Virat Kohli
-
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ అభిమాని కొడుకు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్ దేశవాలీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్ వికెట్కీపర్ బ్యాటర్ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బిహేవియర్ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్ దేశవాలీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్లో సంచలనంగా మారింది.వెస్టిండీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్ తరఫున చేశాడు.వెస్టిండీస్ తరఫున అడపాదడపా టెస్ట్ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజన్తో బిజీగా ఉన్నప్పటికీ తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టు ఢిల్లీ వీడినప్పటికీ కోహ్లి మాత్రం తన స్వస్థలంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్రధాన కారణముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (డబ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి కోహ్లితో పాటు అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా హాజరయ్యారు. ఇది తన కోచ్ రాజ్కుమార్ శర్మ క్రికెట్ అకాడమీ కావడంతో ఆయన మీద గౌరవంతో కోహ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్యక్రమంలో భాగంగా అకాడమీ స్టూడెంట్లకు కోహ్లి అవార్డులు అందజేశాడు. ఈ నేపథ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్లను మొక్కే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి వద్దని వారించి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడమీలోని స్టూడెంట్స్ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వయసులోనే క్రీడలను నా కెరీర్గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజయితీతో చేయాలనుకున్నా. అందుకే క్రికెటర్ కావాలని ధృడంగా నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వర్ధమాన క్రికెటర్లు తమ ఆశయాల పట్ల పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన అవసరముంది. మీరు కంటున్న కలల పట్ల, ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వందశాతం నిజాయితీతో కష్టపడితే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజన్లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్లాడి 351 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 44 బంతుల్లోనే 81 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక సోమవారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్లో 9వేల పరుగుల మార్క్ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం -
అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 5 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన పేస్ బౌలర్ అజితేశ్ అర్గల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ 18 ఏళ్లలో ఇద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. కోహ్లి దిగ్గజ క్రికెటర్ స్థాయికి చేరుకోగా, అజితేశ్ కెరీర్ పెద్దగా సాగలేదు. అండర్–19 స్థాయిలో ప్రతిభ చూపి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీలో 19 మ్యాచ్లకే పరిమితమైన అతడిని ఐపీఎల్లో పంజాబ్ జట్టు తీసుకున్నా... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అజితేశ్ అంపైరింగ్ వైపు మళ్లాడు. ఈ నెల 22న తొలిసారి ఐపీఎల్లో అంపైరింగ్ చేసిన అజితేశ్ తన మూడో మ్యాచ్లో కోహ్లిని కలుసుకున్నాడు. సోమవారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో కోహ్లి ఆడుతుండగా, అజితేశ్ అంపైరింగ్ చేశాడు. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయత, ముచ్చట్లు ఆసక్తికర దృశ్యానికి చిరునామాగా నిలిచాయి. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2026లో సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి మరో 11 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.కోహ్లి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 274 మ్యాచ్లు ఆడి మొత్తంగా 8,989 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో కోహ్లి 62 పరుగులు సాధిస్తే, భారత గడ్డపై 10,000 టీ20 రన్స్ నమోదు చేసిన ప్లేయర్గా అవతరిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి ఉన్న ఫామ్కు ఈ రికార్డులను అందుకోవడం పెద్ద విషయమేమి కాదు. ఈ ఏడాది సీజన్లోనూ ఎప్పటిలానే కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంతమైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో సత్తాచాటేందుకు కింగ్ సిద్దమయ్యాడు. కోహ్లి(328) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
పొద్దున్నే విరాట్, రాత్రికి అభిషేక్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్లే అయ్యాయి. రెండు మ్యాచ్ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్లో సన్రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్తో సోషల్మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
విరాట్పై విషం చిమ్మిన ఇంగ్లండ్ దిగ్గజం
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మరోసారి కెలికాడు. తాజాగా తన దేశానికే చెందిన సామ్ బిల్లింగ్స్ విరాట్ను పొగుడుతూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేయగా.. అందుకు బదులుగా వ్యంగ్యంగా స్పందించాడు. తాజాగా గుజరాత్పై విరాట్ మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం సామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో "ఫుల్ ఫ్లోలో ఉన్న విరాట్ను చూడటం కంటే గొప్పది ఏముంటుంది..?" అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన వాన్, "ఉంది.. జో రూట్" అంటూ విరాట్పై అక్కసును వెళ్లగక్కాడు.వాస్తవానికి వాన్కు విరాట్ను కెలకడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. విరాట్కు ఫాబ్-4లో ఉండే అర్హత లేదంటూ కొన్ని సార్లు.. విరాట్ ఫాబ్-4లో అథముడని మరికొన్ని సార్లు కామెంట్లు చేశాడు. తాజాగా విరాట్ కంటే రూట్ చాలా బెటర్ అన్న అర్దం వచ్చేలా బిల్లింగ్స్ ట్వీట్పై స్పందించి శునకానందం పొందాడు. వాన్ విరాట్పై చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరలైంది. వాన్పై విరాట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొందరు, వాన్కు ఇలాంటి చెత్త ప్రవర్తన కొత్తేమీ కాదంటూ లైట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ మెరుపు హాఫ్ సెంచరీ (81) చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో అతను మరిన్ని ఘనతలు సాధించాడు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించడమే కాకుండా.. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విరాట్తో పాటు దేవ్దత్ పడిక్కల్ (55) కూడా మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అద్భుత శతకం వృధా అయ్యింది. -
తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి!
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్ను ప్యాడ్కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్! ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆర్సీబీ స్టార్ జాకబ్ బెతెల్ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్ మిడ్వికెట్ వద్ద వాషింగ్టన్ సుందర్ సునాయాస క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్ భారీ మూల్యం చెల్లించింది.మరో ఎండ్లో పడిక్కల్ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్తో మొదలు పెట్టిన అతను సిరాజ్ ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. రషీద్ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టగా... ప్రసిధ్ ఓవర్లో పడిక్కల్ 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. ఆపై రషీద్ ఓవర్లోనూ 2 సిక్స్లతో చెలరేగిన పడిక్కల్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.హోల్డర్ వైల్డ్గా సెలబ్రేషన్స్.. తీవ్ర అసంతృప్తిలో కోహ్లిపడిక్కల్ను రషీద్ అవుట్ చేయగా, హోల్డర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Set batters gone 😯🎥 Rashid Khan and Jason Holder hit the timber \|/Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/zVUsxy1NB2— IndianPremierLeague (@IPL) April 24, 2026ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్ శర్మ (10), కెప్టెన్ రజత్ పాటీదార్ (8) విఫలమైనా... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్ సెంచరీస్ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్స్కోరర్గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గర్జించిన కోహ్లి, పడిక్కల్.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్), హోల్డర్ (23 నాటౌట్) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో జాకబ్ బెతల్ (14) షారుక్ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026 -
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
-
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
కోహ్లి ‘టేస్ట్’పై కామెంట్.. మాజీ ‘గర్ల్ఫ్రెండ్’ స్పందన ఇదే!
విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్, రన్మెషీన్గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్.. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.ప్రస్తుతం ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ ఫొటోకు కోహ్లి లైక్ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్లైక్ చేసినట్లు తెలిసింది.ఈ విషయంపై లిజ్లాజ్ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్లూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.అభ్యంతరకర కామెంట్ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో బ్రెజిల్ మోడల్ ఇసబెల్ల లియట్, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్లాజ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్ పెట్టారు.ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్ చేశాడనే వదంతులు ఉన్నాయి.కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్లోని ప్రేమానంద్జీ మహరాజ్ను దర్శించి ఆశీసులు తీసుకుంది.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కరాచీ స్టేడియం వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బాబర్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.గ్లాడియేటర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్కు ఇది 12వ సెంచరీ.టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బాబర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొదటి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో బాబర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొదటి ఆటగాడిగా బాబర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
ఇన్స్టా పోస్ట్కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్
-
‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పరిస్థితి చూస్తే బాధగా ఉందని జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ పేర్కొంది. ఏదేమైనా అతడు తనకు మద్దతుగా నిలిచిన తీరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లిజ్లాజ్.. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఆద్వైత్ వైద్యతో ఫొటోషూట్ చేసింది.కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరు?భారత్లోని వివిధ నగరాల్లో ఫొటోలు దిగుతూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీటిలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించింది. దీంతో లిజ్లాజ్ ( LizLaz) ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరా? అంటూ నెటిజన్లు ఆరాతీశారు.అయితే, కాసేపటికే కోహ్లి నుంచి వచ్చిన లైక్ మాయమైపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై మీమ్స్ పేలాయి. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్యూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించగా వైరల్ అయింది. అయితే, తన ఇన్స్టా ఫీడ్ క్లియర్ చేస్తుండగా అనుకోకుండా అల్గారిథమ్ వల్లే అలా జరిగిందని కోహ్లి వివరణ ఇచ్చాడు.ఆ విషయాన్ని తాజాగా గుర్తుచేస్తూ కోహ్లి ఇప్పుడు కూడా ఇదే చెబుతాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా కోహ్లి పుణ్యమా అని లిజ్లాజ్ మాత్రం ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది‘‘నిద్రలేస్తూనే నేను ట్రెండ్ అవుతున్నానని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేశా. అసలు కోహ్లి నా ఫొటోను లైక్ చేశాడని నాకే తెలియదు. వార్తల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. నా గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.ఎంతో మంది సందేశాలు పంపించారు. అయితే, కోహ్లి విషయంలో జరిగినదానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఆయన నా ఫొటోను లైక్ కొట్టినందుకు సంతోషమే. కానీ ఇది అంతగా వైరల్ అవుతుందని ఊహించలేదు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన లైక్ వల్ల నాకు ఎంతో మద్దతు, ప్రచారం లభించాయి’’ అని లిజ్లాజ్ చెప్పుకొచ్చింది.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్! -
దిగ్గజాలు విరాట్, రోహిత్ను అధిగమించిన మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4244 పరుగులు చేసింది.భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్ప్రీత్ కౌర్ (191 మ్యాచ్ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్ల్లో 2553 పరుగులు) ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది. -
అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్లో గ్రీన్జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అచ్చిరాని జెర్సీ..అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్ల్లో ఆర్సీబీ గ్రీన్జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్లో సెంచరీ, మరో మ్యాచ్లో కీలకమైన 27 పరుగులు చేశాడు.గ్రీన్జెర్సీతో ఆర్సీబీ విజయాలు..ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్గా నిలిచాడు.2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కోహ్లి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.గత సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚More than a tradition. A purpose we wear with pride. 🙌Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026 చదవండి: వైభవ్ సేఫ్.. రోమి భిందర్కు బీసీసీఐ షాక్! -
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంత వరకు టైటిల్ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ (2008)లో ఢిల్లీ డేర్డెవిల్స్తో పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకుంది.తప్పటడుగు వేసి ఉండకపోతే..అయినా సరే ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ఫ్రాంఛైజీ గనుక ఆరోజు తప్పటడుగు వేసి ఉండకపోతే.. ఆ జట్టుకు మంచి క్రేజ్ అయినా దక్కి ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ వీరూ భాయ్ ఏం చెప్పాడంటే.. టాపార్డర్ కిక్కిరిసిపోయి ఉండేది‘‘ఐపీఎల్ ఆరంభ సీజన్ అంటే.. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టులో శిఖర్ ధావన్, తిలక్రత్నె దిల్షాన్ కూడా ఉన్నట్లు నాకు గుర్తు. వీరిద్దరు ఓపెనింగ్ బ్యాటర్లే. అయితే, నేను, గౌతమ్ ఇన్నింగ్స్ ఆరంభించేవాళ్లం.కాబట్టి ధావన్, దిల్షాన్ ఆలస్యంగా వచ్చేవాళ్లు. మనోజ్ తివారి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అప్పుడ మా టాపార్డర్.. ఇలా కిక్కిరిసిపోయి ఉండేది. కాబట్టి కొత్తగా బ్యాటర్ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది.కోహ్లికి బదులు జట్టులోకి అతడుఆ సమయంలో విరాట్ కోహ్లి వన్డౌన్ లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకోలేకపోయారు. అప్పుడు మాకు బౌలర్ అవసరం ఉంది. అందుకే కోహ్లికి బదులు ఢిల్లీ ప్రదీప్ సాంగ్వాన్ను జట్టులోకి తీసుకుంది’’ అని చాంపియన్స్ వాలీ కామెంట్రీలో జియోస్టార్ ఎక్స్పర్ట్ వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా ఆరోజు అలా ఢిల్లీ కోహ్లిని కెరీర్ తొలినాళ్లలో వదిలేసుకోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజంగా ఎదిగినా.. కోహ్లి మాత్రం ఇప్పటికీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్గా ట్రోఫీ గెలవలేకపోయినా.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ తరఫున కోహ్లి తొలిసారి కప్పును ముద్దాడాడు. మరోవైపు.. ఢిల్లీ టైటిల్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ -
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
-
విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్షో తో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో లక్నోను 146 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. లక్నోను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసిన తమ బౌలర్లపై పాటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు కలిసొచ్చింది. తొలుత ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను ఉపయోగించుకుని బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు బంతికి బంతికి వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా. అతడితో పాటు సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా టీ20 లీగ్లలో భువనేశ్వర్, హాజిల్వుడ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని మరింత సులువు అవుతోంది. వారి అనుభవం జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో మేలు చేస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పుడు అదే స్పూర్తిని ఫిల్ సాల్ట్ కొనసాగిస్తున్నాడు. సాధారణంగానే అతడు ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్లను అందుకుంటాడు. ఈ రోజ్ కూడా సంచలన క్యాచ్ అందుకున్నాడు. మేము ప్రస్తుతానికి టైటిల్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇదొక సుదీర్ఘ టోర్నీ. ప్రస్తుతం మా దృష్టి అంతా ఒక్కో మ్యాచ్పైనే ఉందని" పాటిదార్ పేర్కొన్నాడు. కాగా 49 పరుగులతో సత్తాచాటిన కోహ్లి గురుంచి పాటిదార్ మాట్లడకపోవడం గమనార్హం.చదవండి: IPL 2026: సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు -
విరాట్ ఖాతాలో మరో భారీ రికార్డు
దిగ్గజ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 15) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ ఓ సిక్సర్ కొట్టి ఐపీఎల్లో ఓపెనర్గా తన సిక్సర్ల సంఖ్యను 185కు పెంచుకున్నాడు. విరాట్ ఈ రికార్డు సాధించే క్రమంలో కేఎల్ రాహుల్ను అధిగమించాడు. రాహుల్ ఐపీఎల్లో ఓపెనర్గా 184 సిక్సర్లు బాదాడు. రాహుల్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (148) ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత టాప్-5 ఓపెనర్లువిరాట్ కోహ్లి- 185కేఎల్ రాహుల్- 184రోహిత్ శర్మ- 148శిఖర్ ధవన్- 143శుభ్మన్ గిల్- 118ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనర్ (ఓవరాల్గా) రికార్డు క్రిస్ గేల్ (326) పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (210), విరాట్ కోహ్లి (185), కేఎల్ రాహుల్ (184) ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఓపెనర్లుక్రిస్ గేల్- 326డేవిడ్ వార్నర్- 210విరాట్ కోహ్లి- 185కేఎల్ రాహుల్- 184ఫాఫ్ డుప్లెసిస్- 159కాగా, నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 34 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 49 పరుగులు చేశాడు. విరాట్ బాదిన సిక్సర్ దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో వచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీశారు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. విరాట్ (49), కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. -
చారిత్రక మైలురాయిని తాకిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్లో చారిత్రక మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్లో 100 అర్ద సెంచరీల (341 ఇన్నింగ్స్ల్లో) అత్యంత అరుదైన ఫీట్ను సాధించాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో డేవిడ్ వార్నర్ (117) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి (107), జోస్ బట్లర్ (100) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా బాబర్ వీరి సరసన చేరాడు.పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్తో నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో బాబర్ 100 హాఫ్ సెంచరీల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అతను 51 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు (పెషావర్ జల్మీ) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. పాక్ తరఫున సెంచరీ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్గా బాబర్ చరిత్రకెక్కాడు.తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 341 ఇన్నింగ్స్లు ఆడిన బాబర్ 100 హాఫ్ సెంచరీలతో పాటు 11 సెంచరీలు కూడా చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వార్నర్ (126), విరాట్ (116) మాత్రమే బాబర్ (111) కంటే ముందున్నారు.బాబర్ టీ20 గణాంకాలు- 341 ఇన్నింగ్స్ల్లో 12,206 పరుగులు - సగటు – 42.38 - స్ట్రైక్ రేట్ – 128.41 - 100 ఫిఫ్టీలు, 11 సెంచరీలుఇటీవలే బాబర్ పీఎస్ఎల్లోనూ ఓ చారిత్రక ఘనత సాధించాడు. ఈ లీగ్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. పీఎస్ఎల్లో 106 మ్యాచ్లు ఆడిన బాబర్ 127.86 స్ట్రయిక్రేట్తో 45.98 సగటున 4093 పరుగులు చేశాడు. పీఎస్ఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానాల్లో ఫకర్ జమాన్ (3039), మహ్మద్ రిజ్వాన్ (2853), రిలీ రొస్సో (2392), షోయబ్ మాలిక్ (2350) ఉన్నారు. -
గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను 146 పరుగులకే (20 ఓవర్లు) కుప్పకూల్చారు. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీశారు. హాజిల్వుడ్ తీసింది ఓ వికెటే అయినా అత్యంత పొదుపుగా (4-0-20-1) బౌలింగ్ చేసి ఆర్సీబీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కోహ్లి 49 పరుగులతో రాణించాడు. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి తన గాయం (knee injury)పై అప్డేట్ ఇచ్చాడు. మోకాలి నొప్పితో ఇంకా ఇబ్బందిగానే ఉందని అన్నాడు. అయితే గత మ్యాచ్తో పోలిస్తే కాస్త బెటర్ అని తెలిపాడు. గేమ్ ఫినిష్ చేయాలనుకున్నా, పిచ్ స్లో కావడంతో కాస్త కష్టమైందని వివరించాడు. -
ఆర్సీబీ ఆడుతూ పాడుతూ...
బెంగళూరు: సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఏకపక్ష పోరులో గెలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ముకుల్ చౌదరి (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోని (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ (4/24) లక్నోను పడగొట్టగా... భువనేశ్వర్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్స్కోరర్గా నిలవగా...రజత్ పాటీదార్ (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు), జితేశ్ శర్మ (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో మరో 29 బంతులు ఉండగానే ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. మూడు కీలక వికెట్లు తీసిన రసిఖ్ సలామ్కు కాకుండా ఒక వికెట్ పడగొట్టిన హాజల్వుడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇవ్వడం గమనార్హం. సమష్టి వైఫల్యం... చిన్నస్వామి స్టేడియంలో లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మొత్తం పవర్ప్లేలో ఆ జట్టు 1 ఫోర్, 2 సిక్స్లతో 35 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (12) విఫలం కాగా, మార్ష్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. పూరన్ (1) తన వైఫల్యాన్ని కొనసాగించగా, కృనాల్ తన వరుస ఓవర్లలో మార్ష్ , సమద్ (0)లను వెనక్కి పంపించాడు. ఇలాంటి స్థితిలో బదోని కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు నుంచి ముకుల్ కూడా అతనికి అండగా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా జార్జ్ లిండే (7)ను బరిలోకి దించినా లాభం లేకపోయింది. ఆర్సీబీ పదునైన బౌలింగ్ ముందు మిగతా బ్యాటర్లూ తేలిపోయారు. ఆఖరి 4 ఓవర్లలో లక్నో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 29 పరుగులే చేసింది. కోహ్లి తొలిసారి... ఛేదనలో సాల్ట్ (7) తొందరగానే అవుటైనా... కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. గత మ్యాచ్లో మడమ గాయంతో ఫీల్డింగ్ చేయని కోహ్లి ఈ మ్యాచ్లో కూడా నేరుగా బ్యాటింగ్కే వచ్చాడు. ఐపీఎల్లో అతను మొదటిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. ప్రిన్స్ వేసిన నాలుగో ఓవర్లో అతను 4 ఫోర్లు బాదాడు. కోహ్లి తాను ఆడిన తొలి 14 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్తో 34 పరుగులు సాధించడం విశేషం! మరో ఎండ్లో పడిక్కల్ (10) విఫలమైనా... పాటీదార్, జితేశ్ దూకుడుతో ఆర్సీబీ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. షమీ ఓవర్లో పాటీదార్ రెండు వరుస సిక్స్లు కొట్టగా... రాఠీ ఓవర్లో జితేశ్ వరుసగా 6, 4, 6, 4 బాదాడు. వీరిద్దరు ఒకే ఓవర్లో అవుటైనా...మిగిలిన 25 పరుగులను బెంగళూరు తర్వాతి 15 బంతుల్లో సాధించి మ్యాచ్ ముగించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మిచెల్ మార్ష్ (బి) కృనాల్ పాండ్యా 40; మార్క్రమ్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 12; పంత్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; నికోలస్ పూరన్ (బి) హాజల్వుడ్ 1; ఆయుశ్ బదోని (సి) జితేశ్ (బి) సలామ్ 38; సమద్ (సి) పాటీదార్ (బి) కృనాల్ పాండ్యా 0; ముకుల్ (బి) సలామ్ 39; లిండే (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 7; షమీ (బి) భువనేశ్వర్ 0; అవేశ్ (బి) సలామ్ 1; దిగ్వేశ్ రాఠీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–32, 2–35, 3–71, 4–83, 5–118, 6–124, 7–137, 8–137, 9–145, 10–146. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–3, హాజల్వుడ్ 4–0–20–1, రసిఖ్ సలామ్ 4–0–24–4, కృనాల్ పాండ్యా 4–0–38–2, సుయాశ్ శర్మ 4–0–34–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) ప్రిన్స్ 7; కోహ్లి (సి) పూరన్ (బి) అవేశ్ 49; పడిక్కల్ (సి) (సబ్) హిమ్మత్ (బి) అవేశ్ 10; రజత్ పాటీదార్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 27; జితేశ్ (సి) ముకుల్ (బి) ప్రిన్స్ 23; డేవిడ్ (నాటౌట్) 14; షెఫర్డ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో 5 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–86, 4–121, 5–122. బౌలింగ్: షమీ 3–0–30–0, ప్రిన్స్ యాదవ్ 3–0–32–3, దిగ్వేశ్ రాఠీ 4–0–51–0, అవేశ్ ఖాన్ 4–0–23–2, లిండే 1.1–0–9–0.పంత్కు గాయం...హాజల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతి బలంగా తగలడంతో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (1) ఎడమ మోచేతికి గాయమైంది. మూడు బంతులు ఆడిన అనంతరం అతను రిటైర్డ్హర్ట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో తిరిగి బ్యాటింగ్కు వచ్చినా మరో మూడు బంతులే ఆడి అతను అవుటయ్యాడు. పంత్ గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. అతను కీపింగ్ కూడా చేయకపోవడంతో ముకుల్ చౌదరి ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్ వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
విరాట్ కోహ్లి అరుదైన ఫీట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి తన కెరీర్లో అన్ని మ్యాచ్ల్లోనూ ఓపెనర్గానే బరిలోకి దిగేవాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ కోహ్లి ప్రధాన జట్టులో సభ్యుడిగానే ఆడాడు. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి ఫీల్ఢింగ్కు దూరంగా ఉన్నాడు. లక్నోతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో కనిపించడంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే కనిపించింది. అయితే ఐపీఎల్లో ఇంపాక్ట్ రూల్ బ్యాటర్లకు ఉపయోగకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి లక్నోతో మ్యాచ్లో తొలుత తుది జట్టులో లేకపోయేసరికి అభిమానులు కంగారు పడినప్పటికీ కెప్టెన్ పటిదార్ మ్యాచ్లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని పేర్కొన్నాడు. తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. Virat in a chase. Period. 🙇♂️ pic.twitter.com/1uSeL3PaF8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026 -
కోహ్లి, రసిక్ సలామ్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.As convincing as it gets 🙌A comfortable 5️⃣-wicket win and @RCBTweets remain unbeaten at home ✌️Scorecard ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/pFkug0okkt— IndianPremierLeague (@IPL) April 15, 2026 -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్గా గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లు భారత్ గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన ఆర్సీబీ మూడు విజయాలతో పట్టికలోమూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే సోమవారం ట్రైనింగ్ సెషన్లో కోహ్లీ కాలికి బ్యాండేజ్తో కనిపించాడు. ప్రాక్టీస్ అనంరతం కోహ్లీ మాజీ క్రికెటర్ కేన్ విలియమ్సన్, కెప్టెన్ రిషబ్ పంత్లను నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ తమ ఎక్స్లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ నడుస్తున్నట్లుగా కనిపించింది. దీంతో చీలమండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేదని క్లియర్గా తెలుస్తోంది. అందుకే లక్నోతో మ్యాచ్లో కోహ్లి ఆడుతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ఆడినా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశముంది. ఇక ఈ సీజన్లో కోహ్లి నాలుగు మ్యాచ్లు కలిపి 179 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ కోహ్లీ కేవలం బ్యాటింగ్కే పరిమితమయ్యాడు.Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026చదవండి: ‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్కు చాన్స్ ఇవ్వు’ -
విరాట్ కోహ్లికి ఏమైంది..? టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికి.. ఆర్సీబీ శిబిరంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయంపై ఆందోళన నెలకొంది. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కోహ్లి, సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఫీల్డింగ్ రాలేదు. కోహ్లికి ఏమైంది?అతడి స్ధానంలో ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెతల్ సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. కోహ్లి చీలమండ గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెడికల్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్లోనే కోహ్లికి చికిత్స అందించింది. అయితే విరాట్ గాయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అప్డేట్ ఇచ్చాడు."ప్రస్తుతానికి కచ్చితంగా విరాట్కు ఏమైందన్నది తెలియదు. కానీ అతడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని పాటిదార్ పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ నాటికి కోహ్లి కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన విరాట్.. 179 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్తో ఆర్సీబీ ఇన్నింగ్స్ను ప్రారంభించిన విరాట్.. ముంబై బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.తొలుత దూకుడుగా ఆడిన కోహ్లి, మిడిల్ ఇన్నింగ్స్లో కాస్త నెమ్మదించాడు. ఫిల్ సాల్ట్తో కలిసి తొలి వికెట్ ఏకంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, సీఎస్కేపై 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.అదేవిధంగా టీ20ల్లో అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(29), పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం(28)లను కోహ్లి అధిగమించాడు. -
అరుదైన మైలురాయిని తాకిన గిల్.. కోహ్లి కంటే వేగంగా..!
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..సూర్యకుమార్ యాదవ్- 2714శుభ్మన్ గిల్- 2875సురేష్ రైనా- 2886 ఎంఎస్ ధోని- 2887 సంజూ శాంసన్- 2915మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది. -
1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి రొమారియో షెపర్డ్ (22), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) సహకరించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్ (0), పడిక్కల్ (14), కృనాల్ (1), జితేశ్ (5), టిమ్ డేవిడ్ (13) నిరాశపరిచారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ (4-0-32-2), బ్రిజేష్ శర్మ (4-0-32-2), ఆర్చర్ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సందీప్ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రాయల్స్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్ ఐపీఎల్లో చివరిసారి 2023 ఎడిషన్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్లో విరాట్ 1089 రోజుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్లో విరాట్ సీఎస్కే బౌలర్ ఆకాశ్ సింగ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. -
వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్లో అతడు విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.26 బంతుల్లోనే 78 పరుగులతోబెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్కు తోడు ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) రాణిచండంతో రాయల్స్ 18 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026కోహ్లి సైతం ఫిదాఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్ రాయల్స్ క్యాప్పై.. ‘‘ప్రియమైన వైభవ్.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 22), వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు.ఇక లక్ష్య ఛేదనలో వైభవ్, ధ్రువ్ జురెల్లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ విజేతగా కొనసాగుతున్నాడు. Player of the Match ✅Orange Cap ✅An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026 -
బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో బిష్ణోయ్ బంతితో మ్యాజిక్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి ఓవర్లోనే అద్బుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఆర్సీబీ తమ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికి కోహ్లి మాత్రం బౌండరీలతో రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే డేంజర్గా మారుతున్న కోహ్లిని అవుట్ చేయడానికి కెప్టెన్ రియాన్ పరాగ్..ఐదో ఓవర్లోనే రవి బిష్ణోయ్ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని బిష్ణోయ్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో నాలుగో బంతికి కోహ్లికి బిష్ణోయ్ గుగ్లీగా సంధించాడు. బిష్ణోయ్ వేసిన ఆ అద్భుతమైన డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లి బంతిని బౌలర్ తల మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లి కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. బిష్ణోయ్ విషయానికి వస్తే తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు లిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్' -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం విరాట్ కోహ్లి రికార్డును అధిగమించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాబర్ ఆజం పెషావర్ జాల్మీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కరాచీ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో బాబర్ ఆజం 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో 351వ టీ20 మ్యాచ్ ఆడుతున్న బాబర్ 338 ఇన్నింగ్స్ ల్లో ఈ రికార్డును చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్) మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్ కాగా, ఇప్పటికీ పాక్ తరపున అత్యధిక టీ20 పరుగుల రికార్డు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ బరిలోకి దిగిన బాబర్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. పెషావర్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. ఇఫ్రికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో కరాచీ కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా బాబర్ సేన ఘన విజయాన్ని అందుకుంది.చదవండి: ‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’ -
విరాట్ కోహ్లితోపోలికా?.. మండిపడ్డ బాబర్ ఆజం
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు కోపమొచ్చింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లితో పోలుస్తూ అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది. కాగా ఒకప్పుడు పాకిస్తాన్ ముఖచిత్రంగా పేరొందిన బాబర్కు ఇప్పుడు జాతీయ జట్టులో చోటే కరువయ్యే దుస్థితి.మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న బాబర్ ఆజం (Babar Azam).. గత మూడేళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పాక్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించడంతో వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా అతడు తప్పుకొన్నాడు. ఫామ్లేమిజట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నా ఫామ్లేమితో విమర్శల పాలయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ చెత్త ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా పాక్ సెలక్టర్లు యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచీ పక్కనపెట్టారు. దీంతో బాబర్ ఆజం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.ఒకప్పుడు కోహ్లితో బాబర్ను పోల్చిన పాక్ మాజీ క్రికెటర్లు సైతం ఇప్పుడు అతడి ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ జట్టు కెప్టెన్గా బాబర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్ కింగ్స్మన్తో బుధవారం నాటి మ్యాచ్లో బాబర్ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు.15వ ఓవర్లో హసన్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్లో పెషావర్ నాలుగు వికెట్ల తేడాతో గెలవడంతో బాబర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన సమయంలో అతడికి ఊహించని ప్రశ్న ఎదురైంది.అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!‘‘విరాట్ కోహ్లి మాదిరే మీకు కూడా మంచి పేరు ఉంది. అయితే, అతడు మ్యాచ్లను గొప్పగా ఫినిష్ చేస్తాడు. మీరు మాత్రం ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. చాలా మంది అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!.. మరి ఈ పోలికపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించారు.మండిపడ్డ బాబర్ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయాలను నీతోనే పెట్టుకో. ఈ పోలికలు ఆపేసి అంతా ముందుకు సాగండి. నేను మ్యాచ్లు ఫినిష్ చేయలేననుకోవడం నీ తప్పు. అది నీ అభిప్రాయం మాత్రమే’’ అని బాబర్ ఆజం ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: ‘సింగిల్’తో ఢిల్లీ డీలా🚨 BABAR RESPONDED TO A QUESTION ON KOHLI-BABAR COMPARISON 🚨• Journalist - "Virat Kohli comes with the same shot of game as you but he finishes the match which you lack. People compare him with you what are your views on the comparison?" • Babar Azam - "Let these things to… pic.twitter.com/A69fIV9urI— Abdullah. (@Abdullahh_56) April 8, 2026 -
ధురంధర్-2పై విరాట్ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ధరంధర్-2 చిత్రంపై టీమిండియా క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఆదిత్య ధర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన వారిద్దరూ రివ్యూ ఇచ్చారు. దీంతో వారు చేసిన పోస్ట్ను ఆదిత్య ధర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.ధురంధర్ 2 మూవీ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని విరాట్ దంపతులు తెలిపారు. ఈ మూవీ ఒక అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ కలగలేదని వారు అన్నారు. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయానన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగంతో ఉందని తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని తెలిపిన విరాట్.. ప్రత్యేకంగా రణ్వీర్ను అభినందించారు. అతనొక శిఖరాన్ని చేరుకున్నారని కొనియాడారు. ఆపై మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ ఒక జీనియస్ అంటూ మెచ్చుకున్నారు. అనుష్క శర్మ కూడా ధురంధర్పై అభినందనలు కురిపించారు. సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే పాత్రను దక్కించుకుని, అద్భుతమైన నటనతో ప్రతిభ కనబరిచారని రణ్వీర్ను ప్రశంసించారు.అయితే, విరాట్ దంపతులు చేసిన పోస్ట్లపై ఆదిత్య ధర్ ధన్యవాదాలు చెబుతూ స్పందించారు. విరాట్ సినిమా చూసి అభినందించారని తెలిసి నమ్మలేకపోతున్నానంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. విరాట్ మాటలు ఎంతో విలువైనవి అని ఆయన అన్నారు. తాను విరాట్కు వీరాభిమానిని ఆదిత్య ధర్ తెలిపారు. దేశం గర్వించేలా గ్రౌండ్లో ఆయన చేసే పోరాటం తమకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు. అనుష్క ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
BCCI: అది సరికాదు.. యువీకే తప్పలేదంటే...
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్ సింగ్. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ గెలవడంతో ఈ మాజీ ఆల్రౌండర్ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.అయితే, కెరీర్ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్కప్లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..ఈ విషయం గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్నెస్ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్ ఇచ్చానని తెలిపాడు.అంతటి యువీకే తప్పలేదంటేఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్మెంట్ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. రో-కోలకు చెప్పండికాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్కప్-2026 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు కూడా మేనేజ్మెంట్ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.చదవండి: CSKకు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ బౌలింగ్లోనూ పదును పెంచుకుంటున్న భువనేశ్వర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్గానూ భువనేశ్వర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. ఆదివారం సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. అయితే టీమిండియా తరఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన భువనేశ్వర్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 200 వికెట్ల మార్క్ను చేరుకున్న తొలి ఆటగాడిగా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 176 మ్యాచ్ల్లో 224 వికెట్లు పడగొట్టాడు. తాజాగా భువనేశ్వర్ 192 మ్యాచ్ల్లో ఈ ఫీట్ను సాధించాడు. భువనేశ్వర్ తర్వాత కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ 191 మ్యాచ్ల్లో 193 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ స్వింగ్ కింగ్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్ట్ బౌలర్లకు సాధ్యం కాని 200 వికెట్ల మార్క్ను అధిగమించిన తొలి బౌలర్గా భువీ నిలిచాడు. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలు కూడా భువనేశ్వర్ కంటే వెనుకబడి ఉన్నారు. ఇక మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ ఖాతాలో మరో రికార్డు..రికార్డులు పెట్టడానికే కోహ్లీ పుట్టినట్లున్నాడు. తాజగా సీఎస్కేతో మ్యాచ్ ద్వారా కోహ్లీ మరో టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్లో 28 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఆ జట్టుపై 1,174 పరుగులు సాధించాడు. తద్వారా ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ఇంతకముంఉద ఈ రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ శర్మ కోల్కతా నైట్రైడర్స్పై 1,161 పరుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ రోహిత్ను దాటి తొలి స్థానంలో నిలిచాడు.చదవండి: ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం! -
సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే!
టీమిండియా సీనియర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ, విరాట్ కింగ్ వంటి బిరుదులు అతడి సొంతం. చేజింగ్లో కోహ్లీని కొట్టే మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా చేజింగ్లో కోహ్లీ బరిలో ఉన్నాడంటే ఆ జట్టు గుండెలపై హాయిగా చేయి వేసుకొని నిద్రపోతాయి. టీమిండియా తరఫున ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇక ఐపీఎల్లో 19 సీజన్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ చేజింగ్లో లెక్కలేనన్ని సార్లు గెలిపించాడు. అయితే ఐపీఎల్లో కూడా కోహ్లీకి ఒక ఫేవరెట్ జట్టు ఉంది. ఆ జట్టు పేరు చెబితే చాలు బ్యాటింగ్లో పూనకం వచ్చేస్తుంది. ఆ జట్టు పేరే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). ఐపీఎల్ 2026 సీజన్లో ఆదివారం డబుల్హెడర్లో భాగంగా ఇవాళ ఆర్సీబీ తమ హోంగ్రౌండ్లో సీఎస్కేతో తలపడనుంది. తమ తొలి మ్యాచ్లో నెగ్గిన ఆర్సీబీ రెండో విజయంపై కన్నేయగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటములతో పట్టికలో చివరి స్థానంలో ఉన్న సీఎస్కే ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. కాగా సీఎస్కేపై కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐపీఎల్లో సీఎస్కేతో 35 మ్యాచ్లాడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్ల్లో 1146 పరుగులు సాధించాడు. చెన్నైపై అత్యధిక స్కోరు 90 నాటౌట్గా ఉంది. ఇందులో 10 అర్థసెంచరీలున్నాయి. మరో 14 పరుగులు చేస్తే ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా తన రికార్డును తానే బద్దలుకొట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్పై కోహ్లీ 1159 పరుగులు సాధించాడు.చదవండి: ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు వర్షం ముప్పు! -
రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్లోనే ఆ ఫీట్ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్ను రోహిత్ శర్మ మంచి ఈజ్తో ప్రారంభించాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
BCCI: రోహిత్, కోహ్లికి ముఖం మీదే చెప్పేయండి: యువీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఉద్దేశించి లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడించే విషయంలో యాజమాన్యం (బీసీసీఐ) వీరిద్దరికి ఇప్పుడే స్పష్టతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగాకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రో-కో (Rohit Sharma- Virat Kohli) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది రోజుల వ్యవధిలోనే వీరిద్దరు టెస్టులకూ గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్- కోహ్లి ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.అయితే, రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రో-కో భవితవ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు వరల్డ్కప్ ఆడేందుకు కట్టుబడి ఉన్నారో లేదో తమకు తెలియదన్నాడు. అయితే, రో-కో మాత్రం ఇందుకు భిన్నంగా సూపర్ ఫామ్తో ముందుకు సాగుతూ తమ లక్ష్యం ఏమిటో ఆటతోనే చెప్పకనే చెబుతున్నారు.తుది నిర్ణయం సెలక్టర్లదేఈ పరిణామాల గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్ తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్- కోహ్లి ఆలోచన ఏమిటో నాకైతే తెలియదు. అయితే, ఈ ఇద్దరూ కూడా వరల్డ్కప్ ఆడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారిని ఆడించాలా? లేదా? అన్న నిర్ణయం మాత్రం సెలక్టర్లదే.నిజం నిష్ఠూరంగా ఉన్నా.. వీరిద్దరి భవితవ్యాన్ని నిర్ణయించేంది సెలక్టర్లే. నా అభిప్రాయం ప్రకారం వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అయితే, వరల్డ్ ఆడించే విషయంలో మేనేజ్మెంట్ వారికి స్పష్టతనిస్తే మంచిది. ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మనస్ఫూర్తిగా చర్చించాలి.ముఖ్యంగా ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నిజం నిష్ఠూరంగా ఉన్నా.. ముందుగానే ముఖం మీద చెప్పేస్తే బాగుంటుంది. కాకపోతే భారత క్రికెట్లో ఇలా జరగడం లేదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎక్కడి నుంచో వచ్చి ధోనీ కెప్టెన్ అయ్యాడు ఇక టీమిండియా యాజమాన్య వైఖరిని ఈ సందర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ ఎంపిక అంచనాలకు అందకుండా సాగుతుందని పేర్కొన్నాడు. తాను టీమిండియాకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... అనూహ్యంగా ధోనీని భారత జట్టు కెప్టెన్గా ఎంపిక చేసిన విషయాన్ని యువీ గుర్తు చేసుకున్నాడు.తాజాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్... ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్కు అప్పగించిన నేపథ్యంలో యువీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఈ నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. దీన్ని ఒక ఆటగాడి కోణం నుంచి చూస్తే... ఉదాహరణకు ఒక ఆటగాడు ప్రపంచకప్నకు ముందు చక్కటి ఫామ్తో తన రాష్ట్ర జట్టు తరఫున సత్తా చాటి వరల్డ్కప్నకు ఎంపికయ్యాడు.అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు వరల్డ్కప్ అందించాడు. అలాంటి ప్లేయర్ను ఫ్రాంచైజీ కెప్టెన్గా ఎంపిక చేసింది. మరోవైపు ఏడేళ్లుగా ఒక ప్లేయర్ ఆ ఫ్రాంచైజీ కోసం ప్రాణం పెట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగిందిఅయినప్పటికీ అతడికి జట్టు కెప్టెన్ పదవి కాకుండా వైస్కెప్టెన్ పదవి దక్కింది. మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది.నేను భారత జట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో హర్భజన్, సెహ్వాగ్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నా... ఎక్కడి నుంచో వచ్చి ధోని కెపె్టన్ అయ్యాడు. కారణాలు ఏవైనా మీరు భారత కెప్టెన్గా ఉంటారా లేదా అనేది ఫ్రాంచైజీ క్రికెట్ నిర్ణయించదు. కానీ ఆటగాడి కోణం నుంచి చూస్తే ఇది నిరాశ కలిగించే అంశం’ అని యువరాజ్ అన్నాడు. 2007లో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ధోనీకి అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజెప్పడంపై యువీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
విరాట్ కోహ్లిపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి నాడు టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి కారణమని బాంబు పేల్చాడు. తన ఎంపికను పరిగణలోకి తీసుకోవడం లేదన్న కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. సీనియర్ని అన్న గౌరవం కూడా లేకుండా తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఫైరయ్యాడు. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి, సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం చాలాకాలం ఎదురుచూశానని తెలిపాడు. చివరికి ధోనితో మాట్లాడితే కాని విషయం అర్దం కాలేదని అన్నాడు. చేసేదేమీ లేక రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నిజాయితీగా పరిస్థితిని వివరించి సహాయం చేశాడని ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. తన రిటైర్మెంట్ విషయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ తీరు కూడా తప్పుబట్టాడు. తాజాగా స్పోర్ట్స్ టాక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.కాగా, యువీ 2019 జూన్ 10న రిటైర్మెంట్ను ప్రకటించాడు. అతను చివరిగా 2017లో టీమిండియా తరఫున వన్డే ఆడాడు. అవకాశాల కోసం చాలాకాలం వేచి చూసి, చేసేదేమీ లేక ఆట నుంచి వైదొలిగాడు. యువీ చివరి వన్డే ఆడే సమయానికి మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఆ ఏడాది 11 మ్యాచ్ల్లో 98.67 స్ట్రయిక్రేట్తో 372 పరుగులు చేశాడు. అయినా టీమిండియాలో స్థానం దక్కలేదు. 17 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలు చేసి, రెండు ప్రపంచకప్ విజయాల్లో (2007 టీ20, 2011 వన్డే) కీలకపాత్ర పోషించిన యువీ అవమానకర రీతిలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని అప్పట్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు. క్యాన్సర్పై విజయం సాధించి, తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్ ఆటకు సంబంధించి తన చివరి కోరికను తీర్చుకోకుండానే రిటైరయ్యాడు. యువీకి 2019 వన్డే వరల్డ్కప్ ఆడాలని కోరిక ఉండింది. ఇందుకోసమే అతను వయసు మీద పడుతున్నా తీవ్రంగా శ్రమించి ఫిట్నెస్ మెయిన్టైన్ చేశాడు. అయినా సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపించారు. వాస్తవానికి యువీని పక్కకు పెట్టడానికి విరాట్-రవిశాస్త్రి వద్ద కూడా ఎలాంటి వ్యక్తిగత కారణాలూ లేవు. కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. 2015 వరల్డ్ కప్ సమయంలో నాటి కెప్టెన్ ధోని కూడా గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్లను ఈ కారణంగానే పక్కన పెట్టాడు. -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్గా 2024 టీ20 ప్రపంచకప్ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్తో మ్యాచ్లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్లో రోహిత్ ఫుట్వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్ను ఐపీఎల్లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రహానే కేకేఆర్ కెప్టెన్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్కింగ్స్కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్పై రోహిత్ శర్మ 36 మ్యాచ్ల్లో 1161 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్తో మొత్తం 36 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్కింగ్స్పై 36 మ్యాచ్ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది. అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్పై (36 మ్యాచ్ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్పై( 32 మ్యాచ్ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్లోనే అదిరిపోయే విజయం సాధించింది. నిన్న (మార్చి 28) జరిగిన టోర్నీ ఓపెనర్లో సన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఏకపక్ష విజయం నమోదు చేసింది. సన్రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే (15.4 ఓవర్లలో) ఛేదించడం ద్వారా ఓ భారీ రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ను ఊదేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉండేది. రాయల్స్ గత ఎడిషన్లో (2025లో గుజరాత్పై) 200 ప్లస్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. తాజాగా ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.ఆర్సీబీ ఈ రికార్డు సాధించడంలో కింగ్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషించాడు. భారీ ఛేదనలో విరాట్ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో అలరించి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాచ్ను వేగంగా ముగించాడు. గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో విరాట్ వరుసగా 6, 4, 4, 4 బాది ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకునేలా చేశాడు.ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకోవడంలో దేవ్దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తమవంతు పాత్ర పోషించారు. వీరిద్దరు కూడా వేగంగా ఆడి కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 ప్లస్ లక్ష్య ఛేదనలు..15.4 - RCB vs SRH, బెంగళూరు, 2026*15.5 - RR vs GT, జైపూర్, 202516.0 - RCB vs GT, అహ్మదాబాద్, 202416.3 - MI vs RCB, వాంఖేడే, 202317.3 - DC vs GL, ఢిల్లీ, 2017 -
ఎస్ఆర్హెచ్పై విజయం.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్లో ఆర్సీబీ విజయం ఖరారు కాగానే స్టేడియంలో అందరినీ ఆకట్టుకునేలా ఒక క్యూట్ ‘విరుష్క’ మూమెంట్ చోటుచేసుకుంది. గెలుపు ఆనందంలో విరాట్ కోహ్లీ తన హెల్మెట్ తీసి, స్టాండ్స్లో తన కోసం ఉత్సాహంగా చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ ముద్దుగా ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చాడు. దానికి స్పందనగా అనుష్క కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే ప్రేమగా కోహ్లీకి రిటర్న్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆర్సీబీ మహిళల జట్టు క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ నవ్వుతూ ఆశ్చర్యంగా చూశారు. ఈ అందమైన క్షణంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ చాలా సులువుగా ఊదేసింది. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. THE WAY VIRAT KOHLI GIVING FLYING KISS TO ANUSHKA SHARMA AFTER WON THE MATCH. ♥️😍- Video of the Day! pic.twitter.com/lQugBW89Ju— Tanuj (@ImTanujSingh) March 28, 2026 -
అందుకే చేజింగ్ మాస్టర్ అనేది!
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అసలైన చాంపియన్ ఆటతీరును ప్రదర్శించి సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగుల టార్గెట్ను ఉఫ్ అని ఉదేసింది. పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటే.. కోహ్లీ మాత్రం లక్ష్య ఛేదనలో తనను మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. చేజింగ్ అంటేనే కోహ్లీలో ఎక్కడలేని ఊపు కనిపిస్తుంది. అందుకేనేమో ఈ చేజింగ్ మాస్టర్ను వెతుక్కుంటూ రికార్డులు వస్తుంటాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 4027 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత వార్నర్ (3,285), రోహిత్ శర్మ (3,238), శిఖర్ ధావన్ (2,843), రాబిన్ ఊతప్ప (2,832) వరుసగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్తో గత ఐదు మ్యాచ్ల్లో వరుసగా 100, 42, 51, 43, 69* పరుగులు చేయడం ద్వారా మరో రికార్డు లిఖించుకున్నాడు. మరిన్ని రికార్డులు..ఇక కోహ్లీకి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ను కూడా అర్థసెంచరీతోనే మొదలుపెట్టాడు. 2025 సీజన్లో కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో అర్థసెంచరీ చేశాడు. తాజాగా ఎస్ఆర్హెచ్పై అర్థసెంచరీతో ఈ సీజన్లో బ్యాటింగ్ను షురూ చేశాడు.ఇక ఐపీఎల్లో 200 పరుగులకు పైగా ఛేదనను అతి తక్కువ ఓవర్లలో చేధించిన జట్టుగాను ఆర్సీబీ రికార్డు అందుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగులు లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో అందుకుంది.ఐపీఎల్లో 200లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇది నాలుగోసారి. గతంలో 2025లో లక్నో సూపర్జెయింట్స్పై, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై, 2024లో గుజరాత్ టైటాన్స్పై 200 ప్లస్ స్కోర్లు ఛేదించింది. -
ఆర్సీబీ అదరగొట్టింది...
బ్యాటింగ్లో ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయిన సన్రైజర్స్ హైదరాబాద్... బౌలింగ్లో ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక పరాజయంతో ఐపీఎల్ను ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... చాంపియన్ ఆటతీరుతో సీజన్లో బోణీ కొట్టింది. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొడితే... షెఫర్డ్ అతడికి సంపూర్ణ సహకారం అందించాడు. వీరిద్దరి బౌలింగ్ మెరుపులకు... ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్ విన్యాసాలు తోడవడంతో సన్రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుతో మరో 26 బంతులు మిగిలుండగానే బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ను ఘన విజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో విజృంభించగా... అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ (31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీశ్ కుమార్ రెడ్డి (1), సలిల్ అరోరా (9), హర్ష్ దూబే (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో జేకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో అదరగొట్టగా.. కెప్టెన్ రజత్ పాటీదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు దంచికొట్టాడు. ఇషాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ జాకబ్ డఫీ ధాటికి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టిన సమయంలో ఇషాన్ చక్కటి ఇన్నింగ్స్తో అలరించాడు. కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అనూహ్యంగా జట్టు పగ్గాలు అందుకున్న ఇషాన్... బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 4, 6 కొట్టి మైదానంలో జోష్ నింపాడు. కాసేపటికి క్లాసెన్ కూడా రెండు ఫోర్లతో సత్తాచాటాడు. సుయాశ్ శర్మ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్ 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కృనాల్ వేసిన 13వ ఓవర్లో ఈ ఇద్దరు కలిసి మూడు సిక్స్లు బాదారు. నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వివాదాస్పద క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా... అనికేత్ దూకుడు కొనసాగించడంతో సన్రైజర్స్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆడుతూ పాడుతూ... దూకుడుకు మారుపేరైన ప్రత్యర్థి ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన బెంగళూరు... సొంతగడ్డపై దుమ్మురేపింది. సాల్ట్ (8) రెండో ఓవర్లోనే అవుటైనా... ఆ తర్వాత రైజర్స్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెంగళూరు దంచికొట్టింది. మంచి ఫామ్లో ఉన్న పడిక్కల్ అలవోకగా భారీ షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. సిక్స్తో ఖాతా తెరిచిన అతడు... నితీశ్ రెడ్డి ఓవర్లో రెండు ఫోర్లు, పైన్ ఓవర్లో 6, 4, 6 బాదాడు. కోహ్లి కూడా 6, 4తో జోరు పెంచడంతో పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు 76/1తో నిలిచింది. దూబే బౌలింగ్లో 4, 6 కొట్టిన అనంతరం పడిక్కల్ అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ రజత్ పాటీదార్ ఉన్నంతసేపు భారీ షాట్లతో చెలరేగడంతో... స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బెంగళూరు విజయానికి 48 బంతుల్లో 40 పరుగుల అవసరమైన దశలో... వరుస బంతుల్లో పాటీదార్, జితేశ్ శర్మ (0) అవుటైనా... టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి కోహ్లి మిగిలిన పని పూర్తిచేశాడు. హడలెత్తించిన డఫీ న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 48 టి20లు ఆడి 62 వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు తొలిసారి అతను ఐపీఎల్లో అడుగు పెట్టాడు. హేజల్వుడ్కు ప్రత్యామ్నాయంగా ఆర్సీబీ అతడిని తీసుకోగా, తన ఎంపికకు పూర్తి న్యాయం చేస్తూ సత్తా చాటాడు. తన రెండో ఓవర్లోనే కీలక బ్యాటర్లు అభిషేక్, హెడ్లను వెనక్కి పంపిన అతను తర్వాతి ఓవర్లో నితీశ్ను అవుట్ చేసి పవర్ప్లేలోనే 3/17తో రైజర్స్ పని పట్టాడు. కేవలం 530 మంది జనాభా ఉండే ఎలాంటి సౌకర్యాలు లేని చిన్న ఊరిలో పుట్టిన డఫీ ప్రస్థానం కివీస్ క్రికెట్ వర్గాల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మరో ఇద్దరు... ఈ మ్యాచ్తో మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. పేస్ బౌలర్ అభినందన్ సింగ్కు ఆర్సీబీ అవకాశమిచ్చింది. యూపీ టి20 లీగ్లో లక్నో ఫాల్కన్స్ తరఫున ఆడిన అతనికి సీనియర్ స్థాయిలో ఇదే తొలి అధికారిక టోర్నీ. గత సీజన్లోనూ ఆర్సీబీతోనే ఉన్నా మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. సన్రైజర్స్ తరఫున ఆడిన సలీల్ అరోరాకు కూడా ఇదే తొలి మ్యాచ్. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సలీల్ ముస్తాక్ అలీ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లలో దాదాపు 200 స్ట్రయిక్ రేట్తో 358 పరుగులు చేశాడు. టోర్నీలో ఏకంగా 28 సిక్సర్లతో అదరగొట్టి ఐపీఎల్ చాన్స్ దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్: హెడ్ (సి) సాల్ట్ (బి) డఫీ 11; అభిషేక్ (సి) జితేశ్ (బి) డఫీ 7; ఇషాన్ (సి) సాల్ట్ (బి) అభినందన్ 80; నితీశ్ రెడ్డి (సి) అభినందన్ (బి) డఫీ 1; క్లాసెన్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 31; సలిల్ అరోరా (సి) పడిక్కల్ (బి) సుయాశ్ 9; అనికేత్ వర్మ (సి) కోహ్లి (బి) షెఫర్డ్ 43; హర్ష్ దూబే (సి) పడిక్కల్ (బి) షెఫర్డ్ 3; హర్షల్ (సి) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 0; డేవిడ్ పైన్ (నాటౌట్) 6; ఉనాద్కట్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–18, 2–23, 3–29, 4–126, 5–137, 6–155, 7–167, 8–174, 9–192. బౌలింగ్: డఫీ 4–0–22–3; భువనేశ్వర్ 4–0–31–1; అభినందన్ 3–0–38–1; షెఫర్డ్ 4–0–54–3; సుయాశ్ 3–0–28–1; కృనాల్ 2–0–26–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: సాల్ట్ (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 8; కోహ్లి (నాటౌట్) 69; పడిక్కల్ (సి) క్లాసెన్ (బి) హర్ష్ 61; పాటీదార్ (సి) హర్ష్ (బి) పైన్ 31; జితేశ్ (సి) ఉనాద్కట్ (బి) పైన్ 0; టిమ్ డేవిడ్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–110, 3–163, 4–163. బౌలింగ్: నితీశ్ రెడ్డి 2–0–19–0; ఉనాద్కట్ 3–0–29–1; డేవిడ్ పైన్ 3–0–35–2; హర్ష్ దూబే 3–0–35–1; ఇషాన్ మలింగ 2–0–35–0; హర్షల్ 2.4–0–39–0.ఐపీఎల్లో నేడుముంబై X కోల్కతా వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
పంతమే నెగ్గింది.. ఉచితంగా ఐపీఎల్ టికెట్లు!
ఐపీఎల్ టికెట్ల విషయంలో కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఐపీఎల్ టికెట్లు కొనడానికి క్యూలైన్లో నిలబడేందుకు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు పొందనున్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఐపీఎల్ ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ స్టేటస్లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించ నున్నట్లు తెలిపారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరిణామం జరగడానికి ఒక రోజు ముందు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలే ఇవాళ వారికి ఉచిత ఐపీఎల్ టికెట్లు రావడానికి కారణమైంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు కేఎస్సీఏ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడడం ఏంటని విమర్శలకు దిగింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఉచిత టికెట్లు ఇచ్చేందుకు కేఎస్సీఏ ముందుకు వచ్చింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. #WATCH | Bengaluru: On State MLAs' demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, "...Four tickets can't be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow's… pic.twitter.com/1bA5wUNAnc— ANI (@ANI) March 27, 2026చదవండి: బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్! -
రోహిత్, కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్లో టీమిండియా షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఐపీఎల్ తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకైక టెస్ట్ మరియు 3 వన్డేల సిరీస్ కోసం భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ధర్మశాల (జూన్ 14), లక్నో (జూన్ 17), చెన్నై (జూన్ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.అనంతరం భారత్ జులైలో ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్ లీ స్ట్రీట్, ఓల్డ్ ట్రాఫర్డ్, ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్, సౌథాంప్టన్ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్లో జరుగనున్నాయి.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో తిరువనంతపురం, గౌహతి, ముల్లాన్పూర్ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, డెహ్రాడూన్, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్పై స్పష్టత రావాల్సి ఉంది.డిసెంబర్లో శ్రీలంక భారత్లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్లు డిసెంబర్ 13, 16, 19 తేదీల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో జరుగనున్నాయి.వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. -
'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. టైటిల్ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. రజిత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్లో పాల్గోంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలలో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. "గత రెండు, మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తాచాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంలో కోహ్లిది కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లోనూ ఆర్సీబీ విరాట్ కీలకం కానున్నాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే -
IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లోని ఆయా జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి భారత్ చేరుకొని తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్ కోహ్లీ లెగ్స్టంప్ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్ తిన్న కోహ్లీ ‘వాట్ ఏ బాల్ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్ నవ్వుతోనే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్లో కోహ్లీ 15 ఇన్నింగ్స్ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్ 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్ యశ్ దయాల్ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్ సలామ్, మంగేశ్ యాదవ్లకు భువనేశ్వర్ మెంటార్గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు! -
ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026లలో చాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్కప్-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ వేచి ఉంది.షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.ప్రణాళికలు సిద్ధంచీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్ ఐపీఎల్లో వారానికి ఒక్క మ్యాచ్ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.తద్వారా వారానికి ఐదు మ్యాచ్లు కవర్ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.వారికి చోటు ఉందా?ఐపీఎల్లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది. గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
విరాట్ కోహ్లి విశ్వరూపం.. తొలి రోజే సిక్సర్ల వర్షం!
ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. బుధవారం ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు.ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా తన బ్యాటింగ్ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.విరాట్ తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్లో దుమ్ములేపాడు. సౌతాఫ్రికా సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్పై కూడా తన ఫామ్ను కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గత సీజన్లోనూ కోహ్లి అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లిది కీలక పాత్ర. కోహ్లి మరోసారి తన అద్భుత ప్రదర్శనలతో ఆర్సీబీకి టైటిల్ను అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.చదవండి: IPL 2026: 'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'Wtf is Virat Kohli cooking in nets. Man is Dealing only in sixes 😭😭Someone really said, 2026 is the new 2016. pic.twitter.com/rSBD0HUkmc— Selfless⁴⁵ (@SelflessCricket) March 18, 2026 -
అతడు ఆర్సీబీ గుండెచప్పుడు: డివిలియర్స్
ఐపీఎల్-2026 సీజన్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరాడు. త్వరలోనే అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-19వ సీజన్లోనూ ఆర్సీబీకీ కోహ్లి కీలకం కానున్నాడని డివిలియర్స్ తెలిపాడు. కాగా బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో విరాట్ది కీలక పాత్ర. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే జోరును విరాట్ కొనసాగించాలని ఏబీడీ కోరుకుంటున్నాడు."ఆర్సీబీకి విరాట్ కోహ్లి గుండెచప్పుడు లాంటి వాడు. కేవలం తన అద్భుతమైన బ్యాటింగ్తో మాత్రమే కాకుండా, అతడు చూపించే పట్టుదల, ఎనర్జీ జట్టులోని ఇతర ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి. మైదానంలోనూ, మైదానం వెలుపలా కోహ్లి వ్యవహరించే తీరు అమోఘం.విరాట్ నుంచి యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. కోహ్లి సృష్టించిన ఈ సానుకూల వాతావరణమే, గత సీజన్లో ఆర్సీబీ తన తొలి టైటిల్ నెగ్గడానికి ప్రధాన కారణం. అంతకుముందు సీజన్ వరకు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే ఆర్సీబీ ఆధారపడేది. కానీ ఇప్పుడు మాత్రం తొలి టైటిల్ గెలవడంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే -
రికార్డు స్థాయి బిడ్.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!
ఐపీఎల్లో 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్ఫిషర్ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పై, అమెరికా సంస్థ కోల్బెర్గ్ క్రావిస్ రాబర్ట్స్ అండ్ కో (కేకేఆర్), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం! -
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్గా గౌతం గంభీర్ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో తొలి టెస్టులో అశూను బెంచ్కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్లో నేను, బ్రిస్బేన్లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదుకోచ్గా తన జాబ్ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్, రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్కోచ్గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్ టూర్ తర్వాత అకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఒకడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్లలో ఆడిన ఘనత ఈ బ్యాటర్కు ఉంది.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఏబీడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ జట్టు మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ప్రస్తుత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లితోనూ డివిలియర్స్ బంధం విడదీయలేనిది. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఐదేసిసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్లతో ఏబీడీ మ్యాచ్లు ఆడాడు.ఇది వివాదాస్పదం కావొచ్చుటీ20 ఫార్మాట్లో అపార అనుభవం ఉన్న ఏబీ డివిలియర్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ఆల్టైమ్ టీ20 క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబు వైరల్గా మారింది. ‘‘ఇది వివాదాస్పదం కావొచ్చు.. కాదు కాదు.. వివాదానికి తావులేదు. ఇదొక చర్చనీయాంశమైన జవాబు కావొచ్చు.ఎందుకంటే.. అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని నేను అనుకుంటున్నా. కానీ అతనెప్పుడూ నాకు బౌలింగ్ చేయలేదు. అయితే, నిలకడైన ఆటకు అతడు మారుపేరు. ముఖ్యంగా 20 ఓవర్ల ఆటలో ఏ సమయంలోనైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కొత్త బంతి లేదంటే పాత బంతితో అతడు అద్భుతాలు చేయగలడు.గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తాసూపర్ ఓవర్ అయినా.. మరి ఇంకేదైనా బంతి అతడికి చేతికి ఇస్తే గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా అతడికి ఉంది. దటీజ్ జస్ప్రీత్ బుమ్రా’’ అని డివిలియర్స్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.పదిహేను పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లుకాగా టీ20 ప్రపంచకప్-2026లో బుమ్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా మరోసారి వరల్డ్కప్ చాంపియన్గా నిలవడంలో అతడి పాత్ర కీలకం. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో బుమ్రా.. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదిహేను పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఓవరాల్గా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పద్నాలుగు వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై ప్రశంసల వర్షం కొనసాగుతుండగా.. డివిలియర్స్ సైతం ఈ మేరకు కొనియాడటం గమనార్హం. సత్తా చాటుతున్న బుమ్రాఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీలో మరో భారత బౌలర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పద్నాలుగు వికెట్లు తీసి బుమ్రా సరసన నిలిచాడు. కాగా బుమ్రా ఇప్పటికి 95 అంతర్జాతీయ టీ20లలో కలిపి 121 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 145 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి సత్తా చాటేందుకు బుమ్రా సిద్ధయ్యాడు. View this post on Instagram A post shared by Nikhil Uttamchandani (@nikuttam) -
రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
టీమిండియా స్టార్క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్ కోచ్గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ వైఫల్యం అనంతరం రోహిత్, విరాట్లు ఏకకాలంలో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ల ఓటమి తర్వాత కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్ స్వాగతించగా, రోహిత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పారు. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్మన్ గిల్కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్లపై టెస్టు సిరీస్లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026 -
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. తాజాగా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్ టీ20 ఓపెనర్గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రశ్న వేసింది. అయితే మొదట సచిన్, సెహ్వాగ్లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్ చాయిస్లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్ను కాదని ఆర్సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్కే ఓటేశాడు. రోహిత్, సెహ్వాగ్ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్గా గేల్ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్గా మలవాలన్న కోరిక గేల్లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. ఇక గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్లో 267 మ్యాచ్ల్లో 132 స్ట్రైక్రేట్ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలున్నాయి. 2025 సీజన్లో కోహ్లీ 15 మ్యాచ్ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్ కింగ్స్పై విజయం సాధించి తొలిసారి టైటిల్ను ముద్దాడింది.చదవండి: ‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’ -
న్యూ లుక్లో విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్తో దర్శనమిస్తున్నాడు. ఈ కొత్త లుక్ను ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జార్డన్ టబాక్మాన్ డిజైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జార్డన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. కోహ్లి దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్లోనూ కొత్త లుక్తో బరిలోకి దిగుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన న్యూ లుక్తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. కాగా విరాట్ ప్రస్తుతం లండన్లోనే ఉన్నాడు. కోహ్లి త్వరలోనే ఆర్సీబీ క్యాంపులో చేరనున్నాడు.ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by Jordan Tabakman (@jordantabakman)తొలిసారి ఛాంపియన్స్కాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో కింగ్ కోహ్లిది కీలక పాత్ర. గత సీజన్లో కోహ్లీ 657 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఈ ఏడాది సీజన్లో కొనసాగించాలని చేజ్ మాస్టర్ ఉవ్విళ్ళూరుతున్నాడు. తను చివరిగా ఆడిన న్యూజిలాండ్ సిరీస్లోనూ కోహ్లి దుమ్మలేపాడు.చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ -
రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త
భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త అందుతుంది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెట్లో కొనసాగుతున్న రో-కోకు ఆ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలు ఆడే ఆస్కారమున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో (FTP) షెడ్యూలైన మ్యాచ్లకు అదనంగా కొన్ని దేశాలు భారత్తో వన్డేలు ఆడేందుకు బీసీసీఐని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది భారత్ షెడ్యూల్ కిక్కిరిసిపోయింది. అదనంగా మ్యాచ్లు అంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల క్రికెట్ బోర్డులు అదనపు మ్యాచ్ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది.కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచకప్ ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ జూన్లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో మొదలవుతుంది.అనంతరం జులై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది.ఆతర్వాత భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో టెస్ట్, టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివర్లో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు షెడ్యూల్ అయ్యాయి. వీటికి అదనంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరిన్ని వన్డేలు ఆడాలని బీసీసీఐని కోరుతుంది.వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ కూడా భారత్తో అదనపు వన్డే సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాక బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల సిరీస్లు కూడా FTPకి అదనంగా ప్రోగ్రెస్లో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి 2027 వన్డే ప్రపంచకప్కు సన్నద్దం కావాలనుకుంటున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. ఇది వారివారి అభిమానులకు పండగే. రో-కో టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగనుంది. ఈ లోపు రో-కో పదుల సంఖ్యలో వన్డేలు ఆడే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగ్గజాలు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, అభిమానుల గుండెల్లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకుంటారు.ఐపీఎల్ 2026 అనంతరం టీమిండియా షెడ్యూల్ (అంచనా)..ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేలు, ఓ టెస్ట్ఐర్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు సన్నాహాలు జరుగుతున్నాయిఇంగ్లండ్తో 3 వన్డేలు, 5 టీ20లు (అదనపు మ్యాచ్లపై ఆసక్తి)శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్ట్లుబంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి అవసరం)ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లుజింబాబ్వే టీ20 సిరీస్కు సన్నాహాలు జరుగుతున్నాయివెస్టిండీస్తో 3 వన్డేలు, 5 టీ20లుఆసియా క్రీడలున్యూజిలాండ్తో 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్ట్లు (అదనంగా 2 వన్డేలకు అభ్యర్థన)శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లుఆస్ట్రేలియాతో 5 టెస్ట్లు -
T20 WC: రోహిత్, ద్రవిడ్పై సూర్యకుమార్ విమర్శలు?!
టీమిండియా ఇప్పటికి మూడు టీ20 ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచింది. ఐసీసీ తొలిసారి 2007లో ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ వరల్డ్కప్లో ధోని సారథ్యంలో విజేతగా నిలిచిన భారత్.. 2024లో రోహిత్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.2024 మాదిరి కాదుఅయితే, 2024లో నాటి కెప్టెన్ రోహిత్- హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rohit Sharma- Rahul Dravid) అనుసరించిన విధానాలకు, 2026లో సూర్య- గంభీర్ వ్యూహాలకు చాలా తేడా ఉందని యాజమాన్యం చెబుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్వయంగా స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదనే నియమం పెట్టుకున్నామని.. అదే తమకు సత్ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నాడు.వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి..‘‘2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఎలా ఆడామో మాకు తెలుసు. అయితే, అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో కొనసాగితే కష్టమని అర్థమైంది. అందుకే.. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి మ్యాచ్లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.ఈసారి సెమీ ఫైనల్ వరకు అందరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు.. మా జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరూ టాప్ రన్ స్కోరర్ లేదంటే లీడింగ్ వికెట్ టేకర్గా లేరు. అయినా సరే మేము గెలుస్తూనే ఉన్నాం.ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్క ఆటగాడు తనవంతు సహకారం అందించాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఇలా జట్టుగా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని ఓ వైరస్లాగా వ్యాప్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పద్దెనిమిది నెలల క్రితమే ఈ సంప్రదాయాన్ని జట్టులో ప్రవేశ పెట్టాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు.కోహ్లిపై విమర్శలుఇక టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ సైతం సూర్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘‘గత వరల్డ్కప్ గెలిచిన జట్టులో రోహిత్, విరాట్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.ఈసారి బుమ్రా, హార్దిక్ తప్ప పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. అయితే, అప్పటికి ఇప్పటికి మేము ఇన్నింగ్స్ ప్లాన్ చేసిన విధానం వేరుగా ఉంది. మా ఆలోచనకు తగినట్లు అప్పుడు రోహిత్ శర్మ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు.కానీ విరాట్ కోహ్లి యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం, కాస్త నెమ్మదిగా ఆడటం వంటి వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. హార్దిక్, అభిషేక్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో కొత్త జోష్ తీసుకువచ్చారు. 2024, 2026 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
IPL 2026: కోహ్లీ ప్రాక్టీస్.. ఐపీఎల్ జరుగుతుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్బీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తాజాగా ఐపీఎల్ కోసం నెట్స్లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోనూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్ 2026’ అని క్యాప్షన్ మాత్రమే జత చేసినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్స్లో బరిలోకి దిగిన కోహ్లీ చేతికి గ్లోవ్స్, తలకు హెల్మెట్ పెట్టుకొని బరిలోకి దిగడం, బ్యాటింగ్ ప్రాక్టీస్లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడడం ముగ్ధమనోహరంగా అనిపించింది. కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ భారత్ మాత్రం 1-2 తేడాతో కివీస్కు సిరీస్ కోల్పోయింది. ఇక ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో కోహ్లీ 144 స్ట్రైక్రేట్తో 657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో 8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్ సాధించిన బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకున్న సమయానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.చదవండి: స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
కోహ్లీ అందుకే రాలేకపోయాడా!
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్కు అందుకుంది. అయితే ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ హాజరైన సంగతి తెలిసిందే. అయితే కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాకపోవడం వెనుక సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతున్నది. కోహ్లీ రాకపోవడం వెనుక అభిమానులు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. ధోనీ, రోహిత్లు కెప్టెన్లుగా ఐసీసీ ట్రోఫీలు సాధించారని, కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్గా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడని, అందుకే తాజా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా 2007 తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ధోనీ సారథ్యం వహించగా, అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 ప్రపంచకప్ను నెగ్గిన టీమిండియాకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్కప్, 2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్, 2021 టీ20 ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీల్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ టైటిల్ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడినంత కాలం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు. తాజాగా ఒక్క ఫార్మాట్కే పరిమితం కావడంతో కుటుంబంతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని, అందుకే టీ20 ప్రపంచకప్ ఫైనల్ వీక్షించేందుకు అహ్మదాబాద్కు రాలేకపోయాడని పలువురు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రపంచకప్ ఫైనల్తో పాటు అంతకముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు కూడా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు తమ కుటుంబాలతో కలిసి వీక్షించేందుకు వచ్చారు. కేవలం వన్డే ఫార్మాట్కు మాత్రమే ఆడుతున్న కోహ్లీ గత జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఆడాడు. ఆ సిరీస్లో కోహ్లీ సెంచరీ సహా అర్థసెంచరీ సాధించి జట్టు తరఫున టాప్ స్కోరర్గా నిలిచి తన ఫామ్ను కొనసాగిస్తూ వస్తున్నాడు.చదవండి: ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్ -
ధోని, కోహ్లీ, రోహిత్ గ్రూప్లో సంజూ
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ మంగళవారం ధ్రువీకరించాడు.తీవ్ర విషాదంకాగా 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.ఎంతో సంతోషిస్తున్నాఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు.బెంగళూరులో మ్యాచ్లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్గా టైటిల్ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది.చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్: గంభీర్ -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్కు ఇన్స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్తో పర్హాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మైర్(17)ను ఫర్హాన్(18) అధిగమించాడు.👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శతకాలు బాదలేదు.👉అదేవిధంగా టీ20 ప్రపంచకప్లో ఓవరాల్గా రెండు సెంచరీలు చేసిన ప్లేయర్గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ సమం చేశాడు. -
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
విధ్వంసకర ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన ఈ బిహారీ పిల్లాడు.. భారత్ తరఫునా అదరగొడుతున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే అండర్-19 స్థాయిలో అదరగొడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు.జింబాబ్వే వేదికగా ఇంగ్లండ్పై భారీ శతకం (80 బంతుల్లో 175) బాదిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ ఆరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు భారత్ అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో ఏకంగా కెప్టెన్గా వ్యవహరించిన వైభవ్.. యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం విశేషం. ఇలా టీనేజ్లోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఆటతో బిజీగా ఉన్న కారణంగా చదువు విషయంలో ఏడాది వెనుకపడనున్నాడు.బిహార్లోని తేజ్పూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడి మాడెస్టీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17- మార్చి 11 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ క్లాస్ 10 బోర్డు ఎగ్జామ్కు వైభవ్ సూర్యవంశీ హాజరు కావాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలు రాస్తాడని వార్తలు వచ్చాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మాడెస్టీ స్కూల్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార పింటూ నిర్ధారించారు. వైభవ్కు అడ్మిట్ కార్డు కూడా జారీ చేశామని.. అయితే, ఆఖరి నిమిషంలో అతడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలిపినట్లు పింటూ పేర్కొన్నారు. కాగా వరుస సిరీస్లు, వరల్డ్కప్ టోర్నీతో బిజీగా గడిపిన వైభవ్.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ క్యాంపుతో ఐపీఎల్కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. దీంతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడని.. అందుకే ఈసారి పరీక్షలు రాయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు వైభవ్ చదువును కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దిగ్గజాల క్వాలిఫికేషన్ తెలుసా?ఇక వైభవ్ పరీక్షలు స్కిప్ చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాల విద్యార్హతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఈ ముంబైకర్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా ప్రసిద్ధికెక్కాడు.మరోవైపు.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇంటర్ చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమిండియాలోకి వచ్చి జట్టు గతినే మార్చివేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఇక ఢిల్లీకి చెందిన రన్మెషీన్ విరాట్ కోహ్లి కూడా పన్నెండో తరగతి వరకే చదివాడు. అదే విధంగా.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి, ముంబైకర్ రోహిత్ శర్మ సైతం ఇంటర్తోనే ఆపివేసినట్లు తెలుస్తోంది.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
‘ఎ’ గ్రేడ్లో గిల్, బుమ్రా, జడేజా
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ జట్టు ఆటగాళ్లకు సంబంధించి 2025–26కు గాను వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించింది. గత సీజన్ వరకు ఉన్న ‘ఎ ప్లస్’ గ్రేడ్ను తొలగించిన బోర్డు... ఈ సారి ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లతోనే జాబితాను ఖరారు చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఆల్ ఫార్మాట్ స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ఎ’ గ్రేడ్లో స్థానం లభించగా...భారత టెస్టు జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవజు్ఞడైన రవీంద్ర జడేజాకు కూడా ‘ఎ’ గ్రేడ్ దక్కడం విశేషం. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిను ‘బి’ గ్రేడ్లో చేర్చగా, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ‘బి’లోనే ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్కు ‘సి’ నుంచి ‘బి’కు ప్రమోషన్ లభించగా...వన్డే, టి20ల్లో రెగ్యులర్ సభ్యుడైన అక్షర్ పటేల్ స్థాయిని తగ్గించి ‘సి’లోకి చేర్చారు. 2024–25 కాంట్రాక్ట్తో పోలిస్తే ఎవరినీ అదనంగా చేర్చలేదు. నాడు 34 మందితో జాబితా ఉండగా...ఇప్పుడు నలుగురు ఆటగాళ్లు షమీ, సర్ఫరాజ్, రజత్ పాటీదార్, ముకేశ్ కుమార్లను కాంట్రాక్ట్నుంచి తప్పించి 30 మందికి పరిమితం చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి 26 సెప్టెంబర్, 2026 మధ్య కాలానికి కొత్త కాంట్రాక్ట్లు వర్తిస్తాయి. గ్రేడ్ ‘ఎ’ – శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్‡్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిõÙక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్. ‘ఆ నలుగురు’ టాప్ గ్రేడ్లో...భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్లేయర్లకు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మ, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ‘ఎ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్ ‘బి’లో నలుగురు ప్లేయర్లు ఉండగా, గ్రేడ్ ‘సి’లో 13 మంది కలిపి మొత్తం 21 మంది సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచి్చంది. గ్రేడ్ ‘ఎ’ – హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ గ్రేడ్ ‘బి’ – రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా గ్రేడ్ ‘సి’ – రాధ యాదవ్, అమన్జోత్ కౌర్, ప్రతీక రావల్, క్రాంతి గౌండ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, కమలిని, వైష్ణవి శర్మ, తేజల్ హసబ్నిస్. 🚨 BCCI ANNUAL CONTRACT 2025-26 🚨 pic.twitter.com/UxNOSYkEnE— Johns. (@CricCrazyJohns) February 9, 2026ఆయా కాంట్రాక్ట్ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ ప్లస్ గ్రేడ్లో ఉండిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్ 125 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం 105 మ్యాచ్ల్లోనే 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ జాబితాలో స్కై, విరాట్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159 మ్యాచ్ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్దీప్ సింగ్కు (22) దక్కుతుంది. విరన్దీప్ తర్వాతి స్థానాల్లో సికందర్ రజా (19), సూర్యకుమార్ (17) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కై మినహా భారత ఇన్నింగ్స్లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్కు గురైనట్లు సమాచారం. గతంలో విరాట్, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, పేసు గుర్రం మరియు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్, రోహిత్తో పాటు ఏ ప్లస్లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సిరాజ్, పంత్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, కుల్దీప్ యాదవ్ కేటగిరి బిలో ఉన్నారు.సి కేటగిరిలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దుబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నట్లు సమాచారం. -
RCB: విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రెండోసారి చాంపియన్స్గా నిలిచి ఆర్సీబీ కుటుంబానికి గర్వకారణమయ్యారంటూ స్మృతి మంధాన సేనను కొనియాడాడు. ఇదొక అద్భుత విజయమని.. ట్రోఫీని ముద్దాడేందుకు ఆర్సీబీ మహిళా జట్టుకు పూర్తి అర్హత ఉందని పేర్కొన్నాడు.కాగా డబ్ల్యూపీఎల్-2026 సీజన్లో ఆర్సీబీ ఆరంభం నుంచే వరుస విజయాలు సాధించింది. ఐదు మ్యాచ్లు గెలిచి మిగిలిన జట్ల కంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడ్డ ఆర్సీబీ.. ప్రత్యర్థి విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి టైటిల్ గెలుచుకుంది.జెమీమా కెప్టెన్ ఇన్నింగ్స్వడోదర వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు లిజెల్లి లీ (37), షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా.. లారా వొల్వర్ట్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ (37 బంతుల్లో 57)తో మెరవగా.. చినెల్లి హెన్రీ (15 బంతుల్లో 35 నాటౌట్) ధనాధన్ దంచికొట్టింది.ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 203 పరుగులు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్గరే, అరుంధతి రెడ్డి, నదైన్ డిక్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగింది.స్మృతి మంధాన, జార్జియా వోల్ ధనాధన్అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన.. వన్డౌన్ బ్యాటర్ జార్జియా వోల్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. స్మృతి 41 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 87 పరుగులు సాధించగా.. వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసింది.మిగిలిన వారిలో రిచా ఘోష్ (6) విఫలమైనా.. స్మృతి- వోల్ వేసిన బలమైన పునాదిపై నదైన్ డిక్లెర్క్ (5 బంతుల్లో 7), రాధా యాదవ్ (5 బంతుల్లో 12) అజేయంగా నిలిచి పని పూర్తి చేశారు. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఢిల్లీకి మరోసారి చేదు అనుభవందీంతో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీకి మరోసారి చేదు అనుభవం ఎదురుకాగా.. ఆర్సీబీ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. 2024లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచింది. ఇక గతేడాది ఆర్సీబీ పురుషుల జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవగా.. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ రూపంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీకి మరో టైటిల్ దక్కింది.అద్భుతమైన విజయంఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి.. ‘‘మరోసారి చాంపియన్స్గా నిలిచారు. ఆర్సీబీ విజయ పతకాన్ని ఎగురవేస్తూనే ఉండాలి. జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. ముఖ్యంగా స్మృతి.. నీకు, జట్టుకు, ఆర్సీబీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఇదొక అద్భుతమైన విజయం. ఇందుకు మీరు అర్హులు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మన అభిమానులు పంచే ప్రేమను ఎంజాయ్ చేయండి’’ అని ప్రశంసలు కురిపించాడు. ఈ పోస్టు ఏడు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. చదవండి: ఆరో టైటిల్ వేటలో... -
ఇషాన్ కిషన్కు అండగా విరాట్ కోహ్లి
న్యూజిలాండ్ టీ20 సిరీస్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఒకనొక దశలో మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తనకు అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివని అన్నాడు. విరాట్ ఓదార్పు తనను కెరీర్లో తిరిగి పుంజుకునేలా చేసిందని తెలిపాడు.మానసికంగా విరిగిపోయిన సమయంఇషాన్ 2020 ఐపీఎల్ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ తరఫున 516 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ 2021లో పరిస్థితి పూర్తిగా మారింది. 10 మ్యాచ్ల్లో కేవలం 241 పరుగులు మాత్రమే సాధించాడు. అతని ఆటలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ అతన్ని “బ్రోకెన్ యంగ్ మాన్” అని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ ఇచ్చిన మానసిక బలం ఆ సమయంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇషాన్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆ క్షణం ఇషాన్ జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచింది. “నేను కన్నీళ్లు ఆపుకుంటూ ఉన్నాను. విరాట్ భాయ్ వచ్చి నన్ను ఓదార్చారు. ఆ సమయంలో నాకు ఆ మాటలు చాలా అవసరం అయ్యాయి” అని ఇషాన్ ఇటీవల ఒక పోడ్కాస్ట్లో చెప్పాడు. బాధను విజయంగా మార్చిన క్షణం విధి చాలా నాటకీయమైంది. 2022లో ఇషాన్ కిషన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ (ఫాస్టెస్ట్) సాధించినప్పుడు, నాన్-స్ట్రైకర్ ఎండ్లో నిలిచింది విరాట్ కోహ్లీనే. ఇద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఒకప్పుడు కన్నీళ్లు ఆపుకున్న ఆటగాడు, అదే కోహ్లీ సాక్షిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.నమ్మకముంచిన ముంబై ఇండియన్స్ ఇషాన్ 2021లో విఫలమైనప్పటికీ, ముంబై ఇండియన్స్ అతనిపై నమ్మకముంచింది. 2022 వేలంలో రూ. 15.25 కోట్ల భారీ మొత్తానికి అతన్ని తిరిగి కొనుగోలు చేసింది. ఎంఐ విశ్వాసాన్ని ఇషాన్ నిలబెట్టుకున్నాడు. ఆ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ల్లో 133.88 స్ట్రైక్రేట్తో 418 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.ఇషాన్ 2.0ఐపీఎల్ అనుభవాలు పక్కన పెడితే, ఇషాన్ అంతర్జాతీయ కెరీర్లోనూ అద్భుతమైన పునరాగమనం చేశాడు. రెండేళ్ల కిందట అతనికి టీమిండియాలో స్థానమే ఉండేది కాదు. స్వయంకృతాపరాధాల వల్ల జట్టులో స్థానం కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అయితే ఇషాన్ తిరిగి అద్భుత రీతిలో పుంజుకున్నాడు.గడిచిన రెండేళ్లలో దేశీయ క్రికెట్లో విశేషంగా రాణించి, ఇటీవల న్యూజిలాండ్ టీ20 సిరీస్కు అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఈ వెర్షన్ ఇషాన్లోని 2.0 వెర్షన్. రీఎంట్రీలో ఇషాన్ మరింత చెలరేగిపోయాడు. మొదటి మూడు మ్యాచ్ల్లోనే వరుసగా 76, 28, 103 పరుగుల స్కోర్లు చేశాడు. ఈ ప్రదర్శనల తర్వాత అతను త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడం ఖరారైపోయింది. -
విరాట్ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ భారత దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (32), మొహమ్మద్ రిజ్వాన్ (30), డేవిడ్ వార్నర్ (28), జోస్ బట్లర్ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్ సెంచరీతో బాబర్ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్లోకి వచ్చిన బాబర్BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు) చేసిన బాబర్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫామ్లోకి వచ్చాడు.మ్యాచ్ పరిస్థితి లాహోర్ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్ చేసింది. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
విరాట్ కోహ్లి వికెట్ తీస్తే.. ఏం చేస్తానంటే?
ఐపీఎల్-2026లో ఉత్తరప్రదేశ్కు చెందిన యువ స్పిన్నర్ విశాల్ నిషాద్ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో అతడు ఐపీఎల్లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు. -
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
-
గుడ్బై చెప్పాడా?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మెషీన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్ ఎక్కువే.274 మిలియన్ల ఫాలోవర్లుముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం.కాసేపు డీయాక్టివేట్అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేట్ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్ ఫ్యాన్స్.. అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్లి.. ఆరా తీశారు.వదినమ్మా.. అసలేం జరిగింది? ‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్ రీయాక్టివేట్ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.వన్డేల రారాజుకాగా బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్
టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు అందించిన సేవలు మరువలేనివి. టీ20 ప్రపంచకప్- 2007, 2011లో వన్డే వరల్డ్కప్ టైటిళ్లను భారత్ గెలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలక పాత్ర.ఇక 2007 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్తో మ్యాచ్లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యువీ (Yuvraj Singh) తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే వరల్డ్కప్-2011లో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.క్యాన్సర్ బారిన పడి..అయితే, యువీ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. చిన్ననాడు తండ్రి యోగ్రాజ్ సింగ్ శిక్షణలో ఎన్నో కష్టాలు అనుభవించిన యువీ.. ఆ తర్వాత తల్లిదండ్రులు విడిపోగా.. తల్లి సమక్షంలో ఉన్నాడు. అవరోధాలను అధిగమించి క్రికెటర్గా ఉన్నత శిఖరాలకు చేరిన వేళ క్యాన్సర్ మహమ్మారి బారినపడ్డాడు. వన్డే వరల్డ్కప్ గెలిచిన తర్వాత అతడికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.పడిలేచిన కెరటంఛాతిలో నొప్పి, రక్తపు వాంతులు తదితర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన యువీకి.. ఊపిరి తిత్తులు, గుండె మధ్య భాగంలో ట్యూమర్ ఉన్నట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్. కీమోథెరపీ చేయించుకున్నాడు. క్రమక్రమంగా కోలుకుని 2012 సెప్టెంబరులో క్రికెటర్గా రీఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత టీమిండియా తరఫున 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న యువీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీలోనూ భాగమయ్యాడు. అయితే, వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డ యువీ 2019లో అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని అప్పటి కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి తొక్కేసారంటూ యోగ్రాజ్ సింగ్ గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేశాడు.తాజాగా తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ యువరాజ్ సింగ్ సైతం పరోక్షంగా తండ్రి వ్యాఖ్యలకు మద్దతు పలికినట్లు సంకేతాలు ఇచ్చాడు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా యూట్యూబ్ షోలో మాట్లాడుతూ..గౌరవం దక్కడం లేదనే భావన‘‘కెరీర్ భారంగా మారిపోయింది. నా ఆటను ఆస్వాదించలేకపోతున్నాని అప్పుడు స్పష్టంగా తెలిసింది. నా ఆటకు.. రిటైర్మెంట్కు నడుమ సన్నని గీత. అసలు ఆటను ఆస్వాదించలేనపుడు ఆడటం ఎందుకన్న ప్రశ్న.నాకెవరూ మద్దతుగా లేరనిపించింది. నాకు గౌరవం దక్కడం లేదనే భావన కలిగింది. నాలో సత్తా లేకున్నా ఆడటం ఎందుకనే ప్రశ్న తలెత్తింది. ఆట నాకెంతో ఇచ్చింది. అందుకు ప్రతిగా నేనూ అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాను.ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి?మరి అలాంటి ఆటను నేనెందుకు ఆస్వాదించలేకపోతున్నానని బాధగా అనిపించింది. నేను ఆడాల్సిన అవసరం ఇక లేదనిపించింది. ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి? శారీరకంగా, మానసికంగా ఇంతకంటే నేను ఏమీ చేయలేను. ఏదో తెలియని బాధ. కాబట్టి ఆటను ఇక ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైతే ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానో.. అప్పుడే మళ్లీ నన్ను నేను.. అసలైన నన్ను చేరుకోగలిగాను’’ అంటూ తాను పడిన మానసిక వేదన, ఒత్తిడిని గుర్తు చేసుకుంటూ యువీ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్ సాంట్నర్ -
విరాట్ కోహ్లి సరసన సంజూ శాంసన్
గౌహతి వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే ఔట్) శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్లు) - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్లు)* - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్లు) - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్లు) - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్లు) మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-18-2), హార్దిక్ (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. చాప్మన్ (32), సాంట్నర్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్, ఇషాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.శాంసన్ ఫామ్పై ఆందోళనలు ఈ సిరీస్లో శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్కు ముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది. వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్ కాకపోయినా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
దిగ్గజాలకు షాక్!.. అది నిజమే: బీసీసీఐ
ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్లలో మార్పులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ధ్రువీకరించారు.బోర్డు సంతృప్తితో లేదు‘‘A+ గ్రేడ్ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.ఈ గ్రేడ్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు.రో-కో వన్డేలలో మాత్రమేకాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలతో పాటు.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్! -
RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, రన్మెషీన్ విరాట్ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్ మనదే’’ అనుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.పద్దెనిమిదేళ్లకుఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్ పాటిదార్ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. లీగ్ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.చేతులు మారనున్న యాజమాన్యంఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.ఆదార్ పూనావాలా ఆసక్తిఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆదార్ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్!తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది.మరోవైపు.. రణ్బీర్ కపూర్ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన -
టెస్ట్ క్రికెట్లోకి విరాట్ కోహ్లి రీఎంట్రీ..?
టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్కప్-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్లో పెను సంచలనంగా మారుతుంది.కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు గుడ్బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం వెనుక భారత క్రికెట్లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్ నడిచింది.సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్లో చేరతాడు. కోహ్లి టెస్ట్ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. శారీకంగా అతను ఫిట్గా ఉన్నప్పటికీ.. మెంటల్ ఫిట్నెస్ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్ చేస్తే, అతని ఫోకస్ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్ టర్మ్ ప్లానింగ్ను డిస్టర్బ్ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్-2గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ సరికొత్త వన్డే నంబర్ వన్ బ్యాటర్గా అవతరించాడు.తాజాగా భారత్పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్, 137) చేయడంతో డారిల్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్ ప్లేస్లో ఉండిన విరాట్పై డారిల్ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. ప్రస్తుతం డారిల్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో డారిల్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్తో సిరీస్లో డారిల్ చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని (2-1) అందించాడు.మరోవైపు రెండు వారాల కిందట టాప్ ర్యాంక్లో ఉండిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ సిరీస్లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.న్యూజిలాండ్తో రెండో వన్డేలో సూపర్ సెంచరీతో అదరగొట్టిన మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ టాప్-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్ సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్, విండీస్ ప్లేయర్ షాయ్ హోప్, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.తాజాగా ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్తో మూడో వన్డేలో సూపర్ సెంచరీతో అలరించిన ఫిలిప్స్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్-5లో ఉన్నారు. న్యూజిలాండ్ సిరీస్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్తో సిరీస్లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్తో సిరీస్లో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన మైఖేల్ బ్రేస్వెల్ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్, జింబాబ్వే సికందర్ రజా, ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మహ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతున్నారు. -
BCCI: బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వార్షిక వేతనంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడుతున్న కారణంగా సెంట్రల్ కాంట్రాక్టులో అతడిని అత్యుత్తమ గ్రేడ్లోనే కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చాయి. ఏటా రూ. 7 కోట్లుకాగా జాతీయ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను క్రమబద్దీకరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లను ఎ+, ఎ, బి, సి అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులు చెల్లిస్తున్న బోర్డు... ఇక మీద ‘ఎ+’ కేటగిరీని తొలగించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ‘ఎ+’ కేటగిరీలో ఉండగా... వీరికి ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తున్నారు.రో-కోలతో పాటు జడ్డూను తొలగిస్తారు!మరోవైపు.. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 కోట్లు... ‘బి’ కేటగిరీలోని ప్లేయర్లకు రూ. 3 కోట్లు... ‘సి’ కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అయితే కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు.. టీ20లకు స్వస్తి పలికిన జడేజా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్లలోనే ఆడుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఎ+ గ్రేడ్లో ఉన్న బుమ్రా ఒక్కడే అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. దీంతో 2025–26 కోసం ప్రకటించనున్న జాబితాలో ‘ఎ+’ కేటగిరీని తొలగించాలని బోర్డు భావిస్తోంది.బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!అయితే బుమ్రాకు ఇస్తున్న వేతనంలో ఎలాంటి మార్పు చేసే అవకాశాలైతే లేవు. 2018 సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ‘ఎ+’ జాబితాను ప్రవేశపెట్టింది. కోహ్లి, రోహిత్ ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండటంతో వారికి ‘బి’ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇక ప్రస్తుతం ‘బి’ కేటగిరీలో ఉన్న అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి.త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొత్త కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘కాంట్రాక్టుల విధానాన్ని సరళీకరించే ప్రయత్నమే ఇది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లు తక్కువ మందే ఉన్నారు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న బుమ్రా అత్యుత్తమ కేటగిరీలోనే ఉంటాడు. అతడి వేతనంలో ఎలాంటి కోత ఉండదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా ఇప్పటికే పలు కీలక మ్యాచ్లు.. టోర్నీలకు దూరమయ్యాడు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రాధాన్యం దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: భారత్లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..రూ. 7 కోట్ల వార్షిక వేతనంA+ గ్రేడ్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ప్రధాన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.వీరికి ఐదు.. వారికి మూడుఇక A గ్రేడ్లో ఉన్న రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.వీళ్లందరికి కోటిఇక C గ్రేడ్లో ఉన్న రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.A+ గ్రేడ్ను ఎత్తివేసే యోచనతాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.రో-కోకు భారీ షాక్తదుపరి అపెక్స్ మీటింగ్లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ అండ్ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు భారీ షాక్ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్లోకి వేసే అవకాశం ఉంది.ఈ నలుగురు అంతేకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రధాన పేసర్ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.చదవండి: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్ యంగ్స్టార్కి గోల్డెన్ ఛాన్స్
భారత్తో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్లో సత్తా చాటిన యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.మూడు మ్యాచ్లకుఅయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. స్టార్ ఆటగాడు మైకేల్ బ్రేస్వెల్ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్కాప్స్ (న్యూజిలాండ్)తో బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్ అక్కడే ఉండిపోతాడు.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్ బ్రేస్వెల్ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్పూర్లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది.అరంగేట్రంలోనే..కాగా మైకేల్ బ్రేస్వెల్ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్ ఆడిన కివీస్ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్ సందర్భంగానే క్రిస్టియన్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.కోహ్లికే షాకిచ్చాడుభారత్తో తొలి వన్డేలో హర్షిత్ రాణాను అవుట్ చేసి తన ఖాతాలో తొలి వికెట్ జమచేసుకున్న క్లార్క్.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే టీ20 సిరీస్ జట్టులోనూ క్రిస్టియన్ క్లార్క్ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.టీమిండియాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్లకు).షెడ్యూల్: జనవరి 21, 23, 25, 28, 31టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!
న్యూజిలాండ్ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్కు తొలిసారి భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్తో మ్యాచ్లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్ సిరీస్ కోల్పోయేందుకు కారణమని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్లు ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్లాంటి బ్యాటర్ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు -
భారత జెర్సీలో మళ్లీ రో-కోలు కనిపించేది ఎప్పుడంటే?
టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగియడంతో రో-కో ద్వయం దాదాపు 6 నెలల పాటు భారత జెర్సీలో కన్పించరు. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో వీరిద్దరూ భారత్ తరపున ఆడనున్నారు.అంతకంటే మందు జూన్లో అఫ్గానిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ అఫ్గానిస్తాన్తో భారత్ ఆడితే విరాట్-రోహిత్ కూడా బరిలోకి దిగనున్నారు. లేదంటే ఆ తర్వాత నెలలో ఇంగ్లండ్పై కచ్చితంగా ఆడనున్నారు.కాగా ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలు.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డేల తర్వాత టీమిండియా టీ20 సిరీస్లు ఎక్కువగా ఆడనుంది. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డే సిరీస్ షెడ్యూల్ వరకు అభిమానులు అగాల్సిందే.అయితే ఈ సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్లో మాత్రం తమ తమ జట్లు తరపున సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో మాత్రం విరాట్, రోహిత్ వరుస అంతర్జాతీయ సిరీస్లలో బీజీబీజీగా గడపనున్నారు. ఇంగ్లండ్తో వన్డేలు ముగిసిన తర్వాత సెప్టెంబర్లో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంతరం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.విరాట్ హిట్.. రోహిత్ ఫట్ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ సిరీస్లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం! -
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
సంజనా గల్రానీ.. అప్పుడెప్పుడో బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ నటి కొంతకాలంగా సినిమాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె ఇటీవల తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఏకంగా టాప్ 5లో చోటు దక్కించుకుంది. అయితే గతంలో సంజనాపై ఓ రూమర్ ఉంది. క్రికెటర్ విరాట్ కోహ్లితో లవ్ ట్రాక్ నడిపిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆ పబ్లిసిటీ వద్దుకెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది సంజనా. ఆమె మాట్లాడుతూ.. నేను బెంగళూరు అమ్మాయిని. కన్నడలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్కు అతిథిగా వెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది తప్ప అంతకుమించి ఏమీ లేదు. అదంతా గతం. విరాట్ కోహ్లి గర్ల్ఫ్రెండ్గా గుర్తింపు పొందడం, ఆ పబ్లిసిటీ నాకవరసరమే లేదు. కానీ, ఈ లేనిపోని లవ్ రూమర్స్ మా స్నేహాన్ని చెడగొట్టాయి. ఈ రూమర్స్ రాకపోయుంటే ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్గా కొనసాగేవాళ్లం. ఆ బాధ నాకెప్పుడూ ఉంది అని చెప్పుకొచ్చింది.ఏం జరిగిందంటే?సంజనా గల్రానీ, క్రికెటర్ విరాట్ కోహ్లి 2011 సమయంలో ప్రేమించుకున్నారంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ ఏడాది ఐపీఎల్లో బెంగళూరుకు సపోర్ట్ చేసింది సంజనా.. ఈ క్రమంలోనే తరచూ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లేది. అలా ఓసారి ఆర్సీబీ జెర్సీ ధరించిన ఈ నటి.. విరాట్ కోహ్లితో కలిసి మైదానంలో ముచ్చట్లు పెట్టింది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముంది, వీళ్లిద్దరికీ లింక్ పెడుతూ కథనాలు బయటకు వచ్చాయి. కానీ, కొంతకాలానికి వీరిద్దరూ మరెక్కడా కలిసి కనిపించలేదు.చదవండి: సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక మందన్నా -
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో -
కోహ్లి వీరోచిత పోరాటం వృథా.. ఇండోర్లో భారత్ ఓటమి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్తో వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), రాహుల్(1) వికెట్లు భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి(53), విరాట్ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత నితీశ్(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు. -
విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీ
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీతో చెలరేగాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి.. కోహ్లి మాత్రం తన అద్బుత బ్యాటింగ్తో అభిమానుల్లో గెలుపు ఆశలను రేకెత్తించాడు.ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది.న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు. -
ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా!
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్మ్యాన్ నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్లో రోహిత్ ఔటయ్యాడు.మిడాన్లో క్లార్క్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవలం 61 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్ను కివీస్పై మాత్రం కొనసాగించలేకపోయాడు. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో ఉన్న హిట్మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్మెంట్ మెరుగైన ప్రదర్శలను ఆశిస్తోంది.తడబడుతున్న భారత్..కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తడబడుతోంది. కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్మన్ గిల్ 23 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ఫౌల్క్స్, క్లార్క్, లినిక్స్, జేమిసన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్.. -
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
వన్డే క్రికెట్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. భారత్పై అతడికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్పై గత ఐదు మ్యాచ్లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా కలిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా మిచెల్ చరిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో కోహ్లిని మిచెల్ అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్గా..అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్-19 ప్రపంచకప్లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్తో కమల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్లో కొనసాగుతున్నాడు.కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్ వెటరన్లు
దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో చెలరేగిపోతున్నారు. వీరిలో వార్నర్ అయితే మరీనూ. ఈ ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో (130 నాటౌట్, 67 నాటౌట్, 82, 110 నాటౌట్) పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. తాజా సెంచరీతో వార్నర్ భాయ్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (11) తర్వాత రెండంకెల సెంచరీ మార్కును (10) తాకిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.మరో ఆసీస్ వెటరన్, టెస్ట్ ప్లేయర్గా ముద్ర పడిన స్టీవ్ స్మిత్ అయితే ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్లో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా బిగ్బాష్ లీగ్లో అదిరిపోయే విధ్వంసకర శతకం బాదాడు. వార్నర్ తాజా సెంచరీ చేసిన మ్యాచ్లోనే స్టీవ్ కూడా శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బిగ్బాష్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ గురించి అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాటిరాని విధంగా టెస్ట్ల్లో వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. గత ఐదేళ్లలో అతను టెస్ట్ల్లో ఏకంగా 24 సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు చేశాడు. తాజాగా అతను ఆస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలతో సత్తా చాటాడు.టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం లేటు వయసులో ఇరగదీస్తున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ల్లో చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సహా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన రోహిత్.. సౌతాఫ్రికాపై 2, ఆస్ట్రేలియాపై మరో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.విరాట్ కోహ్లి విషయానికొస్తే.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇతను, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చాలామంది విరాట్ పని అయిపోయిందని కూడా అనుకున్నారు. ఈ దశలో విరాట్ అనూహ్యంగా పుంజుకొని సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కెరీర్ పీక్స్లో ఉన్నప్పటి విరాట్ను గుర్తు చేస్తున్నాడు. విరాట్ గత 8 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు చేసి అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు.వీరే కాకుండా ఫాబ్ ఫోర్లోని మరో వెటరన్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా అడపాదడపా సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వీరంతా సత్తా చాటుతుంటే, బౌలింగ్లో ఒక్కరు మాత్రం ఊహకందని విధంగా చెలరేగిపోతున్నారు. ఆ స్టార్ వెటరన్ బౌలర్ పేరు మిచెల్ స్టార్క్. స్టార్క్ తాజాగా ముగిసిన యాషెస్ 2025-26లో 5 మ్యాచ్ల్లో 31 వికెట్లు పడగొట్టి, కుర్ర పేసర్లు కూడా సాధ్యం కాని ప్రదర్శనలు చేశాడు. ఈ సిరీస్లో అతను బ్యాట్తోనూ ఆకట్టుకోవడం మరో విశేషం.ప్రస్తుతం జో రూట్ వయసు 35, మిచెల్ స్టార్క్ వయసు 35, స్టీవ్ స్మిత్ వయసు 36, విరాట్ కోహ్లి వయసు 37, రోహిత్ శర్మ వయసు 38, డేవిడ్ వార్నర్ వయసు 39. వీరంతా మహా అయితే కెరీర్ను మరో రెండేళ్లు కొనసాగించగలరు. ఇలాంటి దశలో సాధారణ ఆటగాళ్లైతే అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపించే వాళ్లు. కానీ వీళ్లు మాత్రం అలా కాదు. వైన్ వయసు పెరిగే కొద్ది మత్తు ఎక్కువగా ఇస్తుందన్నట్టు సత్తా చాటుతున్నారు. -
విరాట్ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్ వైబ్ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు సంబంధించిన ఒక శుభవార్త ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది. అలీబాగ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.మహరాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్లోని గాట్ నంబర్లు 157 158లోని విలేజ్ జిరాద్లో ఈ భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనంమరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్ను కొనుగోలు చేసినవారిలో ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో ఉండటం విశేషం.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి -
కేఎల్ రాహుల్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 120 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రాహుల్ తన సెంచరీతో ఆదుకున్నాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామమ్యం నెలకొల్పారు. రోహిత్(24) ఔటయ్యాక గిల్(56), శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లి(23) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు.ఈ క్రమంలో రాహుల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జడేజా ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో తన ఎనిమిదివ వన్డే సెంచరీ మార్క్ను కేఎల్ అందుకున్నాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొత్తంగా రాహుల్ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్చ, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బ్రేక్
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. తొలి వన్డేలో 93 పరుగులతో సత్తాచాటిన కోహ్లి.. రెండో వన్డేలో మాత్రం నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు.29 బంతుల్లో 23 పరుగులు చేసి క్లార్క్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడనప్పటికి ఓ అరుదైన రికార్డు మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా కింగ్ కోహ్లి చరిత్ర సృష్టించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. కోహ్లి ఇప్పటివరకు కివీస్పై వన్డేల్లో 1770 పరుగులుచ చేశాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(1750)ను కోహ్లి అధిగమించాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన జాబితాలో కోహ్లి రెండో స్ధానంలో నిలిచాడు.అగ్రస్ధానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్(1,971) కొనసాగుతున్నాడు. తొలి వన్డేలో కోహ్లి కూడా పలు అరుదైన రికార్డులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంతవేగంగా 28,000 పరుగులు మైలు రాయిని అందుకున్న ప్లేయర్గా సచిన్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.అదేవిధంగా ఇంటర్ననేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వన్డే వరల్డ్కప్-2027 లక్ష్యంగా దూసుకుపోతున్నాడు.చదవండి: రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి -
రోహిత్ శర్మను కిందికి దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన విరాట్ కోహ్లి
ఐసీసీ ఇవాళ (జనవరి 14) విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో టీమిండియా ఫ్యాన్స్కు మిశ్రమ అనుభవాలు ఎదురయ్యాయి. దిగ్గజ బ్యాటర్లలో ఒకరు టాప్ ర్యాంక్కు చేరుకొని సొంత అభిమానుల్లో ఆనందం నింపగా.. అప్పటికే టాప్ ప్లేస్లో ఉన్న మరో ఆటగాడు రెండు స్థానాలు కోల్పోయి, పర్సనల్ ఫ్యాన్స్ను నిరాశకు గురి చేశాడు. ఇంతకీ ఆ దిగ్గజ బ్యాటర్లు ఎవరంటే..?విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ. విరాట్ తాజాగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 93 పరుగులు చేయడంతో ర్యాంకింగ్స్లో ఓ స్థానం మెరుగుపర్చుకొని టాప్ ర్యాంక్కు చేరాడు. అప్పటికే టాప్ ప్లేస్లో ఉండిన రోహిత్ శర్మ న్యూజిలాండ్పై కేవలం 26 పరుగులకే పరిమితం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. అదే మ్యాచ్లో 84 పరుగులతో సత్తా చాటిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ ఓ స్థానం మెరుగపర్చుకొని రెండో స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ (29 నాటౌట్) ఆడిన కేఎల్ రాహుల్ ఓ స్థానం మెరుగుపర్చుకొని, 11వ స్థానానికి చేరాడు. టాప్-10లో భారత్ తరఫున మరో ఇద్దరు ఆటగాళ్లు కూడా ఉన్నారు. శుభ్మన్ గిల్ 5, శ్రేయస్ అయ్యర్ 10 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇవి మినహా ఈ వారం ర్యాంకింగ్స్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు.బౌలర్ల విషయానికొస్తే.. టాప్-10లో ఒక్క మార్పు కూడా లేదు. రషీద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, కుల్దీప్ యాదవ్ టాప్-3గా కొనసాగుతున్నారు. భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఈ వారం ర్యాంకింగ్స్లో గణనీయంగా లబ్ది పొందాడు. న్యూజిలాండ్పై తొలి వన్డేలో 2 వికెట్లు తీయడంతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 16వ స్థానానికి చేరాడు. అదే మ్యాచ్లో ఘోరంగా విఫలమైన మరో టీమిండియా బౌలర్ రవీంద్ర జడేజా ఐదు స్థానాలు కోల్పోయి 21వ ప్లేస్కు పడిపోయాడు.ఆల్రౌండర్ల విషయానికొస్తే.. ఒమర్జాయ్, సికందర్, మొహమ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతుండగా.. భారత్ తరఫున అక్షర్ పటేల్ పదో స్థానంలో నిలిచాడు. -
రో-కో ఫ్యాన్స్కు గ్రేట్ న్యూస్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లికు సంబంధించి బిగ్ న్యూస్ అందుతుంది. గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరి కెరీర్ భవితవ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంషు కోటక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రో-కో టీమిండియా 2027 వరల్డ్కప్ ప్రణాళికల్లో కీలక భాగమని అధికారికంగా ధృవీకరించాడు. ఈ ప్రకటనతో రో-కో భవితవ్యంపై స్పష్టత వచ్చింది. వారి ఫ్యాన్స్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. తమ ఆరాధ్య ఆటగాళ్లు 2027 వరకు తమకు అలరిస్తారని తెలిసి ఉబ్బితబ్బిబవుతున్నారు.ఇంతకీ కోటక్ ఏమన్నాడంటే.. మేనేజ్మెంట్, రో-కో మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. కోచ్ గౌతమ్ గంభీర్తో వీరిద్దరూ తరచూ చర్చలు జరుపుతున్నారు. 2027 వరల్డ్కప్ ప్రణాళికలపై వీరి అనుభవం జట్టుకు మార్గదర్శకంగా ఉంటుంది.వీరిద్దరూ చాలా ప్రొఫెషనల్. ప్రాక్టీస్, ఫిట్నెస్, ప్రణాళికల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అవసరమైతే ముందుగానే వేదికకు వెళ్లి ప్రాక్టీస్ చేస్తారు. జట్టులోని ఇతర ఆటగాళ్లతో తమ అనుభవాన్ని పంచుకుంటారు. వీరికి చెప్పాల్సిన అవసరం లేదు. వారు స్వయంగా ప్రణాళికలు రూపొందిస్తారని కోటక్ అన్నాడు. కోటక్ చేసిన ఈ వ్యాఖ్యలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కెరీర్ భవితవ్యంపై పూర్తి క్లారిటీ ఇచ్చాయి. రో-కో ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బిజీగా ఉన్నారు. వీరిద్దరు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. మొదటి వన్డేలో అతను 93 పరుగులు చేసి, తృటిలో మరో శతకాన్ని మిస్ అయ్యాడు. ఆ మ్యాచ్లో రోహిత్ 26 పరుగులే చేసినా, క్రీజ్లో ఉన్నంత సేపు తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.ఇవాళ రాజ్కోట్ వేదికగా రెండో వన్డే జరుగనుంది. ఈ మ్యాచ్లోనూ రో-కో తమ అద్భుత ఫామ్ను కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
చరిత్రకు అడుగు దూరంలో శ్రేయస్ అయ్యర్
టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన రీఎంట్రీలో సత్తాచాటిన సంగతి తెలిసిందే. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 47 బంతుల్లో 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఇప్పుడు రాజ్కోట్ వేదికగా జరగనున్న రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించాలని ఈ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ ఉవ్విళ్లురుతున్నాడు. అయితే ఈ మ్యాచ్కు ముందు అయ్యర్కు ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. శ్రేయస్ తన వన్డే కెరీర్లో 3000 పరుగుల మార్కును చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు.రాజ్కోట్ వన్డేలో శ్రేయస్ మరో 34 పరుగులు చేస్తే.. అత్యంతవేగంగా(ఇన్నింగ్స్లు పరంగా) ఈ ఫీట్ అందుకున్న భారత ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ ముంబైకర్ ఇప్పటివరకు 68 వన్డే ఇన్నింగ్స్లలో 2966 పరుగులు చేశాడు.ప్రస్తుతం ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్(72 ఇన్నింగ్స్లు) తొలి స్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాత స్ధానాల్లో విరాట్ కోహ్లి(75), కేఎల్ రాహుల్(78) ఉన్నారు. ఇప్పుడు వీరిందరిని అధిగమించేందుకు సర్పంచ్ సాబ్ సిద్దమయ్యాడు.శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే జట్టులో కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. ముఖ్యంగా నాలుగో స్ధానంలో అయ్యర్ను మించిన ఆటగాడు కన్పించడం లేదు. 2017 నుండి 2021 మధ్య కాలంలో టీమిండియా మెనెజ్మెంట్ దాదాపు నాలుగవ స్దానం కోసం దాదాపు 13 మంది ఆటగాళ్లను మార్చింది. ఒక్కరు కూడా 500 పరుగుల మార్కును కూడా దాటలేదు. కానీ అయ్యర్ మాత్రం ఆ లోటును భర్తీ చేశాడు. ఈ స్ధానంలో అయ్యర్ 54.77 సగటుతో 1479 పరుగులు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ క్రికెట్ దిగ్గజం -
అచ్చం నాలాగే..: రోహిత్తో కోహ్లి ఏం చెప్పాడంటే..
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెద్దోళ్లే కాదు చిన్న పిల్లలూ అతడి ఫ్యాన్స్ జాబితాలో ఉంటారు. ఇటీవల న్యూజిలాండ్తో తొలి వన్డేకు ముందు ఓ ‘బుల్లి’ అభిమాని కోహ్లిని కలిశాడు.ఇందులో ప్రత్యేకత ఏముంది అంటారా?.. ఆ చోటా ఫ్యాన్ కోహ్లి బాల్యంలో ఎలా ఉండేవాడో అచ్చం అలాగే ఉండటం ఇక్కడ విశేషం. ఈ విషయాన్ని కోహ్లి (Virat Kohli)నే స్వయంగా అంగీకరించాడు. అంతేకాదు రోహిత్ శర్మ (Rohit Sharma)తోనూ ఇదే విషయం చెప్పాడు. స్వదేశంలో కివీస్తో వన్డే సిరీస్తో టీమిండియా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా వడోదరలో ఇరుజట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్కు ముందు కోహ్లిని ఓ పిల్లాడు కలిశాడు. ఈ క్రమంలో కోహ్లి తనను చూసి ఎలా స్పందించాడో తాజాగా చెప్పుకొచ్చాడు. ‘‘కోహ్లి అని పిలిచి.. హాయ్ చెప్పాను.నా డూప్లికేట్ అక్కడ కూర్చున్నాడుఒక్క నిమిషంలో వస్తాను అని కోహ్లి నాతో అన్నాడు. అంతలోనే రోహిత్ శర్మవైపు తిరిగి.. ‘నా డూప్లికేట్ (Young Virat Kohli Doppelganger) అక్కడ కూర్చున్నాడు చూడు’ అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా నన్ను చోటా చీకూ అని పిలిచారు’’ అంటూ ఆ బుడ్డోడు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.93 పరుగులుకాగా కోహ్లి ముద్దుపేరు చీకూ అన్న విషయం తెలిసిందే. తనలాగే ఉన్న ఆ పిల్లాడిని కలిసి.. అతడికి ఫొటోగ్రాఫ్ కూడా ఇచ్చి ఖుషీ చేశాడు కోహ్లి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి వన్డేలో భారత్ న్యూజిలాండ్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది.కివీస్ విధించిన 301 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలోనే భారత్ ఛేదించింది. కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ 93 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా 45వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మరోవైపు.. రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో 26 పరుగులు చేయగలిగాడు. ఇక భారత్- కివీస్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్ వేదిక.చదవండి: T20 WC 2026: నెదర్లాండ్స్ జట్టు ప్రకటన.. ‘మనోళ్ల’పై వేటు! Virat Kohli said to Rohit Sharma, "Wha dekh Mera duplicate betha hai (Look, my duplicate is sitting there)".- Virat Kohli called him a Chota Cheeku 😭❤️ pic.twitter.com/b4r1DopMUa— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 12, 2026 -
IND vs NZ: రిపోర్టర్పై మండిపడ్డ టీమిండియా స్టార్
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.ఇక ఈ మ్యాచ్లో టీమిండియా యువ క్రికెటర్ హర్షిత్ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్ పేసర్.ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిఅదే విధంగా.. న్యూజిలాండ్ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన హర్షిత్ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.బుమ్రా గైర్హాజరీలోఈ క్రమంలో కివీస్పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్.. ‘‘జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.మండిపడ్డ టీమిండియా హర్షిత్ రాణాఈరోజు సిరాజ్ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు న్యూజిలాండ్తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్ కలిసి తొలి వికెట్కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.ఆల్రౌండర్గా ఇక టీమిండియా మేనేజ్మెంట్ తనను ఆల్రౌండర్గా చూడాలని భావిస్తోందని హర్షిత్ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్- న్యూజిలాండ్ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియం వేదిక. చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు -
ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్ కోహ్లి
వన్డే క్రికెట్లో తాను ఛేజింగ్ ‘కింగ్’నని టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ న్యూజిలాండ్తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.మా అమ్మకు పంపిస్తానుఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.గుర్గావ్లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.దేవుడు నాకు అన్నీ ఇచ్చాడునా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్- కివీస్ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్ ఆడాయి. 93 పరుగులుటాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ శుబ్మన్ గిల్ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.మిగిలిన వారిలో శ్రేయస్ అయ్యర్ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.చదవండి: క్రికెట్ చరిత్రలో అద్భుతం🗣️ If I look back at my whole journey, it's nothing short of a dream come true. ✨🎥 Virat Kohli reflects on his incredible career after becoming the 2⃣nd highest run-getter in men's international cricket🙌👏#TeamIndia | #INDvNZ | @imVkohli | @idfcfirstbank pic.twitter.com/87BgcZlx4b— BCCI (@BCCI) January 11, 2026 -
విరాట్ కోహ్లి కోసం రంగంలోకి దిగిన వికాస్ కోహ్లి
లిస్ట్-ఏ ఫార్మాట్లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీ (93) అవకాశాన్ని కోల్పోయాడు. విరాట్ సత్తా చాటడంతో న్యూజిలాండ్పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ప్రదర్శనగానూ విరాట్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ ఇన్నింగ్స్తో విరాట్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్కు ముందు సచిన్ మాత్రమే ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, తొలి వన్డే అనంతరం విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి సోషల్మీడియాలో షేర్ చేసిన ఓ సందేశం వైరలవుతుంది. విరాట్పై ఇటీవల చులకన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్కు వికాస్ పరోక్షంగా చురకలించాడు.విరాట్ టెస్ట్ల నుంచి తప్పుకొని, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగడంపై మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు టాపార్డర్ బ్యాటర్లకు సులభమైన ఫార్మాట్ అని వ్యాఖ్యానించాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లను ఉదాహరణగా చూపిస్తూ, వారు టెస్ట్ల్లో గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నారంటూ విరాట్ను నేరుగా టార్గెట్ చేశాడు.ఈ వ్యాఖ్యలకు కౌంటర్గానే వికాస్ సోదరుడు విరాట్ తరఫున రంగంలోకి దిగాడు. మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండానే “ఇది ఎంత సులభమైన ఫార్మాట్ కదా... కొద్ది రోజుల క్రితం ఎవరో తమ జ్ఞానాన్ని పంచుకున్నారు.. చెప్పడం సులభం, చేయడం కష్టం” అంటూ ఓ మెసేజ్ షేర్ చేశాడు.ఈ సందేశాన్ని అభిమానులు మాజీ క్రికెటర్–కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. కాగా, విరాట్పై ఈగ కూడా వాలనివ్వని వికాస్ గతంలో కూడా చాలా సందర్భాల్లో విరాట్పై వ్యతిరేక కామెంట్లు చేసే వారికి ఇలాగే చురకలంటించాడు. విరాట్ జనవరి 14న న్యూజిలాండ్తో జరిగే రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరుగనుంది. -
గెలుపు తలుపు తీసే క్రికెటర్లకు...
వడోదర: ప్రస్తుత టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు బరోడా క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) వినూత్నంగా ఆత్మీయ సత్కారాన్ని ఏర్పాటు చేసింది. ఏళ్ల తరబడి ‘టన్’లకొద్దీ పరుగులతో భారత క్రికెట్ జట్టు గెలుపు తలుపుల్ని తీస్తున్న ‘హిట్మ్యాన్’ రోహిత్, ‘కింగ్’ కోహ్లిలను తొలి వన్డే సందర్భంగా అదే రీతిన గౌరవించింది. రెండు తలుపులతో ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేసిన బీసీఏ ఇద్దరినీ అందులో ఉంచింది. ఇద్దరి క్రికెటర్ల నిలువెత్తు పోస్టర్లు అంటించిన చెరో తలుపు తీయగానే కోహ్లి, రోహిత్లు బయటికి వచ్చారు. వారి పోస్టర్లపై ఆటోగ్రాఫ్లు చేశారు. ఈ వేడుక మైదానంలోని వేలమంది క్రికెట్ అభిమానుల్ని విశేషంగా అలరించింది. వాళ్లు రావడం, పోస్టర్లపై సంతకాలు చేయడంతో ప్రేక్షకులంతా కరతాళధ్వనులతో జేజేలు పలికారు. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ జై షా, బీసీఏ అధ్యక్షుడు ప్రణవ్ అమీన్, బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తదితరులు పాల్గొన్నారు. -
విరాట్ విశ్వరూపం.. తొలి వన్డేలో భారత్ ఘన విజయం
భారత పురుషల క్రికెట్ జట్టు కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. ఆదివారం వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. 301 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి 49 ఓవర్లలో చేధించింది.దీంతో మూడు వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.విరాట్ విధ్వంసం..అనంతరం భారీ లక్ష్య చేధనలో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ తన విశ్వరూపాన్ని చూపించాడు. తనదైన శైలిలో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ దశలో సునాయసంగా సెంచరీ మార్క్ను అందుకునేలా కన్పించిన కోహ్లి.. ఓ భారీ షాట్కు ప్రయత్నించి ఔటయ్యాడు.కేవలం 7 పరుగుల దూరంలో సెంచరీ చేసే అవకాశాన్ని కింగ్ కోల్పోయాడు. కోహ్లి మొత్తంగా 91 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 8 ఫోర్లు, ఒక సిక్సర్తో 93 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ శుభ్మన్ గిల్(56), వైస్ కెప్టెన శ్రేయస్ అయ్యర్(49) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.అయితే కోహ్లి ఔటయ్యాక భారత్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. దీంతో భారత డగౌట్లో కాస్త టెన్షన్ నెలకొంది. కానీ కేఎల్ రాహుల్(21 బంతుల్లో 29) ప్రశాంతంగా ఆడుతూ మ్యాచ్ను ఫినిష్ చేశాడు. హర్షిత్ రాణా(23 బంతుల్లో 29) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాడ్ బౌలర్లలో కైల్ జేమీసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఆశోక్, క్లార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం రాజ్కోట్ వేదికగా జరగనుంది.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. సచిన్ వరల్డ్ రికార్డు బ్రేక్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో దుమ్ములేపిన విరాట్.. ఇప్పుడు కివీస్తో వన్డేల్లో కూడా అదే తీరును కనబరుస్తున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి వన్డేలో కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు.క్రీజులోకి వచ్చినప్పటి నుంచే భారీ షాట్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 28,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అత్యంతవేగంగా ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.కింగ్ కోహ్లి కేవలం 624 ఇన్నింగ్స్లలోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ ఫీట్ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(644) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ ఆల్టైమ్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో ముగ్గురే ముగ్గురు 28,000 పరుగులు సాధించారు. కోహ్లి కంటే ముందు కుమార సంగక్కర(28,016), సచిన్ టెండూల్కర్(34,357) ఈ ఘనత సాధించారు.సంగక్కర రికార్డు బ్రేక్..అదేవిధంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కోహ్లి రెండో స్ధానానికి చేరాడు. ఈ మ్యాచ్లోనే 42 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ స్ధానంలో సంగక్కర ఉండేవాడు. తాజా మ్యాచ్తో అతడిని కోహ్లి అధిగమించాడు. కోహ్లి కంటే ముందు సచిన్ ఒక్కడే ఉన్నాడు. అయితే కోహ్లి కేవలం ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండడంతో సచిన్ రికార్డు బ్రేక్ చేయడం కష్టమనే చెప్పాలి.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు' -
విరాట్ కోహ్లి నాగిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎంత యాక్టివ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కింగ్ కోహ్లి కేవలం బ్యాటింగ్తోనే కాకుండా తన చేష్టలతో కూడా అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మరోసారి కోహ్లి తనలోని ఫన్నీ యాంగిల్ను బయటపెట్టాడు.వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి నగిన్ డ్యాన్స్ చేశాడు. కివీస్ ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డేంజరస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్.. శ్రేయస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో ఇండియన్ టీమ్ మొత్తం సంబరాల్లో మునిగితేలిపోయింది. కోహ్లి మాత్రం ఫ్లూట్ వూదుతున్నట్లుగా చేతులతో సైగ చేస్తూ స్పెషల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో డార్లీ మిచెల్(71 బంతుల్లో 84), డెవాన్ కాన్వే(56), హెన్రీ నికోల్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ, హర్షిత్ రానా తలా రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.చదవండి: IND vs NZ: 'అతడికి మరోసారి అన్యాయం.. కావాలనే ఎదగనివ్వడం లేదు'pic.twitter.com/LZrkrdDVtq— crictalk (@crictalk7) January 11, 2026 -
వివాదంలో విరాట్ కోహ్లి భక్తుడు
విరాట్ కోహ్లి భక్తుడు, గత సీజన్లో ఆర్సీబీ టైటిల్ గెలిచిన జట్టులో భాగమైన స్వస్తిక్ చికారా వివాదంలో చిక్కుకున్నాడు. రాధికా శర్మ అనే యువతితో అతను చేసిన అభ్యంతరకర సంభాషణ సోషల్మీడియాలో లీకైంది. ఇందులో చికారా రాధికాను కేఫ్ లేదా రెస్టారెంట్లో కలవాలని ఒత్తిడి చేశాడు. చికారా రాధికాను కన్పూర్లోని ఓ మాల్లో కలిశాడు. ఆ పరిచయంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. విసిగిపోయిన రాధికా చికారా వేధింపులను బయటపెట్టింది. చికారా తనను సోషల్ మీడియాలో స్టాక్ చేసి, ఫ్లర్ట్ మెసేజ్లు పంపాడని ఆధారాలతో (చాట్ స్క్రీన్షాట్లు) సహా సోషల్మీడియాలో షేర్ చేసింది. లీకైన ఈ చాట్ల వల్ల చికారా వ్యక్తిగత ఇమేజ్ దెబ్బతినడంతో పాటు అతని మాజీ జట్టు, డిఫెండింగ్ ఐపీఎల్ ఛాంపియన్ అయిన ఆర్సీబీ బ్రాండ్కు భంగం వాటిల్లుతుంది. క్రికెటేతర విషయాల కారణంగా ఆర్సీబీ పరువు పోవడం ఇది తొలిసారి కాదు. గతంలో వేర్వేరు ఘటనల్లో అమ్మాయిలను వేధించి, ఇబ్బంది పెట్టాడన్న కారణంగా ప్రస్తుత ఆర్సీబీ బౌలర్ యశ్ దయాల్పై ఘాజియాబాద్, జైపూర్లో కేసులు నమోదయ్యాయి. యశ్ దయాల్ ఉదంతంతోనే ఆర్సీబీ పరువు గంగలో కలిసింది. తాజాగా చికారా ఎపిసోడ్ ఆ ఫ్రాంచైజీ పరువును మరింత దిగజార్చింది. 17 సీజన్ల పాటు టైటిల్ గెలవలేకపోయినా, ఫ్రాంచైజీగా క్లీన్ ఇమేజ్ కలిగిన ఆర్సీబీ దయాల్, చికారా కారణంగా బజారుకెక్కింది. దయాల్ను ఆర్సీబీ 2026 మినీ వేలానికి ముందు అట్టిపెట్టుకోగా.. చికారాను విడుదల చేసింది. చికారాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. అతను ఆర్సీబీలో ఉండగా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. యూపీలో జన్మించిన 20 ఏళ్ల చికారాను ఆర్సీబీ 2024 సీజన్లో కొనుగోలు చేసింది. కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్ అయిన చికారా విరాట్ కోహ్లిని దేవుడి కంటే ఎక్కువగా కొలుస్తాడు. ఆర్సీబీలో ఉండగా అతనెప్పుడూ విరాట్ వెంటే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో విరాట్ చికారా అతి వినయానికి తట్టుకోలేక కోపడ్డాడని కూడా వార్తలు వచ్చాయి. చికారా విరాట్ను బాగా విసిగించేవాడని ప్రచారం ఉంది.మొత్తంగా యశ్ దయాల్, చికారా ఉదంతాలు ఆర్సీబీ ప్రతిష్ట దెబ్బ తీశాయి. దీనిపై ఆ ఫ్రాంచైజీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకునేప్పుడు వారి బ్యాక్ గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలని ఫ్రాంచైజీ యాజమాన్యానికి సూచిస్తున్నారు.కాగా, ఆర్సీబీ 17 సీజన్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం గత సీజన్లోనే తమ తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఫైనల్లో పంజాబ్పై జయకేతనం ఎగురవేసి ఛాంపియన్గా నిలిచింది. ఈ గెలుపును ఆర్సీబీ ఆటగాళ్లు దిగ్గజ ప్లేయర్ విరాట్ కోహ్లికి అంకితమిచ్చారు. ఈ గెలుపుతో విరాట్ కోహ్లి పాత్ర కూడా చాలా ఉంది. సీజన్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించి టైటిల్ కలను నెరవేర్చుకున్నాడు. అయితే ఈ సంతోషం ఆర్సీబీకి కానీ విరాట్ కోహ్లికి కానీ ఎన్నో గంటలు మిగల్లేదు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడయంలో జరిగిన విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా బెంగళూరు ఇప్పుడు ఆర్సీబీకి హోం గ్రౌండ్ అయ్యే అర్హత కూడా కోల్పోనుందని తెలుస్తుంది. ఈ ఘటనపై విరాట్ కోహ్లి చాలా విచారం వ్యక్తం చేశాడు. -
కోహ్లి అరుదైన ఘనత.. సౌరవ్ గంగూలీ రికార్డు బ్రేక్
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానానికి కోహ్లి చేరుకున్నాడు. వడోదర వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలో కోహ్లి ఈ ఫీట్ నమోదు చేశాడు.కోహ్లికి ఇది 309వ వన్డే మ్యాచ్. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిట ఉండేది. గంగూలీ తన కెరీర్లో 308 మ్యాచ్లు ఆడి 11221 పరుగులు చేశాడు. ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(463) అగ్రస్ధానంలో ఉన్నారు. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలోనూ సచిన్(18426) టాప్లో కొనసాగుతున్నారు.భారత్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్లు వీరే..సచిన్ టెండూల్కర్-463ఎంఎస్ ధోని-347రాహుల్ ద్రవిడ్-340అజారుద్దీన్-334విరాట్ కోహ్లి-309సౌరవ్ గంగూలీ-308వన్డే కింగ్..ఇక ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లి కూడా తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్గా కోహ్లి కొనసాగుతున్నాడు. కోహ్లి ఇప్పటివరకు 53 సెంచరీలు నమోదు చేశాడు. అదేవిధంగా వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లి(14557) రెండో స్ధానంలో ఉన్నాడు. కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు. -
భారీ రికార్డులపై కన్నేసిన రోహిత్, కోహ్లి
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా వడోదర వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ (జనవరి 11) జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భారీ రికార్డులపై కన్నేశారు. కోహ్లి 42 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించనుండగా.. రోహిత్ 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్గా 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని తాకుతాడు.రో-కో ప్రస్తుతమున్న ఫామ్ను బట్టి చూస్తే ఇదే మ్యాచ్లో ఈ రెండు రికార్డులు బద్దలవడం ఖాయంగా తెలుస్తుంది. రోహిత్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్ల్లో సెంచరీ, మూడు అర్ద సెంచరీలు చేసి సూపర్ ఫామ్లో ఉన్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో సిక్కింపై భారీ శతకంతో (155) అదే ఫామ్ను కొనసాగిస్తున్నాడు.కోహ్లి విషయానికొస్తే.. రోహిత్తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫామ్లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 4 ఇన్నింగ్స్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు చేసి మరో భారీ ఇన్నింగ్స్ కోసం గర్జిస్తున్నాడు. తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో ప్రస్తుతం వన్డేలపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి భారత ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ ఆచితూచి ఆడుతుంది. 16 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (42), డెవాన్ కాన్వే (35) భారత బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొంటున్నారు. నికోల్స్కు 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లైఫ్ లభించింది. కుల్దీప్ యాదవ్ సునాయాసమైన క్యాచ్ను జారవిడిచాడు. ఈ మ్యాచ్లో భారత్ ఆరుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగింది.తుది జట్లు..న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, విల్ యంగ్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ హే(wk), మైఖేల్ బ్రేస్వెల్(c), జకారీ ఫౌల్క్స్, క్రిస్టియన్ క్లార్క్, కైల్ జామిసన్, ఆదిత్య అశోక్భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్(c), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్(wk), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ -
ప్రాక్టీస్లో టీమిండియా
వడోదర: న్యూజిలాండ్తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్లో కోహ్లి, రోహిత్ మంచి టచ్లో కనిపించారు. నెట్స్లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు. టి20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్మన్ గిల్ కూడా నెట్స్లో చమటోడ్చాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్తో ఐదు మ్యాచ్ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది. -
కోహ్లి కంటే సన్నగా!.. కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!
టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లతో బిజీ కానుంది. కివీస్తో తొలుత మూడు వన్డేలు.. అనంతరం ఐదు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ తమ జట్లను ప్రకటించాయి.ఇక జనవరి 11, 14, 18 తేదీల్లో భారత్-కివీస్ మధ్య జరిగే వన్డే సిరీస్కు హిట్మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) సన్నద్ధమవుతున్నాడు. నెట్స్లో తీవ్రంగా చెమటోడుస్తూ శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే!కాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఫిట్నెస్పై శ్రద్ధ పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏకంగా పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆశ్చర్యపరిచాడు. తాజా వీడియోలో రోహిత్ మరింత బక్కచిక్కినట్లు కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో అభిమానులు.. ‘‘బ్రో.. కోహ్లి కంటే కూడా సన్నబడ్డాడే! అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం. సూపర్ భాయ్’’ అంటూ రోహిత్ శర్మను ఉద్దేశించి సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Rohit Sharma in the nets. pic.twitter.com/OsFnlwkg40— Mufaddal Vohra (@mufaddal_vohra) January 6, 2026 కింగ్ను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫ్యాన్స్!మరోవైపు.. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) కివీస్తో తొలి వన్డే కోసం వడోదరలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో కోహ్లికి చేదు అనుభవం ఎదురైంది. కింగ్ను చూసేందుకు ఎగబడ్డ జనం.. అతడికి తీవ్ర అసౌకర్యం కలిగించారు. అతికష్టమ్మీద అతడు ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లాడు.#WATCH | Gujarat: Former Indian Captain and Star Cricketer Virat Kohli arrives at Vadodara for Team India's ODI match against New Zealand on 11th January. pic.twitter.com/cQbhCghMZy— ANI (@ANI) January 7, 2026ఇద్దరూ సూపర్ ఫామ్లోఇటీవల సౌతాఫ్రికాతో సొంతగడ్డపై వన్డే సిరీస్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అదరగొట్టారు. కోహ్లి అయితే వరుస సెంచరీలతో వింటేజ్ కింగ్ను గుర్తు చేశాడు.ఆ తర్వాత రో-కో దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సొంత జట్ల తరఫున బరిలోకి దిగారు. ముంబై తరఫున రోహిత్, ఢిల్లీ తరఫున కోహ్లి శతక్కొట్టారు. ఇలా స్టార్లు ఇద్దరూ సూపర్ ఫామ్లో ఉండటం కివీస్తో వన్డేలకు ముందు టీమిండియాకు సానుకూలాంశంగా పరిణమించింది.చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త -
కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
నవతరం టెస్టు క్రికెట్లో ‘ఫ్యాబ్ ఫోర్’గా టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి, న్యూజిలాండ్ లెజెండ్ కేన్ విలియమ్సన్, ఆస్ట్రేలియా స్టార్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ దిగ్గజ బ్యాటర్ జో రూట్ పేరొందారు. ఈ నలుగురిలో కోహ్లి మాత్రమే టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా.. మిగతా ముగ్గురు సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగుతున్నారు.సచిన్ శతకాల రికార్డుకు చేరువగావీరిలో ముఖ్యంగా రూట్ అద్భుత ప్రదర్శనతో ప్రపంచ మేటి బ్యాటర్ సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) శతకాల రికార్డుకు చేరువవుతున్నాడు. యాషెస్ సిరీస్ 2025-26 ద్వారా ఇటీవలే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ బాదిన రూట్... సిడ్నీ వేదికగా ఐదో టెస్టులోనూ శతక్కొట్టాడు. టెస్టుల్లో అతడికి 41వ సెంచరీ. తద్వారా టెస్టు ఫార్మాట్లో అత్యధిక శతకాలు సాధించిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న రికీ పాంటింగ్ (41)ను సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ (51), జాక్ కలిస్ (45) మాత్రమే వీరి కంటే ముందున్నారు.ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రూట్ (Joe Root) త్వరలోనే రెండో స్థానానికి ఎగబాకడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకొన్నాళ్లు ఇదే జోరు కొనసాగిస్తే సచిన్ రికార్డును సమం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.. కోహ్లిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.లోపాలను సరిచేసుకోకుండాటెస్టు క్రికెట్లో తన లోపాలను సరిచేసుకోకుండా కోహ్లి రిటైర్మెంట్ పేరిట తప్పించుకున్నాడని మంజ్రేకర్ అన్నాడు. టాపార్డర్ బ్యాటర్కు ఎంతో సులువైన వన్డే ఫార్మాట్లో మాత్రం కొనసాగుతున్నాడని.. అది తనకు ఏమాత్రం నచ్చలేదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. ‘‘టెస్టు క్రికెట్లో జో రూట్ రోజురోజు సరికొత్త శిఖరాలు అందుకుంటున్నాడు.నా మనసు మాత్రం విరాట్ కోహ్లి వెంటే పరుగులు తీస్తోంది. చాలా ముందుగానే అతడు టెస్టుల నుంచి నిష్క్రమించాడు. రిటైర్ అవ్వడానికి ఐదేళ్ల ముందు నుంచి అతడు నిలకడలేమి ఫామ్తో సతమతమయ్యాడు. అయినా సరే పట్టువీడకుండా పోరాడాడు.గత ఐదేళ్లలో అతడి బ్యాటింగ్ సగలు 31. అలాంటపుడు తన లోపాలు సరిచేసుకుని ముందుకు సాగాల్సిందిపోయి గుడ్బై చెప్పాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ టెస్టు క్రికెట్లో మరింత గొప్పగా పేరు తెచ్చుకుంటూ ఉంటే కోహ్లి మాత్రం ఇలా చేయడం విచారకరం.సులువైన వన్డేలలో మాత్రంవిరాట్ కోహ్లి అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికినా బాగుండేది. కానీ అతడు టాపార్డర్ బ్యాటర్కు ఎంతో సులువైన వన్డేలలో మాత్రం కొనసాగడం మాత్రం నన్ను నిరాశకు గురిచేసింది. నాకు ఇది నచ్చలేదు.టెస్టు క్రికెట్, టీ20 క్రికెట్.. ఈ రెండు భిన్నమైన సవాళ్లు విసురుతాయి. టెస్టు క్రికెట్ ఓ ఆటగాడిని ఎల్లప్పుడూ పరీక్షిస్తూ ఉంటుంది. కానీ కోహ్లి దానినే వదిలేశాడు. సూపర్ ఫిట్గా ఉండి కూడా ఇంకొన్నాళ్లు పోరాడకుండా అతడు అలా సంప్రదాయ ఫార్మాట్ను వదిలివేయడం సరికాదు.ఫస్ల్ క్లాస్ క్రికెట్లో ఆడి ఫామ్లోకి రావాల్సింది. కచ్చితంగా పునరాగమనంలో అతడు రాణించేవాడే’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ముప్పై శతకాలతో వీడ్కోలుకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. అనూహ్య రీతిలో గతేడాది టెస్టులకూ గుడ్బై చెప్పేశాడు. తన కెరీర్లో 123 టెస్టులు ఆడిన కుడిచేతి వాటం బ్యాటర్.. 30 సెంచరీల సాయంతో 9230 పరుగులు సాధించాడు.చదవండి: షమీ బౌలింగ్ను చితక్కొట్టాడు.. కరీంనగర్ కుర్రాడి డబుల్ సెంచరీ View this post on Instagram A post shared by Sanjay Manjrekar (@sanjaysphotos) -
విరాట్ కోహ్లి అనూహ్య నిర్ణయం!
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అభిమానులకు చేదు వార్త. న్యూజిలాండ్తో వన్డేలకు ముందు ఈ రన్మెషీన్ మరోసారి బరిలోకి దిగుతాడనుకుంటే.. ఊహించని రీతిలో తన నిర్ణయం మార్చుకున్నాడు. ఢిల్లీ తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో మూడో మ్యాచ్ ఆడేందుకు కోహ్లి నిరాకరించినట్లు తెలుస్తోంది.బీసీసీఐ ఆదేశాల మేరకుఅంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఢిల్లీ లెజెండ్.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే బరిలో దిగాడు.రెండు మ్యాచ్లు కంప్లీట్కనీసం రెండు మ్యాచ్లు అయినా ఆడాలన్న నిబంధనల మేరకు.. తాజా ఎడిషన్లో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో వరుస శతకాలతో జోరు మీదున్న కోహ్లి.. దేశీ క్రికెట్లోనూ ఫామ్ను కొనసాగించాడు. ఆంధ్రపై 131, గుజరాత్పై 77 పరుగులు సాధించాడు.మూడోదీ ఆడతానని చెప్పి..ఇక న్యూజిలాండ్తో సొంతగడ్డపై జనవరి 11 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. విజయ్ హజారే టోర్నీలో మూడో మ్యాచ్కు కూడా కోహ్లి అందుబాటులో ఉంటానని చెప్పాడు. ఈ విషయాన్ని ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇటీవలే ధ్రువీకరించాడు.అందుబాటులో లేడుఅయితే, తాజాగా ఢిల్లీ కోచ్ సరణ్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘లేదు. కోహ్లి అందుబాటులో ఉండటం లేదు’’ అని స్పష్టం చేశాడు. కాగా ఢిల్లీ తదుపరి మంగళవారం (జనవరి 6) నాటి మ్యాచ్లో రైల్వేస్ జట్టుతో ఆడనుంది. కర్ణాటకలోని ఆలూర్లో గల కేఎస్సీఏ క్రికెట్ గ్రౌండ్-2 ఇందుకు వేదిక. రిషభ్ పంత్ సారథ్యంలోని ఈ జట్టులో కోహ్లి లేడు.చదవండి: కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ -
2026లో విరాట్ కోహ్లి ఛేదించబోయే భారీ రికార్డులు ఇవే..!
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2026వ సంవత్సరంలోనూ రికార్డు వేటను కొనసాగించనున్నాడు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. గతేడాది చివరి వరకు రికార్డుల వేటను కొనసాగించాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో భీకర ఫామ్లో ఉన్న విరాట్.. త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగుతాడు. ఈ సిరీస్ నుంచే విరాట్ రికార్డుల వేట మొదలవుతుంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విరాట్ ఈ ఏడాది ఛేదించే అవకాశం ఉన్న రికార్డులపై ఓ లుక్కేద్దాం.28000 అంతర్జాతీయ పరుగులుఅంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు 623 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 27975 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (644 ఇన్నింగ్స్) పేరిట ఉంది.15000 వన్డే పరుగులు308 ఇన్నింగ్స్ల్లో 14557 పరుగులు చేసి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్.. మరో 443 పరుగులు చేస్తే 15000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఏడాది న్యూజిలాండ్, ఇంగ్లండ్ సిరీస్ల్లో విరాట్ ఈ రికార్డును ఛేదించే అవకాశం ఉంది. వన్డేల్లో ఇప్పటివరకు సచిన్ మాత్రమే 15000 పరుగుల మార్కును తాకాడు.అంతర్జాతీయ క్రికెట్లో రెండో అత్యధిక పరుగులువిరాట్ మరో 42 పరుగులు చేస్తే సచిన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. ఈ క్రమంలో సంగక్కరను (28,016) వెనక్కు నెట్టేస్తాడు.అత్యధిక వన్డే పరుగులున్యూజిలాండ్ సిరీస్లో విరాట్ మరో 94 పరుగులు చేస్తే, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ (42 మ్యాచ్ల్లో 1750 పరుగులు) ఖాతాలో ఉంది. విరాట్ న్యూజిలాండ్తో ఇప్పటివరకు 33 వన్డేలు ఆడి 1657 పరుగులు చేశాడు.ఐపీఎల్లో 9000 పరుగులుఈ ఏడాది అంతర్జాతీయ వన్డేలతో పాటు ఐపీఎల్ కూడా ఆడనున్న విరాట్.. మరో 339 పరుగులు చేస్తే ఐపీఎల్ చరిత్రలో 9000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోతాడు. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 8,661 పరుగులు (267 మ్యాచ్లు) ఉన్నాయి. -
డేవిడ్ వార్నర్ విధ్వంసం.. కోహ్లి రికార్డు సమం
బిగ్ బాష్ లీగ్ 2025-26 సీజన్లో సిడ్నీ థండర్ కెప్టెన్, ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎట్టకేలకు తన విశ్వరూపం చూపించాడు. ఈ లీగ్లో భాగంగా శనివారం సిడ్నీ వేదికగా హోబర్ట్ హరికేన్స్తో జరిగిన మ్యాచ్లో వార్నర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన సిడ్నీ థండర్కు మొదటి ఓవర్లోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. తొలి రెండు బంతుల్లోనే ఇన్ ఫామ్ మాథ్యూ గిల్క్స్, సామ్ కాన్స్టాస్ వికెట్లను సిడ్నీ కోల్పోయింది. ఈ సమయంలో వార్నర్ ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటికి వార్నర్ మాత్రం తన విధ్వంసాన్ని ఆపలేదు. ముఖ్యంగా హరికేన్స్ స్పీడ్ స్టార్ నాథన్ ఎల్లిస్ను వార్నర్ ఉతికారేశాడు.ఇన్నింగ్స్ 20వ ఓవర్లో నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో వార్నర్ 3 సిక్సర్లు, 2 ఫోర్లతో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 56 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. దీంతో తన 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ(బీబీఎల్ సెంచరీ)కు డేవిడ్ భాయ్ తెరదించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న వార్నర్ 11 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి తుపాన్ ఇన్నింగ్స్ ఫలితంగా సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం ఈ భారీ లక్ష్యాన్నిహోబర్ట్ హరికేన్స్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలో చేధించింది. దీంతో సిడ్నీ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.కోహ్లి రికార్డు సమం..అయితే ఈ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన వార్నర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి రికార్డును సమం చేశాడు. కోహ్లి ఇప్పటివరకు టీ20ల్లో 9 సెంచరీలు చేయగా.. వార్నర్ కూడా సరిగ్గా తొమ్మిది సతకాలు నమోదు చేశాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్(22) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో పాక్ స్టార్ బాబర్ ఆజం ఉన్నాడు.చదవండి: మహ్మద్ షమీ కెరీర్ ముగిసినట్లేనా..? -
2025 విజ్డన్ జట్టు ప్రకటన.. భారత దిగ్గజాలకు చోటు
2025 సంవత్సరానికి గానూ విజ్డన్ (Wisden) పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ను ప్రకటించింది. ఈ జట్టులో గతేడాది వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 8 దేశాలకు చెందిన 11 మంది ఆటగాళ్లకు చోటు కల్పించింది. భారత్ నుంచి దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఎంపికయ్యారు. మరో భారతీయ ఆటగాడు మిలింద్ కుమార్కు కూడా ఈ జట్టులో చోటు దక్కినా, ప్రస్తుతం అతను యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.వెస్టిండీస్ (షాయ్ హోప్, జేడన్ సీల్స్), న్యూజిలాండ్కు (మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ) కూడా భారత్తో సమానంగా రెండు బెర్త్లు దక్కాయి. మిగతా బెర్త్లు సౌతాఫ్రికా (మాథ్యూ బ్రీట్జ్కే), స్కాట్లాండ్ (జార్జ్ మున్సే), ఇంగ్లండ్ (ఆదిల్ రషీద్), శ్రీలంకకు (అషిత ఫెర్నాండో) చెందిన ఆటగాళ్లు దక్కించుకున్నారు.ఆటగాళ్ల వారిగా గతేడాది ప్రదర్శనలు ఇలా ఉన్నాయి..రోహిత్ శర్మపరుగులు- 650 సగటు- 50.00స్ట్రయిక్రేట్- 100 అత్యుత్తమ ప్రదర్శనలు- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో 76 పరుగులు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై సెంచరీలుజార్జ్ మున్సేపరుగులు- 735సగటు- 73.50స్ట్రయిక్రేట్- 1072 సెంచరీలువిరాట్ కోహ్లిపరుగులు- 651సగటు- 65.10స్ట్రయిక్రేట్- 96పాకిస్తాన్పై అజేయ శతకం, ఛాంపియన్స్ ట్రోఫీ సెమీలో 84 పరుగులుషాయ్ హోప్ (వికెట్కీపర్)పరుగులు- 670 సగటు- 64.18స్ట్రయిక్రేట్- 99 పాకిస్తాన్పై 120*; 15 క్యాచ్లు, 2 స్టంపింగ్స్మాథ్యూ బ్రీట్జ్కేపరుగులు- 706సగటు- 64.18స్ట్రయిక్రేట్- 99అరంగేట్రంలోనే 150 పరుగులు; మొదటి ఐదు ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీలుమిలింద్ కుమార్పరుగులు- 652సగటు- 81.50 స్ట్రయిక్రేట్- 992 శతకాలువికెట్లు- 20ఓ ఐదు వికెట్ల ప్రదర్శనమిచెల్ సాంట్నర్ (కెప్టెన్)పరుగులు- 210వికెట్లు- 25 ఎకానమీ- 4.57కెప్టెన్గా స్థిరమైన ప్రదర్శనఆదిల్ రషీద్వికెట్లు- 30 సగటు- 23.63మ్యాట్ హెన్రీవికెట్లు- 27 వికెట్లుసగటు- 18.142025లో అత్యధిక వికెట్లు; ఛాంపియన్స్ ట్రోఫీ టాప్ బౌలర్జేడన్ సీల్స్వికెట్లు- 27 సగటు- 18.14పాకిస్తాన్పై 6-18అషిత ఫెర్నాండో వికెట్లు- 23 వికెట్లుసగటు- 21.30 -
కివీస్తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. అతడికి నో ఛాన్స్!
న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.ఇందుకు సంబంధించి న్యూజిలాండ్ ఇప్పటికే తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించగా.. భారత్ కేవలం టీ20 జట్టు వివరాలను మాత్రమే వెల్లడించింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రదర్శన ఆధారంగా.. శనివారం వన్డే జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది.జైస్వాల్కు చోటు దక్కినా..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్తో వన్డేలకు తన జట్టును ఎంచుకున్నాడు. టాపార్డర్లో కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిలను కొనసాగించాడు ఈ మాజీ ఓపెనర్.ముంబై తరఫున ఇటీవల సెంచరీతో రాణించిన టెస్టు జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు.. తుదిజట్టులో ఇప్పుడే చోటు దక్కదని.. ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్నే సెలక్టర్లు కొనసాగిస్తారని పేర్కొన్నాడు.పంత్కు చోటెలా?అదే విధంగా వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్గా అతడే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్గా సంజూ శాంసన్ను కాదని.. వన్డేల్లో మెరుగైన రికార్డు లేని, విజయ్ హజారే మ్యాచ్లలో విఫలమవుతున్న రిషభ్ పంత్ను ఎంపిక చేసుకున్నాడు.ఇక స్పిన్ ఆల్రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్కు ఓటు వేసిన ఆకాశ్ చోప్రా.. లెఫ్టార్మ్ బౌలర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలలో ఒకరినే సెలక్టర్లు ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డాడు. అక్షర్ ఐదు టీ20లతో పాటు వరల్డ్కప్ ఆడాల్సి ఉన్నందున వన్డేల నుంచి అతడికి విశ్రాంతినివ్వవచ్చని పేర్కొన్నాడు. అందుకే కివీస్తో వన్డేల్లో జడ్డూనే ఆడతాడని అంచనా వేశాడు.సంజూతో పాటు షమీకీ మొండిచేయితన జట్టులో తిలక్ వర్మకు కూడా చోటుందన్న ఆకాశ్ చోప్రా.. పేసర్ల విభాగంలో మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ తుదిజట్టుకు కూడా ఎంపిక అవుతారని పేర్కొన్నాడు. వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని మాత్రం అతడు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక స్పెషలిస్టు స్పిన్నర్గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్కు ఆకాశ్ చోప్రా ఓటువేశాడు. కాగా కివీస్తో టీ20 మ్యాచ్లు, ప్రపంచకప్-2026 దృష్ట్యా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టుశుబ్మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్.చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా -
వాళ్లిద్దరు రిటైర్ అయితే వన్డే క్రికెట్ ఏమైపోతుందో!
వన్డే క్రికెట్ రారాజుగా వెలుగొందుతున్నాడు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి. ఇప్పటికే యాభై ఓవర్ల ఫార్మాట్లో 53 సెంచరీలు చేసిన ఈ ఢిల్లీ స్టార్... పరుగుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మరోవైపు.. టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma). వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేయడంతో పాటు.. అత్యధిక స్కోరు (264) రికార్డును కూడా తన పేరిటే లిఖించుకున్నాడు.వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియాను ఫైనల్కు చేర్చిన రోహిత్ శర్మ.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో జట్టును చాంపియన్గా నిలిపాడు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో శతక్కొట్టిన ఈ ముంబైకర్.. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్లోనూ ఫామ్ను కొనసాగించాడు. దేశీ మ్యాచ్లకు భారీ క్రేజ్ ఇలా వన్డే క్రికెట్లో తమదైన ముద్ర వేసిన రో-కో.. బీసీసీఐ ఆదేశాల మేరకు దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలోనూ దిగారు. ఢిల్లీ తరఫున కోహ్లి (Virat Kohli).. ముంబైకి ఆడుతూ రోహిత్ మరోసారి శతకాలతో చెలరేగారు. వీరిని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఎన్నడూలేని విధంగా ఈ దేశీ మ్యాచ్లకు భారీ క్రేజ్ ఏర్పడింది.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రో-కో.. వన్డే వరల్డ్కప్-2027 తర్వాత యాభై ఓవర్ల ఫార్మాట్కు గుడ్బై చెప్పే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కెప్టెన్సీలోనూ ఆడిన భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.వాళ్లిద్దరు రిటైర్ అయితే వన్డే క్రికెట్ ఏమైపోతుందో!‘‘రోహిత్, విరాట్.. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీ ఆడేందుకు రాగానే ప్రేక్షకులు ఈ మ్యాచ్లను చూడటం కూడా మొదలుపెట్టారు. అన్నింటికంటే ఆటే గొప్పది. అయితే, రో-కో వంటి ఆటగాళ్లు మాత్రం తమ వల్ల ఆటకు మరింత వన్నె తెచ్చారు.దేశీ వన్డేలను కూడా క్రికెట్ ప్రేమికులు ఫాలో అవుతున్నారంటే అందుకు వీరిద్దరే కారణం. ఒకవేళ రోహిత్, విరాట్ గనుక వన్డేలు ఆడటం మానేస్తే.. పరిస్థితి ఏమైపోతుందో!’’ అని అశ్విన్ విచారం వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మాట్కు క్రేజ్ తగ్గకుండా ఉండేలా అంతర్జాతీయ క్రికెట్ మండలి చర్యలు చేపట్టాలని అశూ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశాడు.చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా -
8 నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్-న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్లు
భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 11న వడోదరలోని కొటంబి స్టేడయంలో జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్లైన్లో అమ్మకం ప్రారంభించిన 8 నిమిషాల్లోనే టికెట్లన్నీ సోల్డ్ ఔటయ్యాయి. మ్యాచ్ను ప్రత్యక్షంగా చూడాలనుకున్న వారిని ఈ విషయం బాధిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు మాత్రం సంతృప్తినిస్తుంది.తమ ఆరాధ్య ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ వల్లే, ఇలా తక్కువ సమయంలో టికెట్లు అమ్ముడుపోయాయని వారు సంబరపడిపోతున్నారు. ఇది కదా రో-కో క్రేజ్ అంటే అంటూ సోషల్మీడియాలో బజ్ క్రియేట్ చేస్తున్నారు. రాజ్కోట్, ఇండోర్లో జరిగే మిగతా రెండు వన్డేల్లోనూ పరిస్థితి ఇలాగే ఉంటుందంటూ హడావుడి చేస్తున్నారు. కాగా, రోహిత్-విరాట్ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్లో రో-కో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో న్యూజిలాండ్ సిరీస్ తొలి వన్డేకు హైప్ మరింత పెరిగింది. కోహ్లి ఆటను ప్రత్యక్షంగా చూడటమే లక్ష్యంగా అభిమానులు టికెట్ల కోసం ఎగబాడ్డారు. సౌతాఫ్రికా సిరీస్లో విరాట్ వరుసగా రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ చేసి ఫ్యాన్స్కు పిచ్చెక్కించాడు. ఇదే ఫామ్ను విరాట్ వడోదర వన్డేలోనూ కొనసాగిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, 3 మ్యాచ్ల వన్డే సిరీస్, 5 మ్యాచ్ల టీ20 సిరీస్ల కోసం న్యూజిలాండ్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్లలో తొలుత వన్డేలు జరుగనున్నాయి. జనవరి 11, 14, 18 తేదీల్లో వడోదర, రాజ్కోట్, ఇండోర్ వేదికలుగా మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్పూర్, రాయ్పూర్, గౌహతి, విశాఖపట్నం, తిరువనంతపురం వేదికలుగా టీ20లు జరుగనున్నాయి. టీ20 సిరీస్ కోసం భారత జట్టును ఇదివరకే ప్రకటించగా.. వన్డే జట్టును ప్రకటించాల్సి ఉంది. -
టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..
టీమిండియా టెస్టు, వన్డే సారథి శుబ్మన్ గిల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడేందుకు అతడు సిద్ధమయ్యాడు. పంజాబ్ తరఫున ఓపెనర్గా గిల్ బరిలోకి దిగనున్నాడు.జైపూర్ వేదికగా సిక్కిం, గోవా జట్లతో పంజాబ్ శని (జనవరి 3), మంగళవారాల్లో (జనవరి 6) ఆడే మ్యాచ్లో గిల్ భాగం కానున్నట్లు క్రిక్బజ్ వెల్లడించింది. కాగా సౌతాఫ్రికా (IND vs SA)తో ఇటీవల జరిగిన ఆల్ ఫార్మాట్ సిరీస్లో గిల్కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి.అనూహ్య రీతిలో వేటుతొలి టెస్టు సందర్భంగా గాయపడిన గిల్ (Shubman Gill).. సఫారీలతో రెండో టెస్టుతో పాటు వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆ తర్వాత టీ20 సిరీస్తో రీఎంట్రీ ఇచ్చి వరుస వైఫల్యాలతో విమర్శలు మూటగట్టుకున్నాడు. దీంతో నాలుగు, ఐదో టీ20ల నుంచి యాజమాన్యం అతడిని తప్పించింది.అంతేకాదు.. అనూహ్య రీతిలో ప్రపంచకప్-2026 జట్టులోనూ గిల్కు చోటివ్వలేదు. వైస్ కెప్టెన్గా ఉన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్పై వేటు వేసి.. టీ20ల నుంచి పక్కనపెట్టేసింది. ఈ నేపథ్యంలో విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో గిల్ సత్తా చాటి తిరిగి ఫామ్లోకి రావాలని గిల్ భావిస్తున్నాడు.ఇప్పటికే ఆడేశారుఇదిలా ఉంటే.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఇప్పటికే ఢిల్లీ, ముంబై తరఫున ఈ టోర్నీలో రెండేసి మ్యాచ్లు పూర్తి చేసుకున్నారు. టీమిండియా స్టార్లు రిషభ్ పంత్ ఢిల్లీ సారథిగా, నితీశ్ కుమార్ రెడ్డి ఆంధ్ర జట్టు కెప్టెన్గా ఉండగా.. రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర, సర్ఫరాజ్ ఖాన్ ముంబై, దేవదత్ పడిక్కల్ కర్ణాటక తరఫున దుమ్ములేపుతున్నారు. ఇక అభిషేక్ శర్మ సైతం పంజాబ్ తరఫున బరిలోకి దిగాడు.టీమిండియా స్టార్ల ‘రీఎంట్రీ’!.. ఎవరెవరు ఎప్పుడంటే..ఈ జాబితాలో ఇప్పుడు గిల్తో పాటు వెటరన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరనున్నాడు. సర్వీసెస్, గుజరాత్ జట్లతో జనవరి 6,8వ తేదీల్లో జరిగే మ్యాచ్లలో సౌరాష్ట్రకు జడ్డూ ప్రాతినిథ్యం వహించనున్నాడు. మరోవైపు.. భారత వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం కర్ణాటక తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు.త్రిపుర, రాజస్తాన్లతో జనవరి 3, 6 తేదీల్లో జరిగే మ్యాచ్లలో కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. ఇక గిల్తో పాటు.. జడేజా, కేఎల్ రాహుల్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లు పూర్తి చేసుకుని.. కోహ్లి, రోహిత్లతో కలిసి స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే వన్డే సిరీస్ బరిలో దిగనున్నారు. సొంతగడ్డపై కివీస్తో టీమిండియా మూడు వన్డే, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: నిజంగా ఇది సిగ్గుచేటు.. అతడిని ఎందుకు సెలక్ట్ చేయరు? -
అక్కాబావా.. అన్నా-వదినలతో కోహ్లి.. భార్యతో ధోని సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
2026: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్
సరికొత్త ఆశలతో మానవాళి కొత్త సంవత్సరంలో అడుగుపెట్టింది. నవ్వులతో నవ వసంతానికి నాంది పలుకుతూ నూతన ఏడాది ఆగమనాన్ని వేడుకగా జరుపుకొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) పెట్టిన పోస్టు వైరల్గా మారింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించి కోహ్లి గతేడాది సెప్టెంబరులో చివరగా ఓ ఫొటో షేర్ చేశాడు. తన సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి దిగిన చిత్రాన్ని పంచుకుంటూ.. చాన్నాళ్ల తర్వాత ఇలా అంటూ అభిమానులను పలకరించాడు.లైట్ ఆఫ్ మై లైఫ్ఆ తర్వాత చాలాకాలానికి తాజాగా కోహ్లి న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. ‘‘నా జీవితాన్ని కాంతులతో నింపే అత్యంత ముఖ్యమైన, విలువైన వ్యక్తితో కలిసి 2026లోకి అడుగుపెడుతున్నాను’’ అంటూ అనుష్క శర్మతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. భార్యపై ప్రేమను చాటుకున్నాడు. ఈ పోస్టు నిమిషాల్లోనే వైరల్గా మారింది. పది మిలియన్లకు పైగా దూసుకుపోతూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. లండన్లోనేకాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మను ప్రేమించిన కోహ్లి.. 2017లో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. పిల్లలను సెలబ్రిటీ లైఫ్ నుంచి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో విరుష్క జోడీ ఎక్కువగా లండన్లోనే నివాసం ఉంటోంది. ఇంతవరకు వారి ఫొటోలను కూడా రివీల్ చేయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఇక ఈ జంట ఇటీవలే ఎనిమిదో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొంది.టెస్టులకు బైబైఇదిలా ఉంటే.. కోహ్లికి 2025 మిశ్రమంగా గడిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో అతడు వరుసగా విఫలమై విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ క్రమంలో అనూహ్య రీతిలో మే నెలలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. సంప్రదాయ ఫార్మాట్లో పదివేల పరుగులు చేయకుండానే ‘టెస్టు కింగ్’ నిష్క్రమించడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే, వన్డేల్లో మాత్రం కోహ్లి మరోసారి సత్తా చాటాడు.వన్డే రారాజుగానే..రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ను భారత్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన కోహ్లి.. ఆసీస్ టూర్లో మాత్రం వరుస మ్యాచ్లలో డకౌట్ అయ్యాడు. అయితే, అదే పర్యటనలో మూడో వన్డేతో ఫామ్లోకి వచ్చిన కోహ్లి.. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్లో వరుస శతకాలతో చెలరేగాడు. తద్వారా 53వ వన్డే సెంచరీ నమోదు చేసి అత్యధిక సెంచరీల వీరుడిగా తన రికార్డు తానే సవరించాడు. ఇక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో పదిహేనేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. ఇక్కడా శతక్కొట్టాడు. కాగా ఐపీఎల్ టైటిల్ గెలవాలనే కోహ్లి చిరకాల కోరిక గతేడాది నెరవేరినా.. ఆర్సీబీ విజయోత్సవాలకు వచ్చిన అభిమానులు తొక్కిసలాటలో మృతి చెందడంతో విషాదం నెలకొంది. చదవండి: 2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్లు ఇవే..! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
సంవత్సరాంతంలోనూ ప్రపంచ రికార్డు నెలకొల్పిన విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి 2025వ సంవత్సరం చివరి రోజు కూడా ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది చివరి రోజు విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపర్చుకొని, రెండో స్థానానికి ఎగబాకిన విరాట్.. చరిత్రలో అత్యధిక సార్లు (10) టాప్-2లో (ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో) సంవత్సరాన్ని ముగించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.నేటికి ముందు ఈ రికార్డును విరాట్ మరో దిగ్గజ బ్యాటర్, విండీస్ యోధుడు వివ్ రిచర్డ్స్ (9), సౌతాఫ్రికా లెజండరీ ఆల్రౌండర్ షాన్ పొల్లాక్తో (9) కలిసి షేర్ చేసుకున్నాడు. తాజాగా సింగిల్గా ఈ ప్రపంచ రికార్డును కబ్జా చేశాడు.ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో వరుసగా 2017, 2018, 2019, 2020 సంవత్సరాలను టాప్-1 బ్యాటర్గా ముగించిన విరాట్.. 2013, 2014, 2015, 2016, 2021, 2025 సంవత్సరాలను రెండో నంబర్ బ్యాటర్గా ముగించాడు. డిసెంబర్ నెలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో రెండు శతకాలు, ఓ అర్ధశతకం సాయంతో 302 పరుగులు చేసిన విరాట్.. ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి ఎగబాకాడు. 2025ను నంబర్ వన్ బ్యాటర్గా ముగించిన ఆటగాడు మరో భారత దిగ్గజం రోహిత్ శర్మ కావడం మరో విశేషం. రోహిత్కు విరాట్కు రేటింగ్ పాయింట్ల పరంగా కేవలం 8 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. రోహిత్ ఖాతాలో 781 పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 773 పాయింట్లు ఉన్నాయి.ఈ ఏడాదే టెస్ట్లకు, అంతకుముందు ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. వన్డేల్లో ఈ ఏడాది అద్భుత ప్రదర్శనలు కనబర్చాడు. 13 మ్యాచ్ల్లో 3 శతకాల సాయంతో 651 పరుగులు చేశాడు. ఇందులో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్పై శతకం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. -
నిజాన్ని మీరే బయటపెట్టాలి: రోహిత్, కోహ్లికి మాజీ క్రికెటర్ విజ్ఞప్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ ఏడాది మే నెలలో తొలుత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. కోహ్లి కూడా అదే బాటలో నడిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో వీరిద్దరు పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడ్డారు.రోహిత్ మధ్యలో విరామం తీసుకుంటూ మ్యాచ్లు ఆడగా.. కోహ్లి పదే పదే ఆఫ్ స్టంప్ దిశగా వెళ్తున్న బంతిని ఆడే క్రమంలో దాదాపుగా ఎనిమిది సార్లు వికెట్లు పారేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రో- కో ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. రోహిత్ టెస్టులకు స్వస్తి పలికితే బాగుంటుందనే డిమాండ్లు పెరగగా.. మేటి టెస్టు బ్యాటర్ అయిన కోహ్లి తప్పులను సరిదిద్దుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అనూహ్య రీతిలోఈ క్రమంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ 2025-27లో భాగంగా తొలుత ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో టీమిండియాలో రో- కో ఆడతారని ముందుగా సంకేతాలు వచ్చాయి. అయితే, అనూహ్య రీతిలో వీరిద్దరు టెస్టులకు గుడ్బై చెప్పేశారు. రోహిత్ శర్మ స్థానంలో టెస్టు పగ్గాలు చేపట్టిన శుబ్మన్ గిల్.. బ్యాటింగ్ ఆర్డర్లో కీలకమైన కోహ్లి నాలుగో స్థానాన్నీ భర్తీ చేశాడు.ఒత్తిడి చేశారుఅయితే, రోహిత్- కోహ్లి ఆకస్మిక రిటైర్మెంట్లపై భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఇదైతే సహజమైన రిటైర్మెంట్లా అనిపించలేదు. ఈ విషయంలో వాళ్లు మాత్రమే నిజమేంటో చెప్పగలరు. నాకైతే ఇదేదో బలవంతంగా చేయించినట్లు అనిపిస్తోంది.నిజాన్ని మీరే బయటపెట్టాలిరోహిత్ శర్మ ఆరు నెలల పాటు విరామం తీసుకుని.. ఫిట్నెస్ సాధించి తిరిగి వస్తే బాగుండేది. అదే జరిగితే తిరిగి అతడు ఫామ్ను అందుకునేవాడు. అతడిలో ఇంకా క్రికెట్ మిగిలే ఉంది. రోహిత్తో పాటు కోహ్లి కూడా కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి వస్తే బాగుండేది. ఏదేమైనా టెస్టు రిటైర్మెంట్ విషయమై వాళ్లు నోరు విప్పితేనే నిజం తెలుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.ఇద్దరూ సిద్ధంఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి ప్రస్తుత ఫామ్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సౌతాఫ్రికాతో వన్డేల్లో ఇద్దరూ అదరగొట్టారు. రోహిత్ అద్భుతమైన హాఫ్ సెంచరీలు సాధిస్తే.. కోహ్లి వరుసగా రెండు శతకాలు బాదాడు. ఇద్దరూ ప్రపంచకప్ టోర్నీకి సిద్ధంగా ఉన్నారు.ఇటీవలే రోహిత్ను కలిశాను. అతడు ప్రస్తుతం రిలాక్సింగ్ మోడ్లో ఉన్నాడు. ఆట పట్ల సంతృప్తిగా ఉన్నాడు. రోహిత్- విరాట్ పరుగుల దాహం ఇంకా తీరలేదు. ఇప్పటికే ఇద్దరూ దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్నారు. అయినా సరే ఇంకా ఇంకా ఆడాలనే పట్టుదల వారిని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది’’ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.చదవండి: సెలక్టర్లు వద్దన్నా!... హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం -
Virat Kohli: చరిత్రకు పాతిక పరుగుల దూరంలో..
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో వరుస శతకాలు బాది.. యాభై ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుడి (53)గా తన రికార్డును తానే సవరించుకున్నాడు.ఈ సిరీస్ తర్వాత దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగాడు కోహ్లి. సొంతజట్టు ఢిల్లీ తరఫున వన్డౌన్ బ్యాటర్గా వచ్చి ఆంధ్రతో మ్యాచ్లో శతక్కొట్టాడు. కేవలం 101 బంతుల్లోనే 131 పరుగులతో అలరించాడు.29 బంతుల్లోనే హాఫ్ సెంచరీఆ తర్వాత గుజరాత్తో మ్యాచ్లోనూ కోహ్లి అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 61 బంతుల్లో 77 పరుగులు చేసి అవుటయ్యాడు. బీసీసీఐ ఆదేశాల మేరకు ఢిల్లీ తరఫున దేశీ క్రికెట్లో రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న కోహ్లి.. మరో మ్యాచ్ ఆడేందుకు కూడా సుముఖంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు సన్నాహకంగా జనవరి 6న రైల్వేస్తో జరిగే మ్యాచ్లో కోహ్లి ఆడే అవకాశం ఉంది. కాగా జనవరి 11 నుంచి భారత్- కివీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కొటాంబి, ఖంధేరి, ఇండోర్ వేదికగా ఇరుజట్లు మూడు మ్యాచ్లు ఆడతాయి.సచిన్ ఆల్టైమ్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన కోహ్లిఈ సిరీస్ నేపథ్యంలో కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ఆల్టైమ్ ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. టీమిండియా తరఫున కోహ్లి ఇప్పటికి 123 టెస్టుల్లో 9230, 308 వన్డేల్లో 14557 పరుగులు, 125 టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 632 ఇన్నింగ్స్లో.. 27,975 పరుగులు పూర్తి చేసుకున్నాడు.ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కివీస్తో తొలి వన్డే సందర్భంగా కోహ్లి గనుక పాతిక పరుగులు చేస్తే.. 28 వేల పరుగుల క్లబ్లో చేరతాడు.సచిన్ టెండుల్కర్ 644 ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని తాకగా.. శ్రీలంక దిగ్గజం కుమార్ సంగక్కర 666 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ను అందుకున్నాడు. కోహ్లి ఒకవేళ కివీస్తో తొలి వన్డేలోనే ఈ మైలురాయిని చేరుకుంటే.. అత్యంత వేగంగా అంతర్జాతీయ క్రికెట్లో 28 వేల పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్గా.. సచిన్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డు బద్దలుకొడతాడు. తొలి వన్డేలో మిస్ అయినా.. మిగిలిన రెండు వన్డేల్లో రాణించినా సరే.. కోహ్లి ఈ రికార్డును కొల్లగొట్టడం ఖాయం. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా కోహ్లి తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. చదవండి: టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే? -
న్యూజిలాండ్ సిరీస్కు ముందే 'మరోసారి' రంగంలోకి దిగనున్న విరాట్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) న్యూజిలాండ్ సిరీస్కు ముందే మరోసారి రంగంలోకి దిగనున్నాడు. ఇటీవలే విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున రెండు మ్యాచ్లు ఆడిన విరాట్, ఇదే టోర్నీలో మరో మ్యాచ్ ఆడేందుకు సిద్దంగా ఉన్నాడు. జనవరి 6న ఆలుర్లో రైల్వేస్తో జరుగబోయే మ్యాచ్లో విరాట్ బరిలో ఉంటాడని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అత్యున్నత అధికారి ఒకరు క్రిక్బజ్కు లీక్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే విరాట్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ కోసం జనవరి 7న భారత జట్టుతో పాటు బరోడాలో కలుస్తాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జనవరి 11 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును అతి త్వరలో ప్రకటిస్తారు. ఈ జట్టులో విరాట్ ఉండటం లాంఛనమే. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ ఫార్మాట్లో విరాట్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో రెండు మ్యాచ్లు ఆడిన విరాట్.. ఓ సెంచరీ (ఆంధ్రపై 131), ఓ హాఫ్ సెంచరీ (గుజరాత్పై 77) చేశాడు. విరాట్ రైల్వేస్తో జరుగబోయే మ్యాచ్లోనూ సత్తా చాటితే న్యూజిలాండ్ సిరీస్కు ముందు టీమిండియాకు అదనపు ధైర్యం వస్తుంది.విరాట్ తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు (135, 102), ఓ హాఫ్ సెంచరీ (65 నాటౌట్) చేశాడు. అంతకుముందు ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటైన విరాట్.. చివరి మ్యాచ్లో హాఫ్ సెంచరీ (74 నాటౌట్) చేసి ఫామ్లోకి వచ్చాడు. విరాట్ ఢిల్లీ జట్టులో ఉండటం వల్ల విజయ్ హజారే ట్రోఫీలో ఆ జట్టుకు కూడా అదనపు బలం చేకూరుతుంది.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ సంపాదించేది ఎంత?
ప్రతి ఏడాది మాదిరే ఈసారీ దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మొదలైంది. అయితే, ఈసారి భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల రాకతో ఈ సీజన్కు పండుగ కళ వచ్చింది. ఢిల్లీ తరఫున కోహ్లి.. ముంబైకి ఆడుతూ రోహిత్ బుధవారం నాటి తొలి మ్యాచ్లలో శతక్కొట్టారు.రెండో రౌండ్లో భాగంగా శుక్రవారం నాటి మ్యాచ్లో కోహ్లి మరోసారి అద్భుత ప్రదర్శన కనబరచగా.. రోహిత్ మాత్రం ఈసారి గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి నిరాశపరిచాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రో-కో బీసీసీఐ ఆదేశాల మేరకు ఇలా దేశీ క్రికెట్ బరిలో దిగారు. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి తాము సిద్ధంగా ఉన్నామని మరోసారి సంకేతాలు ఇచ్చారు.రూ. వెయ్యి కోట్లకు పైగానేఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ బ్యాటర్లుగా పేరు తెచ్చుకున్న రోహిత్- కోహ్లి.. సంపాదన ఏ స్థాయిలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి నెట్వర్త్ రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు, ఐపీఎల్లో ఆడటం ద్వారా కూడా రో-కో భారీ స్థాయిలో వేతనం పొందుతున్నారు. మరి విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ఇప్పటికి రెండు మ్యాచ్లు పూర్తి చేసుకున్న ఈ దిగ్గజాలకు లభించే మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?!..విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో లిస్ట్-ఎ మ్యాచ్లలో భాగమయ్యే ఆటగాళ్లను వారు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించి.. తదనుగుణంగా ఫీజును చెల్లిస్తారు. ఆ వివరాలు ఇవీ..సీనియర్ కేటగిరీ (40కి పైగా లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 60 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 30 వేల చొప్పున ఫీజుమిడ్-లెవల్ కేటగిరీ (21 నుంచి 40 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 50 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 25 వేల చొప్పున ఫీజుజూనియర్ కేటగిరీ (0- 20 లిస్టు-ఎ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లు)తుదిజట్టులో ఉన్నవారికి: మ్యాచ్కు రూ. 40 వేల చొప్పున ఫీజురిజర్వు ప్లేయర్లకు: మ్యాచ్కు రూ. 20 వేల చొప్పున ఫీజు.రోజువారీ అలవెన్సులురవాణా, భోజనం ఖర్చులు.. వసతి ఏర్పాటుప్రదర్శన ఆధారంగా బోనస్లుమ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన ఆటగాడికి రూ. 10 వేల ప్రైజ్మనీప్రైజ్మనీనాకౌట్ దశకు చేరిన, ఫైనల్ ఆడిన జట్లకు ప్రైజ్పూల్ ఆధారంగా నజరానా ఇస్తారు.అక్కడేమో రూ. లక్షలు.. మరి ఇక్కడ వచ్చేది ఎంత?ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్లుగా రోహిత్- కోహ్లి ఒక్కో వన్డేకు రూ. 6 లక్షల చొప్పున మ్యాచ్ ఫీజు అందుకుంటారు. అయితే, విజయ్ హజారే ట్రోఫీలో సీనియర్ కేటగిరీలో ఉన్నందుకు గానూ రూ. 60 వేలతో పాటు బోనస్, అలవెన్సులు కూడా దక్కుతాయి. ఫీజులో వ్యత్యాసం ఉన్నా.. ఆట ఒక్కటే.ఈ దేశీ టోర్నీ ద్వారానే తమను తాము నిరూపించుకున్న రో- కో వంటి ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నత స్థాయికి చేరారు. ఏదేమైనా బీసీసీఐ నిబంధనల పుణ్యమా అని రోహిత్- కోహ్లిలను మరోసారి తమ సొంత దేశీ జట్ల తరఫున ఆడుతుంటే చూసే భాగ్యం అభిమానులకు దక్కింది. -
కోహ్లి 77 రోహిత్ 0
బెంగళూరు: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (61 బంతుల్లో 77; 13 ఫోర్లు, 1 సిక్స్) దేశవాళీల్లో కూడా అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ తొలి మ్యాచ్లో ఆంధ్ర జట్టుపై శతకంతో కదంతొక్కిన కోహ్లి... గుజరాత్తో శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన ఈ పోరులో రిషభ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు 7 పరుగుల తేడాతో గుజరాత్పై విజయం సాధించింది. మొదట ఢిల్లీ నిరీ్ణత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి చక్కటి షాట్లతో అర్ధశతకంతో ఆకట్టుకోగా... రిషభ్ పంత్ (70; 8 ఫోర్లు, 2 సిక్స్లు) కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఛేదనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ ‘డకౌట్’ జైపూర్: సిక్కింతో జరిగిన తొలి మ్యాచ్లో భారీ సెంచరీతో చెలరేగిన ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ (0) ఉత్తరాఖండ్తో మ్యాచ్లో ‘గోల్డెన్ డకౌట్’ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగి నిరాశ పరిచాడు. అయినా శుక్రవారం జరిగిన ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో ముంబై జట్టు 51 పరుగుల తేడాతో ఉత్తరాఖండ్పై గెలిచింది. మొదట ముంబై 50 ఓవర్లలో 7 వికెట్లకు 331 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ తమోర్ (93 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా... సర్ఫరాజ్ ఖాన్ (55; 5 ఫోర్లు, 1 సిక్స్), ముషీర్ ఖాన్ (55; 7 ఫోర్లు), షమ్స్ ములానీ (48; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఛేదనలో ఉత్తరాఖండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 280 పరుగులకు పరిమితమైంది. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్, ఢిల్లీ బాయ్ విరాట్ కోహ్లి అదరగొడుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడుతున్న కోహ్లి.. అద్భుత ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. తొలి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్పై విధ్వంసకర సెంచరీతో చెలరేగిన కోహ్లి.. ఇప్పుడు రెండో మ్యాచ్లో గుజరాత్పై మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 77 పరుగులు చేశాడు.ఈ క్రమంలో కింగ్ కోహ్లి ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో అత్యధిక యావరేజ్ కలిగిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో కోహ్లి ఇప్పటివరకు 57.87 సగటుతో 16,207 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ వరల్డ్ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం మైఖేల్ బెవాన్ పేరిట ఉండేది. బెవాన్ తన లిస్ట్-ఎ కెరీర్లో 57.86 సగటుతో 15,103 పరుగులు చేశాడు. తాజా హాఫ్ సెంచరీ బెవాన్ ఆల్టైమ్ రికార్డును కింగ్ బ్రేక్ చేశాడు.లిస్ట్ ఎ క్రికెట్లో అత్యధిక సగటు సాధించిన బ్యాటర్లు వీరే1. విరాట్ కోహ్లి (భారత్): 57.87- 16,207 పరుగులు2. మైఖేల్ బెవాన్ (ఆస్ట్రేలియా): 57.86- 15,103 పరుగులు3. సామ్ హైన్ (ఇంగ్లండ్): 57.76- 3004 పరుగులు4. ఛతేశ్వర్ పుజారా (భారత్): 57.01-5759 పరుగులు5. రుతురాజ్ గైక్వాడ్ (భారత్): 56.68- 4648 పరుగులుఇక మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్పై 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కోహ్లితో పాటు కెప్టెన్ రిషబ్ పంత్(70) హాఫ్ సెంచరీతో మెరిశాడు. గుజరాత్ బౌలర్లలో విశాల్ జైశ్వాల్ 4 వికెట్లు పడగొట్టగా..రవి బిష్ణోయ్ రెండు వికెట్లు సాధించాడు. అనంతరం 255 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్ 47.4 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బ్యాటర్లలో ఆర్య దేశాయ్(57) టాప్ స్కోరర్గా నిలవగా.. సౌరవ్ చౌహన్(49), ఉర్విల్ పటేల్(31) ఫర్వాలేదన్పించారు. ఢిల్లీ బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ మూడు, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా తలా రెండు వికెట్లు సాధించాడు. హాఫ్ సెంచరీతో సత్తాచాటిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు దక్కింది. -
విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్ రికార్డులు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ (Steve Smith) ప్రస్తుత తరం ఫీల్డర్లలో అత్యుత్తముడనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టీవ్ మైదానంలో ఏ ప్రాంతంలో ఫీల్డింగ్ చేసినా పాదరసంలా కదులుతూ, కళ్లు చెదిరే క్యాచ్లు పడుతూ, ప్రత్యర్ధి జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్టలా ఉంటాడు. ఫార్మాట్ ఏదైనా స్టీవ్ మైదానంలో ఉన్నాడంటే జరిగేది ఇదే. అలాంటి స్టీవ్ తాజాగా ఫీల్డింగ్కు సంబంధించి ఓ అరుదైన ఘనత సాధించాడు. టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ ఫీల్డర్ రాహుల్ ద్రవిడ్ను అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. ద్రవిడ్ 301 టెస్ట్ ఇన్నింగ్స్ల్లో 210 క్యాచ్లు పట్టగా.. స్టీవ్ 232 ఇన్నింగ్స్ల్లోనే ద్రవిడ్ మార్కును దాటి 212 క్యాచ్లకు చేరాడు. ఇక స్టీవ్ ముందున్నది జో రూట్ మాత్రమే. ప్రస్తుతం రూట్ ఖాతాలో 214 క్యాచ్లు ఉన్నాయి. రూట్కు స్టీవ్కు మధ్య కేవలం రెండు క్యాచ్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.టెస్ట్ల్లో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్లు (టాప్-5)..రూట్-214స్టీవ్ స్మిత్-212ద్రవిడ్-210జయవర్దనే-205కల్లిస్-200కోహ్లిని వెనక్కు నెట్టి..అన్ని ఫార్మాట్ల వారీగా చూస్తే.. స్టీవ్ స్మిత్ టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించి అన్ని ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. విరాట్ ఖాతాలో 342 క్యాచ్లు ఉండగా.. స్టీవ్ అన్ని ఫార్మాట్ల క్యాచ్ల సంఖ్య 344కు చేరింది. ఈ జాబితాలో జయవర్దనే (440) అందరి కంటే చాలా ముందున్నాడు. అతని తర్వాత పాంటింగ్ (364), రాస్ టేలర్ (354) ఉన్నారు. ఇంగ్లండ్తో ఇవాళ (డిసెంబర్ 26) ప్రారంభమైన యాషెస్ సిరీస్ నాలుగో టెస్ట్లో స్టీవ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో తొలి రోజే ఇరు జట్లు ఆలౌటయ్యాయి. ఆసీస్ 152, ఇంగ్లండ్ 110 పరుగులకే చాపచుట్టేశాయి. కాగా, ఐదు మ్యాచ్ల ఈ సిరీస్ను ఆసీస్ ఇదివరకే కైవసం చేసుకుంది. తొలి మూడు టెస్ట్లు నెగ్గిన ఆ జట్టు 3-0 క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది. -
కోహ్లి, పంత్ మెరుపులు
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్లు, ఢిల్లీ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ మెరుపులు మెరిపించారు. గుజరాత్తో ఇవాళ (డిషెంబర్ 26) జరుగుతున్న మ్యాచ్లో అర్ద సెంచరీలతో సత్తా చాటారు. విరాట్ 61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో 77 పరుగులు చేయగా.. పంత్ 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేశాడు. క్లిష్టమైన పిచ్పై విరాట్, పంత్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. విరాట్, పంత్ ఔటయ్యాక హర్ష్ త్యాగి (40) కాస్త నిలకడగా ఆడాడు. చివర్లో సిమర్జీత్ సింగ్ (15 నాటౌట్) బ్యాట్ ఝులిపించాడు.గుజరాత్ బౌలర్లలో స్పిన్నర్లు విశాల్ జేస్వాల్ (10-0-42-4), రవి బిష్ణోయ్ (10-0-50-2) ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. అర్జన్ నగస్వల్లా, కెప్టెన్ చింతన్ గజా తలో వికెట్ తీశారు. మిగతా ఢిల్లీ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 1, అర్పిత్ రాణా 10, నితీశ్ రాణా 12, ఆయుశ్ బదోని 12, నవ్దీప్ సైనీ 6, ఇషాంత్ శర్మ 5 (నాటౌట్) పరుగులు చేయగా.. ప్రిన్స్ యాదవ్ డకౌటయ్యాడు.3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలులిస్ట్-ఏ ఫార్మాట్ అంటేనే పునకాలు తెప్పించే విరాట్ కోహ్లి గత కొంతకాలంలో ఈ ఫార్మాట్లో పీక్స్లో ఉన్నాడు. గత ఆరు ఇన్నింగ్స్ల్లో అతని ప్రదర్శనలు చెప్పనశక్యంగా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు.. దేశవాలీ స్థాయిలో (VHT 2025-26) సెంచరీ, హాఫ్ సెంచరీతో పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. గత 6 లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో విరాట్ స్కోర్లు..- 74*(81)- 135(120)- 102(93)- 65*(45)- 131(101)- 77(61) -
Virat Kohli: మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..
టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఢిల్లీ స్టార్ విరాట్ కోహ్లి శతకం చేజార్చుకున్నాడు. మెరుపు హాఫ్ సెంచరీతో అలరించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్... సెంచరీకి ఇరవై మూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. కాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి కోహ్లి దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగిన విషయం తెలిసిందే. రోహిత్ తన సొంత జట్టు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కోహ్లి సైతం తన జట్టు ఢిల్లీకి ఆడుతున్నాడు.ఆంధ్రపై శతక్కొట్టిన కోహ్లి..ఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్లో ఆంధ్రపై శతక్కొట్టిన (101 బంతుల్లో 131) కోహ్లి.. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్లోనూ ఫామ్ను కొనసాగించాడు. ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా బెంగళూరు వేదికగా గుజరాత్తో మ్యాచ్లో ఢిల్లీ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగింది.𝐕𝐢𝐫𝐚𝐭 𝐊𝐨𝐡𝐥𝐢 𝐒𝐩𝐞𝐜𝐢𝐚𝐥 😎1️⃣3️⃣1️⃣ runs 1️⃣0️⃣1️⃣ balls 1️⃣4️⃣ fours 3️⃣ sixes A terrific knock from Virat Kohli as he guided Delhi to a 4️⃣-wicket victory against Andhra 👏 He also completed 1️⃣6️⃣0️⃣0️⃣0️⃣ runs in Men’s List A cricket 🫡 @IDFCFIRSTBank | @imVkohli |… pic.twitter.com/kCfdl3yux1— BCCI Domestic (@BCCIdomestic) December 24, 202529 బంతుల్లోనేఅయితే, ఆదిలోనే గుజరాత్ బౌలర్లు ఢిల్లీని దెబ్బకొట్టారు. ప్రియాన్ష్ ఆర్య (7 బంతుల్లో 1)ను కెప్టెన్ చింతన్ గజా వెనక్కి పంపగా.. కోహ్లి క్రీజులోకి వచ్చాడు. కాసేపటికే మరో ఓపెనర్ అర్పిత్ రాణా (31 బంతుల్లో 10)ను విశాల్ జైస్వాల్ అవుట్ చేయగా.. కోహ్లి బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు.మళ్లీ సెంచరీ చేస్తాడనుకుంటే..కేవలం 29 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న కోహ్లి.. తర్వాత కూడా అదే జోరును కొనసాగించాడు. మొత్తంగా 61 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 77 పరుగులు సాధించాడు. అయితే, విశాల్ జైస్వాల్ బౌలింగ్లో వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి ఇన్నింగ్స్కు తెరపడింది.మిగతా వారిలో నితీశ్ రాణా (12) తేలిపోగా.. కెప్టెన్ రిషభ్ పంత్, ఆయుశ్ బదోనిలపై భారం పడింది. 27 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి ఢిల్లీ 129 పరుగులు చేయగలిగింది. ఇదిలా ఉంటే.. గత ఐదు మ్యాచ్లలో కోహ్లి మూడు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో తొలి, రెండో మ్యాచ్లలో శతక్కొట్టిన కోహ్లి.. ఢిల్లీ తరఫు పునరాగమనంలోనూ సెంచరీతో అలరించాడు. కింగ్ ఫామ్ చూసి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. తాజాగా మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో.. ‘‘సంతోషం పట్టలేకపోతున్నాం.. పిచ్చెక్కిస్తున్నావు భయ్యా!’’ అంటూ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా బెంగళూరులో కోహ్లి ఆటను చూసేందుకు ఫ్యాన్స్ చెట్లెక్కి మరీ విన్యాసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే. UPDATE: కోహ్లి, పంత్ మెరుపులు.. ఢిల్లీ స్కోరెంతంటే?చదవండి: మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్! -
మొన్న శతక్కొట్టాడు.. ఇప్పుడు గోల్డెన్ డక్!
టీమిండియా మాజీ కెప్టెన్, ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ తాజా మ్యాచ్లో ‘హిట్మ్యాన్’ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆదేశాల మేరకు టీమిండియా విధుల్లో లేని స్టార్లంతా దేశవాళీ క్రికెట్ బాట పట్టిన విషయం తెలిసిందే.దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా ఈ జాబితాలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో తమకు తిరుగులేదని నిరూపించుకున్న ఈ ఇద్దరు.. సొంత జట్ల తరఫున విజయ్ హజారే ట్రోఫీ 2025-26 బరిలో దిగారు. ముంబై ఓపెనర్గా రోహిత్ శర్మ.. పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు వన్డౌన్ బ్యాటర్గా కోహ్లి బుధవారం దర్శనమిచ్చారు.62 బంతుల్లోనే శతక్కొట్టి..ఇక తమ తొలి మ్యాచ్లో ముంబై సిక్కిం వంటి పసికూనతో తలపడగా.. రోహిత్ శర్మ కేవలం 62 బంతుల్లోనే శతక్కొట్టి.. తన లిస్ట్-ఎ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. మొత్తంగా 94 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 18 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 155 పరుగులు సాధించి జట్టును గెలిపించాడు.ఇప్పుడు గోల్డెన్ డక్!తాజాగా గ్రూప్-సిలో భాగంగా ఉత్తరాఖండ్తో శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ ఓడిన ముంబై తొలుత బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ రోహిత్ శర్మ అవుటయ్యాడు. దేవేంద్ర సింగ్ బోరా బౌలింగ్లో జగ్మోహన్ నాగర్కోటికి క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. దీంతో జైపూర్లో మొన్న (బుధవారం) రోహిత్ శర్మ సెంచరీ చూసిన అభిమానులు.. ఇప్పుడు అదే వేదికపై అతడు ఇలా తేలిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. బుధవారం ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి సైతం శతక్కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: IND vs NZ: టీమిండియాకు గుడ్ న్యూస్#VijayHazareTrophy Golden duck for rohit sharma pic.twitter.com/mwsH4O7aRt— vaibhav dhakad (@Pkmbk123) December 26, 2025 -
'అతడు సూపర్ ఫామ్లో ఉన్నాడు.. వరల్డ్కప్ టోర్నీకి రెడీ'
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ తరపున విజయ్ హజారే ట్రోఫీ బరిలోకి దిగిన కోహ్లి.. తను ఆడిన తొలి మ్యాచ్లోనే సెంచరీతో చెలరేగాడు.బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆంధ్ర జట్టుతో జరిగిన మ్యాచ్లో కోహ్లి శతక్కొట్టాడు. 299 పరుగుల భారీ లక్ష్య చేధనలో కింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ ఢిల్లీ బాయ్ కేవలం 101 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. కోహ్లికి ఇది 58వ లిస్ట్-ఎ సెంచరీ. అదేవిధంగా ఇదే మ్యాచ్లో16,000 లిస్ట్-ఏ పరుగుల మైలురాయిని కూడా కోహ్లి అధిగమించాడు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లలో మాత్రమే కొనసాగుతున్నాడు. అయినప్పటికి తనలో ఏ మాత్రం జోరు తగ్గలేదని కింగ్ నిరూపించుకుంటున్నాడు. వన్డే వరల్డ్కప్-2027కు తాను సిద్దంగా ఉన్నానని తన ప్రదర్శనలతోనే సాటిచెబుతున్నాడు. 2025లో కోహ్లి 13 వన్డేల్లో 65.10 సగటుతో 651 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్లో కనబరిన జోరునే విజయ్ హాజారే ట్రోఫీలోనూ కొనసాగిస్తున్నాడు.. తన అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీకి విజయాన్ని అందించాడు. చాలా కాలం తర్వాత దేశవాళీ క్రికెట్ ఆడినప్పటికి.. ఎక్కడా కూడా అతడిలో తడబాటు కన్పించలేదు. విరాట్ భారత జట్టులో అత్యంత నిలకడైన ఆటగాడు. అతడు వరల్డ్కప్ టోర్నీలో ఆడేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాడు" అని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్కుమార్ పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లి దుమ్ములేపాడు. మూడు మ్యాచ్ల సిరీస్లో కోహ్లి 302 పరుగులు చేశాడు.చదవండి: అదరగొట్టిన రింకూ సింగ్, ధ్రువ్ జురెల్.. చెలరేగిన జీషన్ అన్సారీ -
ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ ఆరంభమైన రోజే (బుధవారం) పరుగుల వరద పారింది. ఈ ఎడిషన్లోని తొలి మ్యాచ్.. దాదాపు ప్రతీ బౌలర్కూ ఓ పీడకలను మిగిల్చింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు ఏకంగా 22 శతకాలు నమోదు కావడం.. ఇందులో ఫాస్టెస్ట్ సెంచరీలు ఉండటం ఇందుకు నిదర్శనం.అయితే, ఇందులో రెండు శతకాలు మాత్రం అత్యంత ప్రత్యేకం. సుమారుగా పదిహేనేళ్ల తర్వాత ఢిల్లీ తరఫున భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి (Virat Kohli) ఈ దేశీ టోర్నీ బరిలో దిగగా.. ముంబై రాజా, టీమిండియా లెజెండరీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూడా సొంత జట్టు తరఫున రంగంలోకి దిగాడు.62 బంతుల్లోనే జైపూర్ వేదికగా సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో సిక్కింతో మ్యాచ్లో రోహిత్ శర్మ శతక్కొట్టాడు. కేవలం 62 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన లిస్-ఎ క్రికెట్ కెరీర్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ (Fastest Century) నమోదు చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 155 పరుగులు సాధించాడు. ఇందులో 18 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.ఇక రోహిత్ అద్భుత ప్రదర్శన కారణంగా సిక్కిం విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని.. ముంబై కేవలం 30.3 ఓవర్లలోనే ఛేదించి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మను చూసేందుకు వేలాది మంది అభిమానులు జైపూర్ స్టేడియానికి వచ్చారు.కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ జరుగుతున్న వేళ కొంతమంది.. టీమిండియా సెలక్టర్ ఆర్పీ సింగ్ స్టేడియంలో ఉండటాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో.. లక్ష్య ఛేదనలో రోహిత్ మెరుపు శతకంతో చెలరేగడంతో.. టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నావు?.. కళ్లప్పగించి చూడు గంభీర్!‘‘గంభీర్ నువ్వు ఎక్కడున్నావు? మాకైతే కనిపించడం లేదు.. నువ్వేతై కళ్లప్పగించి రోహిత్ ఇన్నింగ్స్ చూడు’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. కాగా వన్డే ప్రపంచకప్-2027 ఆడటంపై స్పష్టత లేదంటూ.. ఇటీవలే రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది బీసీసీఐ. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన సారథిపై వేటు వేసింది. మరోవైపు.. టీమిండియా యువ ఆటగాళ్లతో పాటు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వంటి దిగ్గజాలు కూడా దేశీ టోర్నీల్లో ఆడాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో రో-కోలను కావాలనే టార్గెట్ చేస్తున్నారంటూ వారి అభిమానులు.. సందర్భం వచ్చినపుడల్లా గంభీర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఈ ఇద్దరు అదరగొట్టడం.. విజయ్ హజారే ట్రోఫీలోనూ శతకాలు బాదడంతో మరోసారి గంభీర్ ట్రోల్ అవుతున్నాడు. శతక్కొట్టిన కోహ్లికాగా ఆంధ్రతో మ్యాచ్లో కోహ్లి 131 పరుగులు సాధించాడు. కోహ్లితో పాటు ప్రియాన్ష్ ఆర్య (74), నితీశ్ రాణా (77) రాణించడంతో ఆంధ్ర విధించిన 299 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 37.4 ఓవర్లలో ఛేదించింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. ఈ సీజన్ను విజయంతో ఆరంభించింది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20, టెస్టులకు గుడ్బై చెప్పిన రో-కో కేవలం వన్డేలలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.చదవండి: ప్రపంచకప్ జట్టులో జైస్వాల్, రుతురాజ్కు చోటు.. షమీకీ ఛాన్స్! -
ఒకే రోజు 22 సెంచరీలు
బంతి మీద పగబట్టినట్లు... బౌలర్లతో ఆజన్మ విరోధం ఉన్నట్లు... సింగిల్స్ తీయడమే తెలియదన్నట్లు... బిహార్ బ్యాటర్లు బౌండరీలతో చెలరేగిపోయారు. బంతి ఎక్కడపడ్డా దాన్ని గీత దాటించడమే లక్ష్యంగా అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఫలితంగా విజయ్ హజారే వన్డే టోర్నీలో బిహార్ జట్టు ప్రపంచ రికార్డు స్కోరు నమోదు చేసింది. 14 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ రికార్డులు తిరగరాస్తూ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకోగా... సకీబుల్ గనీ లిస్ట్ ‘ఎ’క్రికెట్లో భారత్ తరఫున ‘ఫాస్టెస్ట్ సెంచరీ’ తన పేరిట రాసుకున్నాడు. ఆయుశ్ లొహారుక కూడా శతకంతో విజృంభించడంతో బిహార్ కొండంత స్కోరు చేసింది. ఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 177 పరుగులకు ఆలౌటై 397 పరుగుల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. భారత దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారింది. టోర్నీ తొలి రోజు బుధవారం రికార్డు స్థాయిలో 22 సెంచరీలు నమోదయ్యాయి. సుదీర్ఘ విరామం అనంతరం దేశవాళీల్లో ఆడుతున్న స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి (ఢిల్లీ), రోహిత్ శర్మ (ముంబై) శతకాల మోత మోగిస్తే... బిహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ త్రుటిలో డబుల్ సెంచరీ మిస్ అయ్యాడు. టి20 ప్రపంచకప్నకు ఎంపికైన ఇషాన్ కిషన్ (జార్ఖండ్) మెరుపు సెంచరీతో కదంతొక్కితే... అదే మ్యాచ్లో దేవదత్ పడిక్కల్ (కర్ణాటక) భారీ శతకంతో చెలరేగాడు. ఒడిశా ప్లేయర్ స్వస్తిక్ సమల్ ఈ టోర్నీ చరిత్రలో ఎనిమిదో డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కితే... 32 బంతుల్లోనే సెంచరీ చేసిన బిహార్ కెప్టెన్ సకీబుల్ గనీ లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగవంతమైన సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. రాంచీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతం ఆవిష్కృతమైంది. ప్లేట్ గ్రూప్లో భాగంగా బుధవారం జరిగిన పోరులో బిహార్ జట్టు రికార్డుల దుమ్ము దులిపింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (84 బంతుల్లో 190; 16 ఫోర్లు, 15 సిక్స్లు), కెప్టెన్ సకీబుల్ గనీ (40 బంతుల్లో 128 నాటౌట్; 10 ఫోర్లు, 12 సిక్స్లు), ఆయుశ్ లొహారుక (56 బంతుల్లో 116; 11 ఫోర్లు, 8 సిక్స్లు) సెంచరీలతో కదంతొక్కడంతో మొదట బ్యాటింగ్ చేసిన బిహార్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం లక్ష్యఛేదనలో అరుణాచల్ ప్రదేశ్ 42.1 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి 397 పరుగుల తేడాతో బిహార్కు విజయాన్ని అందించారు. దంచుడే దంచుడు... మెరుపులా మొదలైన బిహార్ ఇన్నింగ్స్... ఉరుములా ప్రత్యర్థులను భయపెట్టి... తుపానులా చుట్టేసి... చివరకు సునామీలా రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఇప్పటికే సీనియర్ స్థాయిలో భారీ సెంచరీలతో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న బిహార్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ... అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వరుస బౌండరీలతో బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్... ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడు. మరో 11 బంతుల్లోనే 50 పరుగులు జోడించి 36 బంతుల్లో శతకం నమోదు చేసుకున్నాడు. తద్వారా లిస్ట్ ‘ఎ’క్రికెట్లో శతకం బాదిన అత్యంత పిన్నవయసు్కడిగా రికార్డు సృష్టించాడు. తొలి వికెట్కు 14.3 ఓవర్లలో 158 పరుగులు జతచేసిన వైభవ్... 59 బంతుల్లోనే 150 పరుగుల మార్క్ అందుకొని... డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. డబుల్ సెంచరీకి 10 పరుగుల దూరంలో వైభవ్ అవుటయ్యాడు. సకీబుల్ విధ్వంసం... వైభవ్ వెనుదిరగడంతో ఊపిరి పీల్చుకుందాం అనుకున్న అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు బిహార్ సారథి సకీబుల్ గనీ పట్టపగలే చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని బౌండరీకి తలరించడమే లక్ష్యంగా భారీ షాట్లతో పరుగుల వరద పారించాడు. ఈ క్రమంలో అతడు 32 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకొని లిస్ట్ ‘ఎ’క్రికెట్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ మ్యాచ్లో 128 పరుగులు చేసి సకీబుల్ బౌండరీల ద్వారానే 112 పరుగులు రాబట్టాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో బిహార్ ప్లేయర్లు 49 ఫోర్లు, 38 సిక్స్లు బాదారు. 574/6పురుషుల లిస్ట్ ‘ఎ’ (దేశవాళీ+అంతర్జాతీయ వన్డేలు) క్రికెట్లో ఇదే అత్యధిక స్కోరు. 2022–23 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్పైనే తమిళనాడు చేసిన స్కోరు (506/2) రెండో స్థానానికి చేరింది. 1 పురుషుల లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగంగా 150 పరుగులు చేసిన ప్లేయర్గా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. తాజా మ్యాచ్లో అతడు 59 బంతుల్లో ఈ మార్క్ అందుకున్నాడు. 2015లో వెస్టిండీస్పై దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ 64 బంతుల్లో 150 పరుగులు చేసి రెండో స్థానంలో ఉన్నాడు.32 ఈ మ్యాచ్లో సకీబుల్ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్ గుర్క్ (29 బంతుల్లో), డివిలియర్స్ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 38 ఈ మ్యాచ్లో సకీబుల్ సెంచరీకి తీసుకున్న బంతులు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో భారత్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. ఓవరాల్గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగవంతమైన సెంచరీల జాబితాలో మెక్ గుర్క్ (29 బంతుల్లో), డివిలియర్స్ (31 బంతుల్లో) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 1 విజయ్ హజారే టోర్నీలో ఒకే జట్టు తరఫున మూడు సెంచరీలు నమోదవడం ఇదే తొలిసారి. ఓవరాల్గా లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో 1995లో హైదరాబాద్తో మ్యాచ్లో విల్స్ ఎలెవన్ జట్టు తరఫున సచిన్ టెండూల్కర్, గగన్ ఖోడా,సంజయ్ మంజ్రేకర్ శతకాలు చేశారు.1 లిస్ట్ ‘ఎ’ క్రికెట్ చరిత్రలో సెంచరీ చేసిన అతిపిన్న వయస్కుడిగా వైభవ్ సూర్యవంశీ (14 సంవత్సరాల 272 రోజులు) రికార్డు నెలకొల్పాడు. జహూర్ ఇలాహీ (15 ఏళ్ల 209 రోజులు; 1986లో పాక్ ఆటోమొబైల్స్ కార్పొరేషన్) పేరిట ఉన్న రికార్డును వైభవ్ తిరగరాశాడు.ఇటు కోహ్లి... అటు రోహిత్‘శత’క్కొట్టిన సీనియర్ ప్లేయర్లు ఆంధ్రపై ఢిల్లీ; సిక్కింపై ముంబై గెలుపు బెంగళూరు: స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సెంచరీలతో కదంతొక్కారు. సుదీర్ఘ విరామం అనంతరం విజయ్ హజారే ట్రోఫీలో ఆడిన ఈ ఇద్దరూ... అది్వతీయ ఫామ్ కొనసాగిస్తూ తమ జట్లను గెలిపించారు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా జరిగిన పోరులో కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టు 4 వికెట్ల తేడాతో ఆంధ్ర జట్టుపై గెలిచింది. మొదట ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 298 పరుగులు చేసింది. రికీ భుయ్ (122; 11 ఫోర్లు, 7 సిక్స్లు) సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ 37.4 ఓవర్లలో 6 వికెట్లకు 300 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (101 బంతుల్లో 131; 14 ఫోర్లు, 3 సిక్స్లు) సెంచరీ చేశాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో కోహ్లికిది 58వ శతకం. ఈ క్రమంలో విరాట్ లిస్ట్ ‘ఎ’ క్రికెట్లో వేగంగా 16,000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ 391 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ అందుకోగా... కోహ్లి 330 ఇన్నింగ్స్లో 16 వేల పరుగుల మైలురాయి దాటాడు. రోహిత్ తగ్గేదేలే! ఎలైట్ గ్రూప్ ‘సి’లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు 8 వికెట్ల తేడాతో సిక్కింపై నెగ్గింది. మొదట సిక్కిం 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. అనంతరం ముంబై 30.3 ఓవర్లలో 2 వికెటకు 237 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (94 బంతుల్లో 155; 18 ఫోర్లు, 9 సిక్స్లు) వీరవిహారం చేశాడు. జాతీయ జట్టుకు ఆడాలంటే దేశవాళీల్లోనూ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేయడంతో చాన్నాళ్ల తర్వాత కోహ్లి, రోహిత్ విజయ్ హజారే టోర్నీలో బరిలోకి దిగారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మరో చరిత్ర సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా 16000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ 10, 11, 12, 13, 14, 15 వేల పరుగులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. విరాట్ 16000 పరుగుల అత్యంత అరుదైన మైలురాయిని కేవలం 343 మ్యాచ్ల్లో తాకాడు.విరాట్కు ముందు భారత్ తరఫున సచిన్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. సచిన్ 551 మ్యాచ్ల్లో 21999 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆటగాళ్లు గ్రహాం గూచ్ (22211), గ్రేమ్ హిక్ (22059) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు.విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా ఆంధ్రప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ 16000 పరుగుల మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్లో తొలి పరుగు పూర్తి చేయగానే విరాట్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ సెంచరీ కూడా చేశాడు. ఆంధ్ర నిర్దేశించిన 299 పరుగుల లక్ష్య ఛేదనలో 85 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 107 పరుగులతో ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్లో విరాట్ జట్టు ఢిల్లీ గెలవాలంటే ఇంకా 79 పరుగులు చేయాలి. విరాట్తో పాటు నితీశ్ రాణా (37) క్రీజ్లో ఉన్నాడు. 27.4 ఓవర్ల తర్వాత ఢిల్లీ స్కోర్ 220/2గా ఉంది. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్లో ప్రియాంశ్ ఆర్మ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్ కేవలం 44 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆంధ్ర తరఫున రికీ భుయ్ (122) సెంచరీ చేశాడు. ఆ జట్టు కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23 పరుగులకు ఔటయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. -
శతక్కొట్టిన విరాట్ కోహ్లి
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్లో ఈ కుడిచేతి వాటం ఆటగాడు వరుస శతకాలతో అలరించిన విషయం తెలిసిందే. ప్రొటిస్ జట్టుతో తొలి రెండు వన్డేల్లో సెంచరీలు చేసిన విరాట్.. మూడో వన్డేలో అజేయ అర్ధ శతకం (45 బంతుల్లో 65) సాధించాడు.ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి (Virat Kohli)... వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో బీసీసీఐ ఆదేశాల మేరకు దాదాపు పదిహేనేళ్ల విరామం తర్వాత దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్లో రెండు మ్యాచ్లు ఆడేందుకు సిద్ధమయ్యాడు.298 పరుగులుఇందులో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్లో ఆంధ్రతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బౌలింగ్ చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రిక్కీ భుయ్ (122) సెంచరీ చేయగా.. షేక్ రషీద్ 31, కెప్టెన్ నితీశ్ కుమార్ రెడ్డి 23, హేమంత్ రెడ్డి 27, సింగుపురం ప్రసాద్ 28 పరుగులతో రాణించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆంధ్ర ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది.శతక్కొట్టిన విరాట్ కోహ్లిఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అర్పిత్ రాణా డకౌట్ అయ్యాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (74) బాదగా.. అతడికి తోడుగా వన్డౌన్లో వచ్చిన కోహ్లి సెంచరీ చేశాడు. కేవలం 83 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు.మొత్తంగా 101 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 14 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 131 పరుగులు చేశాడు. రాజు బౌలింగ్లో షేక్ రషీద్కు క్యాచ్ ఇవ్వడంతో కోహ్లి శతక ఇన్నింగ్స్కు తెరపడింది.చదవండి: తిరుగులేని ఇషాన్ కిషన్.. వైభవ్ రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర -
నితీశ్ రెడ్డి వర్సెస్ రిషభ్ పంత్!.. కోహ్లి వచ్చేశాడు
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్కు బుధవారం తెరలేచింది. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా బుధవారం నాటి తొలి మ్యాచ్లో ఆంధ్ర జట్టు... స్టార్లతో నిండి ఉన్న ఢిల్లీ టీమ్తో తలపడేందుకు సిద్ధమైంది.బెంగళూరు వేదికగా విరాట్ కోహ్లి (Virat Kohli), రిషభ్ పంత్ (Rishabh Pant)తో కూడిన ఢిల్లీ జట్టుపై మెరుగైన ప్రదర్శన చేయాలని ఆంధ్ర జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్పై అందరి దృష్టి నిలవనున్న నేపథ్యంలో... మనవాళ్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారనేది ఆసక్తికరం.నితీశ్ రెడ్డి వర్సెస్ రిషభ్ పంత్టీమిండియా పేస్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)ఆంధ్ర జట్టుకు కెప్టెన్గా ఉండగా... శ్రీకర్ భరత్, రికీ భుయ్, అశ్విన్ హెబ్బర్, షేక్ రషీద్ బ్యాటింగ్లో కీలకం కానున్నారు. సత్యనారాయణ రాజు, వినయ్, స్టీఫెన్ బౌలింగ్ భారం మోయనున్నారు.బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా ఆంధ్ర జట్టుతో మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో నితీశ్ రెడ్డి సేన బ్యాటింగ్కు దిగనుంది.ఆంధ్ర వర్సెస్ ఢిల్లీ తుదిజట్లుఆంధ్రశ్రీకర్ భరత్(వికెట్ కీపర్), అశ్విన్ హెబ్బార్, షేక్ రషీద్, రికీ భుయ్, నితీశ్ కుమార్ రెడ్డి(కెప్టెన్), సౌరభ్ కుమార్, మారంరెడ్డి హేమంత్ రెడ్డి, కేఎస్ నరసింహ రాజు, త్రిపురాణ విజయ్, సత్యనారాయణ రాజు, SDNV ప్రసాద్.ఢిల్లీఅర్పిత్ రాణా, ప్రియాంష్ ఆర్య, విరాట్ కోహ్లీ, నితీష్ రాణా, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుశ్ బదోని, సిమర్జీత్ సింగ్, హర్ష్ త్యాగి, ఇషాంత్ శర్మ, ప్రిన్స్ యాదవ్, నవదీప్ సైనీ.రోహిత్ కూడా వచ్చేశాడుఇక గ్రూప్-సిలో భాగంగా ముంబైతో మ్యాచ్లో సిక్కిం టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లి మాదిరే రోహిత్ శర్మ కూడా ఛేదనలోనే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది.ముంబై తుదిజట్టురోహిత్ శర్మ, అంగ్క్రిష్ రఘువంశీ, సర్ఫరాజ్ ఖాన్, సిద్ధేష్ లాడ్, ముషీర్ ఖాన్, హార్దిక్ టామోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్), తుషార్ దేశ్పాండే, సిల్వెస్టర్ డిసౌజా.సిక్కిం తుదిజట్టులీ యోంగ్ లెప్చా (కెప్టెన్), ఆశిష్ థాపా (వికెట్ కీపర్),అమిత్ రాజేరా, రాబిన్ లింబూ, గురీందర్ సింగ్, క్రాంతి కుమార్, పల్జోర్ తమాంగ్, అంకుర్ మాలిక్, కె సాయి సాత్విక్, ఎండీ సప్తుల్లా, అభిషేక్ కేఆర్ షా.చదవండి: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం -
ఎన్నాళ్లకెన్నాళ్లకు!
బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి రంగం సిద్ధమైంది. జాతీయ జట్టులో ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాలంటే దేశవాళీ టోర్నీల్లో తప్పక ఆడాల్సిందే అనే నిబంధనల నేపథ్యంలో... స్టార్ ఆటగాళ్లు సైతం ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. టి20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పాటు శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ వంటి పలువురు టీమిండియా ప్లేయర్లు తమ రాష్ట్రాల జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ‘కింగ్’ కోహ్లి విజయ్ హజారే టోర్నీలో ఆడి దాదాపు 16 సంవత్సరాలు అవుతోంది. కోహ్లి చివరగా ఈ టోర్నీ బరిలోకి దిగిన సమయంలో టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలవలేదు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ టీమిండియా ఓపెనర్గా కొనసాగుతున్నాడు... మహేంద్ర సింగ్ ధోనీ భారత టెస్టు జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు... రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ భారత మిడిలార్డర్లో పరుగుల వరద పారిస్తున్నారు! తొలిసారి ఈ టోర్నీ ఆడే సమయానికి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోని కోహ్లి... ఆ తర్వాత ఇన్నేళ్లలో ఎప్పుడూ తిరిగి విజయ్ హజారే టోర్నీలో ఆడలేదు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి... 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలనుకుంటున్న నేపథ్యంలో... ఫామ్ ఫిట్నెస్ నిరూపించుకునేందుకు ఈ టోర్నీ తొలి దశ మ్యాచ్లు ఆడనున్నట్లు వెల్లడించాడు. ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో రెండు సెంచరీలు ఒక హాఫ్సెంచరీతో మూడొందలకు పైగా పరుగులు చేసిన విరాట్... అదే జోరు దేశవాళీల్లోనూ కొనసాగిస్తాడా చూడాలి. ఇక ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ 2017–18లో చివరగా విజయ్ హజారే ట్రోఫీలో ఆడాడు. » మొత్తం 32 ఎలైట్ జట్లను నాలుగు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో గ్రూప్లో ఎనిమిదేసి జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో... ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లతో తలపడుతుంది. గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. » బెంగళూరు, జైపూర్, రాజ్కోట్, అహ్మదాబాద్... ఈ నాలుగు వేదికల్లో మ్యాచ్లు నిర్వహించనున్నారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లు జరగాల్సి ఉన్నా... ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన సందర్భంగా జరిగిన విజయోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో 10 మందికి పైగా అభిమానులు మృతిచెందడంతో చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించలేదు. » ఈ టోర్నీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా... గ్రూప్ ‘డి’ మ్యాచ్లు బెంగళూరులో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కోహ్లిని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఎగబడే అవకాశం ఉండటంతో పోలీసులు మ్యాచ్ల నిర్వహణకు అనుమతి ఇవ్వలేదు. దీంతో బుధవారం ఢిల్లీ, ఆంధ్ర మధ్య జరగాల్సిన మ్యాచ్ను బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ మైదానానికి తరలించారు. » గతంలో విరాట్ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగినప్పుడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం అభిమానులతో నిండిపోయింది. అందుకే ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. » ఆ్రస్టేలియా పర్యటనలో అదరగొట్టిన రోహిత్ శర్మ... దక్షిణాఫ్రికాపై సైతం మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. కెరీర్ను పొడిగించుకోవాలనే లక్ష్యంతోనే భారీగా బరువు తగ్గిన ‘హిట్మ్యాన్’ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తాడో చూడాలి. తొలి రెండు మ్యాచ్ల్లో వరుసగా సిక్కిం, గోవాతో ముంబై తలపడనుంది. » టీమిండియా టి20 కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్పై కూడా అందరి దృష్టి నిలవనుంది. ఏడాది కాలంగా విఫలమవుతున్న సూర్యకుమార్... వచ్చే ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో సిరీస్ వరకు లయ అందుకునేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడనుంది. » ఈ ఏడాది టి20ల్లో సూర్యకుమార్ సగటు 12.84 కాగా... స్ట్రయిక్ రేట్ 117.87. ఇది అతడి స్థాయికి ఏమాత్రం తగినది కాదు. గత 22 ఇన్నింగ్స్ల్లో అతడు ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేసుకోలేదు. అయితే వచ్చే ఏడాది టి20 వరల్డ్కప్ జట్టుకు సారథ్యం వహించే అవకాశం దక్కించుకున్న సూర్య... మెగా టోర్నీకి ముందు విజయ్ హజారే టోర్నీ ద్వారా ఫామ్లోకి రావాలని భావిస్తున్నాడు. » కోహ్లి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ జట్టుకు రిషభ్ పంత్ సారథ్యం వహించనున్నాడు. విరాట్ ఆరంభ మ్యాచ్లు మాత్రమే ఆడనుండగా... రిషభ్ టోర్నీ మొత్తం అందుబాటులో ఉండనున్నాడు. ప్రస్తుతం కేవలం భారత టెస్టు జట్టులోనే కొనసాగుతున్న పంత్... పరిమిత ఓవర్లలో పునరాగమనం చేసేందుకు ఈ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడనుంది. » ఇటీవల జరిగిన దేశవాళీ టి20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అది్వతీయ ప్రదర్శనతో జార్ఖండ్ జట్టుకు టైటిల్ అందించిన యువ ఓపెనర్ ఇషాన్ కిషన్... ఈ ఆటతీరులో వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడతడు... విజయ్ హజారేలో సైతం అదే దూకుడు కొనసాగించాలని భావిస్తున్నాడు. » గతేడాది ఈ టోర్నీలో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. 2024–25 సీజన్లో అతడు 8 ఇన్నింగ్స్ల్లో 389.5 సగటుతో 779 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు సైతం ఉన్నాయి. దీంతో పాటు రంజీల్లోనూ రాణించిన అతడికి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. » ఐపీఎల్ మినీ వేలం ముగిసినప్పటికీ... ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసిన ప్లేయర్లపై ఫ్రాంచైజీలు దృష్టి సారించడం ఖాయం. గతంలో ఈ టోర్నీ ఆటతీరు ఆధారంగా... స్మరణ్, మయాంక్ ఐపీఎల్ అవకాశాలు దక్కించుకున్నారు. » ఫలితాలపై వాతావరణం ప్రభావం ఉండకూదనే ఉద్దేశంతో మ్యాచ్లన్నీ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ రూపొందించారు. దీంతో రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే జట్టుపై ఎలాంటి మంచు ప్రభావం పడే అవకాశం లేదు. » ఇక టి20 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన భారత టెస్టు, వన్డే కెపె్టన్ శుబ్మన్ గిల్పై కూడా అందరి దృష్టి నిలవనుంది. అభిషేక్ శర్మ సారథ్యంలో పంజాబ్ జట్టు తరఫున గిల్ బరిలోకి దిగనున్నాడు. » ప్రస్తుతం భారత జట్టులో పేస్ బౌలర్ల లోటు స్పష్టంగా కనిపిస్తోంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై పని భారం ఎక్కువవుతుండగా... ఇతర పేసర్లు నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ స్పీడ్ స్టార్ మొహమ్మద్ సిరాజ్ను సెలెక్టర్లు కేవలం టెస్టు ఫార్మాట్కే పరిమితం చేసినట్లు కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో తదుపరి తరం పేసర్లు ఎవరనేదానికి ఈ టోర్నీ ద్వారా సమాధానం లభిస్తుందా చూడాలి. గుర్జపనీత్ సింగ్ (తమిళనాడు), గుర్నూర్ బ్రార్ (పంజాబ్), యు«ద్వీర్ సింగ్ (జమ్మూ కశ్మీర్), అనూజ్ (హరియాణా), షకీబ్ హుసేన్ (బిహార్) రూపంలో పలువురు యువ పేసర్లు ఈ టోర్నీలో ఆడనున్నారు.హైదరాబాద్ X ఉత్తర ప్రదేశ్ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా రాజ్కోట్లో జరగనున్న మ్యాచ్లో ఉత్తరప్రదేశ్తో హైదరాబాద్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు రాహుల్ సింగ్ సారథ్యం వహిస్తుండగా... రాహుల్ బుద్ధి వైస్ కెపె్టన్గా వ్యవహరించనున్నాడు. ఇటీవల ముస్తాక్ అలీ ట్రోఫీ గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శన చేసి... సునాయాసంగా ‘సూపర్ లీగ్’కు చేరిన హైదరాబాద్... చివరి మ్యాచ్లో పరాజయంతో ఫైనల్ ఆడే అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని హైదరాబాద్ భావిస్తోంది. కెప్టెన్ రాహుల్ సింగ్తో పాటు తన్మయ్ అగర్వాల్, తనయ్ త్యాగరాజన్, అమన్ రావు, అభిరథ్ రెడ్డి, కార్తికేయ, రక్షణ్ సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు ఉత్తరప్రదేశ్లో జట్టులో ప్రియం గార్గ్, ధ్రువ్ జురెల్, కార్తీక్ త్యాగి, సమీర్ రిజ్వీ, రింకూ సింగ్ కీలకం కానున్నారు. -
రవీంద్ర జడేజా కీలక నిర్ణయం
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్లు ఆడనున్నాడు.ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.ఆసీస్ టూర్కు ఎంపిక చేయలేదుఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.అయితే, ఆసీస్టూర్లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.సఫారీలతో సిరీస్లో సత్తా చాటిన జడ్డూఅయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్మన్ గిల్, అర్ష్దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్తో సిరీస్తో బిజీ అవుతారు.చదవండి: Virat Kohli: చరిత్రకు ఒక్క పరుగు దూరంలో..


