breaking news
Virat Kohli
-
ముంబైలో ఫ్లాట్ కొన్న విరుష్క జోడీ.. ఎన్ని కోట్లంటే?
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ జంట ముంబైలోని వర్సోవా ప్రాంతంలో ఓ లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారమ్ జాప్కీ.కామ్ ప్రకారం.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు విరుష్క జోడీ రూ. 18.29 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాట్ సుమారు 2,644 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ప్లాట్తో పాటు మూడు కార్ పార్కింగ్ స్లాట్లు కేటాయించబడ్డాయి. దీనికి సంబంధించి జూలై 21న రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. దీని కోసం కోహ్లీ దంపతులు రూ.1.09 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కాగా ముంబైలోని వర్లీలో ఇప్పటికే వీరికి లగ్జరీ అపార్ట్మెంట్ ఉన్న విషయం తెలిసిందే. అయితే కోహ్లి ఫ్యామిలీ ఎక్కువగా లండన్లో ఉంటుంది. అక్కడ కూడా విలాసవంతమైన ఇంటిని కోహ్లి కొనుగోలు చేశాడు.చివరగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో భారత తరపున బరిలోకి దిగిన కింగ్ కోహ్లి.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెప్టెంబర్ 27న వెస్టిండీస్తో జరగనున్న వన్డేలో కోహ్లి తిరిగి భారత జెర్సీలో కనిపించనున్నాడు. -
విరాట్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత వికెట్కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో 44 బంతుల్లో 81 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన అతను.. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. తాజా ఇన్నింగ్స్తో ఈ ఏడాది ఇషాన్ టీ20 పరుగుల సంఖ్య 783 పరుగులకు చేరగా.. 2022లో విరాట్ 781 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (2021లో 1326 పరుగులు) టాప్ ప్లేస్లో ఉన్నాడు. భారత్ తరఫున మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2022లో 1164 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్న ఇషాన్ ఈ ఏడాది స్కై రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో 381 పరుగులు చేస్తే స్కై రికార్డు.. మరో 543 పరుగులు చేస్తే మహ్మద్ రిజ్వాన్ను కూడా అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చు.భారత్కు ఈ ఏడాది ఇంకా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్లు ఉండటంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఆడే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషన్కు ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లు:* 1326 – మహ్మద్ రిజ్వాన్ (2021)* 1164 – సూర్యకుమార్ యాదవ్ (2022)* 996 – మహ్మద్ రిజ్వాన్ (2022)* 939 – బాబర్ ఆజమ్ (2021)* 936 – బ్రియాన్ బెన్నెట్ (2025)* 859 – అభిషేక్ శర్మ (2025)* 783 – ఇషాన్ కిషన్ (2026)* 781 – విరాట్ కోహ్లీ (2022)మ్యాచ్ విషయానికొస్తే.. ఇషాన్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (219-5) సాధించింది. అనంతరం అభిషేక్ మూడు, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్ల ఈ సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు ఇది తొలి సిరీస్ విజయం. -
‘హ్యాండ్షేక్’ వివాదం.. రెండు నెలల తర్వాత నోరు విప్పిన హెడ్!
ఐపీఎల్ 2026 సీజన్ సమయంలో విరాట్ కోహ్లి, ట్రావిస్ హెడ్ల మధ్య షేక్ హ్యాండ్ ఘటన ఎంత పెద్ద వివాదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఐపీఎల్ ముగిసిన రెండు నెలల తర్వాత హెడ్ 'హ్యాండ్షేక్' వివాదం ఘటనపై మౌనం వీడాడు. ఈ సంఘటన తర్వాత హెడ్, కోహ్లి మధ్య బంధం పూర్తిగా చెడిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ఈ పుకార్లపై హెడ్ స్పందిస్తూ.. 'మా మధ్య ప్యాచ్-అప్ (రాజీ) చేసుకోవడానికి ఏమీ లేదు. కోహ్లితో నా సంబంధాలు ఎప్పటిలాగే సాధారణంగా ఉన్నాయి. మైదానంలో ఏం జరిగిందో అది లీగ్ ప్రక్రియలో భాగమే తప్ప, మా మధ్య ఎలాంటి వివాదం లేదు' అని స్పష్టం చేశాడు. అయితే మైదానంలో జరిగే విషయాలను ఒక ప్రొఫెషనల్ క్రికెటర్గా స్వీకరిస్తానని, కానీ సోషల్ మీడియాలో తన కుటుంబాన్ని టార్గెట్ చేయడం బాధించిందని హెడ్ ఆవేదన వ్యక్తం చేశాడు.'ఇలాంటి ఘటనలు క్రీడా ప్రపంచంలో సహజమేనని నేను, జెస్సికా ముందే గ్రహించాం. కానీ కొంతమంది పనిగట్టుకొని నా కుటుంబంపై అసభ్యకర కామెంట్లు చేయడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. జెస్సికా ఈ పరిస్థితిపై చాలా పరిణితితో వ్యవహరించడంతోనే సమస్య పెద్దది కాలేదు. మరో ఐపీఎల్ వచ్చేసరికి ఇలాంటి సంఘటనలు అందరూ మర్చిపోతారు. కానీ ఇలాంటి విషయాలను సీరియస్గా తీసుకుంటున్న కొందరు మాత్రం అదే పనిగా ఆటగాళ్ల కుటుంబాలను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేసి వేధించడం నిజంగా బాధాకరం.' అని హెడ్ విచారం వ్యక్తం చేశాడు.ఆరోజు ఏం జరిగింది?ఐపీఎల్ 2026 సీజన్లో మే 22న జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఇది చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్షేక్లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్, అభిషేక్ శర్మలతో మాట్లాడి.. హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన అప్పట్లో వైరల్ అయింది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026Read: పాక్తో సిరీస్కు ఎంపిక.. ఆడేందుకు విండీస్ ప్లేయర్ నిరాకరణ! -
అతడికి 2 నెలలే డెడ్లైన్.. రోహిత్, కోహ్లికి మంచి రోజులు!
టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవిలో కొనసాగుతున్న మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ పదవీకాలం ఈ సెప్టెంబర్తో ముగియనున్నట్లు తెలుస్తోంది. కాగా వన్డే ప్రపంచకప్ వరకు తనను సెలెక్టర్గా కొనసాగేందుకు అవకాశమివ్వాలని అగార్కర్ చేసిన అభ్యర్థనను బీసీసీఐ పట్టించుకోనట్లుగా అనిపిస్తోంది. సెలెక్టర్గా ఎంపికైన తర్వాత టీమిండియా ఐసీసీ టైటిల్స్ సాధించినప్పటికీ అగార్కర్ విషయంలో మాత్రం విమర్శలే వ్యక్తమయ్యాయి. అందుకే అగార్కర్ను సెలెక్టర్గా కొనసాగించేందుకు బీసీసీఐ ఇష్టపడడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి స్థానంలో కొత్త సెలెక్టర్ కోసం వెతుకులాటను ప్రారంభించినట్లు సమాచారం. ఇక అగార్కర్ సెలెక్టర్ పదవి నుంచి దిగిపోతే మాత్రం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు వన్డే వరల్డ్కప్ 2027 ఆడేందుకు మార్గం సుగమం అవుతుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మాత్రం సెప్టెంబర్ తర్వాత టీమిండియాకు కొత్త సెలెక్టర్ను చూసే అవకాశాలున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి జరగనున్న సిరీస్లకు కొత్త సెలెక్టర్ నేతృత్వంలోనే జట్టు ఎంపిక జరగనుంది. ఇక అజిత్ అగార్కర్ 2023లో టీమిండియా చీఫ్ సెలక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జట్టులో పలు కీలక మార్పులు చేస్తూ వస్తున్నాడు. Photo Credit: BCCI Twitterఅగార్కర్ పదవీకాలంలో టీమిండియా నాలుగు ఐసీసీ టోర్నీలు ఆడింది. 2023 వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్ 2024, చాంపియన్స్ ట్రోఫీ 2025, టీ20 ప్రపంచ కప్ 2026.. వీటిల్లో మూడు టైటిళ్లు భారత జట్టు సొంతం చేసుకోవడం విశేషం. అయినప్పటికీ సెలెక్టర్గా అగార్కర్పై మాత్రం విమర్శలే రావడం గమనార్హం. జట్టు సెలక్షన్ విషయంలో అగార్కర్ తీసుకున్న పలు నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ను టీ20 జట్టుకు కెప్టెన్ చేయడం, హార్దిక్ పాండ్యకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి అప్పట్లో తీవ్ర విమర్శలకు తావిచ్చాయి. వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మను తప్పించడంపై అభిమానులు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. తన నిర్ణయాలను మాత్రం అగార్కర్ బహిరంగంగానే సమర్థించుకుంటూ వచ్చాడు. సెలక్షన్ అనేది కేవలం ప్లేయర్ల గణాంకాలపై ఆధారపడదని, జట్టుకు సరిపోయే కాంబినేషన్, ఆటగాళ్ల పాత్రలు, వ్యూహాలు కీలకమని అగార్కర్ ప్యానెల్ నిరూపించింది. టీ20 ప్రపంచకప్తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన కారణంగా 2025లోనే అగార్కర్ సెలెక్టర్ పదవీకాలన్ని మరో ఏడాది పొడిగించిన బీసీసీఐ మరోసారి అతడి పదవీకాలాన్న పొడిగించేందుకు సముఖత వ్యక్తం చేయడం లేదు.చదవండి: Asian Games: క్రికెట్ ‘డ్రా’ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే? -
వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లి-రోహిత్ జోరు!
-
వైభవ్ సూర్యవంశీ కాదు.. నెక్స్ట్ విరాట్ కోహ్లి అతడే..!
విరాట్ కోహ్లి కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న వేళ, భారత క్రికెట్లో తదుపరి స్టార్ ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. రేసులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు బలంగా వినిపిస్తున్నప్పటికీ, భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ మాత్రం మరో ఆటగాడిని నెక్స్ట్ విరాట్ కోహ్లిగా అభివర్ణించాడు.తాజాగా దూరదర్శన్ నిర్వహించిన 'ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో'లో మాట్లాడిన జాఫర్.. కేఎల్ రాహుల్ను భవిష్యత్ విరాట్ కోహ్లిగా పేర్కొన్నాడు. ప్రతిభ, టెక్నిక్ పరంగా రాహుల్ విరాట్తో సమానమని అన్నాడు. అయితే ఇద్దరి మధ్య తేడాను నిర్ణయించేది విరాట్ మానసిక దృఢత్వమని చెప్పాడు."కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు. మూడు ఫార్మాట్లలోనూ అత్యుత్తమంగా రాణించగలడు. టెక్నిక్, ప్రతిభ పరంగా చూస్తే అతడు విరాట్ కోహ్లితో సమానమే. కానీ విరాట్ని ప్రత్యేకంగా నిలబెట్టింది అతని అసాధారణమైన మెంటాలిటీ" అని జాఫర్ వ్యాఖ్యానించాడు.అయితే గణాంకాల పరంగా విరాట్, రాహుల్ మధ్య భారీ అంతరం ఉంది. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో 28359 పరుగులు, 85 సెంచరీలు, 148 అర్ధసెంచరీలు నమోదు చేయగా.. కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 9830 పరుగులు, 22 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు సాధించాడు.మరోవైపు, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే భారత క్రికెట్లో సంచలనంగా మారాడు. ఐపీఎల్ 2026లో 16 ఇన్నింగ్స్లో 776 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించిన అతడు, అనంతరం టీ20 అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. ఇంగ్లండ్తో తొలి సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్లో మరోసారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం అతడికి దొరికింది. -
భారీ రికార్డుపై కన్నేసిన అభిషేక్ శర్మ
జింబాబ్వేతో ఇవాళ (జూలై 23) జరగనున్న తొలి టీ20కి ముందు భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్లో అతడు 16 పరుగులు చేస్తే, టీ20 క్రికెట్లో 6000 పరుగులు పూర్తి చేసిన భారత బ్యాటర్ల జాబితాలో చోటు దక్కించుకుంటాడు.ప్రస్తుతం అభిషేక్ 203 టీ20 మ్యాచ్ల్లో 199 ఇన్నింగ్స్ ఆడి 5984 పరుగులు చేశాడు. తొలి టీ20లో 16 పరుగులు సాధిస్తే, 200 ఇన్నింగ్స్లోపు 6000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాటర్గా నిలుస్తాడు. ఈ జాబితాలో ఇప్పటికే కేఎల్ రాహుల్ (166 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (184), శుభ్మన్ గిల్ (185) ఉన్నారు.అంతర్జాతీయంగా ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. అతడు కేవలం 162 ఇన్నింగ్స్లోనే 6000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.జింబాబ్వేపై అద్భుతమైన రికార్డుఅభిషేక్ శర్మకు జింబాబ్వేపై అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఆ జట్టుతో ఆడిన ఆరు టీ20ల్లో 179 పరుగులు చేసి, భారత్ తరఫున జింబాబ్వేపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు.అంతేకాదు, ఈ మ్యాచ్లో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా కంటే కనీసం 16 పరుగులు ఎక్కువ చేస్తే, భారత్-జింబాబ్వే మధ్య జరిగిన టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.నేటి భారత్-జింబాబ్వే మ్యాచ్ భారతకాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మొదలవుతుంది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత యువ జట్టు జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
సీజేపీ నిరసనలపై స్పందించిన యువీ
గత కొద్ది రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు, యువతను ఉద్దేశించి శాంతి, సంభాషణ, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చాడు.తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొస్తూ.."ప్రతి చిన్నారి, విద్యార్థి, మహిళ, పురుషుడు ప్రశాంత వాతావరణంలో చదువుకునే, సురక్షితంగా ఎదిగే, తమ కలలను సాకారం చేసుకునే అవకాశం పొందాలి. వారి సంక్షేమమే భారత భవిష్యత్తుకు బలమైన పునాది. సంభాషణ ద్వారానే దేశ భవిష్యత్తు కోసం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం దొరుకుతుంది" అని పేర్కొన్నాడు.Yuvraj Singh Instagram Story. pic.twitter.com/ufb1k3JVBX— Jotdofficial (@jotdofficial_) July 22, 2026విద్యార్థుల నిరసనలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో యువరాజ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అయితే ఆయన ఏ రాజకీయ పక్షానికీ మద్దతు ప్రకటించకుండా, విద్యార్థుల భద్రత, సంక్షేమం, విద్యా భవిష్యత్తుపైనే తన సందేశాన్ని కేంద్రీకరించాడు.క్యాన్సర్ను జయించిన తర్వాత యువరాజ్ స్థాపించిన 'YouWeCan' ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ అవగాహన, చికిత్స సహాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే, ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలపై ఇప్పుడిప్పుడే సెలబ్రిటి లోకం స్పందించడం మొదలు పెట్టింది. తొలుత ఈ విషయంపై మాట్లాడేందుకు వెనకడుగు వేసిన వారు ఒక్కొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి యువరాజ్ సింగ్ చేరాడు.కాక్రోచ్ల నిరసనలపై క్రికెట్ రంగానికి సంబంధించి యువరాజ్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో నెటిజన్లు మరో భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లిని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికి పోతుంటే విరాట్ మాత్రం స్వామీజీల చుట్టూ తిరుగుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు.దేశ యువత భవిష్యత్తు పట్ల ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తిగా విరాట్ను అభివర్ణిస్తున్నారు. ఇలాంటి వాడు యువతకు ఏరకంగా ఆదర్శంగా నిలుస్తాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంకొందరు విరాట్ తన మఖాంను యూకే మార్చడాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి వారిని దేశం నుంచే బహిష్కరించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశం పట్ల, దేశ యువత పట్ల ఏమాత్రం బాధ్యలేకుండా ఇక్కడ సంపాదించుకొని విదేశాల్లో స్థిరపడే వారికి కూడా యువత సరైన గుణపాఠం నేర్పాలని పిలుపునిస్తున్నారు. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్
టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ వన్డేల్లో వరల్డ్నంబర్ వన్ బ్యాటర్గా నిలిచేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించిన తాజా వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్లో అగ్రస్ధానానికి గిల్ మరింత చేరవయ్యాడు. ప్రస్తుతం అగ్రస్ధానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానంలో ఉండగా.. గిల్ (801) కేవలం ఒక్క పాయింట్ తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. తదుపరి ఐసీసీ ర్యాంకింగ్స్ అప్డేట్లో గిల్ అగ్రస్థానానికి చేరుకుంటే.. వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రపీఠాన్ని అదరోహించిన అత్యంత పిన్న వయస్కుడైన భారత కెప్టెన్గా చరిత్ర సృష్టిస్తాడు. గతంలో భారత్ తరపున వన్డేల్లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి దిగ్గజ క్రికెటర్లు టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నారు. కాగా ఇంగ్లండ్తో జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్లో గిల్ అదరగొట్టాడు. మూడు మ్యాచ్లలో 94.00 అద్భుత సగటుతో 188 పరుగులు సాధించి, భారత్ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ప్రదర్శ కారణంగానే అతడిని నంబర్-1 ర్యాంక్ రేసులో ఉన్నాడు.కాగా ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత బ్యాటర్ల హవా కొనసాగుతోంది. గిల్తో పాటు విరాట్ కోహ్లి 767 పాయింట్లతో మూడో స్థానంలో, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ సిరీస్లో రోహిత్, కోహ్లి కూడా మెరుగైన ప్రదర్శన చేశారు. ఇక ఇదే సిరీస్లో దుమ్ములేపిన ఇంగ్లండ్ వెటరన్ జో రూట్ నాలుగు స్ధానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్కు చేరుకున్నాడు. -
ODI WC: భారత జట్టు ఇదే.. వాళ్లకు నో ఛాన్స్!
ఇంగ్లండ్తో వన్డే సిరీస్లోనూ టీమిండియాకు భంగపాటే ఎదురైంది. తొలుత టీ20 సిరీస్లో ఆతిథ్య జట్టు చేతిలో 4-0 క్లీన్స్వీప్ అయిన భారత జట్టు.. ఆ తర్వాత వన్డే సిరీస్లో 2-1తో ఓడిపోయింది. తొలి వన్డేలో గెలిచిన గిల్ సేన.. ఆ తర్వాత రెండు వన్డేల్లోనూ ఓడిపోయింది.ఫిట్నెస్లేని ఆటగాళ్లకు గిల్ వార్నింగ్ముఖ్యంగా లార్డ్స్లో భారత బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఇక జస్ప్రీత్ బుమ్రా గాయం వల్ల ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. అంతకుముందే ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా గాయపడి జట్టుకు దూరమయ్యాడు.ఇక ఈ సిరీస్ కంటే ముందే ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీశ్ కుమార్ రెడ్డి కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో తరచూ గాయపడే ఆటగాళ్ల వల్ల తుదిజట్టు కూర్పు దెబ్బతింటోందని కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. వన్డే వరల్డ్కప్-2027లో వరుసగా ఏడు మ్యాచ్ల దాకా ఆడాల్సి ఉంటుందని.. అలాంటి కీలక సమయంలో వీరితో కష్టమేనంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.తమ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగుపడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని గిల్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఇలాంటి తరుణంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ బ్యాటర్ అభినవ్ ముకుంద్ వరల్డ్కప్ జట్టును ఎంచుకున్నాడు.వారికే పెద్దపీటటాపార్డర్లో ఎలాంటి మార్పులు చేయని అభినవ్.. ఓపెనర్లుగా రోహిత్ శర్మ- కెప్టెన్ శుబ్మన్ గిల్ జోడీని వన్డౌన్లో విరాట్ కోహ్లిని కొనసాగించాడు. అయితే బ్యాకప్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్కు మాత్రం చోటివ్వలేదు. ఇక వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్లను ఎంచుకున్న అభినవ్.. మిడిలార్డర్లో వీరితో పాటు శ్రేయస్ అయ్యర్కు చోటిచ్చాడు.ఆల్రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను ఎంచుకున్న అభినవ్ ముకుంద్.. రవీంద్ర జడేజాను పక్కనపెట్టాడు. స్పెషలిస్టు స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్కు స్థానమిచ్చిన అతడు.. వరుణ్ చక్రవర్తికి చోటివ్వలేదు.ఇక పేస్ విభాగంలో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గుర్నూర్ బ్రార్లకు చోటు ఇచ్చాడు. ప్రిన్స్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్ పేర్లను అభినవ్ ముకుంద్ పరిగణనలోకి తీసుకోలేదు. వీళ్లు కూడా ఉండవచ్చుఅయితే, వరల్డ్కప్ టోర్నీకి ఇంకా సమయం ఉంది కాబట్టి.. నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అర్ష్దీప్ సింగ్ ఆఖరి నిమిషంలో జట్టులోకి వచ్చినా అభినవ్ ఆశ్చర్యం లేదన్నాడు. కాగా వచ్చే ఏడాది సౌతాఫ్రికా- జింబాబ్వే- నమీబియా వేదికలుగా అక్టోబరు- నవంబరు మధ్య వన్డే వరల్డ్కప్ జరుగనుంది.వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి అభినవ్ ముకుంద్ ఎంచుకున్న భారత జట్టురోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, గుర్నూర్ బ్రార్.చదవండి: ఐపీఎల్ టూ ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?
టీమిండియాతో వన్డే సిరీస్లో ఇంగ్లండ్ స్టార్ జో రూట్ అదరగొట్టాడు. ఎడ్జ్బాస్టన్ వేదికగా తొలి వన్డేలో 76 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ వన్డౌన్ బ్యాటర్.. కార్డిఫ్లో జరిగిన రెండో వన్డేలో 99 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నా.. సహచరుడికి మ్యాచ్ ముగించే అవకాశం ఇచ్చి.. హుందాగా వ్యవహరించాడు.ఈ మ్యాచ్లో రూట్ ఇన్నింగ్స్ కారణంగా ఇంగ్లండ్ జయభేరి మోగించి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డేలోనూ రూట్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. కేవలం 39 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. మొత్తంగా 48 బంతుల్లో తొమ్మిది ఫోర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ తొలి క్రికెటర్గా రికార్డుఇక మూడో వన్డేలో గెలిచి ఇంగ్లండ్ సిరీస్ 2-1తో కైవసం చేసుకోగా.. టీమిండియా ఓటమితో నిరాశగా వెనుదిరిగింది. రూట్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.నిజానికి గత కొంతకాలంగా రూట్ వన్డేల్లోనూ సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఈ ముప్పై ఐదేళ్ల బ్యాటర్ గత ఆరు వన్డే ఇన్నింగ్స్లో చేసిన పరుగులు వరుసగా.. 61, 75, 111*, 76*, 99*, 74*. తద్వారా ఇంగ్లండ్ తరఫున వన్డేల్లో వరుసగా ఆరు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన తొలి క్రికెటర్గా రూట్ చరిత్రకెక్కాడు.ఇంగ్లండ్ అతడికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది.. మీరేం చేస్తున్నారు?ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ టీమిండియా యాజమాన్యం వైఖరిని విమర్శించాడు. ఇంగ్లండ్ మేనేజ్మెంట్ జో రూట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చి.. మంచి ఫలితాలు రాబడుతోందన్నాడు. అదే సమయంలో భారత జట్టు యాజమాన్యం మాత్రం దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి విషయంలో తప్పు చేస్తోందని మండిపడ్డాడు.కాగా ఇప్పటికే రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అయితే, అనూహ్య రీతిలో రోహిత్ను కెప్టెన్సీ తప్పించిన యాజమాన్యం.. రో-కో ప్రపంచకప్ ఆడతారో లేదోనన్న అంశంపై తమకు స్పష్టత లేదన్నారు.రోహిత్ భారీ శతకంఈ క్రమంలోనే లార్డ్స్లో ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోడుతన్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే, ఈ మ్యాచ్లో రోహిత్ భారీ శతకం (138)తో రాణించి ఊహాగానాలకు చెక్ పెట్టాడు. తాను రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు.మీరు తప్పు చేస్తున్నారుఈ పరిణామాల నేపథ్యంలో నేపథ్యంలో రమేశ్ స్పందిస్తూ.. ‘‘విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు యాజమాన్యం మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. వాళ్లిద్దరు ఇప్పటికీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-5లో ఉన్న సత్తా కలవారు. ఓసారి ఇంగ్లండ్ మేనేజ్మెంట్ను చూడండి. జో రూట్కు వాళ్లు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నారు. అతడి నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకునేందుకు చేయాల్సిందంతా చేస్తున్నారు.అతడిపై ఏమాత్రం ఒత్తిడి పెట్టడం లేదు. ఇంగ్లండ్ రూట్ను తమ బలంగా భావిస్తోంది. కానీ భారత జట్టు యాజమాన్యం మాత్రం రోహిత్- విరాట్లనే తమ వెన్నెముకగా భావించాల్సింది పోయి వారి విషయంలోనే స్పష్టత లేకుండా చేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్లో రోహిత్ వరుసగా 11, 26, 138 పరుగులు చేయగా.. కోహ్లి 5, 74, 65 పరుగులు సాధించాడు.చదవండి: లార్డ్స్ వన్డేలో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్ -
లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ కెరీర్ చరమాంకానికి చేరిందంటూ గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు.. ‘హిట్మ్యాన్’ లార్డ్స్లో శతకంతో చెక్ పెట్టాడు. ఇంగ్లండ్తో మూడో వన్డే సందర్భంగా క్రికెట్ ‘మక్కా’లో సెంచరీ బాది తన బ్యాట్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. కాగా ఇంగ్లండ్తో లార్డ్స్ వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ అని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్లో హిట్మ్యాన్ 110 బంతుల్లోనే పదిహేడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాది 138 పరుగులతో అదరగొట్టాడు.లార్డ్స్ మ్యాచ్లో అదే హైలైట్అనంతరం తన రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ.. తాను క్రికెట్ ఆడుతున్నంత కాలం... రిటైర్మెంట్ ఊహాగానాలు వస్తూ ఉంటాయని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి వార్తలతో పోరాడటం కంటే... మైదానంలో పరుగులు సాధించడంపైనే దృష్టి పెడతానని స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్లతో పాటు పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్ సైతం రోహిత్ శర్మకు మద్దతుగా నిలిచాడు. గేమ్ ప్లాన్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సిరీస్లో గెలిచేందుకు ఇంగ్లండ్కు అర్హత ఉంది. అయితే, ఆ విషయం కంటే కూడా రోహిత్ శర్మ సెంచరీ చేయడమే లార్డ్స్ మ్యాచ్కు హైలైట్. ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తానూ ఒకడినని.. ఇప్పటికీ తన ఆటలో పదును తగ్గలేని రోహిత్ తన ఇన్నింగ్స్ ద్వారా స్టేట్మెంట్ ఇచ్చాడు. అతడి భవిష్యత్తు గురించి చాలా వదంతులు వస్తున్నాయి. వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో అతడు లేడని చాలా మంది అంటున్నారు. వాళ్లు తలచుకుంటేనే..అయితే, తనను విమర్శించే వాళ్లందరికీ రోహిత్ బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. రోహిత్, విరాట్ కోహ్లి వంటి ఆటగాళ్లను ఎవరూ జట్టు నుంచి బయటకు పంపలేరు. ఆటకు వీడ్కోలు పలకడానికి సరైన సమయం వచ్చిందని భావిస్తే వాళ్లే స్వయంగా తప్పుకొంటారు. రిటైర్మెంట్ అనేది కేవలం వారి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. భారత క్రికెట్కు వీరిద్దరు చేసిన సేవలు వెలకట్టలేనివి. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చే క్రమంలో మిగతా ఫార్మాట్ల నుంచి వారే తప్పుకొన్నారు. అందుకే వాళ్లు నేటికీ సూపర్స్టార్లుగానే కొనసాగుతున్నారు’’ అని కమ్రాన్ అక్మల్ రో-కోలపై ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్లో 4-0తో వైట్వాష్ అయిన టీమిండియా.. వన్డే సిరీస్ను 1-2తో కోల్పోయింది.ఇదిలా ఉంటే.. 2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో టీమిండియాను చాంపియన్గా నిలిపిన తర్వాత.. రోహిత్- కోహ్లి అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. గతేడాది వారం రోజుల వ్యవధిలో ఇద్దరూ టెస్టులకూ గుడ్బై చెప్పారు. వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా వన్డేల్లో కొనసాగుతున్నారు.చదవండి: ఆటకు గుడ్బై చెప్పు... భారత మాజీ క్రికెటర్ ఫైర్ -
కోహ్లి సలహా నా ఆటను మార్చేసింది: పీవీ సింధు
జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ సాధించిన తొలి భారత షట్లర్గా పీవీ సింధు నిలిచిన సంగతి తెలిసిందే. జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత సింధు తన విజయం వెనుక ఎవరు దాగున్నారనే విషయాన్ని బయటపెట్టింది. ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న సమయంలో కోహ్లి తనకు ధైర్యం చెప్పాడని, అతడిచ్చిన సలహాతోనే ఇవాళ తనను చాంపియన్గా నిలబడేలా చేసిందంటూ సింధు అతడిని ప్రశంసలతో ముంచెత్తింది. కోహ్లితో పాటు తనకు కష్టకాలంలో అండగా నిలిచిన భర్త వెంకటసాయి దత్తకు కూడా సింధు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ‘ కొంతకాలం కిందట నేను ఫామ్లేమితో సతమతమయ్యాను. ఈ సమయంలో కోహ్లిని కలిసి.. మీరు కూడా ఒక దశలో ఫామ్ కోల్పోయి సెంచరీ కోసం పరితపించారు. ఆ సమయం ఎలా గడించింది, దానిని మీరు ఎలా అధిగమించారు’ అని అడిగాను. దీనిని కోహ్లి చాలా సింపుల్గా తేల్చేశాడు. ఒక ఆటగాడిగా పరుగులు చేయడమే నా పని. దాంట్లోనే నా ఆనందాన్ని వెతుక్కుంటా’ అని పేర్కొన్నాడు. ఆ సమయంలో కోహ్లి అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. కానీ నా బొటనవేలికి గాయం కావడంతో డాక్టర్ మూడు నెలలు విరామం తీసుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో నా భర్త వెంకట దత్త సాయి మానసిక ప్రశాంతత కోసం నన్ను అట్లాంటాకు తీసుకెళ్లారు. గాయాలు, ఫామ్పై పెరుగుతున్న సందేహాల నేపథ్యంలో దత్త నాకు కోహ్లి చెప్పిన మాటలను గుర్తుచేసుకోమన్నాడు. అప్పుడు తెలిసింది నాకు కోహ్లి సీక్రెట్. విరాట్ చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. మా ఇద్దరి మధ్య సంభాషణ ఒక ప్రత్యేకమైనదిగానే ఉంచాలనుకుంటున్నా. ఆ తర్వాత కూడా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ అవేంటనేవి మా మధ్యే ఉండడం అవసరమనిపించింది’ అని సింధూ పేర్కొంది. ఆదివారం జరిగిన జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానే యమగూచిపై విజయం సాధించిన సింధు 19 నెలల తర్వాత ఒక బీడబ్ల్యూఎఫ్ టైటిల్ను సొంతం చేసుకుంది.Read: ‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’ -
‘రోహిత్, కోహ్లిలను టచ్ చేయడం అసాధ్యం’
టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి భవితవ్యంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్, కోహ్లిలను జట్టులో నుంచి తొలగించడం చాలా కష్టతరమని, బలవంతంగా పంపించాలని చూస్తే మాత్రం అభిమానులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించాడు. ఇటీవలే రోహిత్ రిటైర్మెంట్పై ఊహాగానాలు వచ్చిన వేళ అశ్విన్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.తన యూట్యూబ్ షో 'ఆష్ కి బాత్’లో అశ్విన్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆడాలని అనుకుంటే వారిని జట్టు నుంచి తప్పించడం చాలా చాలా కష్టం. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది.. వారి అద్భుతమైన కెరీర్ రికార్డులు. రోహిత్ ఇప్పటికే 12 వేల అంతర్జాతీయ పరుగులు చేశాడు. అలాంటి ఆటగాడిని సులభంగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. తన ఆటతో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. Photo Credit: BCCI Twitterఇక రెండో కారణం ఏంటంటే.. అది రోహిత్, కోహ్లికి భారీ అభిమాన బలం ఉంది. వీరిద్దరు మ్యాచ్లు ఆడుతున్నారంటే.. వారిని చూసేందుకే లక్షలాది మంది అభిమానులు స్టేడియాలకు తరలివస్తారు. అలాంటి స్టార్ ఆటగాళ్లను జట్టు నుంచి తప్పిస్తే భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తుంది. వారిని తప్పించాలని చూస్తే అభిమానులు ఊరుకుంటారా? ఒకవేళ తొలగిస్తే మాత్రం స్టేడియం పైకప్పు లేచిపోవడం గ్యారంటీ' అంటూ తనదైన శైలిలో అశ్విన్ చమక్కులు పంచాడు.Photo Credit: BCCI Twitterఇంగ్లండ్తో వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో రోహిత్ విపలం కావడంతో మూడో వన్డే అతడికి చివరిది కానుందని, ఇంగ్లండ్తో సిరీస్ తర్వాత రోహిత్ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు వార్తలంటూ బీసీసీఐ కొట్టిపారేయడంతో ఊహాగానాలకు తెరపడింది. ఇక రోహిత్ కూడా తన రిటైర్మెంట్పై వస్తున్న వార్తలకు బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్తో మూడోవన్డేలో రోహిత్ శర్మ సెంచరీతో మెరిశాడు. 110 బంతుల్లో 138 పరుగులు సాధించాడు. మరోవైపు కోహ్లి కూడా అర్ధసెంచరీతో రాణించి తమకు తిరుగులేదని చాటిచెప్పాడు. ఇక బౌలర్ల పరిస్థితి గురించి అశ్విన్ కాస్త భిన్నంగా స్పందించాడు. 'మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేదా భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు జట్టులో లేకపోతే కొంతమంది మాత్రమే ప్రశ్నిస్తారు. కానీ స్టార్ బ్యాటర్ల జరిగినంత స్థాయిలో చర్చ జరగదు. భవిష్యత్తులో బౌలర్ల కోసం కూడా అభిమానులు అదే స్థాయిలో గళమెత్తితే వారిని కూడా జట్టు నుంచి తప్పించడం కష్టమవుతుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నా' అని అశ్విన్ తెలిపాడు. Read: స్పెయిన్ నంబర్వన్.. ర్యాంకింగ్స్లో మొరాకో, నార్వే సంచలనం -
అంతా కోహ్లి వల్లే.. రిటైర్మెంట్ పై తొలిసారి స్పందించిన రోహిత్
-
లార్డ్స్లో సెంచరీ.. రోహిత్ శర్మ వ్యాఖ్యలు వైరల్
రిటైర్మెంట్ వార్తల నడుమ లార్డ్స్ మైదానంలో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ అద్భుత శతకంతో మెరిశాడు. ఇంగ్లండ్తో ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా 138 పరుగులు సాధించాడు. తొలుత నెమ్మదిగా ఆడిన హిట్మ్యాన్ ఆ తర్వాత గేరు మార్చి.. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.ఈ క్రమంలో 110 బంతుల్లో 17 ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 138 పరుగులు చేశాడు. అయితే, జేకబ్ బెతెల్ అనూహ్య రీతిలో రోహిత్ను బౌల్డ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్మన్ గిల్ (77), వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (74) అర్ధ శతకాలు సాధించినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణయాత్మక మ్యాచ్లో 27 పరుగుల తేడాతో ఓడి టీమిండియా సిరీస్ను 1-2తో ఇంగ్లండ్కు కోల్పోయింది.The name is Rohit Gurunath Sharma. 🫡The occasion? A Lord's century. 💯Watch #ENGvIND 3rd ODI LIVE NOW on Sony Sports Network TV channels. #SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/G5HoYMO0BV— Sony Sports Network (@SonySportsNetwk) July 19, 2026రూమర్లు కొత్తేం కాదుఇదిలా ఉంటే.. తాజాగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలపై స్పందించాడు. ‘‘మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేయడం నా ముఖ్య విధి. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. నా అరంగేట్రం రోజు నుంచి నేటి దాకా అదే నిబద్ధత, అంకితభావంతో ముందుకు సాగుతున్నాను.అంతేకాదు నేను అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నాటి నుంచే ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాను. నేను మళ్లీ గ్రౌండ్లోకి వెళ్లే దాకా ఈ వదంతులు ఆగవు. అయినా.. ఇలాంటి రూమర్లు నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. మైదానంలో నా ఆట తీరు ఎలా ఉందన్నదే ముఖ్యం.జట్టు విజయం కోసం నా వంతు కృషి చేస్తాను. కేవలం ఆ ఒక్క విషయంపైనే నా దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. అయినా ఇలాంటి వదంతులు ఉంటేనే కదా.. మనకూ కాస్త సరదాగా అనిపిస్తుంది. నా పని నాదే. బయట ఎవరి పని వాళ్లదే. వాళ్లు ఇలాంటి రూమర్లతో ప్రాచుర్యం పొందాలనుకుంటారు’’ అని రోహిత్ శర్మ గాసిప్రాయుళ్లకు కౌంటర్ వేశాడు.కాగా ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకొన్న రోహిత్ శర్మ.. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అయితే, లార్డ్స్లో రోహిత్ చివరి మ్యాచ్ ఆడబోతున్నాడనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశాడు. కెప్టెన్ గిల్ సైతం ఇవన్నీ కేవలం ఊహాగానాలే అన్నాడు.మా మధ్య అవగాహన ఉందిఇదిలా ఉంటే.. రోహిత్- కోహ్లి కలిసి అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా 400 మ్యాచ్లలో కలిసి ఆడిన తొలి భారత జోడీగా చరిత్రకెక్కారు. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందిస్తూ.. ‘‘మా కెరీర్ తొలి నాళ్ల నుంచి మేము కలిసి ఆడుతున్నాం. ఇప్పటికే మేమిద్దరం కలిసి ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాము.మధ్య ఓవర్లలో కోహ్లి వస్తే అతడితో కలిసి ఆడటం నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఈరోజు కూడా ఇద్దరం కలిసే ఆడాము. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ఆట మధ్యలో మేము ఎక్కువగా చర్చించుకుంటాము. ఒకరి ఆలోచనలు ఒకరం పంచుకుంటూ.. ఒకరినొకరం అర్థం చేసుకుంటూ బ్యాటింగ్ చేస్తూ ఉంటాము’’ అని కోహ్లితో ఉన్న అనుబంధం, సమన్వయం గురించి చెప్పుకొచ్చాడు.చదవండి: మెరుగుపడాల్సిందే: శుబ్మన్ గిల్ వార్నింగ్ -
రోహిత్ సెంచరీ వృథా.. లార్డ్స్ వన్డేలో టీమిండియా ఓటమి
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ బెన్ డక్కెట్ (141 పరుగులు, 135 బంతుల్లో, 18 ఫోర్లు, 1 సిక్స్) భారీ సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74 నాటౌట్, 48 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్లు ఆడారు. భారత బౌలర్లు ఘోరంగా విఫలమయ్యారు.రో-కో హిట్.. మిడిలార్డర్ ఫట్అనంతరం 388 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్కు వీరిద్దరూ 147 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 77 పరుగులు చేసిన గిల్.. రషీద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి, రోహిత్తో జతకట్టాడు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో రోహిత్ 34 బంతుల్లో తన 34వ వన్డే సెంచరీ మార్క్ను పూర్తి చేసుకున్నాడు. వరుస బౌండరీలు బాది మంచి జోరు మీద ఉన్న రోహిత్(110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 138) జాకబ్ బెథల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత భారత వికెట్ల పతనం మొదలైంది. మిడిలార్డర్ బ్యాటర్లు ఒక్కరు కూడా రాణించలేకపోయారు. ఇషాన్ కిషన్(14), శ్రేయస్ అయ్యర్(0) వరుస ఓవర్లలో ఔటయ్యారు. దీంతో కావాల్సిన రన్రేట్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి(74) కూడా ఓ భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు.దీంతో మ్యాచ్ భారత్ చేతులనుంచి చేజారిపోయింది. కేఎల్ రాహుల్(12), అక్షర్ పటేల్(2) నిరాపరిచారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 360 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ 4 వికెట్లతో భారత్ను దెబ్బ తీశాడు. కాగా ఇంగ్లండ్ టూర్లో భారత్ టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్ను కూడా కోల్పోయి ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. -
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధికంగా సంయుక్తంగా 400 మ్యాచ్లు ఆడిన భారత జోడీగా రికార్డు సాధించారు. ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి మూడో వన్డే సందర్భంగా రో-కో ఈ ఫీట్ నమోదు చేశారు.అగ్రస్థానంలో ఎవరంటే?ఇక మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జోడీగా శ్రీలంక దిగ్గజాలు కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె కొనసాగుతున్నారు. వీరిద్దరు కలిసి శ్రీలంక తరఫున 550 మ్యాచ్లలో భాగమయ్యారు. ఆ తర్వాత మూడు స్థానాల్లోనూ లంక దిగ్గజాలే ఉండటం విశేషం. ఇక రోహిత్- కోహ్లి జోడీ ఈ జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.కాగా 2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ 67 టెస్టులు, 159 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికి 287 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. ఇక 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లి 123 టెస్టులు, 125 టీ20 మ్యాచ్లు ఆడాడు. ఇప్పటికి 313 వన్డేలు పూర్తి చేసుకున్నాడు.వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగాటీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్గా నిలిచిన తర్వాత రోహిత్- కోహ్లి సంయుక్తంగా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అదే విధంగా గతేడాది రోహిత్ టెస్టు ఫార్మాట్కు గుడ్బై చెప్పగా.. వారం రోజుల వ్యవధిలోనే కోహ్లి సైతం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇద్దరూ ప్రస్తుతం వన్డే వరల్డ్కప్-2027లో ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ చేతిలో 4-0తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైంది టీమిండియా. ఈ క్రమంలో వన్డే సిరీస్ను విజయంతో ఆరంభించిన భారత జట్టు.. రెండో వన్డేలో తడబడింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. లార్డ్స్ వేదికగా ఆదివారం నాటి నిర్ణయాత్మక మూడో వన్డేతో విజేత ఎవరో తేలుతుంది.ఇంగ్లండ్తో తొలి వన్డేలో రోహిత్ 11 పరుగులు చేయగా.. కోహ్లి 5 పరుగులకే అవుటయ్యాడు. ఇక రెండో వన్డేలో రోహిత్ 28 పరుగులు చేయగా.. కోహ్లి అర్ధ శతకం (65)తో అలరించాడు.అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన జోడీలు👉కుమార్ సంగక్కర- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 550 మ్యాచ్లు👉తిలకరత్నె దిల్షాన్- మహేళ జయవర్ధనె (శ్రీలంక): 426 మ్యాచ్లు👉కుమార్ సంగక్కర- తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక): 418 మ్యాచ్లు👉సనత్ జయసూర్య- ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక): 408 మ్యాచ్లు👉జాక్వెస్ కలిస్- మార్క్ బుచర్ (సౌతాఫ్రికా): 407 మ్యాచ్లు👉రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి (ఇండియా): 400* మ్యాచ్లు.చదవండి: టీమిండియాకు భారీ షాక్! -
రోహిత్ రిటైర్మెంట్ పై విరాట్ కోహ్లి షాకింగ్ రియాక్షన్
-
కోహ్లిని అధిగమించిన రూట్
ఇంగ్లండ్ వెటరన్ స్టార్ జో రూట్ ఓ రికార్డుకు సంబంధించి టీమిండియా దిగ్గజ బ్యాటర్, ఛేజింగ్ రారాజు విరాట్ కోహ్లిని అధిగమించాడు. నిన్న భారత్తో జరిగిన రెండో వన్డేలో అజేయంగా 99 పరుగులు చేసి తన జట్టుకు నాలుగు వికెట్ల విజయాన్ని అందించిన అతడు.. విజయవంతమైన వన్డే లక్ష్యఛేదనల్లో 2000కుపైగా పరుగులు చేసి, అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో కోహ్లిని వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. విజయవంతమైన వన్డే ఛేజింగ్లలో అత్యధిక సగటు కలిగిన ఆటగాళ్లు (కనీసం 2000 పరుగులు)ఎంఎస్ ధోని- 75 ఇన్నింగ్స్ల్లో 2876 పరుగులు- సగటు 102.71జో రూట్- 47 ఇన్నింగ్స్ల్లో 2473 పరుగులు- సగటు 91.59విరాట్ కోహ్లి- 105 ఇన్నింగ్స్ల్లో 6235 పరుగులు- సగటు 89.07మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కోహ్లి (65), శ్రేయస్ (66) రాణించడంతో 233 పరుగులు చేసింది. అనంతరం 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా, రూట్ నిలకడగా బ్యాటింగ్ చేస్తూ హ్యారీ బ్రూక్, సామ్ కరన్, జోస్ బట్లర్, విల్ జాక్స్లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు.99 నాటౌట్తో అరుదైన ఘనత45వ ఓవర్ తొలి బంతికే గస్ అట్కిన్సన్ విజయం సాధించే బౌండరీ కొట్టడంతో రూట్కు మరో బంతి ఆడే అవకాశం రాలేదు. దీంతో అతను 99 పరుగుల వద్ద అజేయంగా నిలిచిపోయాడు. వన్డే చరిత్రలో 99 నాటౌట్తో అజేయంగా నిలిచిన తొలి ఇంగ్లండ్ బ్యాటర్గా రూట్ ప్రత్యేక రికార్డు నెలకొల్పాడు. అలాగే భారత్పై 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన మూడో ఇంగ్లండ్ బ్యాటర్గా నిలిచాడు.సెంచరీ మిస్పై స్పందనసెంచరీ చేజారినప్పటికీ తనకు ఎలాంటి నిరాశ లేదని జో రూట్ తెలిపాడు. వ్యక్తిగత మైలురాయి కంటే జట్టు విజయం ముఖ్యమని, అందుకే గస్ అట్కిన్సన్ను స్వేచ్ఛగా షాట్లు ఆడమని తానే ప్రోత్సహించినట్లు వెల్లడించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను ఇంగ్లండ్ 1-1తో సమం చేయగా, నిర్ణయాత్మక మూడో వన్డే జూలై 19న లార్డ్స్లో జరగనుంది. -
‘రోహిత్ రిటైర్మెంట్ వార్తలపై కోహ్లి రియాక్షన్!’
టీమిండియా సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్పై ఊహాగానాలు వ్యక్తమవుతున్న వేళ మరో సీనియర్ విరాట్ కోహ్లి రియాక్షన్ ఆసక్తిగా మారింది. లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే రోహిత్కు ఆఖరిదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా జట్టు నుంచి రోహిత్ను తొలగిస్తున్నట్లు బీసీసీఐ ముందే హిట్మాన్కు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రోహిత్ నిజంగానే అంతర్జాతీయ క్రికెట్కు ఈడ్కోలు పలుకుతాడా? లేదా అన్నది ఇంగ్లండ్తో జరిగే మూడో వన్డే ద్వారా తేలిపోనుంది. ఇదిలా ఉంటే రోహిత్ శర్మ రిటైర్ అవ్వనున్నాడనే వార్తలు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ట్రోల్స్తో ఊగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లండ్తో రెండో వన్డే సందర్భంగా రోహిత్, కోహ్లి, బుమ్రాలు పక్కపక్కనే కూర్చొని మ్యాచ్ను సీరియస్గా వీక్షించిన వీడియో ఒకటి బయటికొచ్చింది. అయితే కోహ్లి, రోహిత్ పక్కపక్కనే కూర్చోవడం చాలా అరుదు. దీంతో వీడియోను లింక్ చేస్తూ ఒక అభిమాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'డ్రెసింగ్ రూమ్లో కోహ్లి, రోహిత్లు ఇలా పక్కపక్కన కూర్చోవడం ఎప్పుడూ చూడలేదు. రోహిత్ రిటైర్ అవ్వబోతున్నాడనే వార్త తెలిసినప్పటి నుంచి కోహ్లి దిగాలుగా కనిపిస్తున్నాడని, అతడి పక్కనే కూర్చొని ధైర్యం చెబుతున్నట్లుగా అనిపిస్తోందని, నిజమైన స్నేహం అంటే ఇదేనంటూ' కామెంట్ చేశాడు.ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్పై అటు హిట్మ్యాచ్ కానీ, ఇటు బీసీసీఐ ఇప్పటివరకు స్పందించలేదు. బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కొటక్ కూడా రోహిత్ ఫామ్పై స్పందించాడే తప్ప అతడి రిటైర్మెంట్పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కొంతమంది అభిమానులు వచ్చే వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్ ఆడుతాడని, తన ఫిట్నెస్ను మెరుగుపరుచుకునేందుకు రోహిత్ 10 కిలోల బరువు కూడా తగ్గాడని, మూడో వన్డేలో భారీ ఇన్నింగ్స్తో మెరుస్తాడని జోస్యం చెబుతున్నారు. ఇక శుక్రవారం జరిగిన రెండో వన్డేలో ఇంగ్లండ్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (66 బంతుల్లో 65; 8 ఫోర్లు), శ్రేయస్ అయ్యర్ (71 బంతుల్లో 66; 5 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లకు 235 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ జో రూట్ (133 బంతుల్లో 99 నాటౌట్; 9 ఫోర్లు) సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అజేయంగా నిలిచాడు. Never seen Kohli and Rohit sit together in the dressing room like this. Kohli's looking concerned seems like that Rohit retirement news is actually true and he knows. pic.twitter.com/7vcOZejDMq— Dhillon (@sehajdhillon_) July 16, 2026Read: అపశకునం ముద్ర.. ఫైనల్కు దూరంగా అర్జెంటీనా అధ్యక్షుడు! -
కోహ్లి, శ్రేయస్ రాణించినా.. స్వల్ప స్కోర్కే టీమిండియా ఆలౌట్
కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. ఓ దశలో (178-3) భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్.. విరాట్ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ క్రీజ్లో పాతుకుపోయినప్పటికీ.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.అంతకుముందు భారత ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ (26), శుభ్మన్ గిల్ (31) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచారు. గత మ్యాచ్లో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1) ఈ మ్యాచ్లో చేతెల్తేశారు. విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్, దూబేలను ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్ బ్రార్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో వికెట్గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్ కృష్ణ (0) ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు.ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
అరుదైన మైలురాయిని తాకిన రో-కో
టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కలిసికట్టుగా మరో ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఇద్దరు 8000 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత జోడీగా, ఓవరాల్గా తొమ్మిదో జోడీగా రికార్డుల్లోకెక్కారు.వీరికి ముందు భారత్ తరఫున గంగూలీ-టెండూల్కర్ (12400), ద్రవిడ్-టెండూల్కర్(11037) ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు శ్రీలంక స్టార్ ద్వయం మహేళ జయవర్దనే-కుమార సంగక్కర (13368) పేరిట ఉంది.కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో రో-కో జోడీ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గిల్ (31), రోహిత్ (26), ఇషాన్ కిషన్ (1) ఔట్ కాగా.. విరాట్ (65), శ్రేయస్ (33) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో రికార్డు సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన భారత బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.కార్డిఫ్ వేదికగా ఆతిథ్య జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో ఈ ఘనత సాధించాడు.4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ ద్రవిడ్ (2645) పేరిట ఉన్న రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 1996 నుంచి 2011 వరకు ద్రవిడ్ ఇంగ్లండ్లో 46 మ్యాచ్ల్లో 2645 పరుగులు చేయగా.. కోహ్లి 59 మ్యాచ్ల్లో ద్రవిడ్ రికార్డును అధిగమించాడు. ప్రస్తుతం ఈ జాబితాలో విరాట్ (2646*), ద్రవిడ్ తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్ (2626), రోహిత్ శర్మ (2308*), సౌరవ్ గంగూలీ (1949) ఉన్నారు.రిచర్డ్స్ రికార్డు ఇంకా చెక్కుచెదరలేదు..!ఓవరాల్గా ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన విదేశీ బ్యాటర్గా వెస్టిండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ కొనసాగుతున్నాడు. 1975 నుంచి 1991 మధ్య అతడు 3402 పరుగులు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 23 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. గిల్ (31), రోహిత్ (26), ఇషాన్ కిషన్ (1) ఔట్ కాగా.. విరాట్ (45), శ్రేయస్ (6) క్రీజ్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కర్రన్, అట్కిన్సన్, జాక్స్ తలో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్ల ఈ సిరీస్లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్పై వివాదం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్పై వివాదం చెలరేగింది. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా మీడియా ప్రతినిధితో దురుసుగా ప్రవర్తించి, అసభ్య పదజాలం ఉపయోగించాడని ఆరోపణలు రావడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ జర్నలిస్టులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.సోషల్మీడియా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఓ జర్నలిస్టు భారత జట్టు బస్సు బయలుదేరే దృశ్యాలను (కోహ్లి బస్సులోకి ఎక్కుతుండగా) అధికారిక మీడియా పాయింట్లో నిలబడి చిత్రీకరిస్తున్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ వ్యక్తిగత బాడీగార్డ్ అక్కడికి వచ్చి సదరు జర్నలిస్టును అక్కడి నుంచి వెళ్లిపోవాలని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి.జర్నలిస్టు తన వద్ద అధికారిక అక్రిడిటేషన్ కార్డు ఉందని చెప్పినా, బాడీగార్డ్ పట్టించుకోకుండా అవమానకరంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలువురు మీడియా ప్రతినిధులు సోషల్ మీడియాలో వెల్లడించడంతో వివాదం ముదిరింది.బీసీసీఐ నిబంధనలపై ప్రశ్నలుఈ ఘటనతో మరో అంశం కూడా చర్చనీయాంశమైంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాళ్లు విదేశీ పర్యటనల్లో వ్యక్తిగత బాడీగార్డులు, వ్యక్తిగత సిబ్బందిని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.బీసీసీఐ అమల్లో ఉన్న క్రమశిక్షణ మార్గదర్శకాల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల భద్రతను బోర్డు, స్థానిక నిర్వాహకులు ఏర్పాటు చేసిన అధికారిక భద్రతా సిబ్బందే చూసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత భద్రతా సిబ్బందికి సాధారణంగా అనుమతి ఉండదు.బీసీసీఐ స్పందన కోసం ఎదురుచూపుఈ ఘటనపై ఇప్పటివరకు బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే విరాట్ కోహ్లీ కూడా స్పందించలేదు. అయితే ఆరోపణలు నిజమని తేలితే, బీసీసీఐ అంతర్గతంగా విచారణ జరిపే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్లో ఉన్నాడు. ఈ సిరీస్లోని తొలి మ్యాచ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగగా.. ఆ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో విరాట్ మాత్రం విఫలమయ్యాడు. రెండో వన్డే జులై 16న కార్డిఫ్ వేదికగా జరుగనుంది. -
రెండో వన్డేలో రోహిత్, కోహ్లికి విశ్రాంతి..?
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్లో రెండో వన్డే కార్డిప్ వేదికగా 16వ తేదీ జరుగనుంది.ఈ మ్యాచ్కు ముందు భారత జట్టు రోటేషన్ విధానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని జట్టులో పలు కాంబినేషన్లను పరీక్షిస్తున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ వెల్లడించాడు.తొలి వన్డే అనంతరం మాట్లాడిన అతడు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సరైన సమతుల్యత కలిగిన జట్టును ఎంపిక చేసేందుకు విభిన్న కాంబినేషన్లను పరిశీలిస్తున్నామని తెలిపాడు.ప్రపంచకప్ దక్షిణాఫ్రికాలో జరుగనుండగా, అక్కడి పరిస్థితులకు ఇంగ్లండ్ పిచ్లు కొంతవరకు సమానంగా ఉంటాయని.. అందుకే ఈ సిరీస్ను ప్రయోగాలకు ఉపయోగించుకుంటున్నామని వివరించాడు.ఈ వ్యాఖ్యలతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు విశ్రాంతి ఇవ్వొచ్చనే ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. దీనిపై అధికారిక ప్రకటన అయితే లేదు.ఒకవేళ వీరిలో ఎవరికైనా విశ్రాంతినిస్తే, వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్కు తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది. అవసరానికి అనుగుణంగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేసి జట్టు సమతుల్యతను కొనసాగించే అవకాశం ఉంది. కాగా, తొలి వన్డేలో రోహిత్ శర్మ 11, విరాట్ కోహ్లి 5 పరుగులకు ఔటై నిరాశపరిచారు. -
గుర్నూర్ దెబ్బకు కిందపడ్డ గిల్.. కోహ్లి రియాక్షన్ వైరల్
ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత పేసర్ గుర్నూర్ బ్రార్ అదరగొట్టాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం నాటి తొలి వన్డేకు బర్మింగ్హామ్ వేదిక. ఎడ్జ్బాస్టన్ మైదానంలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఈ క్రమంలో 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఇంగ్లండ్ 61 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్లో బంతితో రంగంలోకి దిగిన బ్రార్ రెండో బాల్కు జేకబ్ బెతెల్ (14), నాలుగో బంతికి బెన్ డకెట్ (43)ను అవుట్ చేశాడు. తద్వారా ఒకే ఓవర్లో ఓపెనర్లు ఇద్దరినీ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు.ఘోరంగా ఢీకొట్టుకున్నారుఇదిలా ఉంటే.. పదహారో ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో జోస్ బట్లర్ బంతిని గాల్లోకి లేపాడు. ఈ క్యాచ్ను అందుకునేందుకు బ్రార్, కెప్టెన్ శుబ్మన్ గిల్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఘోరంగా ఢీకొట్టుకున్నారు. అయితే, బ్రార్ సురక్షితంగా క్యాచ్ పట్టడంతో బట్లర్ (5) వెనుదిరిగాడు.ఇక కిందపడ్డ గిల్ను చేయిచ్చి పైకి లేపిన బ్రార్.. అతడిని ఆలింగనం చేసుకున్నాడు. ఇంతలో ప్రసిద్ కృష్ణతో కలిసి వికెట్ను సెలబ్రేట్ చేసుకున్న టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి.. బ్రార్ వైపుగా వచ్చి డాన్స్ చేస్తూ అతడిని టీజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Gurnoor Brar completes the catch to send Jos Buttler back 🚶➡️ Watch the 1st ODI of #ENGvIND, LIVE NOW on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/W2lmSrbZE4— Sony Sports Network (@SonySportsNetwk) July 14, 2026258 పరుగులకు ఆలౌట్కాగా ఇంగ్లండ్తో తొలి వన్డేలో భారత బౌలర్లు మెరుగ్గా రాణించారు. ప్రత్యర్థిని 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ చేశారు. అక్షర్ పటేల్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలా రెండు.. జస్ప్రీత్ బుమ్రా, శివం దూబే తలా ఒక వికెట్ తీశారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ టాప్ రన్ స్కోరర్ (76 నాటౌట్)గా నిలవగా.. లియామ్ డాసన్ (68) కూడా అర్ధ శతకం చేశాడు. మిగిలిన వారిలో బెన్ డకెట్ (43), విల్ జాక్స్ (20) రాణించారు. చదవండి: వాళ్లిద్దరికి అస్సలు పడటం లేదు.. డీకే సంచలన వ్యాఖ్యలు -
IND vs ENG: ఇంగ్లండ్ను చిత్తు చేసిన భారత్
భారత్ ఘన విజయంఎడ్జ్బాస్టన్ వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని భారత్ 45.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్(85) టాప్ స్కోరర్గా నిలిచాడు. నిలకడగా ఆడిన గిల్ గాయం కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. గిల్తో పాటు అక్షర్ పటేల్(55 నాటౌట్), వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(35) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.విజయం దిశగా భారత్ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. 66 బంతుల్లో 43 పరుగులు కావాలి. క్రీజులో అక్షర్ పటేల్(35), వాషింగ్టన్ సుందర్(29) ఉన్నారు.గిల్ రిటైర్డ్ హర్ట్80 పరుగుల వద్ద గిల్ రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు. అతడి స్థానంలో వాషింగ్టన్ సుందర్ క్రీజ్లోకి వచ్చాడు. 34 పరుగులతో శ్రేయస్ అప్పటిక క్రీజ్లో ఉన్నాడు. 26.1 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 151-2గా ఉంది. ఈ మ్యాచ్లో గెలవాలంటే భారత్ మరో 108 పరుగులు చేయాలి. నిలకడగా ఆడుతున్న గిల్, శ్రేయస్గిల్ (74), శ్రేయస్ అయ్యర్ (32) నిలకడగా ఆడుతున్నారు. 24 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 141-2గా ఉంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే మరో 118 పరుగులు చేయాలి. రోహిత్, కోహ్లి ఔట్ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లి (5) ఘోరంగా విఫలమయ్యారు. సామ్ కర్రన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కాగా.. ఆర్చర్ బౌలింగ్లో విరాట్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8.3 ఓవర్ల తర్వాత భారత స్కోర్ 48-2గా ఉంది. రోహిత్ ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన భారత్7.3వ ఓవర్- 259 పరుగుల ఛేదనలో టీమిండియా 43 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 21 బంతుల్లో ఫోర్ సాయంతో 11 పరుగులు చేసిన రోహిత్ సామ్ కర్రన్ బౌలింగ్లో హ్యారీ బ్రూక్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. గిల్కు (26) జతగా విరాట్ కోహ్లి క్రీజ్లోకి వచ్చాడు. బర్మింగ్హామ్ వేదికగా టీమిండియాతో తొలి వన్డేలో ఇంగ్లండ్ టాస్ గెలిచి.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఎడ్జ్బాస్టన్లో 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ బెన్ డకెట్ (43) రాణించగా.. జో రూట్ (76 నాటౌట్), లియామ్ డాసన్ (68) అర్ధ శతకాలతో అదరగొట్టారు. మిగిలిన వారిలో విల్ జాక్స్ (20) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.భారత బౌలర్లలో అక్షర్ పటేల్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ తలా రెండు.. బుమ్రా, శివం దూబే చెరో వికెట్ దక్కించుకున్నారు. 259 పరుగుల లక్ష్యంతో టీమిండియా బ్యాటింగ్కు దిగింది. అప్డేట్స్..ఇంగ్లండ్ ఆలౌట్47.5: అక్షర్ బౌలింగ్లో జోష్ టంగ్ బౌల్డ్ (0)తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్47.3:అక్షర్ బౌలింగ్లో ఆదిల్ రషీద్ స్టంపౌట్ (1)ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్45.6: అక్షర్ పటేల్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్గా వెనుదిరిగిన జోఫ్రా ఆర్చర్ (12). స్కోరు 250-8 (46). క్రీజులోకి ఆదిల్ రషీద్ రాగా.. రూట్ 69 పరుగులతో ఉన్నాడు.ఏడో వికెట్ డౌన్43.6: అక్షర్ పటేల్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చిన డాసన్. 68 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్. క్రీజులోకి జోఫ్రా ఆర్చర్. రూట్ 59 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 228-7 (44).డాసన్, రూట్ హాఫ్ సెంచరీలు42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు: 214-6రూట్ 51, డాసన్ 63 పరుగులతో ఉన్నారు.కుదురుగా ఆడుతున్న రూట్, డాసన్జో రూట్ (30), లియామ్ డాసన్ (34) కుదురుగా ఆడుతున్నారు. 32 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 160-6గా ఉంది. 27 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-627 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 128-6గా ఉంది. రూట్ 21, లియామ్ డాసన్ 11 పరుగులతో క్రీజ్లో ఉన్నారు.ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్21.4వ ఓవర్- 107 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే బౌలింగ్లో రాహుల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో విల్ జాక్స్ (20) ఔటయ్యాడు. 100 దాటిన ఇంగ్లండ్ స్కోర్21 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్ 104-5గా ఉంది. జో రూట్ (9), విల్ జాక్స్ (19) క్రీజ్లో ఉన్నారు. ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.4: ప్రసిద్ బౌలింగ్లో సామ్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు.నాలుగో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్16.1: ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో బ్రార్కు క్యాచ్ ఇచ్చి బట్లర్ అవుట్ (5). కేవలం 19 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్. సామ్ కర్రాన్ క్రీజులోకి రాగా.. రూట్ 6 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 80-4.మూడో వికెట్ డౌన్13.1: బుమ్రా బౌలింగ్లో మూడో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (1). క్రీజులోకి జోస్ బట్లర్. రూట్ సున్నా పరుగులతో ఉన్నాడు. స్కోరు: 64-3.రెండో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.4: గుర్నూర్ బ్రార్ బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చిన డకెట్. హాఫ్ సెంచరీకి ఏడు పరుగులదూరంలో నిలిచిన డకెట్ (43).తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్12.2: గుర్నూర్ బ్రార్ బౌలింగ్ వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్గా వెనుదిరిగిన జేకబ్ బెతెల్ (14).పవర్ ప్లేలో ఇంగ్లండ్ స్కోరు: 51-0 (10)ఓపెనర్లు బెన్ డకెట్ 41, జేకబ్ బెతెల్ ఆరు పరుగులతో క్రీజులో ఉన్నారు.రో-కో రాకఇక ఈ సిరీస్ సందర్భంగా భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు. ఏడు మ్యాచ్లలో ఇంగ్లండ్దే గెలుపు! 👉ఈ ఇద్దరు చివరగా సొంతగడ్డపై న్యూజిలాండ్తో జనవరిలో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నారు. ఇక ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఏడు వన్డేల్లోనూ ఇంగ్లండ్ గెలుపొందడం విశేషం. అయితే, చివరగా 2014లో టీమిండియా చేతిలో ఇంగ్లండ్ ఓడింది. బట్లర్ @ 200👉మరోవైపు.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ కెరీర్లో ఇది 200వ వన్డే. తద్వారా ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ మోర్గాన్ (225 వన్డేలు) తర్వాతి స్థానాన్ని బట్లర్ ఆక్రమించాడు. ఇదిలా ఉంటే.. ముందుగా టీ20 సిరీస్ జరగగా ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను 4-0తో వైట్వాష్ చేసింది. తుదిజట్లుఇంగ్లండ్జాకబ్ బెథెల్, బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), జోస్ బట్లర్(వికెట్ కీపర్), సామ్ కర్రన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, జోష్ టంగ్, ఆదిల్ రషీద్ఇండియారోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ. -
వరల్డ్కప్ ప్రణాళికలు వేరు.. కోహ్లితో ఏం మాట్లాడానంటే?: గిల్
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో క్లీన్స్వీప్నకు గురైన టీమిండియా వన్డే సిరీస్కు సన్నద్ధమైంది. ఇరుజట్ల మధ్య బర్మింగ్హామ్ వేదికగా తొలి వన్డేకు రంగం సిద్ధమైంది. ఈ సిరీస్తో భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెడుతున్నారు.ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదుఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. శిక్షణ సందర్భంగా కోహ్లితో జరిగిన సంభాషణ గురించి వివరించాడు. ‘‘అత్యుత్తమ కాంబినేషన్తో ముందుకు వెళ్లడమే మా ప్రధాన ప్రణాళిక. దీని గురించే మేము మాట్లాడుకున్నాము.కొంతమంది ప్రస్తుతం జట్టులో లేకపోవచ్చు. వీరిలో పేస్ బౌలర్లు, ఆల్రౌండర్లు, స్పిన్నర్లు.. ఇలా ఎవరైనా సరే ఆయా విభాగం నుంచి భవిష్యత్తులో సేవలు అందించేందుకు జట్టులోకి రావొచ్చు. ఇక విరాట్ భాయ్, రోహిత్ భాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.గత దశాబ్ద కాలంగా వారిద్దరు టీమిండియా బ్యాటింగ్ లైనప్ వెన్నెముకగా ఉన్నారు. వారు జట్టులో అంతర్భాగం. వారి అనుభవం, నైపుణ్యం మా జట్టు విలువను పెంచుతాయి. అయితే, వన్డే ప్రపంచకప్ ప్రణాళికలు కాస్త భిన్నంగా ఉంటాయి.ఇక్కడి వికెట్ల మాదిరే వీలైనన్ని వైవిధ్యమైన కాంబినేషన్లు ప్రయత్నించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వరల్డ్కప్ వేదికైన సౌతాఫ్రికాలోని పిచ్లు.. ఇక్కడి (ఇంగ్లండ్) వికెట్ల మాదిరే ఉంటాయి. కాబట్టి మా బలాన్ని పరీక్షించుకునే క్రమంలో ఇది అత్యంత కీలకమైన సిరీస్గా మారింది. కొత్త వాళ్లకు అవకాశం నిజానికి మా తుదిజట్టులో ఎప్పుడూ పెద్దగా మార్పులు జరగలేదు. అయితే, కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చే క్రమంలో స్వల్ప మార్పులు చోటుచేసుకోవచ్చు. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా.. ఒత్తిడిలో వారు ఏమేరకు రాణించగలరో తెలుసుకోవచ్చు. తద్వారా ప్రపంచకప్ టోర్నీకి ముందే జట్టు కూర్పు గురించి మాకు ఒక అవగాహన వస్తుంది’’ అని శుబ్మన్ గిల్ తెలిపాడు.ఇక టీ20 సిరీస్లో ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్వాష్ కావడం తమపై ఎలాంటి ప్రభావం చూపబోదని గిల్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. ‘‘ఈ రెండూ వేర్వేరు ఫార్మాట్లు. వేర్వేరు జట్లు. వేర్వేరు లక్ష్యాలు. కాబట్టి ఈ సిరీస్పై గత టీ20 సిరీస్ ప్రభావం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని గిల్ అన్నాడు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
తొలి వన్డే.. కోహ్లిని ఆకాశానికి ఎత్తిన ఇంగ్లండ్ కోచ్
ఇంగ్లండ్, టీమిండియా మధ్య ఎడ్జ్బాస్టన్ వేదికగా మరికొన్ని గంటల్లో తొలి వన్డే మొదలుకానుంది. జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ తర్వాత వన్డేలు ఆడని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు జట్టులోకి తిరిగొచ్చారు. రో-కో ద్వయం తిరిగి రావడంతో పాటు గిల్, కేఎల్ రాహుల్ కూడా జాయిన్ కావడంతో టీమిండియా సరికొత్తగా కనిపిస్తుంది. అయితే ఇంగ్లండ్తో తొలి వన్డే నేపథ్యంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల క్రికెట్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ కోహ్లిని ఆకాశానికి ఎత్తాడు. 'క్రీడా ప్రపంచంలో కోహ్లి ఒక నిజమైన చాంపియన్. తన దూకుడైన ఆటతో క్రీడకు సరికొత్త నిర్వచనం చెప్పి ట్రెండ్సెట్టర్గా నిలిచాడు. కోహ్లి కేవలం క్రికెట్ ప్రపంచంలోనో లేక భారతదేశంలోనో మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడల రంగాలకు కూడా సుపరిచితుడిగా మారిపోయాడు. ప్రజలు క్రికెట్ను ప్రేమించేలా చేయడంలో కోహ్లి స్ఫూర్తినిచ్చాడు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లి వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అతడు నిజమైన ఛాంపియన్.' అని పొగడ్తల వర్షం కురిపించాడు.ఇటీవలే ఇంగ్లండ్ వరుస టెస్టు సిరీస్ పరాజయాలు చవిచూడడంతో టెస్టు కోచ్ పదవికి బ్రెండన్ మెక్కల్లమ్ గుడ్బై చెప్పాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20 ఫార్మాట్)లో మాత్రం హెడ్కోచ్గా కొనసాగనున్నట్లు స్పష్టం చేశాడు. తాజాగా టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై స్పందించిన మెక్కల్లమ్ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ తెలిపాడు. టెస్టు కోచ్ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయం బాధించినప్పటికీ పరిస్థితుల ప్రభావంతోనే అలా చేయాల్సి వచ్చిందన్నాడు. అయితే తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని మెక్కల్లమ్ పేర్కొన్నాడు. తన నిర్ణయం పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపాడు. టెస్టు కోచ్గా తన పాత్రను సమర్థంగా పోషించలేకపోయానని, అందుకే తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించాడు. మెక్కల్లమ్ టెస్టు కోచ్గా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో బెన్స్టోక్ కెప్టెన్సీలో 'బజ్బాల్' ఆటతో ఇంగ్లండ్ 11 టెస్టుల్లో 10 విజయాలు సాధించి కొత్త శకానికి నాంది పలికింది. కానీ రానురాను బజ్బాల్ ఆట ఇంగ్లండ్ కొంపముంచింది. ఈ మధ్య కాలంలో ఇంగ్లండ్ ఆడిన 9 టెస్టుల్లో ఏడింటిలో పరాజయం చవిచూసి డబ్ల్యూటీసీ టైటిల్ రేసులో చాలా వెనుకబడిపోయింది. ఆ తర్వాత స్టోక్స్ ఉదంతం అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించేలా చేసింది. ఆ వెంటనే మెక్కల్లమ్ టెస్టు కోచ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. Brendon McCullum has apologised to England fans for the poor string of Test results that led to his dismissal 💬 pic.twitter.com/zxNyHAvC7y— Sky Sports Cricket (@SkyCricket) July 13, 2026Read: ఫిఫా చరిత్రలో తొలిసారి.. సెంటిమెంట్తో బరిలోకి అర్జెంటీనా! -
కోహ్లి, రోహిత్ వచ్చేశారు...
బర్మింగ్హామ్: ‘టి20 సిరీస్ ప్రభావం మాపై ఉండదు. ఫార్మాట్ వేరు, జట్టు వేరు, లక్ష్యం వేరు. పూర్తిగా భిన్నమైన, కొత్త తరహా వాతావరణం ఇక్కడ కనిపించనుంది’... ఇంగ్లండ్తో భారత్ వన్డే సిరీస్ ఆరంభానికి ముందు కెప్టెన్ శుబ్మన్ గిల్ చేసిన వ్యాఖ్య ఇది. ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో కలిపి ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఆరు పరాజయాలు మూటగట్టుకున్న టీమిండియా ఇప్పుడు వన్డే ఫార్మాట్లో పోరుకు సిద్ధమైంది. ఇక్కడైనా తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటి సిరీస్లో పైచేయి సాధించాలని భారత్ పట్టుదలగా ఉంది. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం జరుగుతున్న సన్నాహాలను దృష్టిలో ఉంచుకొని చూస్తే టి20లకంటే ఈ ఫార్మాట్లో టీమిండియా ప్రదర్శన కీలకం కానుంది. భారత జట్టు తాము ఆడిన గత 6 వన్డే సిరీస్లలో 3 సిరీస్లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్తో జరిగిన గత 5 వన్డేల్లోనూ భారత్ గెలవడం విశేషం. బుమ్రా 2 ఏళ్ల 8 నెలల తర్వాత... మాజీ కెప్టెన్లు, స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ రాకతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. వీరికి తోడు నిలకడగా రాణించే కెప్టెన్ గిల్ ఆట జట్టుకు అదనపు బలం. ఎలాగైనా వరల్డ్ కప్ ఆడాలనే లక్ష్యంతో ఉన్న కోహ్లి, రోహిత్ ఈ క్రమంలో తమకు లభించే ప్రతీ అవకాశాన్ని సమర్థంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారిద్దరి నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఆశించవచ్చు. ఈ టాప్–3 తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిలార్డర్ బాధ్యతలు తీసుకుంటారు. వన్డేల్లో రెగ్యులర్ బ్యాటర్గా రాహుల్ ఇప్పటికే పలు మార్లు తన విలువను చూపించాడు. ఇప్పుడు శ్రేయస్పై మాత్రం అదనపు భారం ఉంది. పేస్ బౌలింగ్లో అన్నింటికంటే పెద్ద బలం జస్ప్రీత్ బుమ్రా పునరాగమనంగా చెప్పవచ్చు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత బుమ్రా వన్డేలే ఆడలేదు! మరో ఇద్దరు యువ పేసర్లు గుర్నూర్, ప్రిన్స్లకు చోటు కల్పిస్తారా... ఒకరిని పక్కన పెట్టిన అర్ష్ దీప్ను ఆడిస్తారా చూడాలి.ఆల్రౌండర్లే బలం... టి20 సిరీస్లో అద్భుత ప్రదర్శనతో చెలరేగిన ఇంగ్లండ్ అదే ఊపులో వన్డే సిరీస్పై కన్నేసింది. టి20 టీమ్లో ఉన్న కెప్టెన్ బ్రూక్, ఆర్చర్, బెతెల్, బట్లర్, కరన్, టంగ్, రషీద్, జాక్స్లు వన్డేల్లో కూడా జట్టును గెలిపించగల సమర్థులు. వీరందరితో పాటు సీనియర్ బ్యాటర్ జో రూట్ వన్డే జట్టులో ఉండటం ఇంగ్లండ్కు పెద్ద సానుకూలాశం. అయితే జనవరిలో శ్రీలంకతో తలపడిన తర్వాత టీమ్ ఒక్క వన్డే కూడా ఆడలేదు. దాంతో ఈ ఫార్మాట్లో సన్నద్ధత విషయంలో కొంత తడబాటు కనిపించింది. అయితే సొంతగడ్డపై సిరీస్ కాబట్టి ఇంగ్లండ్ ఈ సవాల్ను అధిగమించగలదు. 2024 నుంచి ఆడిన 7 వన్డే సిరీస్లలో 5 ఓడిపోయిన ఇంగ్లండ్... చాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. -
తిరిగొచ్చిన రో-కో ద్వయం.. తొలి వన్డేకు భారత జట్టు ఇదే!
ఇంగ్లండ్ గడ్డపై టీ20 సిరీస్లో దారుణ పరాజయం తర్వాత శుబ్మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా వన్డే సిరీస్ ఆడేందుకు సమాయత్తమవుతోంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా మంగళవారం (జూలై 14న) ఇరుజట్లు తొలి వన్డే మ్యాచ్ ఆడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెస్టులు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వన్డే జట్టుతో కలిశారు. ఇక తొలి వన్డేకు తుది జట్టు అంచనా ఒకసారి పరిశీలించి చూద్దాం.వీరితో పాటు సీనియర్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా జాయిన్ కావడంతో టీమిండియా బలం పెరిగింది. 20 ఓవర్ల ఫార్మాట్ నుంచి 50 ఓవర్ల ఫార్మాట్కు ఆట మారడానికి తోడు, సీనియర్లు అంతా జట్టులోకి రావడంతో టీమిండియా ఇప్పుడు పేపర్పై దుర్భేద్యంగా కనిపిస్తోంది. 39 ఏళ్ల రోహిత్, 38 ఏళ్ల కోహ్లికి 2027 వన్డే ప్రపంచకప్ ఆఖరిది కానుండడంతో వీరిద్దరు రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు. టీ20 సిరీస్లో జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్లు తమ బౌలింగ్తో టీమిండియా బ్యాటర్లను బెంబెలెత్తించారు. కానీ వన్డే ఫార్మాట్లో కోహ్లి, రోహిత్ వంటి అనుభవజ్ఞులు రావడంతో ఈ ఇద్దరు బౌలర్ల ఆటలు సాగకపోవచ్చని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్తో పాటు కేఎల్ రాహుల్ కీలకంగా మారనున్నారు.ఆల్రౌండ్ విభాగంలో అక్షర్పటేల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్లు ఉన్నప్పటికీ వీరిలో ఇద్దరికి మాత్రమే అవకాశం రానుంది. ఇక బౌలింగ్ విభాగాన్ని జస్ప్రీత్ బుమ్రా నడిపించనుండగా.. టీ20 సిరీస్లో విఫలమైనప్పటికీ అర్ష్దీప్కు మరో చాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరో స్పిన్నర్ అవసరమనుకుంటే కుల్దీప్ యాదవ్ తుదిజట్టులో చోటు దక్కించుకుంటాడు. లేదంటే ప్రసిధ్ క్రిష్ణ, గుర్నూర్ బ్రార్లలో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. మొత్తానికి టీ20 సిరీస్లో ఓటమి పాలైనప్పటికీ వన్డే సిరీస్కు మాత్రం సీనియర్ల రాకతో టీమిండియా కొత్తగా కనిపిస్తోంది. మ్యాచ్ సమయం: భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.తుదిజట్టు అంచనా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణ/ గుర్నూర్ బ్రార్ -
చరిత్ర సృష్టించిన జోస్ బట్లర్.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
టీమిండియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను 4-0 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. సౌతాంప్టాన్ వేదికగా జరిగిన ఐదో టీ20లోనూ ఆతిథ్య ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్ను 56 పరుగుల తేడాతో బ్రూక్ సేన చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.గత కొన్నాళ్లగా పేలవ ఫామ్తో సతమవుతున్న బట్లర్.. ఈ మ్యాచ్లో మాత్రం భారత బౌలర్లను ఉతిరాకేశాడు. రోజ్బౌల్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. బట్లర్ కేవలం 64 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్స్లతో 131 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.బట్లర్ సాధించిన రికార్డులు ఇవే👉అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించి మూడో స్ధానానికి బట్లర్ చేరుకున్నాడు.👉108 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద బట్లర్ ఈ ఫీట్ సాధించాడు. విరాట్ తన టీ20 కెరీర్లో 4,188 పరుగులు చేయగా.. బట్లర్ ఇప్పటివరకు 4,212 రన్స్ చేశాడు. ఈ జాబితాలో అగ్రస్ధానంలో బాబర్ ఆజం(4,596) ఉండగా, రెండో స్ధానంలో రోహిత్ శర్మ(4,231) కొనసాగుతున్నాడు.👉అంతర్జాతీయ టీ20ల్లో భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్గా బట్లర్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ ఎవిన్ లూయిస్(125 నాటౌట్) పేరిట ఉండేది.👉తాజా మ్యాచ్తో లూయిస్ ఆల్టైమ్ రికార్డును జోస్ ది బాస్(131) బ్రేక్ చేశాడు. టీ20ల్లో బట్లర్కే ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా ఇంగ్లండ్ తరపున అత్యధిక స్కోర్ సాధించిన రెండో బ్యాటర్గా బట్లర్ నిలిచాడు. తొలి స్దానంలో ఫిల్ సాల్ట్(141) ఉన్నాడు. -
కోహ్లి రహస్య సంభాషణ బట్టబయలు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ ఆరంభించిన కోహ్లి తొలి వన్డేలో రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. తాజాగా కోహ్లికి సంబంధించి ఒక సీక్రెట్ సంభాషణను ఇంగ్లండ్ క్రికెటర్ జోర్డాన్ కాక్స్ లీక్ చేయడం వైరల్గా మారింది. కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్ కోహ్లితో జరిపిన పర్సనల్ సంభాషణకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటికి వచ్చాయి. దీనిపై జోర్డాన్ కాక్స్ స్పందించాడు. 'గత నెలలో కోహ్లిని లండన్లో కలిశాను. అయితే కోహ్లితో సమావేశాన్ని గోప్యంగా ఉంచాలని భావించాను. కానీ మేమిద్దరం మాట్లాడుకుంటున్న ఫొటోలు ఎవరో రహస్యంగా చిత్రీకరించారు. తాజాగా ఆ ఫొటోలు బయటికి లీకయ్యాయి. మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో కొందరు మా పక్క నుంచి మాట్లాడుకుంటూ వెళ్లారు. నాకు తెలిసి వాళ్లలోనే ఎవరో ఒకరు మా ఫొటోలు తీసి సోషల్ మీడియలో షేర్ చేశారనిపించింది. నిజానికి కోహ్లి లండన్లో ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకున్నాడంట. కానీ ఇక్కడ కూడా తనకు పాపులారిటీ రావడంతో ఇకపై లండన్లో స్వేచ్ఛగా తిరిగే హక్కు కోల్పోతానేమో అని కోహ్లి నాతో చెప్పాడు. ఇక ఐపీఎల్ సమయంలో కోహ్లి నాకు అండగా నిలబడ్డాడు. కొంతమంది ఆటగాళ్లు తమ ఆటపై మాత్రమే దృష్టి పెడుతుంటారు. కానీ కోహ్లి మాత్రం తనతో పాటు ఉండే సహచరులకు సంబంధించి అన్ని విషయాలపై దృష్టి పెట్టడమే గాక అవసరమైతే సలహాలు కూడా ఇస్తుంటాడు. ఇదే అతడిని ప్రత్యేకంగా నిలిపింది' అని జోర్డాన్ కాక్స్ చెప్పుకొచ్చాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు, ఆ తర్వాత టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లి ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లి అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం కూడా ఉంది. కోహ్లితో పాటు రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చే చాన్స్ ఉంది. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లండ్ 3-0తో సిరీస్ గెలుచుకుంది. సిరీస్లో చివరి మ్యాచ్ నేడు సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచి వైట్వాష్ గండం నుంచి తప్పించుకోవాలని టీమిండియా భావిస్తోంది.ఇక జూలై 14 నుంచి 19 మధ్య ఇంగ్లండ్, భారత్ మధ్య మూడు వన్డే మ్యాచ్లు జరగనున్నాయి. వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకు 311 వన్డేల్లో 14,797 పరుగులు సాధించాడు. ఇందులో 54 సెంచరీలు, 77 అర్ధసెంచరీలు ఉన్నాయి.చదవండి: ఇంగ్లండ్తో సిరీస్ ఓటమి.. తొలి దెబ్బ అతడికేనా? -
సచిన్, కోహ్లి సరసన గిల్.. టీమిండియా కెప్టెన్గా రికార్డు
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ అరుదైన ఫీట్ సాధించాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టోర్నీని రాయల్ బాక్స్ నుంచి వీక్షించిన నాలుగో భారత కెప్టెన్గా గిల్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు కెప్టెన్ హోదాలో రాయల్ బాక్స్ నుంచి వింబుల్డన్ టోర్నీ మ్యాచ్లను వీక్షించారు. తాజాగా గిల్ వీరి సరసన చేరాడు. శుక్రవారం లండన్లోని ఆల్ ఇంగ్లండ్ టెన్నిస్ క్లబ్లో జకోవిచ్, సినర్ మ్యాచ్ను గిల్ ప్రత్యక్షంగా వీక్షించాడు. మరో విశేషమేమిటంటే గిల్ పక్కనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో పాటు అతడి భార్య అంజలి కూడా ఉన్నారు. ఈ ముగ్గురు కలిసి వింబుల్డన్ మ్యాచ్ వీక్షిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక వీరితో పాటు విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, నెదర్లాండ్స్ స్టార్ ఫుట్బాల్ ఆటగాడు వర్గిల్ వాన్ డిక్, బ్రిటన్ యాక్టర్ బెనెడిక్ట్ కంబర్బాచ్, హ్యూగ్ లారి, డామియన్ లూయిస్లు కూడా రాయల్ బాక్స్ నుంచి మ్యాచ్ను వీక్షించారు. ఇక గిల్ ఇటీవలే సిల్వర్స్టోన్ సర్క్యూట్ వేదికగా జరిగిన బ్రిటీష్ గ్రాండ్ప్రిక్స్ టోర్నీకి కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.ఇక ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్ పర్యటనలో టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 0-3తో ఇంగ్లండ్కు సిరీస్ కోల్పోయిన టీమిండియా ఇవాళ చివరి మ్యాచ్ను సౌతాంప్టన్ వేదికగా ఆడుతోంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ మొదలుకానుంది. వన్డే సిరీస్కు గిల్తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి జాయిన్ కానుండడంతో జట్టు పరిపూర్ణం కానుంది. 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహకంగా ఈ వన్డే సిరీస్ను ఉపయోగించుకుంటామని, దక్షిణాఫ్రికా పరిస్థితులకు ఇక్కడి వాతావరణం సరితూగుతుందని గిల్ వెల్లడించాడు. Shubman Gill with Sachin Tendulkar and Anjali Tendulkar at Wimbledon ❤️ pic.twitter.com/mLkqV9Tjfg— Shubman Gill Fc (@ShubmanGill7fc) July 10, 2026Read: ఒళ్లు మండిన గాఫ్.. బదులు తీర్చుకుంటానని హెచ్చరిక! -
శ్రేయస్కు అండగా నిలబడ్డ సోదరి
భారత టీ20 జట్టు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్కు వరుస పరాజయాలు ఎదురవుతుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అతడి సోదరి శ్రేష్ఠ అయ్యర్ తన సోదరుడికి అండగా నిలుస్తూ, భారత దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్లను ఉదాహరణగా చూపించి విమర్శలకు సమాధానం ఇచ్చింది.సూర్యకుమార్ యాదవ్ స్థానంలో యూరప్ పర్యటనకు శ్రేయస్ అయ్యర్ను టీ20 కెప్టెన్గా ఎంపిక చేసిన భారత జట్టు యాజమాన్యం అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్కు విజయవంతంగా నడిపించిన శ్రేయస్, ఐర్లాండ్తో జరిగిన సిరీస్లో 0-2తో ఓడిపోగా, ఇంగ్లండ్తో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైంది. అనంతరం జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత్ పరాజయం పాలవడంతో కెప్టెన్గా ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయాడు.ఈ నేపథ్యంలో ఓ పోడ్కాస్ట్లో మాట్లాడిన శ్రేష్ఠ అయ్యర్, "విరాట్ కోహ్లీ ఒక లెజెండ్, రోహిత్ శర్మ ఒక లెజెండ్, సచిన్ టెండూల్కర్ ఒక లెజెండ్. వాళ్లు కూడా తమ కెరీర్లో ఎన్నో మ్యాచ్లు ఓడిపోయారు. కానీ ప్రతిసారీ శ్రేయస్నే విమర్శిస్తే సమస్య అతనిలో కాకుండా విమర్శించే వారిలోనే ఉండొచ్చు" అని వ్యాఖ్యానించింది.అయితే శ్రేష్ఠ చేసిన ఈ పోలికలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సచిన్ టెండూల్కర్ 1996లో కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి నాలుగు వన్డేల్లో రెండింట్లో జట్టుకు విజయాలు అందించాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్సీ ఆరంభంలో తొలి ఓటమి తర్వాత వరుస విజయాలు సాధించాడు. రోహిత్ శర్మ తన తొలి వన్డే సిరీస్లో శ్రీలంకపై 2-1తో విజయం అందించగా, శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్గా తన తొలి టీ20 సిరీస్లో ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలు నమోదు చేశాడు. ఈ గణాంకాలను ప్రస్తావిస్తూ శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చడం సరైంది కాదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.నెటిజన్లు శ్రేయస్ను దిగ్గజాలతో పోల్చొద్దని చెప్పినప్పటికీ.. శ్రేష్ఠ మాత్రం తన సోదరుడిపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసింది. "శ్రేయస్ గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఆటగాడు. అతడిలో చాలా సామర్థ్యం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు అతడే భారత అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా గుర్తింపు పొందుతాడని నేను బలంగా నమ్ముతున్నాను" అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ప్రారంభ వైఫల్యాలు ఎదురైనా శ్రేయస్ అయ్యర్పై ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు జట్టు యాజమాన్యం విశ్వాసం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. 2028 టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని యువ జట్టుతో కొత్త ప్రణాళికలు అమలు చేస్తున్న నేపథ్యంలో శ్రేయస్కు మరిన్ని అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తోంది. -
కోహ్లి బాటలో సంజూ శాంసన్..!
భారత వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు ఎంపిక కాకపోవడంతో చర్చనీయాంశంగా మారిన సంజూ, విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవాలని మంజ్రేకర్ పిలుపునిచ్చాడు.2026 టీ20 ప్రపంచకప్లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన శాంసన్, అనంతరం యూకే పర్యటనలో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయడంతో అతడి స్థానంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభించింది. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్కు ప్రకటించిన భారత జట్టులోనూ సంజూకు చోటు దక్కలేదు.ఈ నిర్ణయంపై స్పందించిన మంజ్రేకర్, "సంజూ శాంసన్ను తప్పించడానికి సరైన కారణం ఏదైనా ఉంటే అది ఫిట్నెస్ మాత్రమే. అదే కారణమైతే ఆ నిర్ణయం సమంజసమే. ప్రస్తుతం అతను అత్యుత్తమ శారీరక దృఢత్వంలో లేడు. ఈ దశలో విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకుని ఫిట్నెస్పై పూర్తిగా దృష్టి సారించాలి" అని సూచించాడు.జట్టులో చోటు కోల్పోయిన తర్వాత సంజూ తన ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జిమ్లో తీవ్రంగా శ్రమిస్తున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఒక శిక్షణా సెషన్కు దూరంగా ఉండి జిమ్లోనే ప్రత్యేకంగా వ్యాయామం చేస్తున్నట్లు సమాచారం. గతంలోనూ ఫిట్నెస్ విషయంలో సంజూపై విమర్శలు రావడంతో, ఇప్పుడు అతడికి ఇది కీలక దశగా భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, ఇంగ్లండ్తో మూడో టీ20 అనంతరం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కూడా సంజూ శాంసన్ భవిష్యత్తుపై స్పందించాడు. "2026 ప్రపంచకప్లో సంజూ చేసిన ప్రదర్శన అసాధారణం. అయితే కొన్నిసార్లు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.సంజూ ఇక జట్టులోకి రాలేడనే నిబంధన ఏమీ లేదు. ప్రతి ఆటగాడు తన స్థానాన్ని తన ప్రదర్శనతో సంపాదించుకోవాలి" అని గంభీర్ స్పష్టం చేశాడు.ఇంగ్లండ్తో మిగిలిన మ్యాచ్ల్లో సంజూ శాంసన్కు అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఫిట్నెస్, ఫామ్ రెండింటినీ మెరుగుపర్చుకుని భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించాలని సంజూ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. -
ప్రాక్టీస్ మొదలు పెట్టిన కోహ్లి.. ఇంగ్లాండ్ కు వణుకుపుట్టేలా చేస్తున్న వీడియో
-
తండ్రి బాటలోనే కొడుకులు..సెహ్వాగ్ వారసులపై కాసుల వర్షం!
న్యూ ఢిల్లీ వేదికగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) మూడో సీజన్ వేలం ఘనంగా ముగిసింది. రైజింగ్ స్టార్స్ను తీసుకునేందుకు ఆయా ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఈ వేలంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారులు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్న కొడుకు ఎంపికవ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.సెహ్వాగ్ చిన్న కుమారుడు 16 ఏళ్ల వేదాంత్ సెహ్వాగ్ ఈ వేలంలో అమ్ముడైన చివరి ఆటగాడిగా నిలిచాడు. ఇతడిని రూ. 1 లక్షకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. వేదాంత్ ఇప్పటికే అండర్-14, 16 టోర్నమెంట్లలో తన మార్క్ చూపించాడు. వేదాంత్ తండ్రిలా కాకుండా రైట్ ఆర్మ్ ఆఫ్-స్పిన్నర్గా, లోయర్ ఆర్డర్ బ్యాటర్గా రాణిస్తున్నాడు.అదేవిధంగా సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ను రూ. 3 లక్షల ధరకు వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. గత సీజన్లో ఇతడు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక కోహ్లి అన్న కుమారుడు ఆర్యవీర్ కోహ్లిని రూ.1.2 లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ దక్కించుకుంది. ఆర్యవీర్ గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్కు ప్రాతినిధ్యం వహించాడు.తేజస్విపై కాసుల వర్షంఇక మూడో ఎడిషన్ వేలంలో తేజస్వి దహియా అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ తమ 'రైట్ టు మ్యాచ్' కార్డును ఉపయోగించి అతడిని రూ. 40 లక్షలకు దక్కించుకుంది. గత డీపీఎల్ సీజన్లో దహియా దాదాపు 200 స్ట్రైక్ రేట్తో 339 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనల కారణంగా అతడికి ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా దక్కింది. ఈ ఏడాది సీజన్లో అతడు కేకేఆర్ తరపున అరంగేట్రం చేశాడు.రంజన్కు జాక్ పాట్అదేవిధంగా సీనియర్ రాజకీయ నాయకుడు పప్పు యాదవ్ తనయుడు సార్థక్ రంజన్కు జాక్ పాట్ తగిలింది. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ జట్టు 'రైట్ టు మ్యాచ్' (RTM) కార్డ్ని ఉపయోగించి రూ. 17 లక్షలకు సార్థక్ను తిరిగి దక్కించుకుంది. గత సీజన్లో సార్థక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్ల్లో 449 పరుగులు చేసి సత్తాచాటాడు. ఐపీఎల్-2026 వేలంలో కూడా అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం లభించలేదు. మొత్తంగా తాజా వేలంలో 25 మంది ఆటగాళ్లు అమ్ముడు పోయారు. -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్ అయ్యర్
భారత్, ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ వర్షార్పణమైనప్పటికీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం పలు రికార్డులు తమ పేరిట లిఖించుకున్నారు. ఇప్పటికే అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ ఫిఫ్టీతో అరుదైన ఫీట్ సాధించగా, తాజాగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఏకంగా చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లి రికార్డును బద్దలుకొట్టాడు. విషయంలోకి వెళితే.. ఇంగ్లండ్తో తొలి టీ20లో అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులతో రాణించాడు. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో విఫలమైన శ్రేయస్ ఇంగ్లండ్ గడ్డపై మాత్రం బ్యాట్ ఝలిపించాడు. ఈ క్రమంలో 37 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. టీమిండియా తరఫున 5వేల పరుగులు పూర్తి చేసుకున్న 29వ బ్యాటర్గా అయ్యర్ నిలిచాడు. 147 ఇన్నింగ్స్ల్లో (అన్ని ఫార్మాట్లు) అయ్యర్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇందులో ఆరు సెంచరీలు, 37 అర్ధసెంచరీలున్నాయి. ఇక తొలి టీ20లో హాఫ్ సెంచరీ సాధించిన అయ్యర్ ఇంగ్లండ్ గడ్డపై కెప్టెన్గా ఫిఫ్టీ సాధించిన తొలి ఆటగాడిగా అయ్యర్ నిలిచాడు. గతంలో టీ20 కెప్టెన్గా కోహ్లి చేసిన 47 పరుగులే అత్యుత్తమంగా ఉండేది. 8 ఏళ్ల తర్వాత కోహ్లి రికార్డును అయ్యర్ బద్దలు కొట్టాడు. అంతేకాదు టీ20 కెరీర్లో శ్రేయస్ అయ్యర్కు ఇది మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ అభిషేక్ శర్మ (59), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68) అర్ధసెంచరీలతో రాణించారు. ఆఖర్లో శివమ్ దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) పవర్హిట్టింగ్తో టీమిండియా భారీ స్కోరు చేయగలిగింది. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహ్మూద్ 3 వికెట్లు తీయగా, ఆదిల్ రషీద్, సామ్ కరన్లు చెరో వికెట్ పడగొట్టారు. -
లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)
-
విరాట్ కోహ్లికి సంబంధించి బిగ్ న్యూస్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి సంబంధించి ఓ బిగ్ న్యూస్ అందింది. త్వరలో అతడు వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్కు వెళ్లాల్సి ఉన్నా, ఇంకా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లోనే ఉన్నాడు. విరాట్ ఐపీఎల్ 2026 ఫైనల్లో గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు పునరావాస కార్యక్రమంలోనే ఉన్నట్లు తెలుస్తోంది.గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్లో విరాట్ హ్యామ్స్ట్రింగ్కు గాయమైంది. గాయం ఉన్నప్పటికీ అతడు మొత్తం ఇన్నింగ్స్ ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన వన్డే సిరీస్కు దూరమయ్యాడు.ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చినట్టే.. కానీ..?ఇంగ్లండ్ సిరీస్కు ముందు విరాట్ CoEలో ఫిట్నెస్ టెస్ట్ పూర్తి చేశాడని, అతడికి క్లియరెన్స్ కూడా లభించిందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందుకే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అతడిని జట్టులోకి ఎంపిక చేసినట్లు సమాచారం.అయితే తాజాగా భారత అండర్-19 కెప్టెన్ ఆయుశ్ మాత్రేతో కలిసి విరాట్ CoEలో కనిపించాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అతడు ఇంకా రిహాబిలిటేషన్లోనే ఉన్నాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత జట్టు ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. విరాట్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా ఐర్లాండ్తో రెండు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్లో భాగంగా నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ చిత్తుగా ఓడింది.అసలు గాయం ఏంటి..?విరాట్కు డిస్టల్ సెమిమెంబ్రానోసస్ టెండన్ టియర్ అనే అరుదైన హ్యామ్స్ట్రింగ్ గాయం అయినట్లు సమాచారం. ఇది మోకాలి వెనుక భాగంలో ఉండే హ్యామ్స్ట్రింగ్ కండరానికి సంబంధించిన గాయం. దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా 6 నుంచి 12 వారాలు పట్టే అవకాశం ఉంటుంది. గాయం తీవ్రతను బట్టి కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. -
పెళ్లి చేసుకున్న టీమిండియా స్టార్.. కోహ్లి, ధోనికి ఆహ్వానం లేదు!
టీమిండియా పేసర్ ఆకాశ్ దీప్ ఓ ఇంటివాడయ్యాడు. అక్షిత రాజ్తో కలిసి మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టాడు. వారణాసిలో బుధవారం వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆకాశ్ దీప్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.శాశ్వత ఇన్నింగ్స్ఇందుకు.. ‘‘ఈ అందమైన పెళ్లి వేడుక.. ఇద్దరు దిగ్గజాలు తమ శాశ్వత ఇన్నింగ్స్ మొదలుపెట్టే ఘట్టాన్ని అందంగా చిత్రీకరిస్తున్నట్లుగా ఉంది. రీటేక్లు ఏమీ లేవు. నమ్మకం, టీమ్ స్పిరిట్తో మేము ముందుకు సాగుతున్నాం’’ అని ఆకాశ్ దీప్ క్యాప్షన్ జత చేశాడు.శుభాకాంక్షల వెల్లువఈ క్రమంలో సహచర ఆటగాళ్లు, అభిమానుల నుంచి ఆకాశ్ దీప్- అక్షితా రాజ్ (India pacer Akash Deep Wedding)కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా నవదంపతులను విష్ చేశారు.ఇదిలా ఉంటే.. ఆకాశ్ దీప్ స్నేహితులు షేర్ చేసిన ఓ వీడియో క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. ఇందులో.. ‘‘నీ పెళ్లికి భారత క్రికెట్ దిగ్గజాలు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఎందుకు పిలవలేదు’’ అని ఓ వ్యక్తి అడిగాడు.అందుకు వాళ్లను పిలవలేదు!ఇందుకు బదులుగా ఆకాశ్ దీప్.. ‘‘పెళ్లి బనారస్ (వారణాసి)లో జరుగుతుంది కదా!’’ అని అనడంతో నవ్వులు పూశాయి. కాగా కోహ్లి, ధోని, రోహిత్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా కోహ్లి కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎగబడతారో తెలిసిందే. అందుకే తన పెళ్లి సజావుగా సాగాలంటే కోహ్లి భయ్యా ఇక్కడ లేకపోవడమే మంచిది అన్నట్లు ఆకాశ్ దీప్ సరదాగా ఇలా బదులిచ్చాడు.కాగా బిహార్కు చెందిన ఆకాశ్ దీప్.. 2024లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇంగ్లండ్తో స్వదేశంలో జరిగిన సిరీస్ ద్వారా ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఈ 29 ఏళ్ల పేస్ బౌలర్ టీమిండియా తరఫున 10 టెస్టులు ఆడి.. 28 వికెట్లు కూల్చాడు. గతేడాది ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ గడ్డ మీద ఆకాశ్ దీప్ సత్తా చాటాడు. బర్మింగ్హామ్ టెస్టులో పన్నెండు వికెట్లు కూల్చి సంచలనం సృష్టించాడు.ఇక ఇప్పటికి ఐపీఎల్లో పద్నాలుగు మ్యాచ్లు ఆడిన ఆకాశ్ దీప్.. పది వికెట్లు తీయగలిగాడు. ఈ ఏడాది కోల్కతా నైట్ రైడర్స్ అతడిని సొంతం చేసుకోగా.. గాయం కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు.అదే విధంగా స్వదేశంలో అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టు మ్యాచ్కు కూడా దూరమయ్యాడు. తాజాగా పెళ్లి బంధంలో అడుగుపెట్టి వ్యక్తిగత జీవితంలో నూతన అధ్యాయాన్ని ఆరంభించాడు.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్ View this post on Instagram A post shared by Virat (@kohlixclips) -
అందుకు అతడే అర్హుడు.. తప్పించలేమని.. ఎంపిక చేస్తే ఎలా?
అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన టీమిండియా.. ఐర్లాండ్లో అడుగుపెట్టింది. ఐరిష్ జట్టుతో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లు ఆడనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆయా సిరీస్లకు బీసీసీఐ తమ జట్లను ప్రకటించింది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి ప్రయోజనాల కోసం జట్టుకు ఎంపిక చేయొద్దని.. జట్టు గురించి మాత్రమే ఆలోచించాలంటూ సెలక్టర్లకు హితవు పలికాడు.అందుకు అతడే అర్హుడురోహిత్ శర్మ స్థానంలో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ను ఆడిస్తే బాగుంటుందని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆడిన గత మూడు వన్డేల్లో యశస్వి జైస్వాల్ రెండు శతకాలు బాదాడు. సౌతాఫ్రికా మీద 116 పరుగులతో అజేయంగా నిలిచిన జైసూ.. ఆ తర్వాత అఫ్గానిస్తాన్పై వరుసగా 4, 110* పరుగులు చేశాడు.భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీలో ఒకరిగా ఎవరికైనా అవకాశాలు రావాల్సి ఉందంటే.. అందుకు జైస్వాల్ అర్హుడు. కానీ దురదృష్టవశాత్తూ అతడికి అవకాశాలు రావడం లేదు. ఒకవేళ సెలక్టర్లు రోహిత్ శర్మను వన్డే వరల్డ్కప్-2027 ప్రణాళికల్లో భాగం చేయాలనుకుంటే అది వాళ్ల ఇష్టం.తప్పించలేము కాబట్టి ఎంపిక చేస్తామంటే ఎలా?నిజానికి భారత క్రికెట్లో ‘స్టార్’ ప్లేయర్లకు ఎల్లప్పుడూ పెద్దపీట వేసే సంప్రదాయం ఉంది. వ్యక్తిగత ఇమేజ్, ఆట తీరు దృష్ట్యా మాత్రమే వారికి అవకాశాలు దక్కుతాయి. ఇప్పుడు రోహిత్ విషయంలోనూ అదే జరుగుతోందనిపిస్తోంది. నిజంగానే అతడు వరల్డ్కప్ జట్టుకు అవసరమని భావించి సెలక్ట్ చేస్తే ఫర్వాలేదు.అంతేగానీ.. అతడిని తప్పించలేము కాబట్టి ఆడిస్తాం అంటే కుదరదు. విరాట్, రోహిత్ లేదంటే బుమ్రాకు ఏది అత్యుత్తమం అని కాకుండా.. జట్టు ప్రయోజనాల కోసం ఏమి చేయాలి? భారత క్రికెట్ను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి? అన్న అంశాలపై మాత్రమే దృష్టి పెట్టాల్సి ఉంటుంది’’ అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాగా అఫ్గన్తో సిరీస్కు కోహ్లి దూరం కాగా.. అతడి స్థానంలో జైస్వాల్ జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇంగ్లండ్ పర్యటనతో కోహ్లి తిరిగి జట్టుతో చేరనున్నాడు.చదవండి: శ్రీలంకతో తొలి టెస్టు.. భారత్ బ్యాటింగ్ -
భారత జట్టు ప్రకటన.. సెంచరీ హీరోకు నో ఛాన్స్
ఇంగ్లండ్తో మూడు వన్డేల సిరీస్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అఫ్గాన్తో వన్డేలకు గాయం కారణంగా దూరమైన స్టార్ విరాట్ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చాడు. అతడితో పాటు స్టార్ సేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేశాడు. విరాట్ను ఎంపిక చేసినప్పటికి సిరీస్ ఆరంభానికి ముందు తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది.ఇక అఫ్గాన్తో ఆఖరి వన్డేలో సెంచరీతో సత్తాచాటిన యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్కు మాత్రం చోటు దక్కలేదు. తన చివరి మూడు వన్డేలలో రెండు శతకాలు సాధించినప్పటికీ జైస్వాల్ను సెలక్టర్లు పక్కన పెట్టారు. జూలై 14 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో వన్డేల కోసం భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్బాస్టన్, బర్మింగ్హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30చదవండి: వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు -
ఇంగ్లండ్ సిరీస్కు పాండ్యా దూరం.. కోహ్లీ ఆడడంపై ఆరోజే క్లారిటీ!
టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న హార్దిక్ పాండ్యా కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) శిబిరంలో ఉన్న పాండ్యా అఫ్గానిస్తాన్తో సిరీస్కు కూడా దూరమయ్యాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో అప్పటివరకు పాండ్యా కోలుకుంటాడని వార్తలు వచ్చినప్పటికీ, బీసీసీఐ మెడికల్ బృందం మాత్రం పాండ్యా ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్ధంగా లేడని తెలిపింది. ఎందుకంటే రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్న పాండ్యా ఫిట్నెస్ టెస్టులో విఫలమయ్యాడని, అతడు కోలుకునేందుకు మరో నెల రోజులు పట్టే అవకాశముందని సమాచారం. అయితే ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జూలై 14 నుంచి 19 మధ్య మూడు వన్డేలు ఆడనుంది. ఈ లెక్కన హార్దిక్ టీమిండియాతో జాయిన్ కావడం కష్టమే. ఇక గాయంతో బాధపడుతున్న కోహ్లీ కూడా ఇంగ్లండ్ సిరీస్లో ఆడుతాడా లేదా అనేది జూన్ 22న (సోమవారం) తేలనుంది. ఆరోజు కోహ్లికి ఫిట్నెస్ టెస్టు జరగనుంది.అయితే అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ టూర్లకు హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్కప్ రోడ్మ్యాప్ ప్రక్రియలో భాగంగా పాండ్యా కీలకం కానున్నాడని అజిత్ అగార్కర్ వెల్లడించాడు. కానీ ఐపీఎల్ 2026 సీజన్ చివర్లో వెన్ను గాయంతో బాధపడ్డ పాండ్యా సీవోఈకి చేరుకున్నాడు. వెన్ను నొప్పి నుంచి తేరుకునే లోపే తొడ కండరాల గాయం కావడంతో ఆఫ్గన్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ఒక్కరోజు ముందే పాండ్యా ఆడడం లేదని బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది.2027 వన్డే వరల్డ్కప్ ఆడేనా?వరుస గాయాలతో సతమతమవుతున్న పాండ్యా వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్లో ఆడుతాడా లేదా అన్నది మిస్టరీగా మారింది. టీమిండియా కూడా ఇంగ్లండ్తో వన్డే సిరీస్ అనంతరం మళ్లీ సెప్టెంబర్లో వెస్టిండీస్ టూర్లో వన్డే మ్యాచ్లు ఆడనుంది. అప్పటికి కోలుకొని పాండ్యా జట్టులోకి వస్తే మంచిదే, కానీ మళ్లీ ఏదైనా గాయం బారిన పడితే మాత్రం వన్డే ప్రపంచకప్కు పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానమే.Read: నోరు మూసుకున్నందుకు రెడ్కార్డ్.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి! -
రోహిత్, కోహ్లీ భవితవ్యంపై బీసీసీఐ స్పందన!
వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆ మెగాటోర్నీలో ఆడతారా లేదా అన్న దానిపై బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది. 2027 వన్డే ప్రపంచకప్ చర్చకు వస్తే ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా పీటీఐకి ఇంటర్వ్యూ ఇస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్ కోసం టీమిండియా రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నామని, ఈ ప్రయాణంలో కొంతమంది ఆటగాళ్లకు అవకాశాలు లభించకపోవచ్చని పేర్కొన్నారు. సైకియా మాటలను బట్టి చూస్తే జట్టులో సీనియర్లుగా చెలామణి అవుతున్న రోహిత్, కోహ్లీలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు ఉన్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగుతారా లేదా అన్నదానిపై సెలెక్షన్ కమిటీ హెడ్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. నిజానికి కోహ్లి, రోహిత్లు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ సైకియా వ్యాఖ్యలు సమాధానం కంటే ప్రశ్నలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.గంభీర్, అగార్కర్ల మాదిరిగానే, రోహిత్, కోహ్లీల 2027 ప్రపంచ కప్ అవకాశాలపై సైకియా కూడా స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. ఈ విషయంపై బీసీసీఐ ఏమైనా అంతర్గత చర్చలు జరిపిందా అని అడగ్గా, ఇది ప్రాథమికంగా కొనసాగుతున్న ప్రక్రియ అని, ఇందులో భాగస్వాములందరూ తమ అభిప్రాయాలలో ఏకీభవిస్తున్నారని సైకియా అన్నారు. 'మాది చాలా సమన్వయంతో కూడిన బృందం, ఇందులో చాలా మంది నిపుణులు ఉన్నారు. సంబంధిత వర్గాలన్నింటినీ కలుపుకొని వెళ్తాము. ఏ నిర్ణయాలలోనైనా క్రికెట్ కమిటీ, సెలెక్టర్లు, సహాయక సిబ్బంది, ప్రధాన కోచ్, సంబంధిత ఆటగాళ్లతో సహా ఇతర భాగస్వాములందరూ పాలుపంచుకుంటారు.క్రమం తప్పకుండా సంభాషణలు జరుగుతున్నాయి. అందువల్ల, మనకు ప్రత్యేక సంప్రదింపుల సమావేశం అవసరం లేదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ' అని సైకియా పేర్కొన్నారు. ప్రస్తుతం రోహిత్ శర్మ అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్లో ఆడుతుండగా, కోహ్లీ గాయంతో సిరీస్కు దూరమయ్యాడు. -
IND vs AFG: యశస్వి జైస్వాల్ ఫెయిల్
టీమిండియా స్టార్ యశస్వి జైస్వాల్ వన్డే పునరాగమనంలో తీవ్రంగా నిరాశపరిచాడు. అఫ్గనిస్తాన్తో బుధవారం నాటి మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన జైసూ.. సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. కాగా టెస్టు ఫార్మాట్లో ఓపెనర్గా స్థానం సుస్థిరం చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వన్డే అరంగేట్రం కోసం చాలాకాలం ఎదురుచూడాల్సి వచ్చింది.సెంచరీతో ముగించి..ఎట్టకేలకు గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో అడుగుపెట్టాడు జైసూ. అయితే, అరంగేట్రంలో 15 పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక చివరగా గతేడాది డిసెంబరులో సౌతాఫ్రికాతో మ్యాచ్లో మరోసారి ఓపెనర్గా అవకాశం దక్కించుకున్న జైస్వాల్ అజేయ శతకంతో అలరించాడు.మొత్తంగా 121 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 116 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జైస్వాల్కు వన్డే జట్టులో చోటు దక్కలేదు. తాజాగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో.. సెలక్టర్లు జైసూకు పిలుపునిచ్చారు.రాక రాక వచ్చిన అవకాశంఅయితే, ధర్మశాల వేదికగా అఫ్గనిస్తాన్తో తొలి వన్డేలో జైసూకు తుదిజట్టులో చోటు దక్కలేదు. లక్నో వేదికగా బుధవారం నాటి రెండో వన్డేకు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి దూరం కాగా.. జైస్వాల్కు ఆడే అవకాశం వచ్చింది. రోహిత్ శర్మకు జోడీగా ఓపెనర్గా వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క ఫోర్ బాది నాలుగు పరుగులే చేసి అవుటయ్యాడు.విమర్శలుఅఫ్గన్ యువ పేసర్ మహ్మద్ సలీమ్ సఫీ బౌలింగ్లో నంగేయాలియా ఖరోటికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాగా సలీమ్ సఫీకి వన్డేలో ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. ఏదేమైనా రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక చతికిల పడ్డ జైస్వాల్పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆట తీరును మార్చుకుంటేనే వన్డే వరల్డ్కప్-2027 జట్టులో బ్యాకప్ ఓపెనర్గానైనా చోటు దక్కుతుందని.. లేదంటే ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతాడని అంటున్నారు. కాగా ఇప్పటికి ఐదు వన్డేల్లో కలిపి జైస్వాల్ 175 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం ఉంది. ఇదిలా ఉంటే.. అఫ్గనిస్తాన్ ఇటీవల ఏకైక టెస్టులోనూ జైసూ విఫలమయ్యాడు. కేవలం 24 పరుగులకే అవుటయ్యాడు.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
తొలిసారి అకాయ్తో కనిపించిన కోహ్లి.. ఫొటో వైరల్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ప్రస్తుతం కుటుంబానికి సమయం కేటాయించాడు. గాయం కారణంగా ఈ ‘రన్ మెషీన్’ ఆటకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2026 ఫైనల్లో ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఈ సందర్భంగా తొడ కండరాల గాయంతో బాధపడ్డాడు.అకాయ్తో కోహ్లిఫలితంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో మూడు వన్డేల సిరీస్కు కోహ్లి దూరమయ్యాడు. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే అతడు లండన్కి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో గార్డెన్లో తన కుమారుడు అకాయ్ను ఎత్తుకుని కోహ్లి ఆడిస్తున్న ఫొటోలు బయటకు వచ్చాయి.మరికొన్ని ఫొటోల్లో కోహ్లి సతీమణి అనుష్క శర్మ తమ స్నేహితులతో ముచ్చటిస్తున్నట్లుగా ఉంది. అయితే, వీరి కుమార్తె వామిక మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇక అకాయ్ని కోహ్లి ఎత్తుకున్నట్లుగా ఉన్నప్పటికీ అతడి ఫేస్ మాత్రం రివీల్ కాలేదు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.లండన్లోనే...ఈ నేపథ్యంలో.. ‘‘ఇంకెప్పుడు చిన్నారి వామిక, జూనియర్ కోహ్లిని చూపిస్తావు భయ్యా!’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 2017లో వివాహం చేసుకున్న విరాట్- అనుష్కలకు తొలి సంతానంగా 20121లో కుమార్తె వామిక జన్మించింది.అనంతరం 2024లో లండన్లో ఈ జంట తమ కుమారుడు అకాయ్కు జన్మనిచ్చారు. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. కాగా కోహ్లి- అనుష్క తమ పిల్లల్ని సోషల్ మీడియా ప్రపంచానికి దూరంగా పెంచుతున్నారు. ఇంత వరకు వారి ఫొటోలను ఎక్కడా రివీల్ కాకుండా చూసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ భారత వన్డే జట్టుతో చేరాడు. ఇక అఫ్గనిస్తాన్ తొలి వన్డేలో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. -
కోహ్లి మాట చెవికెక్కించుకోని వైభవ్!
ట్రై సిరీస్లో శ్రీలంక-ఏతో మ్యాచ్ ముగిసిన అనంతరం ఆ జట్టు ఆటగాళ్లతో వైభవ్ సూర్యవంశీ గొడవ హైలైట్గా నిలిచింది. తప్పు ఎవరిదైనా వైభవ్ సూర్యవంశీ ప్రవర్తనపై విమర్శలు వచ్చాయి. 15 ఏళ్ల వయసులో ఇంత అగ్రెసివ్ పనికి రాదని, ఓర్పు వహిస్తేనే జట్టులో ఎక్కువకాలం చోటు ఉంటుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు వారాల క్రితం ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీకి కోహ్లి అడ్వైజ్ ఇస్తున్న ఫొటో తాజాగా సోషల్ మీడియాలో మరోసారి వైరలయ్యింది. ఆ ఫొటోలో కోహ్లి వైభవ్ భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడాడు. వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది కూడా వైభవ్ వెల్లడించాడు. ‘మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రత్యర్థి ఏం మాట్లాడుతున్నా పట్టించుకోవద్దు. ఆటపైనే మన దృష్టి ఉండాలి. కెరీర్ ఎదుగుదలలో ఓపిక చాలా అవసరం. అది ఉన్నప్పుడే మనకు క్రికెట్లో లాంగ్ కెరీర్కు ఆస్కారం ఉంటుంది’ అని కోహ్లి తనతో చెప్పినట్లు వైభవ్ పేర్కొన్నాడు. అయితే తాజాగా లంకతో మ్యాచ్లో వైభవ్ అగ్రెసివ్ ప్రవర్తన చూస్తుంటే కోహ్లీ చెప్పిన మాటలు ఏవీ అతడు చెవికె క్కించుకోలేదనిపిస్తోంది. కోహ్లి ఇచ్చిన సూచనలు, సలహాలు తూ.చా. తప్పకుండా పాటించి ఉంటే ఇవాళ వైభవ్ ప్రవర్తన ఇలా ఉండేది కాదని పలువురు సీనియర్లు పేర్కొంటున్నారు. అయితే వైభవ్ సూర్యవంశీ అగ్రెసివ్గా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. 2025లో అండర్-19 ఆసియా కప్ ఫైనల్ సందర్భంలోనూ వైభవ్ ఇదే దూకుడు ప్రదర్శించాడు. ఆనాడు పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ పేసర్ అలీ రెజా వైభవ్ను ఔట్ చేశాడు. ఈ సమయంలో పాక్ బౌలర్ వైభవ్ను కించపరిచే విధంగా మాట్లాడాడు. అయితే ఉడుకురక్తంతో ఉన్న వైభవ్ కూడా అంతే ఘాటుగా స్పందించాడు. అలీ రెజావైపు చూస్తూ చేతి వేలితో సైగ చేస్తూ, దూషిస్తూ పెవిలియన్ బాట పట్టాడు. అప్పట్లో ఈ వీడియో బాగా వైరలయ్యింది.టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అంటేనే దూకుడుకు పెట్టింది పేరు. తన అగ్రెసివ్ ప్రవర్తనతో విమర్శలు కూడా మూటగట్టుకున్నాడు. అయితే కోహ్లి మైదానంలో ఉన్నంతసేపు మాత్రం హుందాగానే ప్రవర్తిస్తాడు. ప్రత్యర్థిపై ఎంత కోపం ఉన్నా మైదానంలో ఎక్కువశాతం ఫన్నీమోడ్లోనే ఉండడానికే ప్రయత్నం చేస్తుంటాడు. మంచి విషయం ఆలస్యంగా.. కానీ ఒక చెడ్డ విషయం వేగంగా వ్యాప్తి చెందుతున్న మాట వైభవ్ విషయంలో నిజమైంది. ఐపీఎల్లో సంచలన ప్రదర్శనతో అందరి చేత శెభాష్ అనిపించుకున్న వైభవ్ ఇప్పుడు తన ప్రవర్తనతో అందరి దృష్టిలో బ్యాడ్గా మారిపోతున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న వైభవ్ సూర్యవంశీ ఇప్పటికైనా తన అగ్రెసివ్ ప్రవర్తనను తగ్గించుకొని ఆడితే క్రికెట్లో ఎక్కువకాలం కొనసాగేందుకు ఆస్కారం ఉంటుంది.Another heated moment between Vaibhav Sooryvanshi and Sri Lankan players. 🥶 https://t.co/iwmOQfMZwv pic.twitter.com/cUINMCFuJ5— Qamar. (@Qamar5618) June 15, 2026King meets Bihari Monster 💀 pic.twitter.com/927R0z8kF3— सीतामढ़ी जिला 🇮🇳 (@SitamarhiJila) June 1, 2026చదవండి: ఓటమితో లెక్కలు తారుమారు.. ఇండియా-ఏ ఫైనల్ చేరడం కష్టమే! -
విరాట్ కోహ్లికి అహంకారం ఎక్కువే!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి మైదానంలో ఎలా ఉంటాడో క్రికెట్ ప్రేమికులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారి గ్రౌండ్లో దిగిన తర్వాత కోహ్లి పూర్తిగా మారిపోతాడు. ప్రత్యర్థి కవ్వింపు చర్యలకు దిగితే వారి శైలిలోనే వారికి సమాధానం చెబుతాడు. స్లెడ్జింగ్కు దిగిన వారికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తాడు.ఇక అదే సమయంలో అంతే సరదాగానూ ఉండటం కోహ్లికే చెల్లింది. అయితే, కొంతమంది మాత్రం విరాట్ కోహ్లి (Virat Kohli)ని అహంకారి అని.. దూకుడు ఎక్కువని.. అతి చేయడం సరికాదంటూ విమర్శిస్తూ ఉంటారు. తాజాగా ఇదే తరహాలో కోహ్లిని విమర్శిస్తూ ఓ పోస్టు ప్రత్యక్షమైంది.అది నిజమే.. విరాట్ కోహ్లి అహంకారిఇందుకు టీమిండియా మాజీ హెడ్కోచ్, కోహ్లితో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్న రవిశాస్త్రి స్పందించాడు. వన్8 చానెల్ పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడుతూ.. ‘‘అహంకారి.. అతి గారాబం వల్ల చెడిపోయిన అల్లరిపిల్లాడు. దూకుడు.. కోహ్లి గురించి వాళ్లు అన్న ప్రతీ మాట నిజమే. అయితే, ఇదంతా క్రికెట్ మైదానంలో ఉన్నంత వరకే. మైదానం వెలుపల కోహ్లి ఇందుకు పూర్తి విభిన్నం. ఎక్కడ ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం’’ అని రవిశాస్త్రి కోహ్లి పట్ల అభిమానం చాటుకున్నాడు.ప్రత్యేక అనుబంధంకాగా రవిశాస్త్రి హెడ్కోచ్గా.. కోహ్లి కెప్టెన్గా ఉన్న సమయంలో టీమిండియా మంచి విజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో నంబర్ వన్గా నిలిచి సత్తా చాటింది. ఈ ఇద్దరు తర్వాతి కాలంలో తమ తమ పదవుల నుంచి వైదొలిగినప్పటికీ.. వారి మధ్య అనుబంధం మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా రవిశాస్త్రి వ్యాఖ్యలతో మరోసారి ఈ విషయం నిరూపితమైంది.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలవడంతో కీలక పాత్ర పోషించిన కోహ్లి.. ఫైనల్ సందర్భంగా గాయపడ్డాడు. దీంతో అఫ్గనిస్తాన్తో స్వదేశంలో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడు. అతడి స్థానంలో యశస్వి జైస్వాల్ జట్టులోకి వచ్చాడు. ఇక రవిశాస్త్రి ప్రస్తుతం కామెంటేటర్గా కొనసాగుతూ.. తనదైన శైలి వ్యాఖ్యానంతో అభిమానులను అలరిస్తున్నాడు.చదవండి: IND vs SL: కొంపముంచేశాడు! -
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్నెస్కు మారుపేరైన ఈ రన్మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్కు కూడా అఫ్గన్తో వన్డే సిరీస్లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్డౌన్లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్డౌన్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
ఫ్యాబ్-4: ఇద్దరు పోయారు.. మరో ఇద్దరు మిగిలారు!
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం క్రికెట్ అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది. అయితే కివీస్ క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్గా పేరు పొందిన కేన్ విలియమ్సన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు బ్లాక్క్యాప్స్ బ్యాటింగ్ లైనప్కు వెన్నుముకలా నిలిచాడు. వివాదరహితుడిగా పేరున్న విలియమ్సన్ నిష్రమణ సగటు అభిమానిని బాధించే అంశం. అయితే టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ (టీమిండియా), జో రూట్ (ఇంగ్లండ్), స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్)లను 2014లో దివంగత క్రికెటర్ మార్టిన్ క్రో ముద్దుగా ఫ్యాబ్-4 అని అభివర్ణించారు. ఈ తరంలో ఈ నలుగురు అత్యంత గొప్ప టెస్టు క్రికెటర్లని ఆయన కొనియాడారు. అందుకు తగ్గట్లే ఈ ఫ్యాబ్-4 తమ ఆటతో అభిమానుల మనసులు దోచుకున్నారు. అయితే ఫ్యాబ్-4 క్రమంగా కూలిపోతోంది. తాజాగా విలియమ్సన్ రిటైర్మెంట్తో ఈ ఫ్యాబ్-4 కాస్తా ఇప్పుడు ఫ్యాబ్-2గా మారిపోయింది. ఇప్పటికే కోహ్లీ టెస్టు క్రికెట్కు గుడ్బై చెప్పగా, తాజాగా కేన్ మామ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. మిగిలిన ఇద్దరు క్రికెటర్లు జో రూట్, స్టీవ్ స్మిత్ కూడా మహా అయితే మరో రెండేళ్లు ఆడే అవకాశముంది. వీళ్లిద్దరూ కూడా రిటైరైతే ఫ్యాబ్-4 కథ కంచికి చేరనుంది.ఇక 16 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అందుకున్న కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ తరఫున 110 టెస్టులు, 175 వన్డేలు, 91 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 378 మ్యాచ్లాడిన కేన్ విలియమ్సన్ 19,346 పరుగులు సాధించాడు. ఇక కెప్టెన్గా కేన్ మామ కివీస్ తరఫున 40 టెస్టులు, 91 వన్డేలు, 75 టీ20లకు సారథ్యం వహించాడు. కేన్ విలియమ్సన్ సారథ్యంలో న్యూజిలాండ్ 2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ గెలుచుకుంది. అతడి సారథ్యంలోనే 2015 వన్డే ప్రపంచకప్తో పాటు 2021 టీ20 ప్రపంచకప్లో ఫైనల్ చేరినప్పటికీ, రన్నరప్తోనే సరిపెట్టుకుంది.చదవండి: జస్పాల్ రాణా మృతి వెనుక అసలు కారణమిదే! -
‘సచిన్, కోహ్లిలను మించిపోతాడు.. అతడికి తిరుగులేదు’
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియా లెజెండ్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లిలను మించిపోయినా ఆశ్చర్యం లేదంటూ ఆకాశానికెత్తాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధిగా వైభవ్ను అభివర్ణించాడు.ఫార్మాట్లకు అతీతంగాగతేడాది కాలంగా వైభవ్ సూర్యవంశీ ఫార్మాట్లకు అతీతంగా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. ఫాస్టెస్ట్ సెంచరీ (35 బంతుల్లో)తో అలరించాడు.ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా గడ్డలపై యూత్ వన్డే, యూత్ టెస్టుల్లో శతకాలు బాది చరిత్ర సృష్టించాడు. ఇక అండర్-19 వరల్డ్కప్ ఆద్యంతం అలరించిన వైభవ్.. ఫైనల్లో ఇంగ్లండ్ మీద 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.ఆరెంజ్ క్యాప్ విజేతవరల్డ్కప్లో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు కూడా వైభవ్ గెలుచుకున్నాడు. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగి 16 మ్యాచ్లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్ల నుంచి వైభవ్ సూర్యవంశీ పిలుపు అందుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించడంతో పాటు ఆసియా క్రీడలు- 2026లో పాల్గొనే భారత టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో డేల్ స్టెయిన్ వైభవ్పై ప్రశంసలు కురిపించాడు.సచిన్, కోహ్లిలను మించిపోతాడు‘‘సచిన్, విరాట్లను ఈ పిల్లాడు మించిపోగలడు. ఇదే ఫామ్ కొనసాగిస్తూ ఉంటే.. తన కెరీర్ ముగిసేనాటికి వీరిద్దరి కంటే పెద్ద స్టార్గా ఎదుగుతాడు. వైభవ్ సూర్యవంశీ విభిన్న ఆటగాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ఎంతో మంది క్రికెటర్ల కంటే వైభవ్ ఎంతో బెటర్.అతడొక అద్భుతమైన పిల్లాడు. భారత క్రికెట్కు దొరికిన అత్యంత విలువైన నిధి. అతడు ఇండియాలో ఆడినపుడు నేను దగ్గరగా చూశాను. అక్కడి బౌండరీలు చిన్నగానే ఉన్నాయి. అయినప్పటికీ సీనియర్లకు కూడా సాధ్యం కాని రీతిలో అతడు పవర్హిట్టింగ్ ఆడాడు’’ అని డేల్ స్టెయిన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు.అయితే, వైభవ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని బీసీసీఐకి ఈ సందర్భంగా స్టెయిన్ సూచించాడు. పదిహేనేళ్ల పిల్లాడు ఒత్తిడికి లోనుకాకుండా.. అతడిపై చెడు ప్రభావం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నాడు.చదవండి: తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి? -
తుదిజట్టులో చోటు ఉండదు.. ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?
అఫ్గనిస్తాన్తో శనివారం నాటి తొలి వన్డే కోసం టీమిండియా పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఇందుకోసం శుబ్మన్ గిల్ సారథ్యంలోని భారత జట్టు ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. కాగా అఫ్గన్తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ప్రధాన మార్పు జరిగిన సంగతి తెలిసిందే. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం వల్ల టీమిండియాకు దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా ఈ ఆర్సీబీ ఆటగాడు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో అఫ్గన్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు.ఈ నేపథ్యంలో వన్డౌన్ బ్యాటర్ కోహ్లి స్థానంలో.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ను వన్డే జట్టులోకి తీసుకుంది యాజమాన్యం. అయితే, రుతురాజ్ గైక్వాడ్ను కాదని జైసూను ఎందుకు తీసుకున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై టీమిండియా మాజీ ఓపెనర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు.రుతుకు బదులు జైసూను ఎంపిక చేసి సెలక్టర్లు మంచి పనే చేశారని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘‘విరాట్ కోహ్లి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. నిజానికి రుతు శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్తో బిజీగా ఉన్నాడు.అక్కడ భారత జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్లో నాలుగో స్థానంలో వచ్చి సెంచరీ చేశాడు. మరో మ్యాచ్లోనూ రాణించాడు. అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు రుతును ఎంపిక చేయడానికి అనేక కారణాలు ఉన్నాయి. భారత్- ‘ఎ’ జట్టులో అతడు కీలక సభ్యుడు.ఒకవేళ టీమిండియాకు ఎంపిక చేసినా అతడికి తుదిజట్టులో చోటు దక్కదు. అలాంటపుడు కోహ్లి స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తే ఏంటి?.. యశస్వి జైస్వాల్కు కూడా ప్లేయింగ్ ఎలెవన్లో చోటు ఇవ్వరు. కాబట్టి రుతురాజ్ శ్రీలంకలో ఉండటమే కరెక్ట్.నిజానికి జైసూ అఫ్గనిస్తాన్తో చండీగఢ్లో టెస్టు మ్యాచ్ ఆడాడు. తొలి వన్డే కోసం అక్కడి నుంచి ధర్మశాలకు సులువుగానే చేరుకుంటాడు. తుదిజట్టులో యశస్వి జైస్వాల్కు బదులు ఇషాన్ కిషన్నే ఆడిస్తారు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా తరఫున ఆడిన తమ చివరి వన్డేల్లో రుతు, జైసూ శతకాలు బాదడం విశేషం.ఇదిలా ఉంటే.. శనివారం ధర్మశాల వేదికగా టీమిండియా అఫ్గనిస్తాన్తో తొలి వన్డే ఆడనుంది. ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్మన్ గిల్, రోహిత్ శర్మ బరిలోకి దిగనుండగా.. వన్డౌన్లో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది. కాబట్టి జైసూ బెంచ్కే పరిమితమయ్యే పరిస్థితి. -
ఇంగ్లండ్తో వన్డే సిరీస్.. కోహ్లీ విషయంలో కీలక ప్రకటన!
అప్గానిస్తాన్తో వన్డే సిరీస్కు గాయంతో దూరమైన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఒక కీలక అప్డేట్ వచ్చింది. కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లీ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడని సమాచారం. ఈ లెక్కన అభిమానులకు కోహ్లీ విషయంలో ఇది గుడ్న్యూస్.జూలై 14 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఐపీఎల్ 2026 సీజన్ సమయంలోనే కోహ్లీ కండరాల గాయంతో సతమతమయ్యాడు. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో చివరిదాకా బ్యాటింగ్ చేయడంతో కోహ్లీ కండరాల గాయం తీవ్రత పెరిగిపోయింది. దీంతో ఫైనల్ పూర్తయిన మరుసటి రోజే కోహ్లీ తన కాలిని స్కాన్ చేయించుకున్నాడు. రిపోర్ట్లో కోహ్లి కాలిలో ఉండే డిస్టల్ సెమిమెంబ్రానోనస్ టెండన్ టియర్లో చీలిక వచ్చినట్లు తేలింది. డిస్టల్ సెమిమెంబ్రానోనస్ అనేది మోకాలి వెనుక భాగంలో ఉంటుంది. దీనిలో చీలిక వస్తే అది కాలి కండరాలను తీవ్రంగా బాధిస్తోంది. ఇది అత్యంత అరుదుగా జరుగుతుందని, కోలుకోవడానికి ఒక్కోసారి ఆరు నెలలు సమయం పడుతుందని వైద్యబృందం తెలిపింది. కానీ కోహ్లీ విషయంలో అద్భుతం జరిగిందని, అతడి అసామాన్యమైన ఫిట్నెస్ కారణంగా నాలుగు వారాల్లోనే పూర్తిగా కోలుకుంటాడని పేర్కొన్నారు. దీంతో ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు కోహ్లీ అందుబాటులో ఉంటాడనే వార్తలు వస్తున్న వేళ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్లో ఇప్పటికే చాలా రికార్డులు తన పేరిట లిఖించుకున్న కోహ్లీ సచిన్ వంద అంతర్జాతీయ సెంచరీల రికార్డును అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. 37 ఏళ్ల కోహ్లీ కెరీర్లో ఇప్పటివరకు 85 అంతర్జాతీయ సెంచరీలున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీకి ఆఖరి టోర్నీ అని ప్రచారం జరుగుతున్న వేళ టీమిండియా ఆ టోర్నీ వచ్చేలోగా స్వదేశం, విదేశం కలిపి సుమారు 28 నుంచి 30 వన్డేల వరకు ఆడే అవకాశముంది. ఇందులోనే ఆసియా కప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఉన్నాయి. ఈ లెక్కన సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీకి ఇది మంచి అవకాశమని చెప్పొచ్చు.చదవండి: భారత తుది జట్టు ఇదే.. అతడికి నో ఛాన్స్! యార్కర్ల కింగ్ అరంగేట్రం? -
గంభీర్తో మాకు సంబంధం లేదు!.. సీనియర్ల రూటే వేరు!
అఫ్గనిస్తాన్తో సిరీస్తో టీమిండియా వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాలు మొదలుకానున్నాయి. గిల్ సేన స్వదేశంలో అఫ్గన్తో మూడు వన్డేలు ఆడేందుకు సన్నద్ధమైంది. గాయం కారణంగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ సిరీస్కు దూరం కాగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సైతం కాలు నొప్పితో దూరమయ్యే పరిస్థితి నెలకొంది.మరోవైపు.. లెజెండరీ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియాకు సానుకూలాంశంగా మారింది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన దిగ్గజ ద్వయం రోహిత్- కోహ్లి వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.గంభీర్, అగార్కర్ విముఖత?వన్డే ప్రపంచకప్-2027 ఆడటమే లక్ష్యంగా రో-కో ముందుకు సాగుతున్నారు. అయితే, హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వీరి పట్ల సుముఖంగా లేనట్లు సమాచారం. వరల్డ్కప్ ఆడే విషయంలో రో-కో తమకు ఎలాంటి హామీ ఇవ్వలేదని అగార్కర్ ఇప్పటికే బహిరంగంగా ప్రకటించాడు.తలవంచనుఅయితే, ఇందుకు కోహ్లి ఇటీవలే గట్టి కౌంటర్ ఇచ్చాడు. తనను తాను నిరూపించుకోవాలని పదే పదే ఒత్తిడి చేస్తే.. అందుకు తాను తలవంచనని చెప్పేశాడు. డ్రెసింగ్రూమ్లో తన అవసరం లేదనుకుంటే తన గురించి చర్చే అనవసరం అని పేర్కొన్నాడు.ఈ పరిణామాల నేపథ్యంలో రో-కో భవితవ్యం గురించి మరోసారి చర్చ మొదలైంది. ఈ క్రమంలో బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. సంచలన విషయాలు వెల్లడించాయి. సీనియర్ ఆటగాళ్లు గంభీర్, అగార్కర్లను కాదని యాజమాన్యంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నాయి.గంభీర్తో మాకు సంబంధం లేదు‘‘జట్టులో దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. కెప్టెన్ గిల్ ప్రతీ విషయంలో డ్రెసింగ్రూమ్ గట్టిగా తన గొంతు వినిపించాల్సి ఉంది. టెస్టు, టీ20 ఫార్మాట్లలో మాదిరి గంభీర్ వన్డే జట్టు విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోవడం లేదు.అయితే ఇప్పుడు పరిస్థితి కాస్త మారింది. వన్డే వరల్డ్కప్ సన్నాహకాలు మొదలైపోయాయి. గంభీర్- గిల్ ఇకపై మరి కాస్త కఠినంగా ఉండవచ్చు. డ్రెసింగ్రూమ్లో తన ఐడియాలను బలంగా వినిపించవచ్చు.చాలా ఏళ్లుగా అత్యంత గొప్పగా.. సేవలు అందిస్తున్న సీనియర్లు వచ్చే పదహారు నెలల్లో జట్టులో తమ పాత్ర ఏమిటన్న అంశం గురించి గంభీర్తో కాకుండా నేరుగా యాజమాన్యంతో చర్చిస్తున్నారు. తమ భవితవ్యంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు’’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. చదవండి: వాళ్లకే దిక్కులేదు.. అతడిని ఎలా ఎంపిక చేస్తారు? -
చతికిలపడ్డ బాలీవుడ్ స్టార్లు.. ఇది సార్ కోహ్లీ బ్రాండ్!
భారత క్రికెట్ ముఖచిత్రంలో తనకంటూ ప్రత్యేక స్థానం దక్కించుకున్న విరాట్ కోహ్లీ ఆసియా ఖండంలో అది పెద్ద స్టార్ క్రీడాకారుడిగా పేరు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ తర్వాత అంతటి పేరు సంపాదించిన కోహ్లీ ఫిట్నెస్, రికార్డులపై నిత్యం ప్రశంసల వెల్లువ కురుస్తూనే ఉంటుంది. 20 ఏళ్లుగా క్రికెట్ ఆడుతూ అసామాన్యమైన స్టార్డమ్ను పొందిన కోహ్లీ తాజాగా తన బ్రాండ్ పవర్ను మరోసారి చాటుకున్నాడు.భారతదేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అగ్రస్థానంలో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా, గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్బ్రాండ్ సంయుక్తంగా తొలిసారి విడుదల చేసిన 'మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీస్' ర్యాంకింగ్స్లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ బ్రాండ్ విలువను ఏకంగా రూ.3,542 కోట్లుగా లెక్కగట్టడం విశేషం. ఈ జాబితాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ రెండో స్థానంలో నిలవగా, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా జోనాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.క్రికెటర్ల ఆధిపత్యంఈ ర్యాంకింగ్స్లో క్రికెటర్ల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. టాప్ 10 జాబితాలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, ధోనీ కూడా చోటు సంపాదించారు. కేవలం సంపాదన, ప్రఖ్యాతి ఆధారంగా కాకుండా.. ఒక సెలబ్రిటీకి ఉన్న విశిష్టత, అభిమానులతో అనుబంధం, సామాజిక బాధ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులను నిర్ణయించారు. వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలను ప్రభావితం చేయడంలో, బ్రాండ్లపై నమ్మకాన్ని పెంచడంలో సెలబ్రిటీల పాత్రను ఈ అధ్యయనం విశ్లేషించింది.విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడానికి పలు కారణాలు దోహదం చేశాయి. ప్యూమా, ఆడీ వంటి అంతర్జాతీయ బ్రాండ్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలు, ఫిట్నెస్ ఐకాన్గా ఆయనకున్న ఇమేజ్, ఇన్స్టాగ్రామ్లో 270 మిలియన్లకు పైగా ఉన్న భారీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఆయన బ్రాండ్ విలువను అమాంతం పెంచాయి. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ అందించచడంలో కీలక పాత్ర పోషించడం, ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలవడం కోహ్లీ మార్కెట్ స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీని ఎంపిక చేసినప్పటికీ, గాయం వల్ల అతడు జట్టుకు దూరమయ్యాడు.చదవండి: సెలెక్షన్ కమిటీపై భువనేశ్వర్ సంచలన వ్యాఖ్యలు! -
కోహ్లి అవుట్.. రీప్లేస్మెంట్ను ప్రకటించిన బీసీసీఐ
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి దూరమయ్యాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కాగా ఐర్లాండ్, ఇంగ్లండ్లో పర్యటించే... అదే విధంగా ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత టీ20 జట్టును బీసీసీఐ తాజాగా ప్రకటించింది.కొత్త టీ20 కెప్టెన్కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)ను తప్పించిన సెలక్టర్లు.. శ్రేయస్ అయ్యర్కు పగ్గాలు అప్పగించారు. ఇక చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని కూడా టీమిండియాకు ఎంపిక చేసి యూకే టూర్తో పాటు ఆసియా క్రీడల జట్టులోనూ చోటిచ్చారు.కోహ్లి ఎప్పుడు వస్తాడో తెలియదుఈ జట్ల ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విరాట్ కోహ్లి గురించి అప్డేట్ అందించాడు. కోహ్లి గాయంపై తమకు ఇంకా స్పష్టత రాలేదని.. అతడు ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటాడో తెలియదని పేర్కొన్నాడు. ఇంగ్లండ్తో వన్డే సిరీస్ నాటికి అతడు ఫిట్గా ఉంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.కోహ్లి స్థానంలో అతడేఅదే సమయంలో విరాట్ కోహ్లి స్థానంలో యశస్వి జైస్వాల్ను అఫ్గన్తో వన్డే సిరీస్కు ఎంపిక చేసినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు- గుజరాత్ టైటాన్స్ మధ్య ఐపీఎల్-2026 ఫైనల్ సందర్భంగా కోహ్లి గాయపడిన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.రోహిత్ సంగతేంటి?ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ గురించి మాత్రం బోర్డు ఎలాంటి అప్డేట్ అందించలేదు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న ఈ ముంబై ఇండియన్స్ స్టార్ ఇంతవరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)కు చేరుకోనే లేదు.మరోవైపు.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా మాత్రం ఇప్పటికే బెంగళూరుకు చేరుకున్నాడు. అయితే, గాయంపై స్పష్టత లేకపోవడంతో అతడిని టీ20 జట్టుకు ఎంపిక చేయలేదని అగార్కర్ తెలిపాడు. కాగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లండ్తో వన్డే సిరీస్ జట్టును ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ సందర్భంగా తెలియజేశారు.అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత జట్టు (అప్డేటెడ్)శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ (ఫిట్నెస్ ఆధారంగా), హార్దిక్ పాండ్యా (ఫిట్నెస్ ఆధారంగా).షెడ్యూల్జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికగా అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ వచ్చేశాడు -
‘అతడు జట్టులో ఉంటే టీమిండియా వరల్డ్కప్ గెలవదు’
వన్డే ప్రపంచకప్-2027 టోర్నీకి ముందు టీమిండియాకు కొన్ని మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు.. అనంతరం ఇంగ్లండ్ పర్యటనలోనూ మూడు మ్యాచ్లు ఆడనుంది.రో-కో ఆడతారా?ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం టీమిండియా సొంతగడ్డపై వెస్టిండీస్తో మూడు.. అనంతరం న్యూజిలాండ్తో మూడు, శ్రీలంకతో మూడు వన్డేలు ఆడుతుంది. మొత్తానికి మెగా టోర్నీకి ముందు భారత్ దాదాపు పదిహేను వన్డేలు ఆడుతుంది. అయితే, దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) వరల్డ్కప్లో ఆడతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే.అనుభవజ్ఞులైన రో-కో జట్టులో ఉంటేనే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం వాళ్లిద్దరు మెగా టోర్నీకి అందుబాటులో ఉండే విషయమై తమకు ఇంత వరకు సమాచారం లేదన్నాడు. కానీ రో-కో మాత్రం తాము ఈ ఈవెంట్కు సిద్ధమనే సంకేతాలు ఇచ్చారు.గాయాల బెడదదేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఆడిన దిగ్గజ ద్వయం.. గత కొంతకాలంగా మంచి ఫామ్ కొనసాగించారు. అయితే, అఫ్గన్తో సిరీస్కు ముందు రోహిత్- కోహ్లి గాయపడటం మరోసారి చర్చకు తావిచ్చింది. 39 ఏళ్ల రోహిత్.. 38 ఏళ్ల కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నారు.కోహ్లి దాదాపు ఆరు వారాల పాటు ఆటకు దూరం కానుండగా.. రోహిత్ అఫ్గన్తో ఆఖరి వన్డే నాటికి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడిగా చెప్పుకొనే గ్రీన్స్టోన్ లోబో సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ జట్టులో ఉంటే టీమిండియా ఈసారి కూడా వన్డే వరల్డ్కప్ గెలవదని పేర్కొన్నాడు.రోహిత్ జట్టులో ఉంటే జట్టు గెలవదుటైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘వన్డే ప్రపంచకప్ గెలిచే భారత జట్టులో రోహిత్ శర్మ భాగంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. చాలా మంది నన్ను ఇదే విషయం గురించి అడుగుతున్నారు. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా? లేదా? అని వారు ఉత్సుకతతో ఉన్నారు.సెలక్టర్లు కోరుకుంటే అతడు జట్టులో ఉంటాడు. అయితే, ఒక విషయం స్పష్టంగా చెప్పగలను. రోహిత్ శర్మ జట్టులో ఉంటే మాత్రం టీమిండియా ఈసారి వరల్డ్కప్ గెలవదు’’ అని గ్రీన్స్టోన్ లోబో పేర్కొన్నాడు.సారథిగా ఇప్పటికే ఎన్నో విజయాలుఏదేమైనా ఇప్పటికే రోహిత్ శర్మ సారథిగా ఎన్నో విజయాలు సాధించాడన్న గ్రీన్స్టోన్ లోబో.. ముంబై ఇండియన్స్ కారణంగా అతడు వన్డే వరల్డ్కప్ గెలవలేకపోయాడని విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కెప్టెన్గా రోహిత్ 2024లో టీ20 ప్రపంచకప్ సాధించాడు. వన్డే వరల్డ్కప్-2023 టోర్నీలోనూ అతడే సారథిగా ఉన్నాడు.అయితే, దురదృష్టవశాత్తూ కప్ గెలవలేకపోయాడు. నిజానికి ఫ్రాంఛైజీ క్రికెట్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అతడు ఐదు టైటిళ్లు గెలిచాడు. ఒకవేళ అలా జరుగకపోయి ఉంటే.. వన్డేలపై మరింత దృష్టి పెట్టి వరల్డ్కప్ కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ వల్ల టీమిండియా నష్టపోయింది’’ అని గ్రీన్స్టోన్ లోబో వ్యాఖ్యానించాడు.అభిమానుల ఆగ్రహంఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి వ్యాఖ్యలపై రోహిత్ శర్మ అభిమానులు భగ్గుమంటున్నారు. ఫేమస్ అయ్యేందుకు లాజిక్ లేకుండా మాట్లాడటం సరికాదని.. అసలు దిగ్గజ ఆటగాడి గురించి మాట్లాడే అర్హతే నీకు లేదంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. కాగా రోహిత్ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. 2025లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ (వన్డే ఫార్మాట్)ని సొంతం చేసుకుంది.చదవండి: కోపంతో ఊగిపోయిన వైభవ్ సూర్యవంశీ -
టీమిండియాకు షాక్.. ఆరు నెలలు ఆటకు దూరమైన కోహ్లీ!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఇంగ్లండ్తో వన్డే సిరీస్కు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాలి పిక్క కండరాల గాయంతో అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు దూరమైన కోహ్లీ తాజాగా గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో కోహ్లీ కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశముందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో జూలైలో ఇంగ్లండ్తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్కు కోహ్లీ దూరమైనట్లే. అయితే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. 'కోహ్లీ తొడ కండరంలో చీలిక వచ్చింది. ఈ గాయానికి శస్త్రచికిత్స అవసరం లేదు. అయితే ఇది నయం కావడానికి మాత్రం సుమారు ఆరు వారాల సమయం పట్టనుంది. దీనిలో భాగంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కోహ్లీ పునరావాసం పొందే అవకాశముంది. కాగా కోహ్లీ తన గాయంపై ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలోని ప్రఖ్యాత ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పర్దివాలాను టెలి-కన్సల్ట్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్లో కండరాల్లో చీలిక వచ్చినట్లు రిపోర్ట్లో తేలింది.' అని పేర్కొంది.ఇదిలా ఉండగా, ఆఫ్ఘనిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు ఫిట్నెస్ మదింపు కోసం రోహిత్ శర్మ జూన్ 8న బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ)కి హాజరుకానున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది . ఈ సిరీస్ కోసం రోహిత్ను జట్టులోకి తీసుకున్నప్పటికీ, అతని లభ్యత పూర్తిగా ఫిట్నెస్ పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. చదవండి: కుప్పకూలిన కివీస్.. భారీ ఆధిక్యం దిశగా ఇంగ్లండ్ -
కోహ్లికి ఇండియాలో ఉండటం ఇష్టం లేదు లివింగ్ స్టోన్ షాకింగ్ కామెంట్స్
-
గాయాల బారిన సీనియర్లు.. టీమిండియాకు షాక్ తప్పదా?
ఐపీఎల్ 2026 సీజన్ ముగియడంతో టీమిండియా ప్రస్తుతం అఫ్గానిస్తాన్తో జరగనున్న టెస్టుతో పాటు వన్డే సిరీస్పై దృష్టి సారించింది. రేపటి నుంచి భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు గిల్ నేతృత్వంలోని టీమిండియా స్టేడియానికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత వెంటనే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేశారు. అయితే పిక్క కండరాల గాయంతో కోహ్లీ ఈ సిరీస్కు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో కోహ్లీ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆఫ్గన్తో వన్డే సిరీస్కు కోహ్లీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. జూన్ 13న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి వన్డేకు రుతురాజ్ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటన విడుదల చేసినట్లు నివేదికలు వచ్చాయి. కానీ రుతురాజ్ గైక్వాడ్ భారత-ఏ జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు బయల్దేరి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో ఈ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పడినట్లయింది.లంక పర్యటనలో భారత్.. శ్రీలంక-ఏ, అప్గానిస్తాన్-ఏ జట్లతో కలిసి ట్రై సిరీస్ ఆడనుంది. తాజాగా రుతురాజ్ కొలంబోలో దర్శనమివ్వడంతో మరి కోహ్లీ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.ఎటూ తేల్చని బీసీసీఐ?ఆఫ్గన్తో వన్డే సిరీస్కు 15 మందితో జట్టును ప్రకటించడంతో కోహ్లీ దూరమైన అతడి స్థానాన్ని ఆ సిరీస్కు ఎంపికైన ఆటగాళ్లలో ఒకరితోనే భర్తీ చేయాలనే నిర్ణయానికి బీసీసీఐ వచ్చినట్లు తెలుస్తోంది. కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కూడా ఆఫ్గన్తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. అతడు కూడా పిక్క కండరాల గాయంతో బాధపడుతుండడం టీమిండియాకు ప్రతికూలంగా మారనుంది. మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇలా జట్టులోని సీనియర్లంతా గాయాల బారిన పడడంతో వన్డే సిరీస్లో అప్గానిస్తాన్ మనకు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనసరం లేదని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కోహ్లీ, రోహిత్, పాండ్యాలు దూరమైతే మాత్రం బీసీసీఐ వీరి స్థానంలో కనీసం ఇద్దరినైనా జట్టులోకి తీసుకోవాల్సిన అవసరముంటుంది. అయితే వన్డే సిరీస్కు ఇంకా సమయం ఉండడంతో బీసీసీఐ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోనుంది.ఆఫ్గన్తో వన్డే సిరీస్కు టీమిండియాశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబేచదవండి: ఫిఫాకు ట్రోఫీ తిరిగివ్వని బ్రెజిల్.. విలువెంతో తెలుసా? -
‘ఇండియాలో లైఫ్ కోహ్లికి అస్సలు ఇష్టం లేదు’
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. కోహ్లిని ఒక్కసారి నేరుగా చూస్తే తమ జన్మ ధన్యమైనట్లు భావించే వీరాభిమానులు కూడా కోకొల్లలు.కోహ్లికి ఉన్న విపరీతమైన ఈ క్రేజ్ అతడికి ఒక రకంగా శాపంగా మారిందంటున్నాడు ఇంగ్లండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్. నిజానికి భారత్లో జీవించడం కోహ్లికి కష్టంగా మారిందని.. అందుకే అతడు లండన్కు మకాం మార్చి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్-2025లో లివింగ్స్టోన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ లెజెండ్ కోహ్లి (Virat Kohli)తో తనకు ఏర్పడిన అనుబంధం, సహచర ఆటగాళ్ల పట్ల అతడు వ్యవహరించే తీరుపై లివింగ్స్టోన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తిస్టిక్ టు క్రికెట్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘కోహ్లి అత్యద్భుతమైన వ్యక్తి. విరాట్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగడం నాకెంతో ఇష్టం. అతడితో కలిసి ఆడటాన్ని కూడా ఆస్వాదిస్తా. అతడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉంటాడు.ఎవరికి ఏ అవసరం ఉన్నా.. సలహా, సూచన కావాలన్నా అతడు ముందుంటాడు. అయితే, ఒక్కసారి మైదానంలో దిగిన తర్వాత అతడిలోని పోటీతత్వం తారస్థాయికి చేరుకుంటుంది. అతడు పూర్తిగా భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తాడు.కుటుంబానికే ప్రాధాన్యంఅయితే, ముందుగా చెప్పినట్లు మైదానం వెలుపల మాత్రం అతడు అందరితో చాలా చాలా బాగుంటాడు. కుటుంబంతో సమయం గడపడం అంటే అతడికి ఎంతో ఇష్టం. నిజానికి ఇండియాలో జీవించే జీవితం అతడికి అసలు ఇష్టం లేదనే చెప్పవచ్చు.ఇండియాలో లైఫ్ అతడికి నచ్చదుప్రతి ఒక్కరూ తననే గమనిస్తూ ఉండటం అతడికి అస్సలు నచ్చదు. కోహ్లి చాలా మంచివాడు. మనసులో ఒకటి.. బయటకు ఒకటి ఉండదు. అయితే, మైదానంలోకి వెళ్లిన తర్వాత మాత్రం అతడిలా పూర్తిగా మారిపోయే మరొక ప్లేయర్ని మాత్రం నేను ఇంతవరకు చూడలేదు’’ అని లియామ్ లివింగ్స్టోన్ చెప్పుకొచ్చాడు.లండన్లో నివాసంకాగా బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్న కోహ్లికి.. కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. అనుష్క లండన్లోనే అకాయ్కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కోహ్లి కుటుంబం ఎక్కువగా లండన్లోనే నివసిస్తోంది. బ్రాండ్ ఎండార్స్మెంట్లు, ఐపీఎల్, స్వదేశంలో జరిగే మ్యాచ్లు, ఆశ్రమాలకు వెళ్లేందుకు మాత్రమే కోహ్లి భారత్కు వస్తున్నాడు.తమకున్న క్రేజ్ తన పిల్లలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో విరుష్క దంపతులు ఇప్పటి వరకు వారి ఫొటోలు కూడా రివీల్ చేయలేదు. లండన్లో సామాన్యుల్లా రోడ్ల మీద నడుస్తూ చిల్ అవడమే తమకు సంతోషంగా ఉంటుందని ఈ జంట పలుమార్లు చెప్పకనే చెప్పింది.ఇక ఐపీఎల్ టైటిల్ గెలవాలన్న కోహ్లి కల గతేడాది నెరవేరింది. పద్దెమినిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. అదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ చాంపియన్గా నిలిచింది. దీంతో కోహ్లి సంతోషం రెట్టింపు అయింది.చదవండి: భారత క్రికెటర్ల రిటైర్మెంట్పై బీసీసీఐ కఠిన నిర్ణయం! -
రోహిత్- కోహ్లి ఆడతారా?.. స్పందించిన టీమిండియా కోచ్
అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అందుబాటులో ఉంటారా? లేదా?.. క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. ఐపీఎల్-2026లో కోహ్లి అదరగొట్టిన సంగతి తెలిసిందే.రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఓపెనర్గా కొనసాగుతున్న కోహ్లి.. ఈ సీజన్లో 16 మ్యాచ్లలో కలిపి 675 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీ ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు.అంతలోనే గాయమా?ఇక ఆర్సీబీ రెండోసారి టైటిల్ విజేతగా అవతరించిన తరుణంలో కోహ్లి సంబరాలు అంబరాన్నంటాయి. భార్య అనుష్క శర్మ, సహచర ఆటగాళ్లతో కలిసి అతడు ఉత్సాహంగా డాన్స్ చేసిన దృశ్యాలు వైరల్గా మారాయి. అయితే, అంతలోనే కోహ్లి తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడనే వార్త బయటకు వచ్చింది.ఫలితంగా అఫ్గనిస్తాన్తో వన్డే సిరీస్కు కోహ్లి దూరమయ్యాడనే వార్త చక్కర్లుకొడుతోంది. మరోవైపు.. ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ తొడ కండరాల గాయం కారణంగా ఐదు మ్యాచ్లకు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి వచ్చినా ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలోకి దిగాడు.రోహిత్ కూడా డౌటేఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సైతం సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే తాజాగా స్పందించాడు. అఫ్గనిస్తాన్తో టీమిండియా ఏకైక టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ..కోచ్ ఏమన్నాడంటే..‘‘ఇప్పటి వరకు మాకు కూడా అధికారిక సమాచారం అందలేదు. విరాట్, రోహిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల వల్ల దూరవుతున్నారంటే అది నిజంగా పెద్ద వార్తే. అయితే, ఏ ఆటగాడి విషయంలోనైనా ప్రొటోకాల్ ఒకేలా ఉంటుంది.వాళ్లు ఫిట్నెస్ పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్యాచ్ ఆడేందుకు ఫిట్గా ఉన్నారా? లేరా? అన్నది మా వైద్య బృందం నిర్ణయిస్తుంది. వారి సూచన ప్రకారమే రో-కోలను ఆడించాలా? వద్దా? అన్నది తేలుతుంది.ఒకవేళ వాళ్లు దూరమైతే వారి స్థానాలను భర్తీ చేసే అంశంపై కూడా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని డష్కాటే తెలిపాడు. కాగా జూన్ 6- 20 మధ్య టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్తో ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఏం జరుగుతోంది?ఇదిలా ఉంటే.. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ- విరాట్ కోహ్లి.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. వన్డే వరల్డ్కప్-2027 ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మెగా టోర్నీకి ముందు కొన్ని వన్డేలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రో-కో గాయాల బారిన పడటం అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. చదవండి: ‘పంజాబ్ కింగ్స్ ఈ ఐదుగురిని వదిలేయాలి’ -
పాటిదార్ ను తొక్కేస్తున్న కోహ్లి
-
ఆఫ్ఘన్ సిరీస్కు విరాట్ ప్రత్యామ్నాయం ఇతడే..!
త్వరలో (జూన్ 13) స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్తో జరుగబోయే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ నుంచి టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయం కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే. విరాట్ తాజాగా ముగిసిన ఐపీఎల్ 2026లో హ్యామ్ స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఈ గాయం విషయమై వైద్యులను సంప్రదించగా.. రెండు వారాల విశ్రాంతిని సూచించారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ ప్రకటించాడు.ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ సిరీస్కు విరాట్ ప్రత్యామ్నాం ఎవరనే చర్చ పొద్దున్నుంచి నడుస్తుంది. ఈ విషయమై ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నా.. బీసీసీఐ ఓ వ్యక్తిని ఫైనల్ చేసిందని సమాచారం. విరాట్ రీప్లేస్మెంట్ కోసం తిలక్ వర్మ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ పోటీపడినప్పటికీ.. సెలెక్టర్లు రుతురాజ్ గైక్వాడ్వైపు మొగ్గుచూపారని తెలుస్తోంది.ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న గైక్వాడ్.. త్వరలో మరోసారి భారత వన్డే జట్టు తరఫున బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. దక్షిణాఫ్రికాతో జరిగిన తన చివరి వన్డే సిరీస్లో గైక్వాడ్ అద్భుతంగా రాణించాడు. మూడు మ్యాచ్ల్లో 113 పరుగులు చేయడంతో పాటు రెండో వన్డేలో శతకం (105) నమోదు చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే సెలెక్టర్లు తిలక్, పడిక్కల్, పాటిదార్ను కాదని రుతురాజ్వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. -
విరాట్ కోహ్లి అవుట్.. టీమిండియాలోకి హైదరాబాదీ!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాకు విరాట్ కోహ్లి రూపంలో భారీ షాక్ తగిలింది. ఈ సిరీస్కు తొడ కండరాల గాయం కారణంగా కోహ్లి దూరమయ్యాడు. ఐపీఎల్-2026 ఫైనల్లో కూడా గాయంతో బాధపడుతూనే ఆడాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అఫ్గాన్ సిరీస్ నుంచి తప్పుకోవాలని విరాట్ నిర్ణయించుకున్నాడు. దీంతో కోహ్లి స్ధానాన్ని భర్తీ చేసే పనిలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ పడింది.ఈ క్రమంలో విరాట్ స్ధానంలో జట్టులోకి వచ్చే అవకాశమున్న ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.తిలక్ వర్మహైదరాబాదీ తిలక్ వర్మ ప్రస్తుత రేసులో అందరికంటే ముందున్నాడు. టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యునిగా కొనసాగుతున్న తిలక్ను.. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకునే సూచనలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్కు మిడిలార్డర్లో రాణించే సత్తా ఉంది. అతడు ఇప్పటివరకు భారత్ తరపున కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడాడు. కాగా సెలక్టర్లు ఇటీవలే తిలక్ను శ్రీలంక టూర్ కోసం భారత-ఎ జట్టు కెప్టెన్ ఎంపిక చేశారు. ఒకవేళ తిలక్ను వన్డే జట్టులోకి తీసుకోవాలని భావిస్తే ఇండియా-ఎ టీమ్ కెప్టెన్గా మరొకరని నియమించే అవకాశముంది.దేవదత్ పడిక్కల్కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ కూడా సెలక్టర్ల రాడార్లో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్గానిస్తాన్తో ఏకైక టెస్టుకు ఎంపిక చేసిన భారత జట్టులో పడిక్కల్ భాగంగా ఉన్నాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి తీసుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. పడిక్కల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో ఆర్సీబీ తరపున పడిక్కల్ దుమ్ములేపాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం తన ప్రత్యామ్నాయ జట్టులో పడిక్కల్ను నెం.3 స్థానానికి ఎంపిక చేయడం విశేషం.రజత్ పాటిదార్ఇక ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించిన కెప్టెన్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నాడు. పాటిదార్ కూడా టాపర్డర్తో పాటు మిడిలార్డర్లో కూడా రాణించగలడు. అతడు మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. వీరితో పాటు రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నాడు. కానీ రుతురాజ్ భారత-ఎ జట్టు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. వీరిలో ఎవరు వైపు సెలక్టర్లు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. -
కెప్టెన్ గా పాటిదార్ ఈ టీం చూస్తే ప్రత్యర్ధులు వణకాల్సిందే
-
టీమిండియాకు బిగ్ షాక్!
అఫ్గానిస్తాన్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి హ్యామ్స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కాగా అఫ్గాన్తో మూడు వన్డేల సిరీస్ కోసం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు జూన్ 9న ముల్లాన్పూర్లో భారత జట్టుతో కలవనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు తొడ కండరాల గాయం బారిన పడడంతో విరాట్ సిరీస్ మొత్తానికే దూరం కావాల్సి వచ్చింది. వన్డే ప్రపంచకప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ వైట్బాల్ సిరీస్కు కోహ్లి దూరం కావడం భారత్కు నిజంగా గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి.విరాట్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ను అందించాడు. ఐపీఎల్లో దుమ్ములేపిన విరాట్ను భారత జెర్సీలో చూడాలని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అతడు మళ్లీ జూలైలో ఇంగ్లండ్తో జరగనున్న వన్డే సిరీస్లో బరిలోకి దిగననున్నాడు.మరోవైపు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్లో ఆడటంపై కూడా ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. రోహిత్ కూడా ప్రస్తుతం తొడ కండరాల గాయంతోనే బాధపడుతున్నాడు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్ తన ఫిట్నెస్ను నిరూపించుకోవాల్సి ఉంది. ఫిట్నెస్ పరీక్షలలో అతడు పాసైతేనే జట్టులో కొనసాగనున్నాడు. లేదంటే అతడి స్ధానాన్ని యశస్వి జైశ్వాల్తో భర్తీ చేయనున్నారు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ జూన్ 13 న ధర్మశాల వేదికగా ప్రారంభం కానుంది.అఫ్గానిస్తాన్తో వన్డేలకు భారత జట్టుశుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్, కుల్దీప్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, హార్దిక్ పాండ్యాచదవండి: ఆ తప్పిదమే పంజాబ్ కింగ్స్ కొంపముంచింది: సచిన్ -
వైభవ్తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే.. వీడియో వైరల్
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి సంతోషంలో మునిగితేలుతున్నాడు. ఐపీఎల్ తొలి టైటిల్ కోసం పద్దెనిమిదేళ్లు ఎదురుచూసిన ఈ రన్మెషీన్ కల గతేడాది ఫలించింది. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ నుంచి అతడు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) 2025లో తొలిసారి ట్రోఫీ గెలిచింది.ఐపీఎల్-2026లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఐదు వికెట్ల తేడాతో గెలిచి విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్లో కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.వైభవ్ నమస్కారం చేయగా.. ఇదిలా ఉంటే.. ఫైనల్లో విజయం తర్వాత రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు, ఆరెంజ్క్యాప్ విన్నర్ వైభవ్ సూర్యవంశీతో కోహ్లి కాసేపు ముచ్చటించాడు. కోహ్లిని చూసి వైభవ్ నమస్కారం చేయగా.. ప్రతిగా అతడి భుజం తట్టి హత్తుకున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడో తెలుసుకోవాలని నెటిజన్లు ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.వాళ్ల మాటలు పట్టించుకోకుఈ నిరీక్షణకు ఆర్సీబీ తెరదించింది. కోహ్లి- వైభవ్ల వీడియోను బుధవారం షేర్ చేసిన యాజమాన్యం.. కోహ్లి వైభవ్కు ఇచ్చిన సలహా ఏమిటో తెలియజేసింది. వీడియో ప్రకారం.. ‘‘నువ్వు ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. నీ కఠోర శ్రమ, ఆత్మవిశ్వాసం వల్లే నువ్వు ఇది సాధించగలిగావు.అయితే, నీ గురించి ఎవరు.. ఏం మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? అన్న విషయాల గురించి అస్సలు పట్టించుకోకు. నిజం చెప్పాలంటే.. బిహారీ ఎవరినైనా ఓడించగలడు. ఎవరినైనా అధిగమించగలడు’’ అని కోహ్లి వైభవ్తో పేర్కొన్నాడు.776 పరుగులుకాగా గతేడాది ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. ఈ సీజన్లో ఏకంగా 776 పరుగులు సాధించాడు. తద్వారా అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు.. రాజస్తాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. కోహ్లి ఈ సీజన్లో 675 పరుగులు సాధించి టాప్-4లో నిలిచాడు. ఫైనల్లో రాణించి ఆర్సీబీ రెండో టైటిల్ గెలవడంలో తన వంతు సాయం అందించాడు.చదవండి: నువ్వు కూర్చో.. అతడినే వన్డౌన్లో పంపుతాం అన్నాడు!𝗧𝗵𝗲 𝗺𝗮𝗻 𝘄𝗵𝗼 𝗺𝗮𝗱𝗲 𝗜𝗻𝗱𝗶𝗮𝗻 𝗰𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🤝 𝘁𝗵𝗲 𝗯𝗼𝘆 𝘄𝗵𝗼 𝗯𝗮𝘁𝘀 𝗳𝗲𝗮𝗿𝗹𝗲𝘀𝘀 🫶💪The best piece of advice the 15-year old Vaibhav Suryavanshi could get! And who better than Virat Kohli to help fuel his fire in the right direction.… pic.twitter.com/MUqCRBo0la— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
కప్పు గెలిచారు.. అంతలోనే ఆర్సీబీ లెజెండ్ రిటైర్మెంట్
ఐపీఎల్-2026 సీజన్ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాసు శంకర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ఫ్రాంచైజీ బుధవారం ఎక్స్వేదికగా ధ్రువీకరించింది.మా అందరి కళ్లల్లో నీళ్లు"మీరు తీసుకున్న ఈ నిర్ణయం మా అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. బసు శంకర్ సార్… ఈ సీజన్ విజయంలో మీ పాత్ర వెలకట్టలేనిది. ఈ విజయం.. తెరవెనుక మీరు పడిన లెక్కలేనన్ని గంటల కష్టానికి ప్రతిఫలం. ఈ సక్సెస్లో భాగమైన మా సపోర్ట్ స్టాఫ్ ,మేనేజ్మెంట్ సభ్యులందరికీ ధన్యవాదాలు" ఆర్సీబీ ఓ భావోద్వేగ పోస్ట్ను ఎక్స్లో షేర్ చేసింది. ఎనిమిది సీజన్ల పాటు2019లో ఆర్సీబీ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన బసు శంకర్, ఎనిమిది సీజన్ల పాటు తన సేవలను అందించాడు. బెంగళూరు జట్టు వరుసగా రెండు సార్లు విజేతగా నిలవడంలో ఆయనది కీలక పాత్ర. ప్లేయర్లతో వివిధ రకాల వ్యాయామాలు చేయిస్తూ శారీరక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఆయన తెరవెనుక పోషించిన పాత్ర అసాధారణమైనది. అంతకంటే ముందు భారత జాతీయ క్రికెట్ జట్టుకు హెడ్ స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్గా పనిచేశారు. భారత క్రికెట్లో 'యో-యో' (Yo-Yo) టెస్ట్ను ప్రాచుర్యంలోకి తెచ్చి, టీమిండియాను ప్రపంచంలోనే అత్యంత ఫిట్ ప్రొఫెషనల్ జట్టుగా మార్చిన ఘనత ఆయనదే. విరాట్ కోహ్లి లాంటి దిగ్గజం ఫిట్నెస్ సక్సెస్ వెనక కూడా బసు శంకర్ ఉన్నారు.This news made us all teary eyed. 𝐁𝐚𝐬𝐮 𝐒𝐡𝐚𝐧𝐤𝐞𝐫 𝐒𝐢𝐫… ❤️🥺This season was built on countless hours of hard work behind the scenes. To every member of our support staff and management who made this journey possible, thank you. 🤗🫶A special salute to Basu Shanker… pic.twitter.com/K2UInIBhC9— Royal Challengers Bengaluru (@RCBTweets) June 3, 2026 -
వారెవ్వా కోహ్లీ.. రోజు వ్యవధిలో ఎంత మార్పు!
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు వృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని మంగవారం సందర్శించారు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత ఆర్సీబీ బ్యాటర్ కోహ్లీ తన భార్య అనుష్కతో కలిసి ఆధ్యాత్మిక ఆశ్రమానికి వచ్చాడు. ప్రేమానంద్ మహారాజ్కు చెందిన రాధా కేళీ కుంజ్ ఆశ్రమానికి వెళ్లారు. కాగా కోహ్లీ, అనుష్క దంపతులు ఇప్పటికే అనేక సార్లు ఆశ్రమాన్ని విజిట్ చేశారు. ఆశ్రమానికి వెళ్లి బయటకు వస్తున్న కోహ్లీ, అనుష్కకు సంబంధించిన వీడియోలు, ఫొటోలే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా సింపుల్ డ్రెస్సులో ఇద్దరూ ఆశ్రమానికి వెళ్లారు. మాస్క్లతో తమ ముఖాన్ని కవర్ చేసుకున్నారు. ప్రేమానంద్ ఆధ్యాత్మిక బోధనలు వినేందుకు తరుచూ అనుష్క, కోహ్లీ జంట ఆశ్రమానికి వెళ్తుంటారు. ఇది చూసిన ఆర్సీబీ అభిమానులు.. ‘వారెవ్వా కోహ్లీ.. ఒక్కరోజులో ఎంత మార్పు’..‘టైటిల్ టు ఆధ్యాత్మికం వైపు అడుగులు’ అంటూ కామెంట్లు చేశారు.గత ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్పై ఆర్సీబీ విజయం సాధించింది. అయితే ట్రోఫీ పట్టుకున్న సమయంలో కోహ్లీ నుదురుపై అనుష్కా కిస్ ఇచ్చింది.ఆ తర్వాత ఆర్సీబీ గెలుపు సంబరాలకు సంబంధించిన ఒక ఈవెంట్లోనూ విరుష్క జంట అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. 🎥 | Virat Kohli and Anushka Sharma’s visit to #PremanandMaharaj’s Radha Keli Kunj Ashram in #Vrindavan has gone viral on #socialmedia, with a video showing the couple seeking blessings from the spiritual leader. The visit came days after #RCB’s historic #IPL title triumph, and… pic.twitter.com/QPucsbjK6i— The Statesman (@TheStatesmanLtd) June 2, 2026చదవండి: 'మాట తప్పిన మూర్ఖుడు.. అత్యంత చెత్త యజమాని!' -
కోహ్లీ, పాటీదార్ కాదు.. ఆర్సీబీ రాత మారింది ఆమె వల్లే!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది చాంపియన్గా నిలిచింది. అయితే ఐపీఎల్ ఆరంభం నుంచి 'ఈ సాలా కప్ నమ్దే' అంటూ 17 ఏళ్లుగా టైటిల్ కోసం చకోర పక్షిలా ఎదురుచూసింది. అప్పటికీ మూడుసార్లు ఫైనల్ చేరినా తుది మెట్టుపై బోల్తా పడడంతో ఇక ఆర్సీబీ టైటిల్ కల కష్టమే అని ఫ్యాన్స్ కూడా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.కానీ 17 ఏళ్లలో దక్కని టైటిల్ గతేడాది తమ చెంత చేరడంతో ఆర్సీబీ ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఈ సీజన్లో అద్భుత ప్రదర్శనతో ఆర్సీబీ రెండోసారి కప్ ఒడిసిపట్టడంతో రజత్ పాటీదార్ లక్కీ కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన మూడో కెప్టెన్గా పాటీదార్ నిలిచాడు. ఈ క్రమంలో పాటీదార్ను ఆర్సీబీకి ట్రోఫీ అందించిన లక్కీ కెప్టెన్ అని పొగుడుతున్నారు.కానీ ఆర్సీబీ రాత అంతకుముందే మారిందని కొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఆర్సీబీ పురుషుల జట్టు టైటిల్ సాధించ డానికి ముందే మహిళల జట్టు ఆ ఘనత సాధించింది. స్మృతి మందాన నేతృత్వంలోని ఆర్సీబీ వుమెన్ టీం 2024లోనే తొలి టైటిల్ సాధించింది. అయితే 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్లో ఆర్సీబీ మహిళల జట్టు కూడా మొదట్లో ఓటమిబాటలోనే నడిచింది. ఆ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్లలో ఓడిపోయి పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. దీంతో పురుషుల జట్టు మాదిరే మహిళల జట్టు కూడా ట్రోలింగ్కు గురైంది. అయితే మరుసటి సీజన్లోనే మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ కమ్బ్యాక్ ఇచ్చింది. ఆ సీజన్ ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను చిత్తు చేసిన ఆర్సీబీ వుమెన్ తొలిసారి ఫ్రాంచైజీకి టైటిల్ అందించింది. దీంతో కెప్టెన్గా మంధాన పేరు మార్మోగిపోయింది. 2025 సీజన్లో టైటిల్ సాధించడంలో విఫలమైనప్పటికీ, 2026 సీజన్లో మరోసారి ఆర్సీబీ మహిళల జట్టు చాంపియన్గా నిలిచింది. ముఖ్యంగా కెప్టెన్గా, బ్యాటర్గా మంధాన అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన ఫైనల్లో మంధాన 41 బంతుల్లోనే 87 పరుగులు సాధించి ఒంటిచేత్తో ఆర్సీబీకి రెండో కప్పును అందించింది. దీంతో ఆర్సీబీ కూడా చాంపియన్గా నిలవగలదని మంధాన బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చింది. మహిళల జట్టును ఆదర్శంగా తీసుకున్న పురుషుల జట్టు లెగసీని కంటిన్యూ చేస్తూ ఇవాళ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలిచింది. రాబోయే రెండు మూడేళ్లు ఆర్సీబీకి చెందిన మహిళల జట్టు డబ్ల్యూపీఎల్లో.. పురుషుల జట్టు ఐపీఎల్లో వరుస టైటిల్స్ సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు.ఆర్సీబీని మార్చిన కోహ్లీ సందేశం..2023 డబ్ల్యూపీఎల్లో వైఫల్యం తర్వాత ఆర్సీబీ మహిళల జట్టుతో కోహ్లీ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మహిళల జట్టుకు 'ఫలితం కోసం ఆశించకుండా 110 శాతం కష్టపడండి' అంటూ కోహ్లీ తన మోటివేషన్ స్పీచ్తో ఆ ఏడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అలా కోహ్లీ సందేశాన్ని ఒంటబట్టించుకున్న మంధాన సేన 2024 సీజన్లో టైటిల్ను సాధించింది. ఆర్సీబీ తలరాత మార్చింది కోహ్లీ, పాటీదార్ కాదు.. మంధాన అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫన్నీ పోస్టులు పెడుతున్నారు.𝙀𝙚 𝙎𝙖𝙡𝙖 𝘾𝙪𝙥 𝙉𝙖𝙢𝙙𝙪 x 2⃣ 🏆🏆Smriti Mandhana 🤝 Rajat Patidar #TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/QxVAOX8oq2— IndianPremierLeague (@IPL) May 31, 2026చదవండి: షకీరా కూడా పనికిరాదు.. ఫ్యాన్స్ను షేక్చేస్తోన్న ఫిఫా పాట! -
IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?
భారత మెగా క్రికెట్ సంబరం ఐపీఎల్-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ను ఓడించి.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్ రిచ్ లీగ్లో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్ కింగ్ను గుర్తుచేశాడు.అయితే, సీజన్ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుబ్మన్ గిల్ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ ఓటమికి అక్కడే పునాది పడింది.అత్యుత్తమ జట్టుఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ సీజన్కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..ఓపెనర్లుగా ఎవరంటే?‘‘వైభవ్ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్ కోహ్లి నా జట్టు ఓపెనర్గా ఉంటాడు.మూడో స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ను ఆడిస్తాను. అతడే నా వికెట్ కీపర్.. అదే విధంగా వైస్ కెప్టెన్ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.అతడు లేకుంటే ఎలా?ఐదో స్థానంలో హైదరాబాద్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ అతడు.అతడికి తోడుగా హైదరాబాద్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా సరైనోడు.ఎనిమిదో స్థానానికి సునిల్ నరైన్ లేదంటే రషీద్ ఖాన్ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉంటాడనడంలో సందేహం లేదు.బౌలింగ్ దళం ఇదేఈ సీజన్లోనూ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్ కాంబోజ్, సకీబ్ హుసేన్, రసిఖ్ సలామ్ దర్ పేర్లను పరిశీలించాను.సకీబ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిఖ్ కూడా తక్కువేమీ కాదు. అన్క్యాప్డ్ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్కే నా ఓటు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్ (732 రన్స్), సాయి (722)లకు మాత్రం ఆకాశ్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.ఐపీఎల్-2026 సీజన్కు గానూ ఆకాశ్ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).వైభవ్ సూర్యవంశీ (776 రన్స్), విరాట్ కోహ్లి (675 రన్స్), ఇషాన్ కిషన్ (602 రన్స్), రజత్ పాటిదార్ (కెప్టెన్- 501 రన్స్), హెన్రిచ్ క్లాసెన్ (624 రన్స్), నితీశ్ కుమార్ రెడ్డి (302 రన్స్, 8 వికెట్లు ), కృనాల్ పాండ్యా (226 రన్స్, 14 వికెట్లు), సునిల్ నరైన్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు), రసిఖ్ సలామ్ దర్ (19 వికెట్లు).చదవండి: నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు! -
కింగ్ పదానికి కోహ్లీ అర్హుడు కాదు.. పాక్ కపట బుద్ధి!
ఈ తరం క్రికెటర్లలో ఆల్ టైమ్ గ్రేటెస్ట్ జాబితాలో ఆటగాళ్ల పేర్లను వెలికితీస్తే అందులో టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ కచ్చితంగా ఉంటాడు. భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత మూడు ఫార్మాట్లు (టెస్టు, వన్డే, టీ20) కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్గా కోహ్లీ చరిత్రకెక్కాడు. కోహ్లీ మూడు ఫార్మాట్లు కలిపి 559 మ్యాచ్ల్లో 28,215 పరుగులు సాధించాడు. ఇందులో 85 సెంచరీలు, 146 హాఫ్ సెంచరీలున్నాయి. అలాంటి కోహ్లీతో కొన్నాళ్ల క్రితం వరకు పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం పరుగుల పరంగా పోటీ పడ్డ మాట నిజమే. ఒక దశలో కోహ్లీ రికార్డులను కూడా బాబర్ బద్దలుకొట్టాడు. అయితే క్రమేపి బాబర్ ఆజం ఆటలో పదును తగ్గుతూ రావడం.. అదే సమయంలో కోహ్లీ వయసు పెరుగుతున్న కొద్ది బ్యాటింగ్లో జోరు కనబరచడం జరిగిపోయింది. దీంతో బాబర్ ఆజం కోహ్లీకి ఆమడ దూరంలోనే నిలిచిపోయాడు. ఇప్పటివరకు బాబర్ ఆజం మూడు ఫార్మాట్లు కలిపి 15,647 పరుగులు సాధించాడు. ఇందులో 32 శతకాలు, 108 అర్థసెంచరీలున్నాయి. అయితే బాబర్ ఆజం టీ20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. కానీ మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే మాత్రం కోహ్లీ చేసిన పరుగుల్లో బాబర్ సగం కూడా చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో పాక్ మాజీ పేసర్ తన్వీర్ అహ్మద్ కోహ్లీ కంటే బాబర్ ఆజం గొప్పోడంటూ ప్రశంసలు కురిపించడం ఆసక్తి రేపింది. 'విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో 675 పరుగులు సాదించాడు. కానీ అదే సమయంలో బాబర్ ఆజం పీఎస్ఎల్లో కోహ్లీ కంటే నాలుగు తక్కువ ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ 588 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్లు కలిపి చూస్తే కోహ్లీవి ఎక్కువ పరుగులు ఉండొచ్చు.. కానీ టీ20 క్రికెట్లో బాబర్ను మించిన బ్యాటర్ లేడు. పరుగులు సాధించడమే కాదు సెంచరీల విషయంలోనూ కోహ్లీపై బాబర్ ఆజందే పైచేయి. అదీగాక కోహ్లీ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నాడు. కానీ బాబర్ ఇప్పటికీ మూడు ఫార్మాట్లు నిలకడగా ఆడుతున్నాడు. రాబోయే కాలంలో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో ఉన్న రికార్డులన్నింటిని తన పేరిట లిఖించుకోనున్నాడు.' అని చెప్పుకొచ్చాడు. అంతటితో ఊరుకోకుండా తన్వీర్ అహ్మద్ తన ఎక్స్ ఖాతాలో కింగ్ అనే పదానికి బాబర్ ఆజం సరైన నిర్వచనమని, కోహ్లీ దీనికి ఎంతమాత్రం సరిపోడంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం కనిపించింది. 'గత పదేళ్లలో అన్ని ఫార్మాట్లలోనూ కోహ్లీతో పోటీ పడి పరుగులు సాధించిన బాబర్ ఆజం నా దృష్టిలో గొప్ప క్రికెటర్. నేను అతడిని కింగ్ అని పిలుచుకుంటా' అని పేర్కొన్నాడు. తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'పరుగుల యంత్రంగా పేరున్న కోహ్లీని అవమానిస్తుంటే చూస్తూ ఊరుకోము.'..'టీమిండియా బ్యాటర్లు బాగా ఆడుతుంటే ఓర్వలేనితనం ఎలా ఉంటుందో పాక్ నిరూపించింది' టీమిండియా అంటే పాక్కు ఎప్పుడు కుళ్లే ఉంటుంది’ అని కామెంట్లు చేస్తున్నారు.కోహ్లీతో సరితూగలేడు.. నిజానికి బాబర్ కంటే ఏడేళ్ల ముందే కోహ్లీ (2008లో) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బాబర్ అడుగుపెట్టే సమయానికే కోహ్లీ స్టార్ క్రికెటర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కోహ్లీ బ్యాటింగ్తో ఏమాత్రం సరితూగని బాబర్ ఆజంకు కలిసొచ్చే అంశం ఏదైనా ఉందంటే.. వయసు దృష్ట్యా అతడు మరో ఐదారేళ్లు క్రికెట్ ఆడే అవకాశముంది. అసలు కోహ్లీతో బాబర్ ఆజంను పోల్చలేము. ఐసీసీ మేజర్ టైటిల్స్ సాధించకపోయినప్పటికీ, కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ను, ఆ తర్వాత ఇంగ్లండ్, సౌతాఫ్రికా దేశాల్లో నిలకడ విజయాలు అందుకుంది. మరోవైపు బాబర్ ఆజం కేవలం టీ20 ప్రపంచకప్పుల్లో మాత్రమే టీమిండియాను ఓడించాడు. అందులో కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 ప్రపంచకప్లో 10 వికెట్ల తేడాతో పాక్ చేతిలో ఓడిపోవడమే బాబర్ ఆజంకు ఉన్న ఏకైక విజయం. అది మినహాయిస్తే కోహ్లీని ఏ విషయంలోనూ బాబర్ ఆజం మ్యాచ్ చేయలేడన్న సంగతి అందరికి తెలిసిందే.చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
ఐపీఎల్ ఫైనల్లోమెరిసిన అనుష్క, స్పెషల్ లగ్జరీ వాచ్, ధర ఎంతో?
ఐపిఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చారిత్రాత్మక విజయం సాధించిన వేళ నటి, స్టార్ క్రికెటర విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) మరోసారి ఆకర్షణీయంగా నిలిచారు. గుజరాత్లోని అహ్మదా బాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్లో అనుష్క శర్మ స్టాండ్స్ నుండి ఆర్సీబీని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ముఖ్యంగా ఆమె చేతి రూ. 28 లక్షల విలువైన 'కార్టియర్ పాంథర్' (Cartier Panthère) లగ్జరీ వాచ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. సింపుల్ అండ్ లగ్జరీ స్టైల్, ఫ్యాషన్ ప్రియులకు తెగ నచ్చేసింది.సెజాన్ లియోనార్డ్ వైట్ టాప్, వైడ్ లెగ్ ట్రౌజర్ల ధరించి సింపుల్ అండ్ క్లాసీ లుక్లో కనిపించింది. దీని ధర విలువ దాదాపు 25 వేల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆమె లుక్ సింపుల్గా ఉన్నప్పటికీ, చేతికి పెట్టుకున్న వాచ్ మాత్రం హైలైట్గా నిలిచింది. అభిమానులు అది ప్రముఖ లగ్జరీ బ్రాండ్ 'కార్టియర్ పాంథర్' వాచ్ అని గుర్తుపట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వివరాల ప్రకారం.. ఈ ఐకానిక్ వాచ్ ధర దాదాపు రూ. 28 లక్షల వరకు ఉంటుందని అంచనా. స్క్వేర్ డయల్, రోమన్ అంకెలు, బ్రాస్లెట్ స్టైల్తో ఉండే ఈ వాచ్ సెలబ్రిటీలలో చాలా ఫేమస్. నీతా అంబానీ లాంటి ఫ్యాషన్ ఐకాన్లతో ప్రజాదరణ పొందింది.కాగా ఆర్సీబీ ఐపీఎల్ 2026 ట్రోఫీని గెలవడంతో కోహ్లీ సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత విరాట్, అనుష్క కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీకి అనుష్క ఎల్లప్పుడూ అండగా నిలిచే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో విరాట్ కోహ్లీ 'One felt nice, we did twice' (ఒక్కసారి గెలిస్తే బాగుంటుంది అనుకున్నాం, కానీ రెండుసార్లు గెలిచాం) అని రాసి ఉన్న టీ-షర్ట్ ధరించి అనుష్కతో కలిసి డాన్స్ చేయడం విశేషం. మొత్తానికి ఆర్సీబీ విజయోత్సవాల్లో అనుష్క లగ్జరీ వాచ్ ఒక అనూహ్యమైన ఫ్యాషన్ హైలైట్గా నిలిచింది. ఇదీ చదవండి: వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్లోనూ సూపర్ స్టారే! -
కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది?
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ చాంపియన్గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్లో కోహ్లీ(75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించడమే గాక రెండోసారి టైటిల్ అందించాడు.అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి, అనుష్క శర్మల మధ్య జరిగిన ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. ఆ వీడియోలో అనుష్క, కోహ్లీ నడుచుకుంటూ వెళుతున్న సమయంలో, అనుష్క చేతిలో ఒక కవర్ కనిపించింది. ఇది చూసిన కోహ్లీ అందులో ఏముందో తెలుసుకోవడానికి అది ఒకసారి ఇవ్వాలని అడిగాడు. కానీ అనుష్క మాత్రం కోహ్లీకి లెటర్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.అయినా కోహ్లీ అదే పనిగా ఆమె చేతి నుంచి లెటర్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన అనుష్క శర్మ డగౌట్కు చేరుకున్న తర్వాత ఇస్తానులే అని చెప్పింది. దీంతో కోహ్లీ ఏంటి ఇలా చేస్తున్నావనడం వీడియోలో కనిపించింది. ఇది చూసిన అభిమానులు ఇంతకీ ఆ కవర్లో ఏముంది చెప్మా అంటూ కామెంట్లు పెట్టారు.మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, భువనేశ్వర్, హాజిల్వుడ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 18 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కోహ్లీ (75 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్తో ఆర్సీబీని గెలిపించగా, వెంకటేశ్ అయ్యర్ (32), టిమ్ డేవిడ్ (24) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, సిరాజ్, రబాడలు చెరొక వికెట్ తీశారు.FUNNY MOMENT AFTER THE FINAL 🤣🔥- Anushka had an envelope.- Virat Kohli was trying to take it.- But Anushka didn't want to give it.- Kohli tried multiple times but failed.- He was curious to know what was inside.Meanwhile, Anushka: "I'll give it to you there." 😅🔥 pic.twitter.com/v8k7jyaZ4z— Jara (@JARA_Memer) June 1, 2026చదవండి: కెనడా క్రికెట్పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం! -
విరాట్ కోహ్లీ నేర్పే పెట్టుబడి పాఠాలు!
విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫైనల్లో మరోసారి తన స్థిరమైన ఆటతీరుతో అద్భుత ప్రదర్శన చేశారు. 42 బంతుల్లో 75 పరుగులు (నాటౌట్) చేసి ఆర్సీబీ విజయానికి కీలక పాత్ర పోషించారు. అతని ఆట శైలి కేవలం భారీ షాట్లపై కాకుండా, సరైన టెక్నిక్, సహనం, క్రమశిక్షణపై ఆధారపడుతుందని అతని కోచ్ వ్యాఖ్యానించారు. కోహ్లీ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాదు. ఆయన కెరీర్ క్రీడల్లో మాత్రమే కాకుండా.. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో కూడా విలువైన పాఠాలు నేర్పుతుంది. ఈ కథనంలో ఆ విషయాలను వివరంగా తెలుసుకుందాం.➤ఒకటి.. కోహ్లీ విజయానికి కారణం అతని స్థిరత్వం, క్రమశిక్షణ. ఒక్క అద్భుతమైన ఇన్నింగ్స్ కాదు, సంవత్సరాల తరబడి నిరంతర ప్రదర్శనే అతన్ని గొప్ప ఆటగాడిగా నిలబెట్టింది. అదే విధంగా.. పెట్టుబడుల్లో కూడా ఒకేసారి పెద్ద లాభాలు ఆశించడం కంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ (SIP) వంటి విధానంతో నిరంతరంగా పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాన్ని ఇస్తుంది.➤రెండవది, తక్కువ వయస్సులోనే ప్రారంభించడం. కోహ్లీ 19 ఏళ్ల వయస్సులోనే ఐపీఎల్లో ప్రవేశించారు. ఇది అతనికి అనుభవం, తప్పిదాల నుంచి నేర్చుకునే అవకాశం కల్పించింది. పెట్టుబడుల్లో కూడా ముందుగా ప్రారంభిస్తే చక్రవడ్డీ ద్వారా ఎక్కువ సంపద సృష్టించుకోవచ్చు.➤మూడవది, డైవర్సిఫికేషన్ (పెట్టుబడుల విభజన). కోహ్లీ కేవలం ఒక రంగంలోనే కాకుండా స్పోర్ట్స్, టెక్, రియల్ ఎస్టేట్ వంటి అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా షేర్లు, బాండ్లు, బంగారం వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలి.➤నాలుగవది, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండడం. క్రికెట్లో ఒత్తిడి పరిస్థితుల్లో కూడా కోహ్లీ స్థిరంగా ఆడతాడు. అలాగే మార్కెట్ పతనాలు వచ్చినప్పుడు భయపడకుండా దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టాలి.➤చివరగా.. వయస్సు, అవసరాల ప్రకారం వ్యూహం మార్చుకోవడం. కోహ్లీ ఇప్పుడు కొన్ని ఫార్మాట్లకు మాత్రమే ఆడుతున్నాడు. అలాగే పెట్టుబడిదారులు కూడా రిటైర్మెంట్ దగ్గరపడే కొద్దీ రిస్క్ తగ్గించి సురక్షిత పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.Note: పెట్టుబడుల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.ఇదీ చదవండి: జాబ్ అంత ఈజీ కాదు.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన! -
IPL 2026: టాప్-10 వివాదాలపై ఒక లుక్కేద్దామా!
ఐపీఎల్లో పరుగుల పండుగ అభిమానులకు ఎంత కిక్ ఇస్తుందో, వివాదాలు, గొడవలు కూడా అదే స్థాయిలో ఫ్యాన్స్ను అలరించాయి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి తాజా 19వ సీజన్ దాకా ఎన్నో గొడవలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. మరి ఈ సీజన్లో అభిమానులకు కిక్ ఇచ్చిన టాప్-10 వివాదాలు ఏంటనేవి ఇప్పుడు తెలుసుకుందాం.1) కోహ్లి-గిల్ క్యాచ్ వివాదంఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లి క్యాచ్ ఔట్పై ఎంత రగడ జరిగిందనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 63 పరుగులతో కోహ్లి ఆర్సీబీని విజయం వైపు నడిపిస్తున్న సమయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి అర్షద్ ఖాన్ వేసిన బంతిని కోహ్లి మిడాఫ్ మీదుగా ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ గిల్ డైవ్ చేసి మరీ క్యాచ్ అందుకున్నాడు. అయితే, ఆ క్యాచ్ను గిల్ సరిగ్గా పట్టలేదని, చేతుల్లోకి వెళ్లడానికి ముందు బంతి నేలను తాకిందని కోహ్లీ భావించాడు. A chat between Virat Kohli and Shubman Gill on the catch. - The celebration by Kohli after winning the argument. 😄 pic.twitter.com/9yVbseOqGy— Mufaddal Vohra (@mufaddal_vohra) May 31, 2026అయితే అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వడంతో షాక్ తిన్న కోహ్లీ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. తాను ఔట్ కాదని, క్రీజు వదలి వెళ్లనని, థర్డ్ అంపైర్ రివ్యూకు చాన్స్ ఇవ్వాలిని మొండిపట్టు పట్టాడు. చేసేదేం లేక అంపైర్ తన నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు నివేదించాడు. రీప్లేలను పరిశీలించిన థర్డ్ అంపైర్కు కూడా అది స్పష్టంగా కనిపించకపోయినా.. బంతిలో కొంత భాగం నేలను తాకినట్లు గుర్తించి ఔట్ నిర్ణయాన్ని రద్దు చేసి నాటౌట్గా ప్రకటించాడు. కోహ్లీ సంబరాలు చేసుకోగా, గిల్ మాత్రం నిరాశతో చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత 75 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో కోహ్లీ ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.2) షేక్హ్యాండ్ వివాదం..ఈ సీజన్లో అభిమానులకు మరింత కిక్ ఇచ్చిన ఎపిసోడ్ అంటే కోహ్లీ, హెడ్ మధ్య జరిగిన షేక్ హ్యాండ్ వివాదమే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీతో హెడ్ వ్యంగ్యంగా మాట్లాడడం, దానికి కోహ్లీ ధీటుగా బదులివ్వడం జరిగిపోయాయి. అయితే ఈ గొడవ ఇక్కడితో సద్దుమణగలేదు. Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂Kohli you character 🔥 pic.twitter.com/W9CS6KM52t— Avénue.1 (@Avnueone8) May 23, 2026మ్యాచ్ పూర్తైన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చే క్రమంలో హెడ్ తన వద్దకు వచ్చినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా పక్కకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. ఈ వివాదం హెడ్ భార్యను కూడా తాకింది. ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతూ కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మరి ఈ వివాదానికి ఈ సీజన్తో ముగింపు పడిందా అంటే చెప్పలేని పరిస్థితి.3) టిమ్ డేవిడ్ అనైతిక చర్యమే 11న ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ విజయం తర్వాత ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ చేతి వేళ్లతో అసభ్య సంజ్ఞలు చేయడం వివాదాస్పదమైంది. సీజన్ ప్రారంభానికి ముందు జరిగిన మెగా వేలంలో ముంబై ఇండియన్స్ తనను విడుదల చేయడంపై వ్యంగ్యంగా ఈ సైగలు చేసినట్లు తేలింది. దీంతో బీసీసీఐ టిమ్ డేవిడ్ చర్యను తప్పుబడుతూ అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించడంతో పాటు రెండు డీ మెరిట్ పాయింట్లు కేటాయించింది.4) టాస్ వివాదం..ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-2 పోరు సందర్భంగా టాస్ సమయంలో నెలకొన్న గందరగోళం వివాదంగా మారింది. మొదట టాస్ వేసినప్పుడు పరాగ్ హెడ్ అని చెప్పాడు. అయితే మ్యాచ్ రిఫరీ ప్రకాశ్ భట్ మాత్రం పరాగ్ చెప్పింది అర్థం కాలేదంటూ టాస్ మళ్లీ వేయించాడు. రెండో ప్రయత్నంలో రాజస్తాన్ రాయల్స్కు టాస్ అనుకూలించడంతో బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలి ప్రయత్నంలో గుజరాత్కు టాస్ అనుకూలంగా వచ్చినట్లు తర్వాత తేలింది. ఈ సమయంలో గుజరాత్ కెప్టెన్ గిల్ కాస్త అయోమయానికి గురయ్యాడు. కానీ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించడంతో ఈ వివాదంపై పెద్దగా చర్చ జరగలేదు.5) అంపైరింగ్పై ఎస్ఆర్హెచ్ ఫిర్యాదు ఈ సీజన్లో వరుస వివాదాస్పద అంపైరింగ్ నిర్ణయాలు తమను తీవ్ర ప్రభావితం చేశాయంటూ ఎస్ఆర్హెచ్ బీసీసీఐని ఆశ్రయించడం హైలైట్గా నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో క్లాసెన్ వివాదాస్పద క్యాచ్, కేకేఆర్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్పై, లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ బంతి బౌండరీ లైన్ను దాటకముందే, ఆ తాడును వెనక్కి నెట్టేయడంపై ఎస్ఆర్హెచ్ అసహనం వ్యక్తం చేసింది. ఎంసీసీ నిబంధనల ప్రకారం ఈ చర్యపై ఆటగాడికి భారీ జరిమానా విధించాలని బీసీసీఐ ఎదుట వాదించడం చర్చనీయాంశమైంది.6) పరాగ్ డ్రెస్సింగ్ రూమ్ ఘటనపంజాబ్ కింగ్స్తో మ్యాచ్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ వేపింగ్ (ఈ-సిగరేట్) చేస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయాడు. నిబంధనల ప్రకారం ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో ఇలాంటి చర్యలకు పాల్పడడం నిషిద్ధం. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన బీసీసీఐ ఆట పరువుకు భంగం కలిగించినందుకు పరాగ్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడంతో పాటు, ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది.Captain of Rajasthan Royals team Riyan Parag enjoying vape in the RR dressing room .Vaping is illegal in India . Hello @BCCI is this allowed? #PBKSvsRR pic.twitter.com/banIgJDO6u— Surbhi (@SurrbhiM) April 29, 20267) రాజస్తాన్ డగౌట్ మొబైల్ వివాదంఈ సీజన్లో వివాదాల్లో హైలైట్గా నిలిచిన వాటిలో రాజస్తాన్ రాయల్స్ డగౌట్లో మొబైల్ ఫోన్ కనిపించడమే. ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా డగౌట్లో రాజస్తాన్ రాయల్స్ మేనేజర్ రోమి భిందర్ మొబైల్ ఫోన్ ఉపయోగిస్తుండడం కెమెరాల కంటికి చిక్కింది. ఈ చర్య పట్ల సీరియస్ అయిన బీసీసీఐ భిందర్ మొబైల్ అనుకోకుండా వాడానని, మెడికల్రిపోర్ట్స్ చూసుకునేందుకే ఫోన్ వాడినట్లు తెలిపాడు. తన చర్య పట్ల క్షమాపణ చెప్పినప్పటికీ, అతడి వివరణతో సంతృప్తి చెందని బీసీసీఐ రోమి భిందర్కు రూ.లక్ష జరిమానా విధించింది. రోమి భిందర్ చర్యను వ్యతిరేకిస్తూ బీసీసీఐ ఆటగాళ్లకు కఠిన ఆంక్షలు, నిబంధనలు జారీ చేసింది.8) అబ్స్ట్రకింగ్ ది ఫీల్డ్ఐపీఎల్ 2026 సీజన్లో లక్నోతో మ్యాచ్ సందర్భంగా కేకేఆర్ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కింద ఔటయ్యాడు. షాట్ ఆడిన అంగ్క్రిష్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు. నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న గ్రీన్ వద్దని వారించడంతో వెనక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ దశలో బంతిని అందుకున్న షమీ స్ట్రైకింగ్ ఎండ్ వికెట్ల వైపు విసిరాడు. The infamous Angkrish Raghuvanshi Run out today ! 😔What's your opinion on this decision 🤔 , my opinion is that it was not out, a blunder by 3rd umpire ! What was the hurry 😯?#LSGvsKKR #IPL2026pic.twitter.com/eJmxLm5Gwk— Cricket IQ (@S17Anurag) April 26, 2026ఈ నేపథ్యంలో తన రన్నింగ్ దిశను మార్చుకున్న రఘువంశీ షమీ వేసిన బంతికి అడ్డు రావడంతో అది అతడి ప్యాడ్లకు తగిలింది. దీంతో లక్నో ఆటగాళ్లు అప్పీల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నందుకు అంపైర్ అంగ్క్రిష్ రఘువంశీని ఔట్గా ప్రకటించాడు.9) అర్ష్దీప్ ఇన్స్టా వివాదంపంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో దాదాపు 200 పైగా పోస్టులను తొలగించడం ఆసక్తిగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో పలు వివాదాల నేపథ్యంలో అర్ష్దీప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తేలింది. టోర్నీ జరుగుతున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్ సహా జట్టు సమావేశాలకు సంబంధించి కంటెంట్ను సోషల్మీడియాలో షేర్ చేసుకోవద్దంటూ బీసీసీఐ ఆటగాళ్లను హెచ్చరించింది. అందుకే అర్ష్దీప్ తన ఇన్స్టాలో పోస్టులు తొలగించి ఉంటాడని అభిమానులు భావించారు.10) జాసన్ హోల్డర్ క్యాచ్ వివాదంగుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో రజత్ పాటీదార్ ఇచ్చిన క్యాచ్ హోల్డర్ డైవ్ చేసి పట్టినప్పటికీ ఆ క్యాచ్ పూర్తి వివాదాస్పదమయింది. పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను అందుకునే క్రమంలో హోల్డర్ బంతిని తొలుత నేలకు ఆనించినట్లు కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, అంపైర్ ఔటివ్వడం ఆర్సీబీ డగౌట్లో ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించింది. They checked the runout for 1 min and there was indeed a check of that Patidar's catch by Jason Holder, just judged in 17 secsTruly disappointing to see umpiring at this level this season. New day, new lowpic.twitter.com/KGgbi2a7qb— Gautam (@indiantweetrian) April 30, 2026హోల్డర్ పట్టిన క్యాచ్పై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఔట్ కాదని తెలుస్తున్నప్పటికీ మూడో అంపైర్ పాటిదార్ను ఔట్ అని ప్రకటించడం అత్యంత వివాదాస్పదమయ్యింది.చదవండి: భారత్లో ఫిఫా ప్రసార హక్కులు ఆ సంస్థకే! -
ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా ఇవే తగ్గించుకో.. కోహ్లి
-
గాయాన్ని కూడా లెక్కచేయకుండా భరించలేని నొప్పిని తట్టుకుంటూ...
-
‘బాస్ బేబీ’ వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!
ఐపీఎల్-2026లో వైభవ్ సూర్యవంశీ దుమ్ములేపాడు. రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్గా పూర్తిస్థాయిలో బరిలోకి దిగిన ఈ బిహారీ పిల్లాడు.. జట్టు ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో మొత్తంగా 16 మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 776 పరుగులు సాధించాడు.తద్వారా తాజా ఎడిషన్లో టాప్ రన్ స్కోరర్గా నిలిచి ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). అంతేకాదు ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు (72) బాదిన ప్లేయర్గానూ నిలిచి.. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.యూనివర్స్ బాస్ బేబీఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీని అభిమానులు ముద్దుగా ‘యూనివర్స్ బాస్ బేబీ’ అని పిలుచుకుంటున్నారు. ఇక అతడి ఆట తీరుకు టీమిండియా దిగ్గజాలు సునిల్ గావస్కర్, సచిన్ టెండుల్కర్.. సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, విండీస్ స్టార్ గేల్ తదితరులు ఇప్పటికే ఫిదా అయిన సంగతి తెలిసిందే.తాజాగా... భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గుజరాత్ టైటాన్స్తో ఆదివారం నాటి ఫైనల్లో ఆర్సీబీ ‘కింగ్’ కోహ్లి 75 పరుగులతో అజేయంగా నిలిచి.. జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.Virat Kohli' talking with "Vaibhav Suryavanshi ❤️ pic.twitter.com/0OVwtASeVp— Priyanka Yadav (@Priyankaji1998) June 1, 2026వైభవ్ సూర్యవంశీతో కోహ్లి ముచ్చటఇక అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచి.. కింగ్ హవాలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీబీ విజయానంతరం కోహ్లి వైభవ్ సూర్యవంశీతో కాసేపు ముచ్చటించాడు.తనకు వినయంగా నమస్కరించిన ‘బేబీ బాస్’ భుజం తట్టి.. ఆత్మీయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘‘కింగ్’.. ‘బేబీ బాస్’తో ఏం మాట్లాడాడబ్బా!.. మాకూ తెలిస్తే బాగుండు’ అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.వైభవ్ గురించి కోహ్లి ఏమన్నాడంటే!ఈ నేపథ్యంలో ఆర్సీబీ దిగ్గజం, కామెంటేటర్ ఏబీ డివిలియర్స్ కోహ్లి.. వైభవ్ గురించి తనతో మాట్లాడిన విషయాన్ని బయటపెట్టాడు. ‘‘విరాట్ ఏం చెప్పాడోనని మీరంతా తెలుసుకోవాలని అనుకుంటున్నారు కదా!.. వైభవ్ ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి స్టేజీ పైకి వెళ్తుంటే విరాట్ నాతో అతడి గురించి మాట్లాడాడు.‘ఏబీ.. ఈ పిల్లాడు చాలా ప్రత్యేకమైన వాడు. ఈ అబ్బాయి చాలా కాలం క్రికెట్ను ఏలగలడు’ అని విరాట్ నాతో అన్నాడు’’ అని డివిలియర్స్ తెలియజేశాడు. కాగా సచిన్ సైతం వైభవ్ రిస్ట్ వర్క్, టెక్నిక్ అద్భుతం అంటూ కొనియాడిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. ఫైనల్ వీక్షించేందుకు ఆదివారం అహ్మదాబాద్కు వచ్చాడు వైభవ్ సూర్యవంశీ. ఐసీసీ చైర్మన్ జై షా, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాతో కలిసి మ్యాచ్ను ఆస్వాదించాడు.చదవండి: IPL 2026: వైభవ్ తగ్గేదేలే!.. ఎవరికెంత ప్రైజ్ మనీ? -
రాయల్ ఛాలెంజర్స్ రాజసం.. ఫైనల్లో దుమ్మురేపిన బెంగళూరు (ఫొటోలు)
-
మళ్లీ వేటాడేసింది...
‘సుదీర్ఘ కాలం మనం వేటాడబడ్డాం... ఇకపై వేటగాళ్లలా మారిపోవాలి. ఇది ఆరంభం మాత్రమే. విజయాన్ని వ్యసనంగా మార్చుకోవాలి. వరుసగా రెండుసార్లు టైటిల్ సాధించిన జట్టుగా మనం కూడా నిలవగలం’... గత ఏడాది ట్రోఫీని గెలుచుకున్న తర్వాత ఆర్సీబీ డైరెక్టర్ బొబాట్ డ్రెస్సింగ్రూమ్లో చేసిన వ్యాఖ్య ఇది. ఆ సమయంలో విజయోత్సాహంతో చెప్పిన మాటలుగానే ఇవి మిగిలిపోలేదు. నాడు జట్టులో కనిపించిన ఆత్మవిశ్వాసం, అద్భుత ప్రదర్శన స్ఫూర్తిగా ఈసారి కూడా బెంగళూరు దూసుకుపోయింది. దాదాపు అదే తరహా ప్రణాళికతో సరిగ్గా సంవత్సరం తర్వాత టీమ్ మళ్లీ చాంపియన్గా నిలిచి సత్తా చాటింది. ఒక్క టైటిల్తో ఆగిపోకుండా తమ ఆకలిని తీర్చుకుంటూ వరుసగా రెండో ట్రోఫీని గెలుచుకొని సగర్వంగా నిలిచింది.తేదీలు మారడం మినహా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానం సరిగ్గా 2025 తరహాలోనే సాగి టైటిల్ వరకు చేరింది. లీగ్ దశలో 9 విజయాలతో అగ్రస్థానం, తొలి క్వాలిఫయర్లో ఏకపక్ష గెలుపుతో ఫైనల్కు... తుది పోరులో కూడా సంపూర్ణ ఆధిపత్యం... డిఫెండింగ్ చాంపియన్గా సొంతగడ్డ బెంగళూరులో మళ్లీ ట్రోఫీనిముద్దాడతామని గత ఏడాది గర్వంగా చెప్పినా... వేర్వేరు కారణాలతో అది జరగలేదు. కానీ మళ్లీ అదే అహ్మదాబాద్ వేదికపై విజయానందాన్ని సొంతం చేసుకుంది. 18వ సీజన్లో తొలిసారి ‘ఈ సాలా కప్ నమ్దు’ అంటూ గర్జించిన జట్టు మరోసారి అదే ధ్వనిని బిగ్గరగా వినిపించింది. నాడు విజేతగా నిలిచిన జట్టులోని 13 మంది ఈసారి కూడా గెలుపులో భాగమై తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు. ఇరు జట్ల మధ్య తొలి క్వాలిఫయర్ పూర్తి ఏకపక్షంగా సాగగా... ఈసారి గుజరాత్ టైటాన్స్ కాస్త మెరుగ్గా ఆడింది. అయితే భయపడినట్లే గిల్, సుదర్శన్, బట్లర్ వైఫల్యం తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లు పదునైన బంతులతో ప్రత్యర్థిని కట్టి పడేశారు. సరిగ్గా నెలరోజుల క్రితం ఇదే మైదానంలో టైటాన్స్తో పోరులో సరిగ్గా 155 పరుగులే చేసి ఆర్సీబీ ఓడగా... ఇప్పుడు అసలు పోరులో సీన్ రివర్స్ అయింది. ఛేదనలో కోహ్లి, వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభంతో ఆర్సీబీ విజయానికి బాట పడింది. ఆ తర్వాత కాస్త తడబాటు ఎదురైనా... దిగ్గజ ఆటగాడిగా ఛేదనలో తన స్థాయిని చూపిస్తూ దూసుకుపోయిన కోహ్లి భారీ సిక్స్తో విన్నింగ్ షాట్ కొట్టడంతో ఆర్సీబీ బృందంలో సంబరాలు షురూ అయ్యాయి. అహ్మదాబాద్: ఐపీఎల్లో వరుసగా రెండుసార్లు విజేతగా నిలిచిన మూడో జట్టుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన ఆర్సీబీ ఐపీఎల్–2026 టైటిల్ను గెలుచుకుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (37 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బెంగళూరు 18 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. విరాట్ కోహ్లి (42 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగిపోగా, వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32; 4 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడాడు. టపటపా... ప్రతీ సీజన్లో జట్టు బ్యాటింగ్ భారం మోస్తున్న ముగ్గురు ప్రధాన బ్యాటర్లు తొందరగా వెనుదిరగడంతోనే గుజరాత్ భారీ స్కోరు ఆశలు కోల్పోయింది. శుబ్మన్ గిల్ (8 బంతుల్లో 10; 2 ఫోర్లు), సాయి సుదర్శన్ (12 బంతుల్లో 12; 2 ఫోర్లు) నాలుగు పరుగుల వ్యవధిలో అవుట్ కాగా, నిశాంత్ సింధు (18 బంతుల్లో 20; 3 ఫోర్లు) ప్రభావం చూపలేదు. పవర్ప్లేలో జట్టు 45 పరుగులే చేసింది. క్రీజ్లో ఉన్నంత సేపు తడబడిన జోస్ బట్లర్ (23 బంతుల్లో 19; 1 ఫోర్) సహనం కోల్పోయి వికెట్ సమర్పించుకున్నాడు. ఈ దశలో సుందర్ కొంత పట్టుదలగా నిలబడినా... అతనూ పెద్ద షాట్లు కొట్టలేకపోయాడు. 4 పరుగుల వద్ద కాక్స్ క్యాచ్ అందుకున్నా... రీప్లేలో బంతి గ్రౌండ్కు తాకిందని తేలడంతో అతను బతికిపోయాడు. మరోవైపు అర్షద్ ఖాన్ (6 బంతుల్లో 15; 2 సిక్స్లు) కొన్ని పరుగులు జోడించగా, తర్వాతి బ్యాటర్లంతా పూర్తిగా చేతులెత్తేశారు. ఒక దశలో వరుసగా 40 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయిన గుజరాత్ ఇన్నింగ్స్లో 13వ ఓవర్ నాలుగో బంతికి గానీ తొలి సిక్స్ రాలేదు! తొలి 10 ఓవర్లలో 62 పరుగులు చేసిన జట్టు తర్వాతి 10 ఓవర్లలో 92 పరుగులు రాబట్టింది. శుభారంభం... ఛేదనలో వెంకటేశ్, కోహ్లి జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్లో సిరాజ్ 5 పరుగులే ఇచ్చినా... రబాడ వేసిన తర్వాత ఓవర్లో వెంకటేశ్ 3 ఫోర్లు, సిక్స్ బాదాడు. సిరాజ్ రెండో ఓవర్లోనూ 3 బౌండరీలు రాగా... రబాడ తర్వాతి ఓవర్లో కోహ్లి వరుసగా 4, 4, 6, 4తో చెలరేగిపోయాడు. వెంకటేశ్, పడిక్కల్ (1) పరుగు తేడాతో వెనుదిరగ్గా... పవర్ప్లేలో జట్టులో 70 పరుగులు చేసింది. ఆ తర్వాత కెపె్టన్ రజత్ పాటీదార్ (13 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్స్), కృనాల్ పాండ్యా (1)లను రషీద్ ఒకే ఓవర్లో అవుట్ చేసి కొంత ఒత్తిడి పెంచాడు. అయితే కోహ్లి మాత్రం తగ్గకుండా దూసుకుపోయాడు. 25 బంతుల్లో అతని అర్ధసెంచరీ పూర్తయింది. టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక పరుగులు జోడించగా... విరాట్ చివరి వరకు నిలిచి జట్టును విజయతీరం చేర్చాడు.స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (సి) జితేశ్ (బి) భువనేశ్వర్ 12; గిల్ (సి) పాటీదార్ (బి) హాజల్వుడ్ 10; నిశాంత్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 20; బట్లర్ (స్టంప్డ్) జితేశ్ (బి) కృనాల్ 19; సుందర్ (నాటౌట్) 50; అర్షద్ (సి) సలామ్ (బి) హాజల్వుడ్ 15; తెవాటియా (సి) పాటీదార్ (బి) సలామ్ 7; హోల్డర్ (సి) హాజల్వుడ్ (బి) భువనేశ్వర్ 7; రషీద్ (సి) షెఫర్డ్ (బి) సలామ్ 7; రబాడ (నాటౌట్) 3; ఎక్స్ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1–22, 2–26, 3–55, 4–73, 5–99, 6–115, 7–142, 8–151. బౌలింగ్: డఫీ 4–0–38–0, భువనేశ్వర్ 4–0–29–2, హాజల్వుడ్ 4–0–37–2, సలామ్ 4–0–27–3, కృనాల్ 4–0–23–1. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: వెంకటేశ్ (సి) రబాడ (బి) సిరాజ్ 32; కోహ్లి (నాటౌట్) 75; పడిక్కల్ (సి) అర్షద్ (బి) రబాడ 1; పాటీదార్ (సి) రబాడ (బి) రషీద్ 15; కృనాల్ (ఎల్బీ) (బి) రషీద్ 1; డేవిడ్ (సి) బట్లర్ (బి) అర్షద్ 24; జితేశ్ (నాటౌట్) 11; ఎక్స్ట్రాలు 2; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 161. వికెట్లపతనం: 1–62, 2–63, 3–89, 4–91, 5–132. బౌలింగ్: సిరాజ్ 4–0–36–1, రబాడ 3–0–44–1, హోల్డర్ 2–0–16–0, రషీద్ 4–0–25–2, అర్షద్ 4–0–32–1, ప్రసిధ్ 1–0–7–0. -
కోహ్లీ వీరవిహారం.. చాంపియన్స్గా ఆర్సీబీ
ఐపీఎల్ 2026 చాంపియన్గా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చేజింగ్ మాస్టర్గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ఆఖరి దాకా నిలిచి ఆర్సీబీని గెలిపించాడు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 75 నాటౌట్), వెంకటేశ్ అయ్యర్ (16 బంతుల్లో 32), టిమ్ డేవిడ్ (17 బంతుల్లో 24 పరుగులు) ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2 వికెట్లు తీయగా, మహ్మద్ సిరాజ్, రబాడ, అర్షద్ ఖాన్ తలా వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాషింగ్టన్ సుందర్ (50 నాటౌట్), నిషాంత్ సిందూ (20 పరుగులు) ఆడుతున్నారు. రసిక్ సలామ్ 3 వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశాడు.కోహ్లీ కమాల్..156 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వెంకటేశ్ అయ్యర్, కోహ్లీలు కలిసి తొలి వికెట్కు 4.3 ఓవర్లలో 62 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. ఈ దశలో పడిక్కల్, పాటీదార్లు రషీద్ఖాన్ బౌలింగ్లో వెనువెంటనే ఔట్ కావడంతో ఆర్సీబీ శిబిరంలో ఆందోళన నెలకొన్నప్పటికీ కోహ్లీ నిలకడగా ఆడి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖర్లో టిమ్ డేవిడ్ ఔటైనప్పటికీ జితేశ్ శర్మ (11 నాటౌట్)తో కలిసి కోహ్లీ ఆర్సీబీని గెలిపించి వరుసగా రెండో కప్పును అందించాడు.ఆర్సీబీ అరుదైన ఫీట్ఈ నేపథ్యంలో ఆర్సీబీ ఒక అరుదైన ఫీట్ సాధించింది. వరుసగా రెండు సీజన్లలో టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డులకెక్కింది. గతంలో చెన్నై సూపర్కింగ్స్ (2010, 2011), ముంబై ఇండియన్స్ (2019, 2020) ఈ ఫీట్ను సాధించాయి.Finishing off in style 🥳And it's none other than King Kohli 😎👑Scorecard ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/FZNGQ26gBs— IndianPremierLeague (@IPL) May 31, 2026 -
'కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ అయిపోలేదు!'
ఐపీఎల్ 2026 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న ఫైనల్లో ఇప్పటికైతే ఆర్సీబీదే పైచేయిగా ఉంది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతున్న గుజరాత్ టైటాన్స్ సాధారణ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. అయితే గుజరాత్ వికెట్లు పడిన ప్రతీసారి కోహ్లీ హైపర్ యాక్టివ్గా కనిపించాడు. ముఖ్యంగా గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ వికెట్లు పడ్డప్పుడు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజిల్వుడ్ బౌలింగ్లో గిల్ ఔటైన వెంటనే పిచ్పైకి పరిగెత్తుకొచ్చిన కోహ్లి గిల్వైపు చూస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకోవడం కనిపించింది. అంతటితో ఆగకుండా సాయి సుదర్శన్ ఔట్ కావడానికి ముందు కోహ్లీ శ్రుతి మించిపోయాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లు ప్రతీ బంతికి ముందు కోహ్లీ సాయి సుదర్శన్ను టార్గెట్ చేస్తూ ఏదో ఒక మాట అనడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఓవర్ నాలుగో బంతికి సాయి సుదర్శన్ భారీ షాట్కు యత్నించి జితేశ్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ చర్యలపై గుజరాత్ టైటాన్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోహ్లీ కాస్త తగ్గి ఉండు.. మీ బ్యాటింగ్ ఇంకా అయిపోలేదు. అని కామెంట్లు పెడుతున్నారు.మరో విషయమేంటంటే.. గత రెండు మ్యాచ్ల్లో హిట్ వికెట్గా వెనుదిరిగిన సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లోనూ అలా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. హాజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్ రెండో బంతిని ఆడే క్రమంలో బ్యాట్ అతని చేతి నుంచి జారిపోయేలా కనిపించినప్పటికీ ఈసారి మాత్రం అలా జరగలేదు. ఇక మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. వాష్టింగ్టన్ సుందర్ (50) అర్థసెంచరీతో గుజరాత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రసిక్ సలామ్ మూడు వికెట్లు తీయగా, హాజిల్వుడ్, భువనేశ్వర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు.pic.twitter.com/E5HLX9ALPr— crictalk (@crictalk7) May 31, 2026చదవండి: అయ్యో గుజరాత్.. సీన్ రివర్స్ అయ్యేలా ఉందే! -
ఫైనల్ కు ముందు కోహ్లిని మరోసారి గెలికిన హెడ్..
-
కోహ్లిని మరోసారి గెలికిన హెడ్
ఐపీఎల్ 2026 ఫైనల్కు ముందు విరాట్ కోహ్లీ–ట్రావిస్ హెడ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్గా మారింది. కొద్ది రోజుల కిందట ఓ ఐపీఎల్ మ్యాచ్లో (ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్) వీరిద్దరూ మాటా-మాటా అనుకున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లీ, ఎస్ఆర్హెచ్లోని పలువురు ఆటగాళ్లతో కరచాలనం చేసినప్పటికీ, ట్రావిస్ హెడ్తో మాత్రం చేతులు కలపలేదు.ఆతర్వాత కోహ్లి అభిమానులు హెడ్ను, అతని భార్య జెస్సికా హెడ్ సోషల్మీడియా వేదికగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. కోహ్లి అభిమానులు హెడ్ భార్యపై వ్యక్తిగత దూషణలు కూడా చేశారు.ఈ వివాదం హెడ్ తాజా సోషల్మీడియా పోస్ట్తో కొత్త మలుపు తీసుకుంది. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్లో ఆశించిన ఫలితాలు సాధించలేక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, జోఫ్రా ఆర్చర్ ధాటికి ఓటమి పాలైంది. తాజాగా ఎస్ఆర్హెచ్ ఆటగాడైన ట్రావిస్ హెడ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అందులో "Appreciate those who showed love and respect" అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ క్యాప్షన్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.ఆ క్యాప్షన్లో హెడ్ నేరుగా ఎవరి పేరు ప్రస్తావించకపోయినా, కోహ్లినే పరోక్షంగా టార్గెట్ చేసినట్లు అర్దమవుతుంది. కోహ్లీ అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ఎదురైన ట్రోలింగ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశాడని సోషల్ మీడియాలో విశ్లేషణలు మొదలయ్యాయి.కాగా, హెడ్-కోహ్లి మధ్య గొడవ తర్వాత జెస్సికా హెడ్, ఆమె కుటుంబం, స్నేహితులపై సోషల్మీడియా వేదికగా తీవ్రస్థాయి దూషణలు వచ్చాయి. భారత్లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదురైనట్లు ఆమె స్వయంగా వెల్లడించింది. ఆ ప్రపంచకప్ ఫైనల్లో భారత్పై అద్భుత సెంచరీ సాధించి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన ట్రావిస్ హెడ్ అప్పుడూ భారత అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. అలాగే 2024 బాక్సింగ్ డే టెస్టులో భారత్పై కీలక ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా ఇలాంటి ట్రోలింగ్ ఎదుర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. కుటుంబాలను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు..! క్రీడల్లో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా, ఆటగాళ్ల కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దూషించడం సమర్థనీయం కాదనే అభిప్రాయం మాత్రం అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.ఇదిలా ఉంటే, అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇవాళ (మే 31) రాత్రి ఐపీఎల్ 2026 ఫైనల్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టైటిల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ పోటీపడనున్నాయి. -
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో తన బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్ఎస్తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.ప్రస్తుతం కోహ్లీ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually. - It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్! -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
రోహిత్, విరాట్లను భయపెట్టిన పాట్ కమిన్స్ నే వణికించిన బుడ్డాడు..!
-
మే 31.. డబుల్ హిస్టారిక్ డే!
మే 31.. ఆదివారం.. కర్ణాటక చరిత్రలో కీలక మలుపు దిశగా సాగే తేదీగా మారింది. ఒకవైపు క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠభరిత ఫైనల్, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. ఈ రెండు భిన్న ప్రపంచాల్లోనూ ఒకే రోజు చర్చకు కేంద్రబిందువుగా నిలుస్తోంది.కర్ణాటక రాజకీయాల్లో ఆ తేదీ కొత్త చరిత్రకు వేదికగా మారుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ 31నే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది(అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది).డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఫలితంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. “కట్టె కాలేదాకా కాంగ్రెస్తోనే ఉంటాను” అనే ఆయన మాటలు ఆ నిబద్ధతను చెబుతాయి. 2023లోనే ఆయన సీఎం పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం వాయిదా పడింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు లభించబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటు కర్ణాటకకు చెందిన ఆర్సీబీ జట్టు అభిమానులు మే 31వ తేదీ కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంది. గత సీజన్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి ఆ జట్టు తొలి ఐపీఎల్ కప్పును సాధించింది. జట్టు సభ్యుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కావడంతో ఆ విజయం మరింత భావోద్వేగంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరడంతో అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.ఒకవైపు క్రీడా ప్రపంచంలో 18 ఏళ్ల కల నెరవేరిన కథ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆశ, మరోవైపు దశాబ్దాల రాజకీయ ప్రయాణం చివరికి శిఖరాన్ని చేరబోతున్న క్షణం.. ఇవన్నీ కలిసి మే 31ను “డబుల్ హిస్టారిక్ డే”గా నిలబెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్గా మారింది. తాను బౌలింగ్కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
తొలి ప్లేయర్గా కోహ్లి అరుదైన రికార్డు
ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 43 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ఈ క్రమంలో కోహ్లి ఈ ఏడాది సీజన్లో 600 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు.ఇప్పడు ఈ ఏడాది సీజన్లో కూడా కోహ్లి 50.00 సగటు, 164.38 స్ట్రైక్రేట్తో600 పరుగులు చేశాడు. గతంలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. కానీ వరుసగా నాలుగు సీజన్లలో కోహ్లి మినహా మిగితా ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. అదేవిధంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడిన జాబితాలో కోహ్లి నాలుగో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ఇప్పటివరకు 18 ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడి శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, కిరాన్ పొలార్డ్ సరసన కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోని(28) అగ్రస్ధానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, రైనా(24) తర్వాతి స్ధానంలో కొనసాగుతున్నారు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
బాబర్ ఆజం కోసం విరాట్ కోహ్లికి డిమోషన్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన ఆల్ టైమ్ బెస్ట్ వన్డే వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి మిస్బా చోటిచ్చాడు. కోహ్లితో పాటు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఛాన్స్ లభించింది. అయితే ఈ జట్టులో బాబర్ ఆజం కోసం కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్ను మిస్బా మార్చడం గమనార్హం.వన్డేల్లో కోహ్లి సాధరణంగా మూడో స్ధానంలో బ్యాటింగ్ వస్తాడు. ఇదే స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి కోహ్లి ఎన్నో వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ మిస్బా మాత్రం విరాట్కు నాలుగో స్ధానంలో ఛాన్స్ ఇచ్చాడు. కోహ్లి స్ధానాన్ని బాబర్తో ఈ పాక్ లెజెండ్ భర్తీ చేశాడు.ఇక ఓపెనర్లగా శ్రీలంక స్టార్ కుశాల్ మెండిస్, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ను అతడు ఎంపిక చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ జోఫ్రా ఆర్చర్, సౌతాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, మార్కో జానెసన్ ఈ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి మిచెల్ శాంట్నర్కు ఒక్కడికే ఈ జట్టులో చోటు దక్కింది.వన్డేల్లో తిరుగులేని విరాట్విరాట్ కోహ్లి 37 ఏళ్ల వయస్సులోనూ వన్డే క్రికెట్లో దూసుకుపోతున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్(14,797) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ కంటే మాత్రమే వెనుకబడి ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రం కోహ్లి(54) పేరిటే ఉంది. వచ్చే నెలలో అఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్లో కోహ్లి తిరిగి మళ్లీ భారత జెర్సీలో కన్పించనున్నాడు.చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న పోరులో అందరి కళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్లో కోహ్లీ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఆర్సీబీ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్లో 17 మ్యాచ్లాడిన కోహ్లీ 121 స్ట్రైక్రేట్తో 396 పరుగులు సాధించాడు. మరి గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే గుజరాత్తో మ్యాచ్లో పిచ్పై అవగాహన వచ్చేవరకు నిలదొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. పైగా ధర్మశాలలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో 557 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఇరుజట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్-1 పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.చదవండి:‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’ -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
కోహ్లి VS ట్రావిస్ హెడ్.. హెడ్ భార్యకు వేధింపులు..
-
హెడ్ భార్యకు వేధింపులు.. వికృత చేష్టలు ఆపండి!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది. మేము మనుషులమే..'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.గతంలోనూ వేధింపులు..అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.కోహ్లీ, హెడ్ వివాదమేంటి?ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే!
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ విజయం కన్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వడానికి కోహ్లీ నిరాకరించడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. వివాదం జరిగి ఒకరోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి తగ్గలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు క్వాలిఫయర్లో ఎదురుపడే అవకాశం లేదు. కానీ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫయర్-2 పోరులో ఈ రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి.అలా కాకుండా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గెలిచి.. మరోవైపు ఎలిమినేటర్తో పాటు క్వాలిఫయర్-2లోనూ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ మాత్రం ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. మరోమారు ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్కు దబిడిదిబిడి అయ్యేలాగే పరిస్థితులు ఉన్నట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలేం జరిగిందంటే..ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్ @కాస్త బౌండరీలు కొట్టు* అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోహ్లీ దీనిని సీరియస్గా తీసుకున్నాడని స్పష్టంగా తెలిసొచ్చింది.You could easily notice that every time Venkatesh Iyer found the boundary, Kohli kept throwing Travis Head-related gestures. He sparked the whole drama himself, didn’t even shake hands afterward.His arrogance is on another level. 🥵pic.twitter.com/HEnvHnLjEw— Yorker__93™ (@Boom__93) May 23, 2026 255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే? -
పక్కా ప్లాన్తోనే.. సన్రైజర్స్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్-2026లోనూ సత్తా చాటుతోంది. టేబుల్ టాపర్గా లీగ్ దశను ముగించి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. కాగా తమ చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం ఆర్సీబీతో తలపడ్డ సంగతి తెలిసిందే. భారీ స్కోరు సాధించినా..సొంతమైదానం ఉప్పల్లో ఆర్సీబీపై భారీ తేడాతో గెలిస్తేనే టాప్–2 దక్కే అవకాశం ఉండటంతో పట్టుదలగా ఆడి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ.. బెంగళూరును 166 పరుగులలోపు మాత్రం కట్టడి చేయలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన స్థితిలోఫలితంగా హైదరాబాద్ ఈ మ్యాచ్లో గెలిచినా మూడో స్థానంతో ముగించి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన స్థితిలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఓడినా... ముందుగా 166, ఆపై 178 స్కోరును దాటి అగ్రస్థానాన్ని సాధించడంలో సఫలమైంది. స్లోగా బ్యాటింగ్ చేస్తూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.TOP 2 confirmed for #RCB! ✅By surpassing 165-run mark with this boundary, the defending champions have secured a berth in Qualifier 1! 👏#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/d1ZT8DPTIM— Star Sports (@StarSportsIndia) May 22, 2026అవును.. పక్కా ప్లాన్తోనేఇదే విషయాన్ని ఆర్సీబీ హెడ్కోచ్ ఆండీ ఫ్లవర్ తాజాగా వెల్లడించాడు. తమ దృష్టి సన్రైజర్స్ను ఓడించడం కంటే కూడా.. టేబుల్ టాపర్గా నిలవాలంటే కావాల్సిన 166 పరుగుల మీదే ఉందని తెలిపాడు. డ్రెసింగ్రూమ్లో మాట్లాడుతూ..‘‘256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ముఖ్యమే. అయితే, పాయింట్ల పట్టికలో నెట్రన్రేటుతో అగ్రస్థానంలో నిలవడమే అంతిమ లక్ష్యం. అందుకే మనం వేర్వేరు టార్గెట్లు పెట్టుకున్నాం.166 పరుగుల మార్కు దాటితేముందుగా 166 పరుగుల మార్కు దాటితే మనకు టాప్-2 బెర్తు ఖరారు అవుతుంది. ఆ తర్వాత 179 పరుగుల మార్కుకు చేరుకున్నామంటే.. టేబుల్ టాపర్ మనమే. ఆ తర్వాత 256 పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్లో గెలుపు మనదే. ఇందుకు తగ్గట్లుగానే మన బ్యాటింగ్ కొనసాగింది.వెంకటేశ్ అయ్యర్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి మనం అగ్రస్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా మన లక్ష్యం 180 పరుగులేనని బ్యాటర్లు ఫీలయ్యేలా చేశాము’’ అని ఆండీ ఫ్లవర్ చెప్పుకొచ్చాడు.వెంకటేశ్ అయ్యర్ ధనాధన్తోకాగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (15), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (21) వికెట్లు కోల్పోయింది.ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్తో పరిస్థితి చక్కదిద్దాడు. ఇక మధ్య ఓవర్లలో కెప్టెన్ రజత్ పాటిదార్ (39 బంతుల్లో 56), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 41 నాటౌట్) కాస్త నెమ్మదిగానే ఆడారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 15 పరుగులతో పాండ్యాతో కలిసి అజేయంగా నిలవగా.. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 200 పరుగులు చేసింది.ఓటమిపాలైనా.. టేబుల్ టాపర్గాసన్రైజర్స్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమిపాలైనా.. టేబుల్ టాపర్గా నిలవడంలో సఫలమైంది. ఇక ఆర్సీబీ- సన్రైజర్స్ మ్యాచ్ ఫలితంతో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచింది.ఈ క్రమంలో ‘ప్లే ఆఫ్స్’లో భాగంగా ఈనెల 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్–1లో ఆర్సీబీ జట్టుతో గుజరాత్ తలపడుతుంది. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో ఈనెల 27న న్యూచండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతుంది. ఇక క్వాలిఫయర్–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈనెల 29న జరిగే క్వాలిఫయర్–2లో పోటీపడుతుంది. చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్ This defeat doesn’t hurt #RCB 💪They enter playoffs as table toppers 🔥#TATAIPL | #SRHvsRCB, #RajatPatidar, #Top2, #ViratKohli, #SakibHussain, #TravisHead pic.twitter.com/9qr9aAs29E— Star Sports (@StarSportsIndia) May 22, 2026 -
విరాట్ కోహ్లికి ఎస్ఆర్హెచ్, హెడ్ కౌంటర్!
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 లీగ్ దశను ఘన విజయంతో ముగించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.హెడ్పై కోహ్లి ఆగ్రహంసొంతమైదానం ఉప్పల్లో ఆర్సీబీపై 255 పరుగులు స్కోరు చేసిన సన్రైజర్స్.. ప్రత్యర్థిని 200 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్- ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి మధ్య కోల్డ్వార్ నడిచింది.విధ్వంసకర వీరుడిగా పేరొందిన హెడ్ ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 26 పరుగులే చేసి.. రసిఖ్ దర్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లి దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.అనంతరం ఆర్సీబీ ఇన్నింగ్స్లో శివంగ్ కుమార్ బౌలింగ్లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీలు బాదుతున్న వేళ.. హెడ్పై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయి అన్నట్లుగా సైగలు చేశాడు. అయితే, హెడ్ మాత్రం ఇందుకు పెద్దగా స్పందించలేదు.#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026షేక్హ్యాండ్ ఇవ్వకుండాఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ కోహ్లి.. హెడ్ పట్ల కాస్త వింతగా ప్రవర్తించాడు. అతడికి షేక్హ్యాండ్ ఇవ్వకుండా ముఖం తిప్పేసుకున్నాడు. దీంతో హెడ్ అలా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.Virat Kohli ignored Travis Head when he tried to shake hands with him after the match 😭#SRHvsRCB pic.twitter.com/urAY79pYQ0— Indian Cricket (@IPL2025Auction) May 22, 2026 కాగా కోహ్లి తీరుకు ఎస్ఆర్హెచ్తో పాటు హెడ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో హెడ్ అనూహ్య రీతిలో బౌలింగ్కు దిగాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (39 బంతుల్లో 56)ను అవుట్ చేశాడు. తద్వారా గత తొమ్మిదేళ్లలో ఐపీఎల్లో తన తొలి వికెట్ నమోదు చేశాడు.వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. వికెట్ తీశాడుఈ నేపథ్యంలో వికెట్ తీసిన తర్వాత హెడ్ సంతోషంగా ఉన్న ఫొటోను పంచుకున్న ఎస్ఆర్హెచ్.. ‘‘వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. వికెట్ తీశాడు’’ అని కోహ్లికి కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే ఫొటోను షేర్ చేసిన హెడ్.. ‘‘ఇదేంటో గెస్ చేయండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి 11 బంతుల్లో 15 పరుగులు చేసి సకీబ్ హుసేన్ బౌలింగ్లో అవుటయ్యాడు.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ, గుజరాత్లతో పాటు.. తాజా విజయంతో సన్రైజర్స్ ఖాతాలో కూడా 18 పాయింట్లు చేరాయి. అయితే, నెట్రన్రేటు పరంగా వెనుకబడిన సన్రైజర్స్ మూడో స్థానంతో ముగించింది. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి.చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్ -
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సన్రైజర్స్ యువ పేసర్ సాకిబ్ హుసేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్ తొలి 10 మ్యాచ్ల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. నిన్న (మే 22) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి వికెట్ తీయడంతో సాకిబ్ ఈ ఫీట్ను సాధించాడు. ఓవరాల్గా సాకిబ్కు ముందు ఫిల్ఫెన్హాస్ (13 వికెట్లు), ఎంగిడి (13) ఈ ఘనత సాధించిన బౌలర్లు ఉన్నారు. వీరిద్దరూ విదేశీయులే.ఇదే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ బిహారి బాయ్.. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన (4-24) ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న సాకిబ్.. సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యార్కర్లు, స్లో బాల్స్తో చెలరేగిపోయే ఈ నయా పేస్ సెన్సేషన్.. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.కాగా, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ, గుజరాత్తో పాటు ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరిన ఈ జట్టుకు ఈ విజయం ఎలాంటి అక్కరకు రాలేదు. ఆర్సీబీపై గెలిచినా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైన ఎలిమినేటర్ గండాన్ని దాటాల్సి వచ్చింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం, ఎలిమినేటర్లో సన్రైజర్స్ను ఎదుర్కొనేందుకు నాలుగు జట్లు (రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ) పోటీపడుతున్నాయి. లక్నో, ముంబై, సీఎస్కే ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.భారీ స్కోర్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్ప్లేలోనే మ్యాచ్ను హైదరాబాద్వైపు తిప్పేశాడు. ట్రవిస్ హెడ్ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51), నితీశ్కుమార్ రెడ్డి (29 నాటౌట్) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించాడు. కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
హెడ్ను అవమానించిన కోహ్లి
నిన్న (మే 22) జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి-ట్రవిస్ హెడ్ మధ్య తేలికపాటి ఘర్షణ జరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్షేక్లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్, అభిషేక్ శర్మలతో మాట్లాడి.. హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచినా ఎస్ఆర్హెచ్కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. ఎస్ఆర్హెచ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. మిగిలిన నాలుగో బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతుంది. మూడో స్థానంలో నిలవడంతో ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ మ్యాచ్ అడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ-గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది.భారీ స్కోర్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్ప్లేలోనే మ్యాచ్ను హైదరాబాద్వైపు తిప్పేశాడు. ట్రవిస్ హెడ్ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51), నితీశ్కుమార్ రెడ్డి (29 నాటౌట్) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించినా, కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 256 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లి త్వరగా ఔటైనప్పటికి వెంకటేశ్ అయ్యర్తో కలిసి మొదటి వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.దీంతో విరాట్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక ఫిప్టి ప్లస్ భాగస్వామ్యాల్లో భాగమైన ఆటగాడిగా విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు 211 సార్లు యాభై ప్లస్ పార్ట్నర్షిప్స్లో భాగమయ్యాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ అలెక్స్ హేల్స్ (210 యాభై ప్లస్ భాగస్వామ్యాలు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హేల్స్ను కోహ్లి అధిగమించాడు.టీ20ల్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో భాగమైన టాప్-5 బ్యాటర్లువిరాట్ కోహ్లి-211హేల్స్-210డేవిడ్ వార్నర్-200బాబర్ ఆజం-196క్రిస్ గేల్-191ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్రైజర్స్ చేతిలో 55 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగల్గింది. అయినప్పటికి బెంగళూరు పాయింట్ల పట్టికలో తమ స్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. -
అందరి దృష్టి కోహ్లిపైనే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ దశను అగ్రస్థానంతో ముగించాలనే లక్ష్యంతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ ఆఖరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. టాప్–2లో నిలిచి ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలను సంపాదించాలని సన్రైజర్స్ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారగా... అందరి దృష్టి మాత్రం ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమైంది. రెండేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఆడనున్న కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఉబలాటపడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఈ స్టేడియంలో 10 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అతను 486 పరుగులు చేశాడు. గత శుక్రవారం ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా... నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. కోహ్లి ప్రధాన ఆకర్షణ కానుండటంతో దీనిని సొమ్ము చేసుకోవాలని సన్రైజర్స్ యాజమాన్యం భావించి ఈ మ్యాచ్ టికెట్ల ధరలను భారీగా పెంచేసింది. మరోవైపు సాధారణ ప్రేక్షకులకు టికెట్లు లభించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్థాయిభేదం లేకుండా ఎవరికి వారు తమ పరపతిని ఉపయోగించి ఈ మ్యాచ్ టికెట్లను సంపాదించడంపైనే దృష్టి పెట్టారు. దాంతో నిజమైన అభిమానుల గోడు వినేవాళ్లే కరువయ్యారు. రజత్ పాటీదార్ సారథ్యంలోని బెంగళూరు బృందం ఈ సీజన్ను సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్తోనే ప్రారంభించింది. ఆ మ్యాచ్లో ఆరు వికెట్లతో గెలిచి శుభారంభం చేసింది. అదే జోరును కొనసాగిస్తూ ప్రస్తుతం 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్లో సన్రైజర్స్పై గెలిస్తే ఆర్సీబీ 20 పాయింట్లతో టాపర్గా ముగిస్తుంది.27ఆర్సీబీ, సన్రైజర్స్ జట్లు ముఖాముఖిగా 27 సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో... సన్రైజర్స్ 14 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. ఆరింటిలో సన్రైజర్స్, రెండింటిలో బెంగళూరు గెలుపొందాయి. -
టెస్ట్ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విరాట్ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికి ఏడాది దాటిపోయినా.. అభిమానుల్లో మాత్రం ఇంకా అతన్ని వైట్ డ్రెస్లో చూడాలనే ఆశ కనిపిస్తూనే ఉంది. తాజాగా విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలు కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై చర్చకు మరింత ఊతమిచ్చాయి.రాజ్కుమార్ శర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది విరాట్ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేనే అతన్ని ఒప్పించగలనని వారి నమ్మకం. వారు కోరుకున్న విధంగానే ఈ విషయాన్ని విరాట్ వద్ద ప్రస్తావించాను. చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏమవుతుందో చూద్దామని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో అభిమానులు విరాట్ కంబ్యాక్పై ఆశలు పెంచుకున్నారు. కొందరైతే "కింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్" అంటూ సోషల్మీడియాలో హడావుడి మొదలు పెట్టారు.ఇదిలా ఉంటే, ఇటీవల కొన్ని సందర్భాల్లో విరాట్ తన టెస్ట్ పునరాగమనంపై పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. పరస్పర నమ్మకం, గౌరవం, విలువ తగ్గిన వాతావరణంలో కొనసాగాలని తనకు ఆసక్తి లేదని చెప్పకనే చెప్పాడు. వీటిని బట్టి చూస్తే విరాట్ టెస్ట్ కంబ్యాక్ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.2025 మే 12న టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విరాట్.. 123 టెస్ట్ల్లో 9230 పరుగులు చేశాడు. విదేశీ గడ్డపై భారత జట్టును దూకుడుగా నడిపించిన నాయకుడిగా, ఆధునిక యుగంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అయితే అతని రిటైర్మెంట్ నిర్ణయం అప్పట్లో అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్నే షాక్కు గురిచేసింది.టెస్ట్ క్రికెట్లో కోహ్లీ సాధించిన విజయాలు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన అతడు.. కొద్ది కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అనంతరం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి భారత జట్టును ప్రపంచ నంబర్ వన్గా నిలబెట్టాడు. కెప్టెన్గా 68 టెస్టుల్లో భారత జట్టును నడిపించిన కోహ్లీ.. 40 విజయాలు అందించి దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా నిలిచాడు. -
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు. -
'ఆ సమయంలో ద్రవిడ్ భాయ్ అండగా నిలబడ్డాడు'
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా బాధాకరమైన దశను ఎదుర్కొన్నట్లు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తనకు అప్పటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్ కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. మంగళవారం ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ మూడో ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో పాల్గొన్న కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.‘నేను కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే, రాహుల్ భాయ్, విక్రమ్ రాథోర్లతో మనసు విప్పి మాట్లాడగలిగాను. చాలా విషయాలు పంచుకున్నాను. 2023లో టెస్ట్ క్రికెట్లో నేను అద్భుతంగా రాణించాను. నేను కెప్టెన్సీ వదిలేసి ఒంటరిగా బాధపడుతున్న సమయంలో వీరిద్దరు నాకు అండగా నిలిచారు. నా కెరీర్ తిరిగి గాడిన పెట్టుకునేందుకు రాహుల్ భాయ్తో పాటు విక్రమ్ రాథోర్ ఎంతోగానో సహాయపడ్డారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు’ అని కోహ్లీ తెలిపాడు.రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ ఒత్తిడిని భరించలేక 2022లో ఆ బాధ్యతల నుంచి తప్పుకు న్నాడు. కెప్టెన్గా ఉన్న సమయంలో కోహ్లీ ఆరు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధశతకంతో, 26.5 సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 2021 నవంబర్లో టీమిండియా హెడ్ కోచ్గా వచ్చిన ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్తో కలిసి కోహ్లీని మళ్లీ బ్యాటింగ్లో ట్రక్ ఎక్కించడంలో విజయవంతమయ్యాడు. ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత 2023 ఏడాదిలో అద్భుతంగా రాణించిన కోహ్లీ 8 టెస్టుల్లో 671 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాప్ సెంచరీలున్నాయి.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ తన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతేడాది తొలిసారి చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్పై కన్నేసింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలకు మాత్రమే పరిమితమైన కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత అప్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.చదవండి: పరువు తీసుకుంటున్న పాక్, బంగ్లా క్రికెటర్లు! -
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్కు కెప్టెన్ గిల్కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్తో సిరీస్కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
కోహ్లి, అయ్యర్ మెరుపులు.. ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కింగ్ కోహ్లి 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు సరికొత్త రికార్డులను లిఖించుకున్నాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్గా 5500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ తరపున కోహ్లి ఓపెనర్గా 5500 పరుగులు సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్ను అందుకున్నాడు.అంతకముందు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఓపెనర్లుగా 5500 పరుగుల మార్కును దాటినప్పటికీ.. వారు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కోహ్లి మాత్రం కేవలం ఆర్సీబీ తరుపున ఆడుతూ ఈ ఘనత సాధించాడు.అదేవిధంగా ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. పంజాబ్ కింగ్స్పై కోహ్లి ఇప్పటివరకు 1175కు పైగా పరుగులు చేశాడు. ఇంతకముందు కోహ్లి చెన్నై సూపర్ కింగ్స్పై 1174 పరుగులు చేశాడు.ఐపీఎల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు:1175 పరుగులు – విరాట్ కోహ్లి (vs పంజాబ్ కింగ్స్)1174 పరుగులు – విరాట్ కోహ్లి (vs చెన్నై సూపర్ కింగ్స్) 1172 పరుగులు – విరాట్ కోహ్లి (vs ఢిల్లీ క్యాపిటల్స్) 1161 పరుగులు – రోహిత్ శర్మ (vs కోల్కతా నైట్ రైడర్స్) 1134 పరుగులు – డేవిడ్ వార్నర్ (vs పంజాబ్ కింగ్స్) ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో తన 500 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 9 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అత్యధిక సార్లు ఐపీఎల్ సీజన్లలో 500 ప్లస్ రన్స్ చేసిన ప్లేయర్లు వీరే9 సీజన్లు – విరాట్ కోహ్లీ 7 సీజన్లు – డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ 5 సీజన్లు – శిఖర్ ధావన్చదవండి: PAK vs BAN: బాబర్ ఆజం అరుదైన రికార్డు -
2027 వరల్డ్ కప్ లో ఆడతారా! కుండబద్దలు కొట్టిన కోహ్లి
-
‘నా విలువను నిరూపించుకునే స్థితిలో లేను’
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఒక్క వన్డే ఫార్మాట్లోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల పదేపదే 2027 వన్డే వరల్డ్ కప్లో అతని స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కోహ్లి తన ఆలోచనలేమిటో స్పష్టంగా చెప్పాడు. తన స్థాయి, విలువకు తగిన గౌరవం ఇస్తేనే ఆటలో కొనసాగుతానని, లేదంటే తప్పుకుంటానని అతను వ్యాఖ్యానించాడు. తాను ఇంకా ఏదో నిరూపించుకోవాల్సిన స్థితిలో లేనని కోహ్లి స్పష్టం చేశాడు.‘నన్ను ఇప్పటికి 2027 వరల్డ్ కప్లో ఆడటం గురించి చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధం. ఎందుకంటే అది నాకు నిత్యకృత్యం. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇల్లు వదిలి నా కిట్తో బయటకు వెళ్లడం, ఎంతో కష్టపడటం కూడా దాని కోసమే కదా. భారత్ తరఫున మరో ప్రపంచకప్ ఆడటం గొప్ప గౌరవం. కానీ నాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. జట్టుకు నా అవసరం ఉందని భావిస్తేనే ఆడతాను. అంతే కానీ నా విలువను, స్థాయిని నిరూపించుకుంటే ఆడాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా లేను. నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు లేను’ అని కోహ్లి వెల్లడించాడు.గత ఏడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్కు పూర్తిగా సన్నద్ధమై, ప్రత్యేకంగా సొంత ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని బోర్డు నిబంధనల ప్రకారం రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత కూడా అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. కోహ్లిని తొలి రెండు టెస్టులకే ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ప్రదర్శనను బట్టి కొనసాగిస్తామని సెలక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘మనం పని చేసే చోట మన ప్రతిభ, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు అప్పగించిన తర్వాత వారం రోజులకే మన పనితీరును ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. నేను నిజాయితీగా పని చేస్తాను. ఆట కోసం ఎంతైనా కష్టపడతాను. వన్డేలో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ల మధ్య ఆ మూల నుంచి ఈ మూలకు పరుగెత్తమని చెబితే కచ్చితంగా చేస్తా. ప్రతీ బంతిని నా కెరీర్ చివరి బంతిలా భావించి మైదానంలో పోరాడతా. దీనిపై ఫిర్యాదు చేయను. ఎందుకంటే దానికి అనుగుణంగానే నేను సాధన చేస్తా, సిద్ధమవుతా. కేవలం ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే చెప్పేయండి. లేదా ఒకసారి అవకాశం ఇచ్చాక నన్ను పని చేసుకోనివ్వండి’ అని విరాట్ తన ఉద్దేశాన్ని చెప్పాడు. -
వన్డే వరల్డ్కప్ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గట్టిగానే చెబుతున్నారు.తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్మెంట్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.మౌనం వీడిన కోహ్లిఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్కప్ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.నా క్రికెట్ కెరీర్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.As I said, if Kohli feels the team management or BCCI wants him to prove his worth, he’ll retire the next day and that’s exactly what he said.He added "Ofc I want to play 2027 WC " 😭♥️ pic.twitter.com/eOv07nN6fc— Gaurav (@Melbourne__82) May 15, 2026ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరిది అనే ఆలోచనతోనేనాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్లో ఎదుర్కొనే ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరి బంతి అనే ఆలోచనతోనే సిద్ధమవుతా.వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్కాస్ట్లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గంభీర్, అగార్కర్ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్-2026 సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడి 484 పరుగులు సాధించాడు.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్.. జట్టును విజయపథంలో నిలిపాడు.టైటిల్ గెలిచిన తర్వాతఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే భారత్ వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేరింది.ఇక ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్ గెలిచిందని నాటి కెప్టెన్ రోహిత్ శర్మ ద్రవిడ్కు క్రెడిట్ ఇచ్చాడు.కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్కు కారణమా?ఇదిలా ఉంటే.. గంభీర్ టీమిండియాలో సూపర్స్టార్ సంస్కృతిని పారద్రోలి.. సూపర్ టీమ్గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్ నుంచి దిగ్గజాలు, సూపర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉందిఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై స్పందించాడు. స్కూప్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.వారే స్ఫూర్తి దాతలుకాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్ స్టార్ లేదంటే దిగ్గజ ప్లేయర్ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. సూపర్ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ సూపర్ స్టార్ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే! -
బంగారు గొలుసు పారేసుకున్నాడు.. అదే పాక్లో అయితే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ జేకబ్ బెతెల్ బంగారు గొలుసు నేల మీద పడిపోయింది. అయితే, అతడు దానిని తీసుకోవడం మర్చిపోయి పెవిలియన్కు చేరుకున్నాడు.ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ఆర్సీబీ- కేకేఆర్ బుధవారం రాయ్పూర్ వేదికగా తలపడ్డ సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆర్సీబీ.. కేకేఆర్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల తేడాతో గెలుపుఅంగ్క్రిష్ రఘువంశీ (71), కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ (49 నాటౌట్) రాణించారు. ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేకబ్ బెతెల్ కేవలం 15 పరుగులు చేసి.. కార్తిక్ త్యాగి బౌలింగ్లో అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయం సెంచరీ (105)తో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (39) రాణించాడు. ఈ క్రమంలో 19.1 ఓవర్లలో ఆర్సీబీ నాలుగు వికెట్లు నష్టపోయి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.కిందపడిన బంగారు గొలుసుఇదిలా ఉంటే.. కార్తిక్ త్యాగి సంధించిన బౌన్సర్ జేకబ్ బెతెల్ హెల్మెట్కు బలంగా తాకింది. ఈ క్రమంలోనే అతడి మెడలో ఉన్న గోల్డ్ చెయిన్ కింద పడిపోయింది. అయితే, అవుటై పెవిలియన్కు వెళ్లిపోతున్న క్రమంలో బెతెల్.. బంగారు గొలుసు తీసుకోవడం మర్చిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్.. ఈ విషయాన్ని గుర్తించాడు.PC: Xఅదే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇలా జరిగి ఉంటే..మైదానంలో పడిన బంగారు గొలుసు తీసి అంపైర్కు చూపించగా.. అది అక్కడి నుంచి బెతెల్కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.‘‘అసలే బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో గొలుసు దొరికితే ఎవరూ వదిలిపెట్టరు. ఇది ఐపీఎల్లో జరిగింది కాబట్టి సరిపోయింది. బెతెల్కు తన గొలుసు లభించింది. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇలా జరిగి ఉంటే.. గొలుసు మళ్లీ కనిపించేదే కాదు’’ అని వ్యంగ్యరీతిలో కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సీఎస్కేకు భారీ షాక్!.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
అది నన్ను తీవ్రంగా వేధించింది: విరాట్ కోహ్లి
వరుస వైఫల్యాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి బుధవారం బ్యాట్ ఝులిపించాడు. ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేస్తూ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై శతక్కొట్టాడు. ప్రత్యర్థి విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టును గెలిపించాడు.గెలుపులో కీలక పాత్రరాయ్పూర్ వేదికగా కేకేఆర్తో మ్యాచ్లో మొత్తంగా 60 బంతుల్లో.. 105 పరుగులతో కోహ్లి (Virat Kohli) అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.అది నన్ను తీవ్రంగా వేధించిందిఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత రెండు మ్యాచ్లలో నేను పరుగులు చేయలేకపోయాను. అది నన్ను తీవ్రంగా వేధించింది. బాగా ఆడగలనని నాకు తెలుసు. ఈరోజు బంతిని బలంగా బాది అనుకున్నట్లుగా పని పూర్తి చేశాను.రోజురోజుకీ మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం. అయితే, కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఒక్కోసారి ఒత్తిడిలో ఆడటం కూడా మంచిదే.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026కారణం అదేఅదే మనల్ని మరింత కఠినంగా శ్రమించేలా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలి అడుగు పడేలా ముందకు తోస్తుంది. గత రెండు మ్యాచ్లలో విఫలమైనప్పుడు నేను నిరాశ చెందిన మాట వాస్తవం. ఈరోజు సెంచరీ పూర్తైన తర్వాత గొప్పగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం అదే.కృతజ్ఞుడిగా ఉంటానునా దృష్టి మొత్తం వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టి జట్టును గెలిపించడమే. బ్యాటింగ్ చేయడమంటే నాకు ఇష్టం. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా నాలో పరుగుల దాహం తీరదు. మళ్లీ మొదటి నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెడతా. దేవుడి దయ వల్ల ఎన్నో రికార్డులు సాధించగలిగాను. అందుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను’’ అని విరాట్ కోహ్లి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో కోహ్లికి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో పదవ శతకం. ఇదిలా ఉంటే.. గత రెండు మ్యాచ్లలో కోహ్లి డకౌట్ అయిన సంగతి తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఐపీఎల్-2026లో గత రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన ‘కింగ్’.. ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు.ఛేదనలో మొనగాడినని మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డు బద్దలుటీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాయ్పూర్ వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కోహ్లి (105 నాటౌట్) శతక్కొట్టగా.. దేవ్దత్ పడిక్కల్ (27 బంతుల్లో 39) మెరుగ్గా రాణించాడు.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 409 ఇన్నింగ్స్లో👉క్రిస్ గేల్- 423 ఇన్నింగ్స్లో👉డేవిడ్ వార్నర్- 431 ఇన్నింగ్స్లో👉జోస్ బట్లర్- 468 ఇన్నింగ్స్లో👉అలెక్స్ హేల్స్- 505 ఇన్నింగ్స్లో👉కీరన్ పోలార్డ్- 633 ఇన్నింగ్స్లోటీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉క్రిస్ గేల్- 22👉బాబర్ ఆజం- 13👉డేవిడ్ వార్నర్- 10👉విరాట్ కోహ్లి- 10👉రీలీ రొసోవ్, సాహిబ్జాదా ఫర్హాన్- 9👉క్వింటన్ డికాక్, అభిషేక్ శర్మ- 9.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
కోల్కతాపై బెంగళూరు విజయం
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం అందుకుంది.విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో సీజన్లో 8వ విజయంతో ప్లేఆఫ్స్ రేసుకి మరింత చేరువైంది ఆర్సీబీ. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
టీమిండియా సూపర్ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా కేకేఆర్తో మ్యాచ్లో కోహ్లి ఈ ఫీట్ను అందుకున్నాడు.కింగ్ కోహ్లికి ఇది 279వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ముగ్గురూ 278 మ్యాచ్లతో సమంగా ఉండేవారు. తాజా మ్యాచ్తో కోహ్లి వారిద్దరిని అధిగమించి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కోహ్లి ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఎంఎస్ ధోనీ సీఎస్కే ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మిస్టర్ కూల్ గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్లో కోహ్లి రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశముంది. కాగా విరాట్ కోహ్లి ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లి-279ఎంఎస్ ధోని-278రోహిత్ శర్మ-278రవీంద్ర జడేజా-265చదవండి: టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!? -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్లో లిజ్ లాజ్కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
సిల్వర్ టు గోల్డెన్ డక్.. కోహ్లీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కాచుకు కూర్చున్న రాజ్బవాకు స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ డకౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలిసారి గోల్డెన్ డక్ అయిన కోహ్లీకి ఓవరాల్గా ఐపీఎల్లో ఎనిమిదో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత రెండు వరుస మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. లక్నోతో జరిగిన గత మ్యాచ్లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. 2022 సీజన్లో కోహ్లీ లక్నో, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ల్లో ఇదే మాదిరిగా డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు. 'సిల్వర్ డక్ను గోల్డెన్ డక్గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం' అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజా డకౌట్తో కోహ్లీ మరిన్ని చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.👉ముంబై ఇండియన్స్పై కోహ్లీ డకౌట్ కావడం ఇది మూడోసారి. గతంలో ఎస్ఆర్హెచ్పై కూడా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక లక్నోపై రెండుసార్లు, పంజాబ్, గుజరాత్, కేకేఆర్, రాజస్తాన్లపై ఒక్కోసారి డకౌట్గా వెనుదిరిగాడు.👉 ఐపీఎల్లో కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్తో ఆడిన తర్వాతి మ్యాచ్లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. తాజా సీజన్లోనూ వరుసగా లక్నో, ముంబైతో మ్యాచ్ల్లోనూ మరోసారి రిపీట్ చేశాడు.👉 ఐపీఎల్ల్లో అత్యధిక సార్లు గోల్డెన్డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిషన్, సునీల్ నరైన్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరి కంటే ముందు రషీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.👉ఈ సీజన్లో కోహ్లీ బ్యాటింగ్లో మెరుపులు తగ్గినప్పటికీ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 379 పరుగులు సాధించాడు. అయితే గత నాలుగు ఇన్నింగ్స్లు కలిపి కోహ్లీ చేసిన పరుగులు 51 మాత్రమే కావడం గమనార్హం.Virat Kohli goes for a Golden Duck 😯Courtesy Deepak Chahar 🤌💙Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/LxCP62qvVJ— IndianPremierLeague (@IPL) May 10, 2026Silver duck now has been upgraded to golden duck 😂 pic.twitter.com/wxhEbgDBHC— Hitman (@Vijay456V60026) May 10, 2026చదవండి: లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర! -
కోహ్లి సహచరుడు, పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ ఆకస్మిక మృతి
ఐపీఎల్ 2026 మధ్యలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ పంజాబ్ క్రికెటర్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అండర్ 19 జట్టు సహచరుడు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) మాజీ ఆటగాడు అమన్ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా కన్నుమూశాడు. ఆతని వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. గిల్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026చండీగఢ్లో జన్మించిన అమన్ప్రీత్ సింగ్ గిల్, పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత అండర్-19 జట్టు తరఫున కూడా ఆడాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభ దశలో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) జట్టులో భాగంగా ఉన్నాడు.క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.కోహ్లీతో కలిసి అండర్-19లోఅమన్ప్రీత్ గిల్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లితో కలిసి 2007లో అండర్-19 ప్రపంచకప్లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రతిభ చాటాడు.అమన్ప్రీత్ గిల్ మృతిపై పంజాబ్ క్రికెట్ అసోసిచయేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "పంజాబ్ క్రికెట్కు అంకితభావంతో సేవలందించిన అమన్ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరం" అని పేర్కొంది. అమన్ప్రీత్ అంత్యక్రియలు ఇవాళ (మే 6) చండీగఢ్లోని మణిమజ్రా శ్మశానవాటికలో నిర్వహించారు. అమన్ప్రీత్ గిల్ మృతికి సంతాపంగా ఇవాళ జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్లు ధరించే అవకాశం ఉంది. -
విరాట్ కోహ్లి కాదు.. కొత్త 'కింగ్' అతడే..!
ఐపీఎల్ 2026 మధ్య దశకు చేరుకున్న వేళ ‘కింగ్’ అనే బిరుదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఈ ట్యాగ్కు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లికి ఇప్పుడు గట్టి పోటీదారు వచ్చాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తమ జట్టు స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ను "కొత్త కింగ్"గా అభివర్ణిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. తాజాగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో నరైన్ 200 ఐపీఎల్ వికెట్ల మైలురాయిని అందుకోవడంతో ఈ చర్చ మొదలైంది.నరైన్ ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 200కు పైగా వికెట్లు, 1000కు పైగా పరుగులు, సెంచరీ, హ్యాట్రిక్, ఐదు వికెట్ల హాల్, మూడు సార్లు మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అవార్డులు.. ఇలాంటి ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ కారణంగానే మైసూర్ నరైన్ను గేమ్ చేంజర్గా కొనియాడుతూ 'కింగ్'గా అభివర్ణించాడు.మరోవైపు విరాట్ కోహ్లి కింగ్ అనే బిరుదుకు సార్దకత చేకూరుస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా స్థిరమైన ప్రదర్శన, జట్టు విజయాల్లో కీలక పాత్ర, భారీ అభిమాన వర్గం.. ఇవి కోహ్లీని 'కింగ్'గా నిలబెట్టాయి.నరైన్ కూడా విరాట్లాగే కెరీర్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో స్థిరంగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ కింగ్ బిరుదు కోసం పోటీపడుతున్నాడు. బ్యాటింగ్లో విరాట్.. ఆల్రౌండ్ ప్రదర్శనల్లో నరైన్ ఆధిపత్యం చాటుతుండటంతో కింగ్ ఎవరో డిసైడ్ చేయడం చాలా కష్టంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ తొలి 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేని కేకేఆర్.. అనూహ్యంగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఉనికి చాటుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు కలిగి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు అయినప్పటికీ.. అధికారికంగా రేసులోనే ఉంది. మరోవైపు విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పట్టికలో రెండో స్థానంలో ఉంది. -
షాక్లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్లో 9 మ్యాచ్లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్లు అదరగొడుతుంటే, బౌలింగ్లో హాజిల్వుడ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్లోనూ బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్రేట్తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్లీ ఈ ఫేర్వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్కు గార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.𝙀𝙣𝙙 𝙤𝙛 𝙖𝙣 𝙚𝙧𝙖, 𝙀𝙫𝙖𝙣 𝙎𝙥𝙚𝙚𝙘𝙝𝙡𝙮! Your legacy at RCB will always be remembered. 🙌❤️Evan Speechly was our Head Physio for 18 long years, from 2008 to 2025 - one of the OGs of RCB. He flew down to Bengaluru for a special farewell, and we were all teary eyed!… pic.twitter.com/fjVJR80V1j— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2026 చదవండి: ‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీకి ఛేజింగ్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. ఈ రికార్డు విజయంలో కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు)లది కీలక పాత్ర. వీరిద్దరూ తొలి వికెట్కు 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.ఆ తర్వాత నిస్సాంక ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఆ తర్వాత ఆశుతోష్, స్టబ్స్ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక హాఫ్ సెంచరీతో సత్తాచాటిన రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ఓపెనర్గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఓపెనర్గా రాహుల్ ఖాతాలో 202 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(192) ఉన్నారు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్లుకేఎల్ రాహుల్ - 202* సిక్సర్లువిరాట్ కోహ్లీ - 192 సిక్సర్లురోహిత్ శర్మ - 148 సిక్సర్లుశిఖర్ ధావన్ - 143 సిక్సర్లుశుభమాన్ గిల్ - 129 సిక్సర్లుఅదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో రాహుల్ నాలుగో స్ధానంలో జడేజా సరసన నిలిచాడు. ఈ లిస్ట్లో రోహిత్ శర్మ(21) అగ్రస్ధానంలో ఉన్నాడు.అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఇండియన్స్ వీరే21 - రోహిత్ శర్మ20 - విరాట్ కోహ్లీ18 - ఎంఎస్ ధోని17 - రవీంద్ర జడేజా17 - KL రాహుల్* -
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్లు పట్టిన జేసన్ హోల్డర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026 -
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
-
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్ మొత్తం వారికే: గిల్
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టైటాన్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. అనంతరం బ్యాటింగ్లోనూ సత్తాచాటింది.15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లను గిల్ కొనియాడాడు."కీలక మ్యాచ్లో విజయం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి వికెట్పై ప్రత్యర్ధి జట్టును 160 పరుగులలోపు కట్డడి చేయడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్రతీ ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవర్లో విరాట్ భాయ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అతడి వికెట్తో తిరిగి మేము గేమ్లోకి వచ్చాము. నేనేమి ఈ మ్యాచ్లో ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. నేను ఒక రిథమ్లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్లో పడింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జట్టులో కీలక సభ్యుడు. ఈ రోజు అతడు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్యతను తెవాటియా తీసుకుని మ్యాచ్ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 43 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి.. కోహ్లి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 28 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ముఖ్యంగా గుజరాత్ పేసర్ కగిసో రబాడకు కింగ్ కోహ్లి చుక్కలు చూపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో కోహ్లి వరుసగా 5 సిక్స్లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే👉భారత గడ్డపై ఐపీఎల్లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలు రాయిని విరాట్ అందుకున్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తంగా అతడు 1000కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి పేరిట 9230 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. కాగా కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.భారత్లో అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లీ - 8,016రోహిత్ శర్మ - 6,274శిఖర్ ధావన్ - 5,819డేవిడ్ వార్నర్ - 5,689👉ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా క్రిస్ గేల్, షేన్ వాట్సన్ సరసన కోహ్లి నిలిచాడు. క్రిస్ గేల్, షేన్ వాట్సన్ గతంలో పుణే వారియర్స్ పై ఈ ఫీట్ సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది.కెప్టెన్ శుభ్మన్ గిల్(43) టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి(28), దేవ్దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్ -
అంపైర్పై ఫైర్ అయిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. గుజరాత్ ఆటగాడు జేసన్ హోల్డర్ పట్టిన ఓ క్యాచ్ (రజత్ పాటిదార్ది) అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాడు. Virat Kohli is unhappy with the decision by the third umpire on the catch of Rajat Patidar ❌Out or not-out - What are your thoughts? 👀 #RCBvsGT pic.twitter.com/3ItI5ZngJP— Hassi (@hass_1707) April 30, 2026ఈ క్రమంలో మైదానంలోనే అంపైర్తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో విరాట్పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు.సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శారీరక దురుసుతనం లేదా తీవ్రమైన అవమానకర ప్రవర్తన ఉంటేనే కఠిన చర్యలు తీసుకుంటారు.ఇందుకు ఇటీవలి నితీశ్ రాణా ఉదంతం ఓ ఉదాహరణ. ఇదే సీజన్లో రాణా అంపైర్తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇదే తరహాలో విరాట్కు కూడా శిక్ష పడే అవకాశం ఉంది.Ball clearly touched the ground, it's a clear notout. Virat Kohli wasn't happy with Umpire decision.He schooled Umpire live in front of 130k fans😭🔥pic.twitter.com/2QrEN2nDCh— ` (@wokenupkohli) April 30, 2026కాగా, హోల్టర్ క్యాచ్ నిజంగా క్లీన్గా పట్టాడా లేదా అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కోహ్లీ స్పందనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు నియంత్రణ కోల్పోయాడని విమర్శిస్తున్నారు. వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్ క్యాచ్ పట్టిన సమయంలో బంతి నేలపై ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఔట్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. -
దడదడలాడించిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న 42వ మ్యాచ్లో ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఊహించిన విధంగానే గుజరాత్ బౌలర్లు తొలుత బౌలింగ్ చేస్తూ చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మధ్యలో ఆర్సీబీకి ఒకే ఒక ఊరట కలిగించే అంశం ఉంది. అదేంటంటే.. విరాట్ కోహ్లి. ఈ మ్యాచ్లో విరాట్ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.చూడటానికి ఈ గణాంకాలు సాధారణంగానే ఉన్నా, ఈ ఇన్నింగ్స్ కెరీర్ తొలినాళ్లలో విరాట్లోని దూకుడుకు అభిమానులకు మరోసారి రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్లో విరాట్ గుజరాత్ బౌలర్ కగిసో రబాడపై విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉండింది.Pace meets 𝙋𝙀𝙍𝙁𝙀𝘾𝙏𝙄𝙊𝙉 🤌🎥 Virat Kohli with 5️⃣ consecutive boundaries against Kagiso Rabada 🔥Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @RCBTweets pic.twitter.com/mdunPUJiV0— IndianPremierLeague (@IPL) April 30, 2026ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రబాడ బౌలింగ్లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్ బౌలర్ అన్న కనికరం కూడా లేకుండా రెచ్చిపోయాడు. వరుసగా 5 బౌండరీలు బాది చుక్కలు చూపించాడు.పుల్ షాట్తో ఆరంభించిన కోహ్లీ.. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ కెరీర్లో కోహ్లీ ఒకే ఓవర్లో సాధించిన నాలుగో అత్యధిక స్కోరు ఇదే.* 30 పరుగులు vs గుజరాత్ లయన్స్ (2016)* 23 పరుగులు vs ఢిల్లీ (2013)* 22 పరుగులు vs డెక్కన్ ఛార్జర్స్ (2010)* 21 పరుగులు vs గుజరాత్ టైటాన్స్ (2026)మరో అరుదైన ఘనతఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్, షేన్ వాట్సన్ తర్వాత ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు.రబాడ ఓవర్ తర్వాత సిరాజ్ వేసిన మరుసటి ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన విరాట్.. రబాడ వేసిన ఆ మరుసటి ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో విరాట్ విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడింది. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభం నుంచే విరాట్ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో తన సహజ శైలికి భిన్నంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా విరాట్ ఎక్కువగా గ్రౌండ్ షాట్లు ఆడుతూ బౌండరీలు కొడుతుంటాడు. అయితే ఈ సీజన్లో అందుకు భిన్నంగా సిక్సర్లతో చెలరేగుతున్నాడు. ఈ సీజన్లో విరాట్ ఇప్పటికే 42 బౌండరీలతో పాటు 15 సిక్సర్లు బాదాడు.కాగా, ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. -
చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో కోహ్లితో గొడవపడిన వ్యక్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్ క్రికెటర్ ఇప్పుడు అతని దేశ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్కు చెందిన 37 ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్కు కోహ్లీ బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఫిన్ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.అయితే ఫిన్ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కామెంటేటర్ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్, కామెంటేటర్గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా ఫిన్ ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్ రైట్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్ తన పదవికి రాజీనామా చేశాడు.ఈ క్రమంలో చీఫ్ సెలెక్టర్ పదవికి ఎన్నిక అనివార్యం కాగా.. ఫిన్తో పాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు డారెన్ గాఫ్, నిక్ నైట్ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్ చీఫ్ సెలెక్టర్ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో విమర్శల పాలైన బాబర్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో బిజీగా ఉన్నాడు.బాబర్ ఆజం శతకంపెషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్గా ఉన్న బాబర్ (Babar Azam).. ఇటీవలే ఫామ్లోకి వచ్చాడు. తాజాగా ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. కరాచీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన బాబర్ ఆజం శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.151 పరుగులకే ఆలౌట్బాబర్ ఇన్నింగ్స్ కారణంగా పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఫైనల్కు పెషావర్ఫలితంగా 70 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెషావర్ జల్మీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్లో పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ ఆజంకు ఇది రెండో సెంచరీ. ఈ క్రమంలోనే అతడు సౌతాఫ్రికా వెటరన్ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్గా బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు.టీ20 క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- తొమ్మిది సెంచరీలు👉ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా)- ఎనిమిది సెంచరీలు👉మైకేల్ క్లింగెర్ (ఆస్ట్రేలియా)- ఏడు సెంచరీలు👉విరాట్ కోహ్లి (భారత్)- ఐదు సెంచరీలు👉జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)- ఐదు సెంచరీలు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ అభిమాని కొడుకు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్ దేశవాలీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్ వికెట్కీపర్ బ్యాటర్ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బిహేవియర్ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్ దేశవాలీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్లో సంచలనంగా మారింది.వెస్టిండీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్ తరఫున చేశాడు.వెస్టిండీస్ తరఫున అడపాదడపా టెస్ట్ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజన్తో బిజీగా ఉన్నప్పటికీ తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టు ఢిల్లీ వీడినప్పటికీ కోహ్లి మాత్రం తన స్వస్థలంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్రధాన కారణముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (డబ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి కోహ్లితో పాటు అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా హాజరయ్యారు. ఇది తన కోచ్ రాజ్కుమార్ శర్మ క్రికెట్ అకాడమీ కావడంతో ఆయన మీద గౌరవంతో కోహ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్యక్రమంలో భాగంగా అకాడమీ స్టూడెంట్లకు కోహ్లి అవార్డులు అందజేశాడు. ఈ నేపథ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్లను మొక్కే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి వద్దని వారించి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడమీలోని స్టూడెంట్స్ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వయసులోనే క్రీడలను నా కెరీర్గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజయితీతో చేయాలనుకున్నా. అందుకే క్రికెటర్ కావాలని ధృడంగా నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వర్ధమాన క్రికెటర్లు తమ ఆశయాల పట్ల పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన అవసరముంది. మీరు కంటున్న కలల పట్ల, ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వందశాతం నిజాయితీతో కష్టపడితే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజన్లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్లాడి 351 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 44 బంతుల్లోనే 81 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక సోమవారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్లో 9వేల పరుగుల మార్క్ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం -
అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 5 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన పేస్ బౌలర్ అజితేశ్ అర్గల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ 18 ఏళ్లలో ఇద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. కోహ్లి దిగ్గజ క్రికెటర్ స్థాయికి చేరుకోగా, అజితేశ్ కెరీర్ పెద్దగా సాగలేదు. అండర్–19 స్థాయిలో ప్రతిభ చూపి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీలో 19 మ్యాచ్లకే పరిమితమైన అతడిని ఐపీఎల్లో పంజాబ్ జట్టు తీసుకున్నా... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అజితేశ్ అంపైరింగ్ వైపు మళ్లాడు. ఈ నెల 22న తొలిసారి ఐపీఎల్లో అంపైరింగ్ చేసిన అజితేశ్ తన మూడో మ్యాచ్లో కోహ్లిని కలుసుకున్నాడు. సోమవారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో కోహ్లి ఆడుతుండగా, అజితేశ్ అంపైరింగ్ చేశాడు. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయత, ముచ్చట్లు ఆసక్తికర దృశ్యానికి చిరునామాగా నిలిచాయి. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2026లో సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి మరో 11 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.కోహ్లి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 274 మ్యాచ్లు ఆడి మొత్తంగా 8,989 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో కోహ్లి 62 పరుగులు సాధిస్తే, భారత గడ్డపై 10,000 టీ20 రన్స్ నమోదు చేసిన ప్లేయర్గా అవతరిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి ఉన్న ఫామ్కు ఈ రికార్డులను అందుకోవడం పెద్ద విషయమేమి కాదు. ఈ ఏడాది సీజన్లోనూ ఎప్పటిలానే కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంతమైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో సత్తాచాటేందుకు కింగ్ సిద్దమయ్యాడు. కోహ్లి(328) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
పొద్దున్నే విరాట్, రాత్రికి అభిషేక్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్లే అయ్యాయి. రెండు మ్యాచ్ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్లో సన్రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్తో సోషల్మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
విరాట్పై విషం చిమ్మిన ఇంగ్లండ్ దిగ్గజం
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మరోసారి కెలికాడు. తాజాగా తన దేశానికే చెందిన సామ్ బిల్లింగ్స్ విరాట్ను పొగుడుతూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేయగా.. అందుకు బదులుగా వ్యంగ్యంగా స్పందించాడు. తాజాగా గుజరాత్పై విరాట్ మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం సామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో "ఫుల్ ఫ్లోలో ఉన్న విరాట్ను చూడటం కంటే గొప్పది ఏముంటుంది..?" అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన వాన్, "ఉంది.. జో రూట్" అంటూ విరాట్పై అక్కసును వెళ్లగక్కాడు.వాస్తవానికి వాన్కు విరాట్ను కెలకడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. విరాట్కు ఫాబ్-4లో ఉండే అర్హత లేదంటూ కొన్ని సార్లు.. విరాట్ ఫాబ్-4లో అథముడని మరికొన్ని సార్లు కామెంట్లు చేశాడు. తాజాగా విరాట్ కంటే రూట్ చాలా బెటర్ అన్న అర్దం వచ్చేలా బిల్లింగ్స్ ట్వీట్పై స్పందించి శునకానందం పొందాడు. వాన్ విరాట్పై చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరలైంది. వాన్పై విరాట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొందరు, వాన్కు ఇలాంటి చెత్త ప్రవర్తన కొత్తేమీ కాదంటూ లైట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ మెరుపు హాఫ్ సెంచరీ (81) చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో అతను మరిన్ని ఘనతలు సాధించాడు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించడమే కాకుండా.. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విరాట్తో పాటు దేవ్దత్ పడిక్కల్ (55) కూడా మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అద్భుత శతకం వృధా అయ్యింది. -
తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి!
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్ను ప్యాడ్కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్! ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆర్సీబీ స్టార్ జాకబ్ బెతెల్ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్ మిడ్వికెట్ వద్ద వాషింగ్టన్ సుందర్ సునాయాస క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్ భారీ మూల్యం చెల్లించింది.మరో ఎండ్లో పడిక్కల్ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్తో మొదలు పెట్టిన అతను సిరాజ్ ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. రషీద్ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టగా... ప్రసిధ్ ఓవర్లో పడిక్కల్ 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. ఆపై రషీద్ ఓవర్లోనూ 2 సిక్స్లతో చెలరేగిన పడిక్కల్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.హోల్డర్ వైల్డ్గా సెలబ్రేషన్స్.. తీవ్ర అసంతృప్తిలో కోహ్లిపడిక్కల్ను రషీద్ అవుట్ చేయగా, హోల్డర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Set batters gone 😯🎥 Rashid Khan and Jason Holder hit the timber \|/Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/zVUsxy1NB2— IndianPremierLeague (@IPL) April 24, 2026ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్ శర్మ (10), కెప్టెన్ రజత్ పాటీదార్ (8) విఫలమైనా... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్ సెంచరీస్ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్స్కోరర్గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గర్జించిన కోహ్లి, పడిక్కల్.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్), హోల్డర్ (23 నాటౌట్) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో జాకబ్ బెతల్ (14) షారుక్ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026 -
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
-
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
కోహ్లి ‘టేస్ట్’పై కామెంట్.. మాజీ ‘గర్ల్ఫ్రెండ్’ స్పందన ఇదే!
విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్, రన్మెషీన్గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్.. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.ప్రస్తుతం ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ ఫొటోకు కోహ్లి లైక్ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్లైక్ చేసినట్లు తెలిసింది.ఈ విషయంపై లిజ్లాజ్ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్లూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.అభ్యంతరకర కామెంట్ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో బ్రెజిల్ మోడల్ ఇసబెల్ల లియట్, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్లాజ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్ పెట్టారు.ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్ చేశాడనే వదంతులు ఉన్నాయి.కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్లోని ప్రేమానంద్జీ మహరాజ్ను దర్శించి ఆశీసులు తీసుకుంది.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కరాచీ స్టేడియం వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బాబర్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.గ్లాడియేటర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్కు ఇది 12వ సెంచరీ.టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బాబర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొదటి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో బాబర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొదటి ఆటగాడిగా బాబర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్!


