాగమని ఇచ్చాడు. నీళ్లు తాగిన తర్వాత తనకు కాస్త మత్తుగా అనిపించిందని, తాను స్పృహ తెలిసీ తెలియని స్థితిలో ఉండగా అతడు తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెలకువ వచ్చిన తర్వాత ఆలీబాగ్ వెళ్లి జరిగిన విషయాన్ని తన భర్తకు తెలిపారు. వెంటనే ఆమె భర్త వ్యాపారవేత్తకు ఫోన్ చేసి గొడవపడ్డారు. వాస్తవానికి మరో రోజు ఉండాల్సిన ఆ వ్యక్తి.. అదేరోజు హోటల్ ఖాళీ చేసి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా స్విచాఫ్ చేసేశాడు. భర్తతో కలిసి స్టేషన్కు వెళ్లిన బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సినీ నటిని గర్భవతిని చేసి...
బంజారాహిల్స్(హైదరాబాద్): ఫేస్బుక్లో పరిచయమైన యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఏడాదిపాటు సహజీవనం చేయడమేగాక ఆమె గర్భవతి అయ్యాక అబార్షన్ చేయించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ముఖం చాటేసిన బీటెక్ విద్యార్థిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్కు తరలించారు. రహ్మత్నగర్లో నివాసం ఉండే యువతి(23) సినీ నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా పని చేసేది. గుంటూరు జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన మేడ యశ్వంత్కుమార్ అనే బీటెక్ విద్యార్థితో 2014లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడడంతో‡హ్మత్నగర్లో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. 2016 డిసెంబర్ 2న యశ్వంత్కుమార్ అదే గదిలో ఆమెకు పసుపుతాడు కట్టి పెళ్ళి చేసుకున్నట్లు నమ్మించి శారీరకంగా దగ్గరయ్యారు. ఇటీవల ఆమె గర్భవతికాగా స్థానిక ఆస్పత్రికి తీసుకెల్లి అబార్షన్ చేయించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా, అందుకు అతడు నిరాకరించడంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యశ్వంత్కుమార్పై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు. -
అన్ని కోట్ల మంది యూజ్ చేస్తున్నారా!
న్యూయార్క్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థ రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్ ను ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు వినియోగిస్తున్నారు. నెలవారీగా ఫేస్ బుక్ యాప్ వినియోగంపై సంస్థ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ దీనిపై హర్షం వ్యక్తం చేశారు. ఈ యాప్ ను 2015 జూన్ నెలలో లాంచ్ చేశారు. 'సాధారణ ఫేస్ బుక్ యాప్ యూజ్ చేయాలంటే స్మార్ట్ ఫోన్ ర్యామ్ కాస్త ఎక్కువగా ఉండాలి. 1జీబీ కంటే తక్కువ ర్యామ్ ఉన్న స్మార్ట్ ఫోన్లు వాడే యూజర్ల ఇబ్బందులను తొలగించేందుకు సంస్థ ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఆవిష్కరించింది' అని జుకర్ బర్గ్ తెలిపారు. '50 కంటే ఎక్కువ భాషలలో, లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, యూరఫ్ ఖండాలలో 150కి పైగా దేశాల నెటిజన్లు ఈ యాప్ ను యూజ్ చేస్తున్నారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ ఎఫ్బీ యాప్ కంటే లైట్ యాప్ తక్కువ స్పేస్ తీసుకుంటుంది. ప్రోగ్రామర్స్ ఎంతో శ్రమించి రూపొందించిన ఫేస్ బుక్ లైట్ యాప్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సులువుగా లైక్స్, షేర్లు చేయొచ్చు. తక్కువ బ్యాండ్ విడ్త్ ఇంటర్ నెట్ కలిగి ఉన్న నెటిజన్లను దృష్టిలో ఉంచుకుని చేసిన తమ ప్రయత్నానికి విశేష స్పందన వచ్చిందని' ఓ ప్రకటనలో ఫేస్ బుక్ సీఈవో జుకర్ బర్గ్ వెల్లడించారు. -
ఫేస్బుక్ ఫ్రెండే హంతకుడు
⇒ రహీం హత్య కేసులో వీడిన మిస్టరీ ⇒ నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్: చైతన్యపురి పోలీస్స్టేషన్ పరిధిలో మూడురోజుల క్రితం జరిగిన ఎలక్ట్రీషియన్ హత్యకేసు మిస్టరీని చేధించారు. శనివారం ఎల్బీనగర్ ఏసీపీ వేణుగోపాల్రావు, చైతన్యపురి ఇన్స్పెక్టర్ గురురాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు. కృష్ణాజిల్లాకు చెందిన షేఖ్రహీం అలియాస్ మున్నా నగరానికి వలసవచ్చి మలక్పేటలోని ఫ్లీట్మ్యాటిక్స్ కంపెనీలో పనిచేస్తూ న్యూ మారుతీనగర్లో నివాసం ఉండేవాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన కొంపెల్ల నవీన్(23) మూడు నెలల కిత్రం ఫేస్బుక్ ద్వారా రహీంకు పరిచయం అయ్యాడు. చెన్నైలో ఉద్యోగం చేసి వచ్చిన అతను ఇసామియాబజారులో ఉండేవాడు. రహీం, నవీన్ తరచూ న్యూ మారుతీనగర్లోని గదిలో మందు పార్టీలు చేసుకునేవారు. ఇదే క్రమంలో ఈ నెల 16న వారు ఇంటి సమీపంలో ఉండే పెయింటర్ లింగయ్యతో కలిసి మద్యం సేవించారు. ఈ సందర్భంగా రహీం ప్రియురాలిపై నవీన్ అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. దీనిని గమనించిన ఇంటి ఓనర్ అక్కడికి వచ్చి వారికి సర్దిచెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నవీన్ వైన్షాప్నకు వెళ్ళి మద్యం తీసుకురాగా మరోసారి కలిసి తాగారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న రహీంపై నవీన్ జిమ్ డంబుల్స్తో తలపై చితకబాది చనిపోయాడని నిర్ధారించుకున్న తరువాత అతని పర్సు, సెల్ఫోన్లు తీసుకుని ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత రహీం ఇంటికి వచ్చిన తోటి ఉద్యోగులు ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటాన్ని గుర్తించి తలుపును పగలగొట్టారు. రక్తపు మడుగులో పడిఉన్న రహీంను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆరోజు వారితో కలిసి మద్యం సేవించిన లింగయ్యను విచారించగా రహీం స్నేహితుడు వచ్చివెళ్లినట్లు తెలిపాడు. దీంతో రహీం ఫేస్బుక్ ఓపెన్ చేసి స్నేహితుల ఫొటోలను చూపగా నవీన్గా గుర్తించాడు. అతని సెల్ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితున్ని శనివారం ఉదయం ఇసామియా బజార్లో అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి రూ.1500 నగదు, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. హత్యకేసును ఛేదించిన ఇన్స్పెక్టర్ గురురాఘవేంద్ర, ఎస్సైలు రత్నం, కోటయ్యలను ఏసీపీ అభినందించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
ఫేస్బుక్ స్నేహితురాలి నగ్న ఫొటోలు తీసి..
గురుగ్రామ్: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి నగ్న ఫొటోలు తీసిన కేసులో బీసీఏ విద్యార్థిని (21) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హరియాణాలోని గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. కొన్ని నెలల క్రితం బీసీఏ విద్యార్థి అమిత్ కుమార్కు ఫేస్బుక్ ద్వారా ఓ యువతి (22) పరిచయమైంది. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులయ్యారు. గత మంగళవారం ఆ యువతి అమిత్ కుమార్ ఇంటికి వచ్చింది. ఆ సమయంలో ఇంట్లో అమిత్ కుమార్ తప్ప ఎవరూ లేరు. అమిత్ కూల్ డ్రింక్ ఆఫర్ చేయగా ఆమె తీసుకుంది. అయితే డ్రింక్లో మత్తు పదార్థం కలపడంతో ఆమె అపస్మారక స్థితికి వెళ్లింది. అమిత్ ఆమె దుస్తులు తొలగించి తన సెల్ఫోన్తో ఫొటోలు తీశాడు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకి రాగా, అమిత్ అనుచితంగా ప్రవర్తించాడు. ఈ విషయం బయటకు చెబితే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి, వారితో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
-
యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థి అరెస్ట్
సికింద్రాబాద్: ఫేస్బుక్లో నగ్న చిత్రాలు పెడతానంటూ ఓ యువతిని వేధిస్తున్న బీటెక్ విద్యార్థిని సికింద్రాబాద్ చిలకలగూడ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. సీతాఫల్మండిలో నివశిస్తున్న ఆకాష్ రెడ్డికి,అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో ఐదేళ్లక్రితం ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. నిత్యం వీరు చాటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తానంటూ ఆకాష్రెడ్డి సదరు యువతిని బెదిరించి 5 లక్షల రూపాయలు వసూలు చేశాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘ఫేస్బుక్ గాళ్ఫ్రెండ్’ను కలిసిన తొలిసారే..
కోయంబత్తూరు: ఫేస్బుక్ ద్వారా పరిచయమైన స్నేహితురాలు ప్రేమను నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు గాజుముక్కతో ఆమె మెడను కోశాడు. ఆమెను కలిసిన తొలిసారే యువకుడు దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బాధితురాలు తమిళనాడులోని కోయంబత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోయంబత్తూరుకు చెందిన కనకలక్ష్మి (21) అనే యువతి భారతీయార్ యూనివర్శిటీలో ఎంసీఏ తొలి సంవత్సరం చదువుతోంది. ఏడాది క్రితం ఫేస్బుక్ ద్వారా వేంబురాజ్ (28) అనే యువకుడు పరిచయమయ్యాడు. రామనాథపురం జిల్లాకు చెందిన వెంబురాజ్ చెన్నైలో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కొన్ని నెలల తర్వాత వెంబురాజ్ ప్రేమ విషయాన్ని తెలపగా, ఆమె తిరస్కరించింది. తాను చదువుపై దృష్టిపెట్టాలంటూ తెలిపింది. అయితే ఆన్లైన్లో ఇద్దరూ ఛాటింగ్ చేసుకునేవాళ్లు. కనకలక్ష్మి ఫోన్ నెంబర్ సంపాదించిన వెంబురాజ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన కనకలక్ష్మి మాట్లాడటం మానేసింది. దీంతో వెంబురాజ్ నేరుగా ఆమెను కలవాలనుకున్నాడు. గత బుధవారం భారతీయార్ యూనివర్శిటీకి వెళ్లి బస్స్టాప్లో కనకలక్ష్మిని తొలిసారి కలిశాడు. వెంబురాజ్ మరోసారి ప్రేమ, పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా, ఆమె తిరస్కరించింది. అతను వెంటనే అక్కడ ఉన్న బాటిల్ను పగలగొట్టి గాజు ముక్కతో ఆమె మెడను కోశాడు. అక్కడున్న విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికే వెంబురాజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పోలీసులు కనకలక్ష్మిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి వెంబురాజ్ను అరెస్ట్ చేశారు. -
ఫేస్బుక్ ఫ్రెండ్ అని నమ్మి వెళ్లినందుకు..
బెంగళూరు: ఫేస్బుక్ స్నేహితుడు అని నమ్మి వెళ్లినందుకు ఓ 16 ఏళ్ల అమ్మాయి దారుణంగా మోసపోయింది. మత్తుమందు ఇచ్చి ఆమెపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా ఈ ఘటనను తాను సెల్ఫోన్లో చిత్రీకరించానని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. ఆ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తానని హెచ్చరించాడు. మైనర్ బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆ కిరాతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు నగరంలో జరిగిన ఈ ఘటన తాలుకు వివరాలివి.. బాధితురాలికి ఆరు నెలల కిందట నిందితుడు డానియెల్ (24) అనే వ్యక్తి ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. గత సోమవారం సాయంత్రం ఆమె తన స్నేహితురాలి పుట్టినరోజు విందుకు వెళ్లింది. అక్కడికి డానియెల్ కూడా వచ్చి ఆమెతో మాట్లాడాడు. తాను కూడా ఓ చిన్న పార్టీ ఇస్తున్నానని, దానికి నువ్వు కూడా రావాలని బలవంతపెట్టాడు. మొదట బాధితురాలు ఒప్పుకోలేదు. చాలా బలవంతపెట్టడంతో చివరకు ఒప్పుకుంది. దీంతో డానియెల్ ముందే వెళ్లిపోయాడు. ఆ తర్వాత డానియెల్ స్నేహితుడు బాధితురాలిని తన బైక్పై తీసుకెళ్లి.. అతడు ఉన్న ఇంటివద్ద విడిచిపెట్టాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో బాధితురాలు అనుమానించింది. అయితే, ఆమెతో బలవంతంగా మత్తుపదార్థం కలిపిన కూల్ డ్రింక్ తాగించిన నిందితుడు.. స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన ఘటన తెలుసుకొని బాధితురాలు నిర్ఘాంతపోయింది. జరిగిన ఘటనను తన సెల్ఫోన్లో చిత్రీకరించానని, దీని గురించి పోలీసులకు చెప్తే ఆ వీడియోను ఇంటర్నెట్లో పెడతానని డానియెల్ బెదిరించాడు. అనంతరం ఆమెను ఇంటివద్ద వదిలేశాడు. అయితే, బాధితురాలు జరిగినదంతా ఇంట్లో చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డానియెల్ను అరెస్టు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫేస్బుక్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు
మంగళూరు: ఫేస్బుక్ లో పరిచయమైన యువతిని మోసగించి మరో పెళ్లికి సిద్ధమైన ప్రబుద్ధుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పెళ్లి చేసుకుంటానని తనను వంచించి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని పర్వేజ్ ముషారఫ్ అనే వ్యక్తి కర్ణాటకలోని మంగళూరుకు చెందిన యువతి(26) పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనకు దగ్గరయ్యాడని, తర్వాత మొహం చాటేశాడని వాపోయింది. నాలుగు నెలల నుంచి తనను తప్పించుకుని తిరుగుతున్నాడని ఆమె తెలిపింది. బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడని తెలుసుకున్న బాధితురాలు.. అతడిని నిలదీసింది. తమ మధ్య సంబంధాన్ని మర్చిపోవాలని ఆమెకు సూచించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
భర్తను వదలి.. ఫేస్బుక్ ప్రేమికుడి కోసం
యువతీ యువకుల మధ్య ఫేస్బుక్ పరిచయాలు ప్రేమగా మారి, వివాహబంధంతో ఒక్కటయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాగే మరికొందరు వివాహబంధాన్ని వీడి ప్రేమికుడు/ప్రేమికురాలి కోసం పారిపోయిన సంఘటనలూ ఉన్నాయి. మహారాష్ట్రలోని నాసిక్లో రెండో రకం ఘటన జరిగింది. ఓ యువతికి మూడేళ్ల క్రితం నాసిక్కు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహమైంది. ఫేస్బుక్ ద్వారా ఆమెకు ఇటీవల ఉత్తరాఖండ్లోని లోహఘాట్కు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. అతను ఢిల్లీలోని ఓ హోటల్లో పనిచేస్తున్నాడు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గత నెల 10న వివాహిత (25) తన భర్తను వదలి ప్రియుడి దగ్గరకు పారిపోయింది. ఆమె వెళ్తూ ఇంట్లో నుంచి నగలు, డబ్బు తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేశారు. ఉత్తరాఖండ్లోని చంపావత్లో ప్రేమజంట ఉన్నట్టు గుర్తించారు. నాసిక్ పోలీసులు చంపావత్ వెళ్లి వివాహితను గుర్తించి వెనక్కు తీసుకునివచ్చారు. కాగా విషయం తెలుసుకుని ఆమె ప్రియుడు పరారయ్యాడు. -
ప్రాణం తీసిన ఫేస్బుక్ పరిచయం
కడప : ఫేస్బుక్ పరిచయం ఓ నిండి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఖాజీపేటకు చెందిన యువకుడికి ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయి పరిచయమైంది. తాను ఆర్థికంగా కష్టాల్లో ఉన్నానని.. సాయం చేయాలని అడిగింది. అమ్మాయి మాటలకు కరిగిపోయి ఇంట్లో తెలియకుండా ఆమె అకౌంట్లో డబ్బులు వేశాడు. చివరికి ఈ విషయం ఇంట్లో తెలియడం..ఆపై యువతి మోసం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేటలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఖాజీపేట బస్టాండులో మాడిచెట్టి నరసింహ ప్రసాద్ అలియాస్ రమేష్ (33) మూడేళ్లుగా టీకొట్టు నిర్వహిస్తున్నాడు. అతడు ఫేస్బుక్లో ఖాతా ప్రారంభించి ప్రతిరోజు తన మొబైల్ ద్వారా చూసేవాడు. ఇలా విశాఖపట్నానికి చెందిన ఓ అమ్మాయితో అతడికి నెలక్రితం పరిచయమైంది. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో ఆమె తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని తనను ఆదుకోవాలని కోరింది. ఆమేరకు ఆమె ఎస్బీఐలోని గ్రీన్కార్డు అకౌంట్ నంబర్(20241371120)కు గతనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు సుమారు రూ.2లక్షలు పంపాడు. ఈ విషయంలో అతని ఇంట్లో తెలియడంతో గట్టిగా మందలించారు. దీంతో అతను తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలని ఆ యువతిపై ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఇచ్చిన ఫోన్ నంబర్కు ఇదే విషయమై తరచూ మెసేజ్ పంపాడు. డబ్బు ఇవ్వకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని కూడా తెలిపాడు. అయినా ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. తాను మోసపోయానని.. డబ్బు విషయమై ఇంట్లోని పెద్దలకు ఏం సమాధానం చెప్పాలో దిక్కు తెలియక సోమవారం మధ్యాహ్నం బాత్రూంలోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. ఎంతకీ తమ కుమారుడు బాత్రూంలో నుంచి బయటికి రాకపోవడంతో అనుమానంతో వారు బాత్రూం తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే మృతి చెందాడు. ఆ తర్వాత అతని మొబైల్ను పరిశీలించగా అందులో ఆ యువతికి పంపిన మెసేజ్లు తదితర వివరాలు బయటపడ్డాయి. తర్జనభర్జన అనంతరం మంగళవారం ఉదయం మృతుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ అమ్మాయి ఎవరు.? నరసింహ ఫోన్ చేసిన మొబైల్ నంబర్తో పాటు బ్యాంకు అకౌంట్ నెంబర్ను పోలీసులు పరిశీలించారు. విశాఖపట్నంలోని సీతంపేటకు చెందిన గార్లే కళ్యాణిగా ఉంది. కాగా బ్యాంక్ అకౌంట్కు ఇచ్చిన ఫోన్ నంబరు మరోలా ఉంది. ఆ యువకుడు ప్రతిరోజు ఫోన్ చేసిన నంబర్ వివరాలు సేకరిస్తే అక్కడ అనుశ్రీగా ఉంది. దీంతో ఫోన్ కాల్స్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
ఎఫ్బీలో వృద్ధ మహిళకు గాలమేసి..!
ఫేస్బుక్లో ఆమెకు 'ఫ్రెండ్' పేరిట అతడు పరిచయమయ్యాడు. తనకు కష్టాలు ఉన్నాయని నమ్మబలికాడు. 'పోర్ట్ ఫీజు' కట్టడానికి తనను సహకరించాలని కోరాడు. పాపం ఆ వృద్ధ మహిళ అతడి ఉచ్చులో పడింది. తన జీవితకాలం దాచుకొని.. తన కలైన బీఎండబ్ల్యూ కారు కొనేందుకు అట్టిపెట్టుకున్న 78వేల డాలర్ల (రూ. 52లక్షల)ను అతడి చేతిలో పోసింది. ముక్కుమొఖం తెలియకున్నా.. అతడు ఇచ్చిన వివిధ బ్యాంకు అకౌంట్లకు ఆ డబ్బును జమచేసింది. ఈ డబ్బును వడ్డీతో సహా చెల్లిస్తానని నమ్మబలికాడు. గత ఏడాది ఆగస్టులో మొదలైన ఈ వ్యవహరం ఏడాది చివరినాటికి ఆమె అతడి చేతిలో పోయడంతో ముగిసింది. ఆ తర్వాత అతడు కనిపించకపోవడంతో ఆమె లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగింది. తాను మోసపోయానని ఆలస్యంగా గుర్తించిన బాధిత మహిళ తాజాగా, తాపీగా పోలీసులను ఆశ్రయించింది. ముక్కుమొఖం తెలియని వ్యక్తికి అంత డబ్బు ఎలా చేరిందనే అంశాన్ని పెన్సిల్వేనియా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. కాలిఫోర్నియా, ఫ్లోరిడా, టెక్సాస్తోపాటు, భారత్లోని బ్యాంకుల్లోకి ఈ డబ్బు ప్రవహించినట్టు తెలుస్తోంది. ఈ డబ్బు వెళ్లిన విధాన్నాని ట్రాక్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఎఫ్బీ ఫ్రెండ్ తో వాలెంటైన్స్ డేకు వెళ్లి!
న్యూఢిల్లీ: ఫేస్బుక్లో పరిచయమైన స్నేహితురాలితో ప్రేమికుల రోజును జరుపుకోవడానికి వెళ్లిన ఓ యువకుడు దారుణంగా హతమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు అతన్ని నాలుగు అంతస్తుల బంగ్లా నుంచి తోసివేసి చంపేశారు. గుర్గావ్లోని సుశాంత్ లోక్ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ హత్య ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రించేందుకు నిందితులు ప్రయత్నించారు. అయితే యువకుడి స్నేహితురాలు పోలీసుల ముందు నోరు విప్పడంతో అసలు రహస్యం వెలుగులోకి వచ్చింది. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఈశ్వర్ అలియాస్ నిషాంత్ ఫేస్బుక్లో పరిచయమైన యువతితో ఏడు నెలలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు సందర్భంగా గుర్గావ్కు రావాలని ఆ యువతి నిషాంత్ను కోరింది. గుర్గావ్లోని హుడా సిటీ సెంటర్ వద్ద ఇద్దరు కలుసుకున్నారు. ఆ తర్వాత సుశాంత్ లోక్ ఏరియాలోని ఓ నాలుగంతస్తుల భవనంలోకి వెళ్లారు. అక్కడ వారిద్దరిని చూసిన యువతి భావ రమేశ్ (30), అతని డ్రైవర్ అనిల్ కుమార్ (25) ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే నిషాంత్పై వాళ్లు దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. ఆ తర్వాత అతన్ని బాల్కనీ నుంచి కిందకు తోసేసి చంపేశారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. -
ఫేస్బుక్ ఫాలోయర్ తెచ్చిన తంటా
లండన్ : ఫేస్బుక్లో చేసే పోస్టింగ్స్తో పాటు ఫాలోయర్స్ వల్ల కూడా సమస్యలొస్తున్నాయి. తెలిసో తెలియకో ఏదో పోస్ట్ చేయడం వల్ల ఇబ్బంది రావడమే కాదు. మనల్ని ఫాలో అవుతున్న వారి వల్ల కూడా తంటాలు తప్పడం లేదు. ఇటీవలి కాలంలో అమెరికా వెళుతున్న వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్యారిస్ బాంబు దాడుల ఘటన అనంతరం ఇలాంటి తనిఖీలు మరీ ఎక్కువయ్యాయి. ఫేస్బుక్లో ఫాలోయర్స్ వల్ల ఇబ్బంది తలెత్తిన తాజా సంఘటన వెలుగు చూసింది. ఇదెవరికో కాదు అప్పటికే నాలుగు సార్లు అమెరికా పర్యటించిన అభ్యర్థికే ఈ సమస్య తలెత్తింది. బ్రిటన్కు చెందిన ఇమామ్ అజ్మల్ మస్రూర్కు అమెరికా అధికారుల నుంచి ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. బంగ్లాదేశ్ కు చెందిన అజ్మల్ మస్రూర్ బ్రిటన్ లో స్థిరపడ్డాడు. 2010లో బ్రిటన్ లోని లిబరల్ డెమాక్రట్స్ తరఫున బేథల్ గ్రీన్ అండ్ బొ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బ్రిటన్ ముస్లిం కౌన్సిల్ సభ్యుడిగా పనిచేయడమే కాకుండా వివిధ టెలివిజన్ చానెళ్లకు ప్రజెంటర్ గా అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. ఇప్పటికే నాలుగుసార్లు అమెరికా పర్యటించిన అజ్మల్ డిసెంబర్ నెలలో మాత్రం చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్లోని క్వీన్స్ మసీదులో జరిగే కార్యక్రమంలో పాల్గొనడానికి లండన్ హిత్రూ నుంచి జేఏఎఫ్ విమానాశ్రయానికి బయలుదేరగా విమానాశ్రయంలో అధికారులు ఆయనను అడ్డుకున్నారు. అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. వీసా ఉన్నప్పటికీ ఎందుకు అడ్డుకున్నారని అజ్మల్ మస్రూర్ ప్రశ్నించినప్పుడు ఆయనకు అమెరికా అధికారుల నుంచి ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. ఆయన ఫేస్బుక్లోని 4500 మంది ఫాలోయర్స్లో ఒక వ్యక్తి అధికారులకు నచ్చలేదు. అజ్మల్ గతంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు చంపేస్తామని బెదిరింపులు కూడా వచ్చాయి. వాటిని దృష్టిలో ఉంచుకొనే ఆయన బిజినెస్ వీసాను రద్దు చేసినట్టు అమెరికన్ ఎంబసీ అధికారులు వెళ్లడించారు. ఫేస్బుక్లో వేలాది మంది తనను ఫాలో అవుతుంటారని, అందులో వారెవరో కూడా తనకు తెలియదని, దానిపై తనకు నియంత్రణ కూడా ఉండదని, నేను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కూడా ఫాలో కావొచ్చు. సోషల్ మీడియా అదొక ఓపెన్ ఫోరం. పైగా అమెరికా అధికారులు ఎవరి గురించి చెబుతున్నారో కూడా సమాధానమివ్వలేదని అజ్మల్ అంటున్నారు. అమెరికా వెళ్లకుండా తనను ఎందుకు బ్యాన్ చేశారో చెప్పాల్సిన అవసరముందని అంటున్నాడు. ఈ విషయంలో అమెరికా అధికారుల సమాధానం కోసం వేచిచూస్తున్నా.. దాని తర్వాత న్యాయవాదులను సంప్రదిస్తానని అజ్మల్ చెబుతున్నారు. అమెరికా పర్యటించే విషయంలో ఇలాంటి చేదు అనుభవాలు ఎదురైన వారి వివరాల కోసం అజ్మల్ ఇప్పుడో వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. -
ఏడాదిపాటు ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఫొటోలు తీసి..
సెయింట్ లూయిస్: ఫేస్బుక్ అనగానే అదో దగ్గరగా ఉన్నట్లు అనిపించే దూరంగా ఉండే మనుషుల గుంపు. ఇందులో ఒకరికి ఒకరు తెలిసినవారితోపాటు తెలియని వారు కూడా ఉంటారు. ఫేస్ బుక్ ఖాతా తెరవగానే తొలుత స్నేహితులకు ప్రాధాన్యం ఇచ్చి వారిని యాడ్ చేసుకున్నా.. తర్వాత మాత్రం తెలియనివారినే ఎక్కువగా స్నేహితులుగా చేసుకుంటుంటాం. ఆలోచనలు, ఫోటోలను పంచుకోవడం ద్వారా ఒకరంటే ఒకరికి ఓ రకమైన అభిమానం ఏర్పడి వెంటనే స్నేహితుడిగా ఆహ్వానిస్తాం. అయితే, ఇలా మీ ఫేస్ బుక్ లో వందల నుంచి వేలమంది స్నేహితులు ఉంటుంటారు. కానీ, చాలామందికి వారి అసలైన ఫేస్ లు ఎలా ఉంటాయో తెలియదు. అందుకు ప్రధాన కారణం చాలామంది తమ ప్రొఫైల్ పిక్చర్ ను ఒరిజినల్ గా పెట్టరు.. ఫ్లవరో, ప్రకృతి, ఇష్టమైన జంతువో, డిజైనో లేదంటే తమకు నచ్చిన హీరోనో హీరోయిన్ నో ప్రొఫైల్ పిక్ గా పెడుతుంటారు. ఇలా ఉండటం వల్ల మీ ఫేస్ బుక్ స్నేహితుడు మీ పక్కనే ఉన్నా, మీరు ప్రయాణించే సమయంలో మీ పక్క సీట్లోనే ఉన్నా గుర్తించే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎప్పుడైన మీ ఫేస్ బుక్ స్నేహితులు అసలు ఎలా ఉంటారోనని చూడాలనిపించిందా.. సరిగ్గా సెయింట్ లూయిస్కు చెందిన కోరే వూడ్రఫ్ అనే ఫొటో గ్రాఫర్ కు అలాగే అనిపించింది. వెంటనే చేతిలో కెమెరా తీసుకొని ఒక ఏడాది కాలంపాటు తన ఫేస్ బుక్ స్నేహితుల అసలైన ఫేస్ లను క్లిక్ మనిపించే పనిలో పడ్డాడు. అలా మొత్తం 738 మంది ఫేస్ బుక్ స్నేహితుల ఫొటోలను తీసుకున్నాడు. అవి కూడా సాదాసీదాగా కాకుండా తన ఐడియాలను జొప్పించి ఓ ఫొటో గ్రాఫర్ గా తన ప్రతిభ చాటుకున్నాడు. చక్కటి ఆల్బమ్ రూపొందించాడు. ఈ ఫొటోలు మొత్తం తీయడానికి ముందు పెద్ద కసరత్తే చేశాడు. ఫొటోలు తీయడానికి ముందు వారి అనుమతి కూడా వూడ్రఫ్ తీసుకున్నాడు. -
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంటూ పెళ్లి చేసుకుని..
బంజారాహిల్స్: ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడు బీటెక్ చదివానని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని ఇంటర్ విద్యార్థినిని నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. గర్భవతి అయిన భార్యను వదిలి పారిపోయాడు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల కథనం ప్రకారం... కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని వడ్డేశ్వరం ప్రాంతానికి చెందిన చావలి ఆనంద్బాబు అలియాస్ అనిల్(26) ఖమ్మంకు చెందిన ఇంటర్ విద్యార్థిని (19)ను గతేడాది నవంబర్లో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఇద్దరూ ప్రేమించుకొని ఏడాది మార్చిలో పెళ్లి చేసుకున్నారు. ఆనంద్బాబు ఆ యువతిని నగరంలోని శ్రీకృష్ణానగర్కు తీసుకొచ్చి కాపురం పెట్టాడు. అతను నిరుద్యోగని, సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కాదని, పదో తరగతి ఫెయిల్ అయ్యాడని ఆలస్యంగా ఆ యువతికి తెలిసింది. ఆమె ఒకసారి గర్భదాలిస్తే అబార్షన్ చేయించాడు. మరోసారి గర్భందాల్చిన ఆమెకు ఏడు నెలలకే ఇంట్లోనే పురిటి నొప్పులు రావడంతో మగశిశువు పుట్టి చనిపోయాడు. ఆ తర్వాత మళ్లీ గర్భం దాల్చింది. రెండు వారాల క్రితం భార్యకు చెప్పకుండా ఆనంద్బాబు ఎటో వెళ్లిపోయాడు. ఫోన్చేస్తే స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించిన ఆమె సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
'ఫేస్బుక్లో కాదు.. నిజంగా ఫ్రెండ్స్ అవ్వండి'
భారత్, పాకిస్థాన్ ప్రజలు తమ సంబంధాలను మెరుగుపర్చుకోవాలని, అయితే కేవలం ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో కాకుండా నిజ జీవితంలో ఫ్రెండ్స్ అవ్వాలని సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా అన్నారు. పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ అహ్మద్ పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తాను గతంలో చాలాసార్లు పాకిస్థాన్ వెళ్లానని, అప్పుడు అక్కడివాళ్ల ప్రేమాభిమానాలు చవిచూశానని చెప్పారు. ఏ ఒక్కసారీ అక్కడి ఆందోళనల కారణంగా తన ప్రదర్శనలు రద్దుచేసుకోవాల్సిన పరిస్థితి తనకు ఎదురు కాలేదని ఆయన తెలిపారు. ఖుర్షీద్ సొంత నగరమైన లాహోర్లో తనకు లభించిన లాంటి స్వాగతాన్నే ఆయనకు కూడా మనం ఇక్కడ ఇచ్చి ఉండాల్సిందని నసీరుద్దీన్ షా అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రధాన వక్త సుధీంద్ర కులకర్ణి మీద శివసేన కార్యకర్తలు నల్ల ఇంకు పోయడాన్ని అనాగరికమైన చర్యగా ఆయన విమర్శించారు. నల్ల ఇంకు పడినా కూడా అలాగే నల్లటి మొహంతో విలేకరుల సమావేశంలో పాల్గొనడం ద్వారా సుధీంద్ర కులకర్ణి అపార ధైర్యాన్ని ప్రదర్శించారని షా అన్నారు. -
నా భార్యను నేను మార్చలేనా?!
జీవన గమనం రచయితగారూ, నా భార్య మీద నాకున్న ఫిర్యాదులన్నీ రాస్తున్నాను. వీటిని ఎలా డీల్ చేయాలో దయచేసి తెలుపగలరు. - పసుపులేటి, ఖమ్మం అయ్యా, మీరు రాసిన 16 ఫిర్యా దులూ చదివాను. మీ శ్రీమతిగార్ని వ్రాయమంటే ఆమె కూడా మీ గురించి ఈ విధంగానే రాస్తారని నా ఉద్దేశం. కొన్ని ఉదాహరణలు ఇస్తున్నాను. చదవండి: ‘‘... నా గురించి ఆలోచించడు. అన్నీ తను చెప్పినట్టే జరగాలనుకుంటాడు. సిగరెట్లూ, డ్రింక్సూ తగ్గించుకుంటే బాగుంటుంది. ఆయనకి కోపం వస్తే తట్టుకోలేం. ఆయన స్నేహితులందరూ బేవార్స్గాళ్లు. అనవసరంగా వాళ్లతో సమయం వృథా చేసుకుంటారు. ఎక్కువసేపు నాతో గడపరు. నాతో ఆర్థిక విషయాలేవీ చర్చించరు. నిజానికి ఆయన రాబడి ఎంతో కూడా నాకు తెలీదు. తన తరఫు వారితో చాలా దగ్గరితనం ప్రదర్శిస్తారు. అన్నిటికీ తల్లినే సంప్రదిస్తాడు. పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిస్తే తన బాధ్యత తీరిపోయిందనుకుంటాడు. మా బంధువుల గురించీ, తల్లిదండ్రుల గురించీ మనసు బాధ కలిగేలా హేళనగా ప్రవర్తిస్తాడు.’’ చాలా? ఇంకా ఫిర్యాదులు చెప్ప మంటారా? ప్రతీ సమస్యకీ పరిష్కారం విడాకులు కాదు. మనం అవతలి వారిని మార్చాలనుకోవడం భ్రమ. ఇంపాసిబుల్. మనం మారటమే ఉత్తమమైన మార్గం. మీరు పంపిన ఫిర్యాదులూ, నేను రాసినవీ కలిపి ఇద్దరూ చర్చించండి. కొన్ని కామన్ పరిష్కారాలు దొరకవచ్చు. ఫేస్బుక్ స్నేహాల మీద మీ అభిప్రాయమేమిటి? - రామకృష్ణ, మెదక్ అవతలివారెవరో తెలియదు. అయినా తరచూ మాట్లాడాలని అనిపించటం, గాఢంగా స్నేహం చెయ్యాలన్న తపన, ఫోన్లో ఆత్మీయమైన కబుర్లు, ఒకరోజు చాటింగ్ చేయకపోతే మనసు కొట్టు కోవటం, స్కైపులో చూసుకోకపోతే స్కై కూలిపోయిన భావన మొదలైనవి ఈ విభాగంలోకి వస్తాయి. ఎదుటి వ్యక్తి తెలి యని కారణంగా, కావలసినట్టు ఊహించు కునే వీలుండటం వల్ల, ఈ స్నేహాలు చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అంతే ప్రమాదకరంగా పరిణమిస్తాయి కూడా. అమ్మాయిల పేరుతో ఫేస్బుక్ నడిపే అబ్బాయిల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫేస్ బుక్లో అమ్మాయి చెప్పే సినిమా కష్టాలు విని, ఆమె అకౌంటులో పదివేలకు పైగా వేసిన తరువాత గానీ ‘తాను వేస్తోంది అబ్బాయి అకౌంటులో’ అన్న విషయం నా స్నేహితుడి మనవడికి తెలియరాలేదు. ఆర్నెల్ల క్రితం జరిగిన మరో యథార్థ సంఘటన పేపర్లో చదివే ఉంటారు. అమెరికాలో సెటిలైన ఒక గుంటూరు ముద్దుగుమ్మకి ఫేస్బుక్లో ఒక టంగుటూరు కుర్రాడు పరిచయం అయ్యాడు. మూడ్రోజుల పరిచయం మూడు రాత్రుల్లో ప్రేమగా మారి, హద్దులు దాటి, సరిహద్దులు దాటి, గాలి ముద్దులతో ముదిరి, ఏకాంతపు సద్దుల్లో మాటల రొమాన్స్ వరకూ వెళ్లింది. మను వాడబోయేవాడు, మనవాడే కదా అని తనువంతా స్కైప్లో ఆచ్ఛాదన లేకుండా చూపించింది. ఇతగాడు దాన్ని రికార్డ్ చేసి, రికార్డ్ స్థాయిలో బ్లాక్మెయిల్ చేయసాగాడు. కొన్ని లక్షలు కోల్పోయాక అతడి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఇంటరాగేషన్లో తేలిందేమిటంటే, అమ్మాయిల్ని ఈ విధంగా మోసం చేసి పబ్బం గడుపుకోవటమే అతగాడి వృత్తట. ఆర్నెల్ల క్రితం పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫోను స్నేహాలూ, ఫేస్బుక్ పరిచయాలూ సాధారణంగా ఈ విధంగానే ముగుస్తాయి. మగవాళ్లే కాదు. అమ్మాయిలూ తెలివి మీరిపోయారు. సెల్-కార్డ్కి డబ్బుల్లేకపోయినా ‘ఖరీదు’గా నటిస్తూ, అవతలివారిచే ధారాళంగా ఖర్చు పెట్టించేవాళ్లూ, నలుగురైదుగురు స్నేహితుల్ని ఒకేసారి మెయిన్టైన్ చేసేవారూ, కొత్త స్నేహితుడు దొరగ్గానే పాత ఫ్రెండ్ నంబరు ఆటో-రిజెక్ట్ లిస్ట్లో పెట్టేవారూ, ఒకరు పంపిన ప్రేమ సందేశాన్ని మరొకరికి పంపి, ఆ జవాబుని తిరిగి మొదటి ప్రేమికుడికి పంపి చేతులు దులుపుకునేవారూ ఉన్నారు. సినీరంగంలో అమ్మాయిలు కాలు జారక తప్పదని ఒక అభిప్రాయం ఉన్నది. మోసపోయేది అమ్మాయిలే కాదు. ఇటీవల కాలంలో దాదాపు అయిదారుగురు పెద్ద పెద్ద దర్శకులు, సినీ రచయితలు కూడా ఇలాంటి బంధాల్లో ఇరుక్కుని, బ్లాక్ మెయిల్కి గురై, చాలా మానసిక వ్యథ అనుభవించి, కోట్లు కుమ్మరించి ఆ కష్టాల్నుంచి బయటపడ్డారు. ఒక దర్శకుడికి ఫోన్లో ఒకావిడ పరిచయమై, ఇంటర్నెట్లో అందమైన అమ్మాయి ఫొటో పంపి, మానసికంగా దగ్గరై (!), ‘ఏకాంతంలో నీ భార్యతో నీవెలా ఆత్మీయంగా గడుపుతావో నాకు చూపించవా’ అని గోముగా రెచ్చగొట్టి, ఆపై అతను జరిపిన సంభాషణా, పంపిన వీడియోలూ, భార్యపై కామెంట్సూ టీవీ చానల్స్లో బహిర్గతం చేస్తానని బెదిరించి, లక్షలు వసూలు చేసింది. హీరో విలన్ల మధ్య ఎత్తుకి పై ఎత్తు కథాంశాలున్న సినిమాలు తీస్తాడని పేరున్న సదరు నంబర్ వన్ దర్శకుడి నిర్హేతుక భయం చూసి సినీపరిశ్రమ విస్తుబోయింది. - యండమూరి వీరేంద్రనాథ్ ప్రకటన: దైనందిన జీవితంలో ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటాం. వాటిని ఎలా అధిగమించాలో తెలియక, మన వ్యక్తిత్వాన్ని ఎలా మలచుకోవాలో, ఉన్నతమైన వ్యక్తిగా ఎలా ఎదగాలో తెలియక తల్లడిల్లుతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో కనుక ఉంటే మాకు రాయండి. జీవన గమనంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు యండమూరి పరిష్కారాలు సూచిస్తారు. మా చిరునామా: జీవన గమనం, సాక్షి ఫన్డే, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
మోస్ట్ పాపులర్ యూజర్ ఎవరు?
పొద్దున లేవగానే పళ్లు తోముకోవడం ఎంత సహజమో, ఫేస్ బుక్ చూడడం అంతే సహజంగా మారింది. లైకులు, షేరింగులతో 'ముఖపుస్తకం' తెరవడం నెటిజన్లకు అలవాటుగా మారింది. 11 ఏళ్ల క్రితం ఇంటర్నెట్లోకి దూసుకొచ్చి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఫేస్ బుక్ సోషల్ మీడియాలో అత్యధిక మంది వీక్షించే వెబ్ సైట్ గా ఫేమస్ అయింది. నెలకు దాదాపు 139 కోట్ల మంది ఫేస్ బుక్ వీక్షిస్తున్నారు. ఇక సెలబ్రిటీల ఫేస్ బుక్ పేజీలకు కుప్పలు తెప్పలుగా లైకులు వచ్చిపడుతుంటాయి. అత్యధిక లైకులతో అగ్రస్థానంలో ఉన్న 10 మంది సెలబ్రిటీల పేర్లను సోషల్ మాడియా ట్రాకింగ్ సంస్థ 'ఫ్యాన్ పేజీ లిస్ట్' వెల్లడించింది. పోర్చుగీస్, రియల్ మాడ్రిడ్ సాకర్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అత్యధిక లైకులతో అగ్రస్థానంలో నిలిచాడు. 10,35,76,615 లైకులతో టాప్ లో ఉన్నాడు. సంపాదనలో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. దాదాపు రూ.16 వేల కోట్ల సంపదతో ప్రపంచ సంపన్న ఆటగాళ్ల లిస్టులో రెండో స్థానంలో ఉన్నాడు. డేవిడ్ బెక్ హామ్ అతడి కంటే ముందున్నాడు. కొలంబియా పాప్ సింగర్, బెల్లీ డాన్సర్ షకీరా ఫేస్ బుక్ ను షేక్ చేస్తోంది. 10,07,32, 587 లైకులతో రెండో స్థానం దక్కించుకుంది. సుమారు రూ. 14వేల కోట్ల సంపద కలిగిన షకీరా గోల్డెన్ గ్లోబ్, గ్రామీ అవార్డులకు నామినేట్ అయింది. యూనిసెఫ్ అంబాసిడర్ గానూ ఆమె కొనసాగుతోంది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు విన్ డీసెల్ 93,17,23,15 లైకులతో మూడో స్థానంలో ఉన్నాడు. గ్లామర్ ఫోటోలకు తోడు టిడ్ బిట్స్ జోడించి చేసే ఫేస్ బుక్ పోస్టులు అభిమానులను ఆకట్టుకుంటాయి. అతడి సంపద సుమారుగా 480 కోట్ల రూపాయలు. ఎమినెమ్ గా సుప్రసిద్ధుడైన అమెరికన్ రాపర్ పేస్ బుక్ లో 91,99,19,71 లైకులు అందుకుని 4వ స్థానంలో నిలిచాడు. నిర్మాత, నటుడు కూడా అయిన ఎమినెమ్ ఆస్తుల విలువ సుమారు రూ. 12 వేల కోట్లు. పాప్ గాయని రిహానా ఫేస్ బుక్ పేజీ అభిమానుల సందేశాలతో సదా నిండివుంటుంది. ఆమె ఫేస్ బుక్ ఖాతాలో 81,54,93,44 లైకులు ఉన్నాయి. పాప్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఆమె సంపద దాదాపుగా రూ. 9వేల కోట్లు. 'మోస్ లైక్స్' లిస్ట్ లో ఐదో స్థానంలో కొనసాగుతోంది. సంపన్న సాకర్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 77,88,14,94 లైకులతో సిక్త్ ప్లేస్ లో ఉన్నాడు. అర్జెంటీనా, ఎఫ్ బీ బార్సిలోనా తరపున ఆడుతున్న మెస్సీ నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 11 వేల కోట్లు. చనిపోయిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ పై అభిమానుల క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 75,30,04,78 లైకులతో పాప్ చక్రవర్తికి ఏడో స్థానంలో నిలిపారు అభిమానులు. మైఖేల్ జాక్సన్ సంతోషంగా గడిపిన రోజుల్లో దిగిన ఫోటోలతో అతడి ఫేస్ బుక్ పేజీ నిండివుంటుంది. మరణించిన తరువాత అత్యధిక ఆదాయాన్ని ఆర్జించిన సెలబ్రిటీస్ జాబితాలో టాప్ లో నిలిచాడు. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ 73,69,14,92 లైకులతో 8వ స్థానంలో ఉన్నాడు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న విల్ స్మిత్ సంపద సుమారు రూ. 14 వేల కోట్లు. మరణించి 34 ఏళ్లు గడిచినా పాప్ సింగర్ బాబ్ మార్లేకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అతడి పేరుతో ఉన్న ఫేస్ బుక్ పేజీలో 73,51,38,81 లైకులు ఉన్నాయి. అత్యధిక లైకుల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. 'జస్టిన్ ఐ లవ్ యూ, జస్టిన్ ఐ హేట్ యూ' సందేశాలతో యువ పాప్ సంచలనం జస్టిన్ బీబర్ ఫేస్ బుక్ పేజీ నిండిపోయి వుంటుంది. ఫేస్ బుక్ లైకులు అతడి బ్యాంకు బాలెన్స్ ను మించిపోయాయి. 72,72,47,46 లైకులతో పదో స్థానంలో నిలిచాడు. అతడి సంపద రూ. 12 వేల కోట్లు. -
నెట్ స్లోగా ఉందా? ఫేస్ బుక్ లైట్ ట్రై చేయండి
న్యూయార్క్: ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు కూడా స్మార్ట్ గా తమ వెబ్ సైట్ చూసేందుకు కొత్త యాప్ ను అధికారికంగా ప్రవేశపెట్టనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటిచింది. ఫేస్ బుక్ లైట్ పేరుతో తయారు చేసిన ఈ ఆండ్రాయిడ్ యాప్ ను తక్కువ డేటాతో వినియోగించుకోవచ్చు. ఏడాదిపైగా దీన్ని పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని ప్రాజెక్టు మేనేజర్ విజయ్ శంకర్ తెలిపారు. ఆగ్నేయాసియా, ఆఫ్రికాల్లో జనవరి నుంచి దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశామన్నారు. గూగుల్ ప్లే యాప్ స్టోర్ లో నాలుగు స్టార్ల రేటింగ్ తో పాటు 50 వేల రివ్యూలు వచ్చాయన్నారు. ఒక మెగా బైట్ కన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫేస్ బుక్ లైట్ యాప్ ను సులువుగా ఇన్ స్టాల్ చేసి వాడుకోవచ్చని వెల్లడించారు. ఫేస్ బుక్ యాప్ ను వాడినట్టుగానే దీన్ని వాడుకోవచ్చని, ఎటువంటి మార్పులు లేవన్నారు. ఫేస్ బుక్ లైట్ యాప్ ను ఆసియాలో కొన్ని దేశాల్లో ప్రవేశపెట్టి తర్వాత లాటిన్ అమెరికా, ఆఫ్రికా, యూరప్ విస్తరిస్తామని విజయ్ శంకర్ తెలిపారు. -
ఎయిర్పోర్టులో ఫేస్బుక్ ఫ్రెండ్స్ హల్చల్
అనుమతి లేకుండా స్కేటింగ్ చేస్తుండడంతో హెచ్చరించిన పోలీసులు శంషాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులోని పార్కింగ్ రహదారుల్లో ఫేస్బుక్ ఫ్రెండ్స్ హల్చల్ చేశారు. అనుమతి లేకుండా స్కేటింగ్ చేస్తుండడంతో విమానాశ్రయ వర్గాలు ఇచ్చిన సమాచారంతో ఆర్జీఐఏ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలేశారు. ఫేస్బుక్ స్నేహితులుగా ఉన్న నగరానికి చెందిన త్రిభువన్, కార్తీక్, రాహుల్, సుశాంత్ కుమార్, అబ్నాన్ అనే ఐదుగురు యువకులు బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్టులోని పార్కింగ్ రహదారుల్లో స్కేటింగ్ చేస్తూ.. అల్లరి చేయడంతో గమనించిన విమానాశ్రయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్కేటింగ్ చేయడంపై వారిని హెచ్చరించి వదిలేశారు. స్నేహితులు ఐదుగురిలో ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, సీఏ చదువుతున్నవారు ఉన్నారు. విమానాశ్రయంలో తరచూ జరిగే కార్టింగ్ రేసులకు ప్రభావితమై వారు ఇక్కడికి చేరుకున్నట్లు తెలిసింది. -
ఫేస్బుక్ పరిచయంతో ఘరానా మోసం
గుంటూరు: ఫేస్బుక్లో పరిచయమైన వ్యక్తిని మోసం చేసి బంగారు బిస్కెట్ చూపించి రూ. 40 వేలు తీసుకుని పరారైన ఘటనపై గుంటూరు అరండల్పేట పోలీస్స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. సీఐ జి.శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన మొయ్యి లక్ష్మణవర్మ సినీ రంగంలో అసిస్టెంట్ డెరైక్టర్గా పని చేస్తుంటాడు. ఆయనకు ఫేస్బుక్లో సింధు అనే యువతి పరిచయమైంది. ఆమె లక్ష్మణ్వర్మతో మంచి సినిమా తీయించేందుకు తిరుపతికి చెందిన అజయ్రెడ్డి భాస్కర్రెడ్డిని నిర్మాతగా పరిచయం చేస్తూ ఆయన ఫోన్ నంబర్ మెసేజ్ చేసింది. లక్ష్మణ్వర్మ అజయ్రెడ్డితో ఫోన్లో మాట్లాడి అరండల్పేటలో ఓ ప్రైవేటు హోటల్లో కలుసుకోవల్సిందిగా చెప్పాడు. అక్కడ కలిసిన లక్ష్మణ్వర్మకు తాను సినిమాలకు నిర్మాతగా చేయడంతో పాటు బంగారం వ్యాపారం కూడా చేస్తానంటూ పరిచయం చేసుకున్న అజయ్రెడ్డి ఓ బంగారు బిస్కట్ను చూపించి కొంటారా అని అడిగారు. దాన్ని లక్ష్మణ్వర్మ బంగారు దుకాణానికి తీసుకెళ్లి చూపగా మంచిదేనని చెప్పారు. తనవద్ద ప్రస్తుతం రూ. 40 వేలే ఉన్నట్లు చెప్పడంతో అయితే ఆ మొత్తం తీసుకుని బిస్కెట్ కట్ చేసి తీసుకు వస్తానంటూ వెళ్లిన భాస్కర్రెడ్డి డబ్బుతో పరారయ్యాడు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జర జాగ్రత్త ఫేస్'బుక్' చేస్తుంది
► పెడదోవ పడుతున్న యువత ►చాటింగ్తో సమయం వృధా ►అపరిచిత వ్యక్తులతో ఫేస్బుక్ ►స్నేహం ప్రమాదకరం రాత్రి లేదు... పగలూ లేదు ఎప్పుడు చూసినా సెల్ఫోన్లు, కంప్యూటర్ల ముందు కూర్చుని ఏక చాటింగ్లే. పోస్టులు, లైక్లు, కామెంట్లు, షేర్లుతో కాలంగడిపేస్తున్నారు నేటి యువత. ఎనీటైం..ఎనీ ప్లేస్ చేతిలో సెల్తో చాటింగ్. ఇంటర్నెట్, ఫేస్బుక్ మాయలో పడ్డవారెవరైనా సరే వారికి ఆకలి దప్పికలుండవు. యువతీ, యువకులు ఫేస్బుక్ మాయలోపడి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవడమే కాకుండా కొన్ని సందర్భాల్లో అడ్డంగా బుక్ అవుతూ ఊచలు లెక్కిస్తున్నారు. ఉప్పలగుప్తం : మారిన సాంకేతిక విప్లవంలో వింత ప్రపంచం లాంటి ఇంటర్నెట్, ఫేస్బుక్ అకౌంట్లతో మునిగి తేలుతున్న వారికి వయస్సుతో పనిలేదనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫేస్బుక్ అకౌంట్ కలిగి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో విరివిగా విస్తరించిన సోషల్ నెట్వర్క్గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. తమకు నచ్చిన అంశాన్ని స్నేహితులతో పంచుకోవడం, నచ్చిన చిత్రాలను, సందేశాలను పోస్ట్ చేయడం. ఆ తరువాత వాటికి ఎన్ని లైక్లు, షేర్లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం పరిపాటయింది. కళాశాలల, పాఠశాలల విద్యార్థులే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫేస్బుక్తో నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా, సందర్భమేదైనా ఫేస్బుక్ చర్చలే కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ఫోన్లనో ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన క్షణాల్లో నేడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఏమూల ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరినీ ఫేస్బుక్ వైపు మళ్ళిస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో యువత ఫేస్బుక్ ద్వారా చేసుకున్న చాటింగ్లు ఘర్షణలకు దారితీయడం, ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటూ తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇంటర్ విద్యార్థినితో ఓ ఆకతాయి చేసిన చాటింగ్ ఆ యువతి ఇల్లు విడిచి వచ్చేలా చేసింది. దీంతో కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే ఆదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలి. తమ పిల్లలు కంప్యూటర్, ల్యాప్టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నారు. వాటిని ఏవిధంగా వాడుతున్నారనే దానిపై దృష్టిసారించాలి. అడగ్గానే ఇంటర్ విద్యార్థికి కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొని చేతిలో పెడుతున్నారు. ఫోన్లలో గేమ్లాడుతున్నామని చెప్పి ఎక్కువ సమయం ఫేస్బుక్ చాటింగ్లు చేస్తుంటారు.. వాటిని గమనించాలి. పిల్లల స్నేహాలు, పరిచయాలు, ప్రవర్తనలపై ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఆఫర్లతో హోరెత్తిస్తున్న ఆపరేటర్లు వినియోగదారుల వాడకాన్ని దృష్టిలో పెటుకుని వివిధ కంపెనీలకు చెందిన సెల్ఫోన్ ఆపరేటర్లు ఇంటర్నెట్, ఫేస్బుక్ల అకౌంట్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆఫర్లు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వినియోగించుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెట్వర్కలు ఒక్క రూపాయితో రాత్రి ఫేస్బుక్, రూ.12 లతో అర్ధరాత్రి దాటిన తరువాత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ యువతకోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి. బినామీపేర్లతో అకౌంట్లు ఎన్నో... కొందరు బినామీ పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మాయిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్లతో ఫ్రెండ్షిప్లు పెంచుకుని వారితో చాటింగ్ చేస్తారు. ఒకరికి ఒకరు తెలియక పోయినా రిక్వెస్ట్లతో వేలసంఖ్యలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరిగిపోతారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు అప్లోడ్ చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత కామెంట్లతో మెసేజ్లు పెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఒక ఫేస్బుక్ అకౌంట్కు ఫ్రెండ్స్గా ఉన్న వారందరికి ఈ మెసేజ్ లేదా చిత్రాలు అప్లోడ్ అవుతాయి. వీటన్నింటినీ బినామీ అకౌంట్ల నుంచి పంపుతున్నారు. వీటివల్ల వచ్చే సమస్యల్లో చిక్కుకుని అమాయకులు కేసుల్లో ఇరుక్కుని చట్టానికి చిక్కుతున్నారు. సైబర్ నేరాల గురించి తెలియని అమాయకులు ఫేస్బుక్లో ఫొటోలు పెట్టుకుంటే వాటిని డౌన్లోడ్ చేసి కామెంట్లతో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట చోటుచేసుకోవడం చూస్తున్నాం. ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితేగాని బినామీల సంగతి బయటకు రావడంలేదు. పోలీస్ల దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్ అకౌంట్ గురించి ఆరాతీస్తే అసలు ఫేస్బుక్ అంటే తెలియని అమాయకుల వివరాలు బయటపడుతున్నాయి. ఎక్కువగా నెట్ సెంటర్కు వె ళ్లి చాటింగ్ చేసేవారు బినామీ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయకులను ఇరికిస్తున్నారు. గంటల తరబడి చాటింగ్ హైస్కూల్ స్థాయి విద్యార్థి సైతం ఫేస్బుక్ వినియోగిస్తున్నాడంటే యూజర్లు ఏ సంఖ్యలో ఉన్నారో అర్థమవుతుంది. చదువుకంటే ముందు దీనికి బానిసగా మారుతూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటింగ్లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు యువతీ యువకులు. ఈ తరహ లోకంలో ఎందరో అపరిచిత వ్యక్తులు తారసపడుతున్నారు. వారితో చాటింగ్, పోస్టులు, లైకులు చేస్తూ స్నేహం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిచయాలు కొందరి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తీయటి పలుకుతో వచ్చే సందేశాలకు యువతీ యువకులు వారి మాయలోపడి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనికితోడు బినామీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, సెలబ్రేటీలు, ప్రముఖల ఫొటోలను మార్ఫింగ్ చేసి అపలోడ్ చెయ్యడంతో కొందరికి తెలియని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పైశాచిక ఆనందంతో అలా చేసేవారెవరో తెలియకపోగా అమాయకులు అడ్డంగా బుక్ అవుతున్నారు. -
1.30 కోట్లకు ముంచేసిన ఫేస్బుక్ ఫ్రెండ్
ఫేస్బుక్లో అకౌంట్ ఉంది కదాని ఎవరు పడితే వాళ్లు పంపిన ఫ్రెండ్ రిక్వెస్టులు ఓకే చేసేస్తే కొంప మునిగిపోతుంది జాగ్రత్త. డెహ్రాడూన్లో ఓ మహిళను ఆమె ఫేస్బుక్ స్నేహితుడు ఏకంగా కోటీ 30 లక్షల మేర ముంచేశాడు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేయడానికి 1.5 మిలియన్ డాలర్లు (సుమారు 9 కోట్ల రూపాయలు) సాయం చేస్తానంటూ చెప్పి చివరకు ఆమె వద్ద ఉన్న డబ్బులన్నీ లాగేసుకున్నాడు. డెహ్రాడూన్లోని రాం విహార్ ప్రాంతానికి చెందిన బీనా బోర్ ఠాకూర్ అనే మహిళకు అతడు ముందుగా తాను ఇవ్వాల్సిన మొత్తం కావాలంటే ఓ పన్ను చెల్లించాలని చెప్పాడు. ఆ ఉచ్చులో చిక్కుకున్న ఆమె, వివిధ బ్యాంకు ఖాతాలకు ఏకంగా రూ. 1.30 కోట్లు జమచేశారు. ఆ తర్వాత గానీ తాను మోసపోయినట్లు గుర్తించలేకపోయారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓఎన్జీసీలో ఉద్యోగి భార్య అయిన ఠాకూర్ ఫేస్బుక్ వాడతారు. గత సంవత్సరం నవంబర్ నెలలో ఆమెకు రిచర్డ్ ఆండర్సన్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. వాళ్లిద్దరూ ఫోన్లో కూడా చాలాసార్లు చాటింగ్ చేసుకున్నారు. భారతదేశంలోని ప్రజలకు తాను సేవ చేయాలనుకుంటున్నానని చెబుతూ పలు రకాల ప్రతిపాదనలు తెచ్చాడు. చివరకు వృద్ధాశ్రమం ఏర్పాటుకు 9 కోట్లు ఇస్తానని చెప్పినట్లు డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ రౌతెలా తెలిపారు. కొన్నాళ్ల తర్వాత రిజర్వు బ్యాంకులోని విదేశీ మారకద్రవ్య విభాగం నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఆమెకు ఫోన్ చేశాడు. 9 కోట్లమొత్తం వచ్చిందని, అందుకు కొంత పన్ను చెల్లించి ఆ మొత్తం తీసుకోవాలని చెప్పాడు. ఆమె ఆ మొత్తాన్ని వేర్వేరు బ్యాంకుల్లో వేసిన తర్వాత విలియం జార్జి, కెవన్ బ్రౌన్ అనే మరో ఇద్దరు ఫోన్ చేసి, మరింత మొత్తం వేయాలన్నారు. అలా మొత్తం 25 ఖాతాల్లో 1.30 కోట్లను ఆమె డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆండర్సన్, జార్జి, బ్రౌన్లతో పాటు మరో వ్యక్తిపై 420 కేసు నమోదు చేశారు. ఆమె డిపాజిట్ చేసిన ఖాతాలు చాలావరకు కేరళ, తమిళనాడు, కర్ణాటకలలోనే ఉన్నాయని పోలీసులు గుర్తించారు. -
అక్కడా రేసుగుర్రమే!
బాక్సాఫీస్ దగ్గరే కాదు, ఫేస్బుక్లో కూడా అల్లు అర్జున్ రేసుగుర్రంలా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఫేస్బుక్లో అల్లు అర్జున్ని అనుసరించే వారి సంఖ్య 50 లక్షలకు చేరింది. బన్నీ ఫేస్బుక్ పేజీ తెరిచిన కొంత కాలానికే ఫేస్బుక్ టీమ్నే అఫిషియల్ పేజీగా గుర్తుంపు తెచ్చుకుంది. దక్షిణాదిలో 50 లక్షల ఫేస్బుక్ ఫాలోయర్స్ ఉన్న తొలి హీరోగా క్రెడిట్ రావడం పట్ల బన్నీ చాలా సంతోషంతో ఉన్నారు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలు ఓకే చేశారు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా విద్యలు కూడా నేర్చుకున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శ కత్వంలో సినిమా మొదలవుతుంది. -
ఫేస్బుక్ స్నేహంతో సామూహిక అత్యాచారం!
బెంగళూరు : పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. బ్యాటరాయణపుర పోలీసులు కథనం ప్రకారం నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలేజీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా వారు కలుసుకున్నారు. ఆదివారం సాయంత్రం జాలి రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించారు. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. -
3,10,000+ లైక్స్.. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టాప్
సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ టాప్ సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ రికార్డు స్థాయిలో 3 లక్షల లైక్స్ను దాటింది. పార్టీ ఫేస్బుక్ లైక్స్(ఇష్టపడే వారి సంఖ్య) విషయంలో దేశంలోనే ప్రాంతీయ పార్టీలన్నిటిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ అగ్రగామిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్, వైఎస్ఆర్సీపీ ఆన్లైన్ కమ్యూనిటీ పోర్టల్లకు సంబంధించిన బృందం సభ్యులు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను గురువారం ఉదయం ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోషల్ మీడియాలో మంచి కృషిని సాగిస్తున్నారంటూ బృందం సభ్యులను విజయమ్మ అభినందించారు. పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ ప్రారంభించిన 10 నెలల్లోనే 3 లక్షల లైక్స్ (ఇష్టపడే వారి సంఖ్య) దాటడం నెటిజన్లలో జగన్పైన ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాల గురించి మరింత విస్తృతంగా ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా విజయమ్మ వారికి సూచించారు. వైఎస్ మరణానంతరం సంక్షేమ పథకాలు సరిగా అమలు కాకపోవడాన్ని నెటిజన్లకు అర్థమయ్యేలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలన్నారు. ప్రత్యర్థులను విమర్శించడం కంటే వైఎస్ఆర్ చేసిన మంచి పనులు, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలపై మరింత ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె సూచించారు. పార్టీ 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజునే అంటే మార్చి 12వ తేదీనే పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీ (www.facebook.com/ ysrcpofficial) 3 లక్షల లైక్స్ను పూర్తి చేసుకుంది. గురువారం ఉదయానికి ఈ సంఖ్య 3,10,000 వద్ద ఉంది. నెటిజన్లు విశేషంగా ఆదరిస్తుండడంతో ఇది క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.