Virat Kohli
-
వైభవ్కు కళ్లు చెదిరే ఆఫర్.. కోహ్లీకి పోటీగా!
రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 19వ సీజన్లో తన బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడిన వైభవ్ సూర్యవంశీ 242 స్ట్రైక్రేట్తో 680 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వైభవ్ ఉపయోగిస్తున్న బ్యాట్ స్పాన్సర్షిప్కు సంబంధించి కళ్లు చెదిరే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వాడుతున్న బ్యాట్కు ఎస్ఎస్ (సరీన్ స్పోర్ట్స్) కంపెనీ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. అయితే ఇకపై వైభవ్ తన బ్యాట్పై ఏడాదికి రూ. 12కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్ఎస్ కంపెనీతో ఉన్న ఒప్పందంతో పోలిస్తే ఇది 24 రేట్లకు ఎక్కువ అని చెప్పొచ్చు. అయితే ఈ కొత్త ఒప్పందం ప్రస్తుత స్పాన్సర్ ఎస్ఎస్తోనే జరిగిందా లేక వేరే కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి వైభవ్ పోటీగా మారనున్నాడు.ప్రస్తుతం కోహ్లీ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న ఎంఆర్ఎఫ్ ఏడాదికి రూ. 12.5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఎంఆర్ఎఫ్ కూడా వైభవ్ బ్యాట్కు స్పాన్సర్గా వ్యవహరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇలా వైభవ్ తన బ్యాట్తో పరుగుల సునామీ సృష్టించడమే కాదు, ఇప్పుడు బ్యాట్ ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో సంపాదించబోతున్నాడు.Vaibhav Sooryavanshi has received a bat sponsorship offer of 12cr annually. - It’s more than 24 times than his previous bat sponsorship deal. (CricBlogger). pic.twitter.com/ZwQkLN61uf— Mufaddal Vohra (@mufaddal_vohra) May 29, 2026చదవండి: ముంబై వీడినా పాండ్యాకు బంపరాఫర్! -
ఆ జట్టుదే ఐపీఎల్ 2026 టైటిల్.. ఏఐ జోస్యం!
ఐపీఎల్ 2026 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ జరగనున్న క్వాలిఫయర్-2 పోరుతో కలిపి ఫైనల్ మ్యాచ్ మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే క్వాలిఫయర్-1 పోరులో గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ఆర్సీబీ నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ను ఓడించిన రాజస్తాన్ రాయల్స్ ఫైనల్లో బెర్తు దక్కించుకోవడం కోసం క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు మే 31న (ఆదివారం) జరగనున్న ఫైనల్లో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2026 సీజన్ విజేత ఎవరనేది ఏఐ ప్లాట్ఫామ్ క్లాడ్ అంచనా వేసింది. క్వాలిఫయర్-2లో విజేతతో పాటు టైటిల్ గెలుచుకోనున్న జట్టును కూడా అంచనా వేసింది. ఏఐ మాయతో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్న ఈ రోజుల్లో అది చెప్పిన జోస్యం నిజమవుతుందా అనేది చూడాలి. క్వాలిఫయర్-2లో రాజస్తాన్ను ఓడించి గుజరాత్ టైటాన్స్ ఫైనల్కు దూసుకెళ్తుందని అంచనా వేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఆర్సీబీ చేతిలో చతికిలపడి గుజరాత్ రన్నరప్తో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. ఇక ఆర్సీబీ వరుసగా రెండోసారి చాంపియన్గా నిలవనుందని, ఆ జట్టుకే గెలుపు అవకాశాలు 65 శాతం ఉన్నట్లు తెలిపింది. దీని వెనుక ఉన్న కారణాల్ని కూడా పక్కాగా వివరించింది.ఈ సీజన్లో ఆర్సీబీ నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తూ ఆరంభం నుంచే విజయాలు సాధించి మెరుగైన రన్రేట్తో 18 పాయింట్లు సాధించి టేబుల్ టాపర్గా నిలిచింది. కోహ్లి, పాటిదార్, పడిక్కల్, టిమ్ డేవిడ్లతో కూడిన బలమైన లైనప్కు తోడు భువనేశ్వర్, హాజిల్వుడ్, రసిక్ సలామ్ వంటి బౌలర్లతో పటిష్టంగా ఉందని తెలిపింది. అదీగాక క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో చిత్తు చేసిన ఆర్సీబీ మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్లో బరిలోకి దిగనుందని, అదే ఆత్మవిశ్వాసంతో గుజరాత్ను మరోసారి ఓడించి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ దక్కించుకోనుందని తెలిపింది. మరి ఏఐ చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే.చదవండి: తగ్గేదేలే.. లక్ష్యం మరో 4 వేల కిలోమీటర్లే! -
రోహిత్, విరాట్లను భయపెట్టిన పాట్ కమిన్స్ నే వణికించిన బుడ్డాడు..!
-
మే 31.. డబుల్ హిస్టారిక్ డే!
మే 31.. ఆదివారం.. కర్ణాటక చరిత్రలో కీలక మలుపు దిశగా సాగే తేదీగా మారింది. ఒకవైపు క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠభరిత ఫైనల్, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. ఈ రెండు భిన్న ప్రపంచాల్లోనూ ఒకే రోజు చర్చకు కేంద్రబిందువుగా నిలుస్తోంది.కర్ణాటక రాజకీయాల్లో ఆ తేదీ కొత్త చరిత్రకు వేదికగా మారుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ 31నే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే ప్రచారం నడుస్తోంది(అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది).డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానం చూస్తే ఇది ఒక దీర్ఘ ప్రయాణానికి ఫలితంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. “కట్టె కాలేదాకా కాంగ్రెస్తోనే ఉంటాను” అనే ఆయన మాటలు ఆ నిబద్ధతను చెబుతాయి. 2023లోనే ఆయన సీఎం పదవికి అర్హుడిగా ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాల కారణంగా అవకాశం వాయిదా పడింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు లభించబోతోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇటు కర్ణాటకకు చెందిన ఆర్సీబీ జట్టు అభిమానులు మే 31వ తేదీ కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఆరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంది. గత సీజన్లో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి ఆ జట్టు తొలి ఐపీఎల్ కప్పును సాధించింది. జట్టు సభ్యుడు, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18 కావడంతో ఆ విజయం మరింత భావోద్వేగంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరడంతో అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.ఒకవైపు క్రీడా ప్రపంచంలో 18 ఏళ్ల కల నెరవేరిన కథ మళ్లీ రిపీట్ అవుతుందా అనే ఆశ, మరోవైపు దశాబ్దాల రాజకీయ ప్రయాణం చివరికి శిఖరాన్ని చేరబోతున్న క్షణం.. ఇవన్నీ కలిసి మే 31ను “డబుల్ హిస్టారిక్ డే”గా నిలబెడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
గుజరాత్పై గెలుపు.. కోహ్లికి వెటకారం ఎక్కువే!
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గొడవలో అయినా, ఫన్నీ మోడ్లో అయినా కింగ్ కోహ్లిని ఎవరు బీట్ చేయలేరు. మ్యాచ్లో కోహ్లి 25 బంతుల్లోనే 43 పరుగులు చేసి ఆర్సీబీకి శుభారంభం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ ఓటమి తర్వాత గుజరాత్ టైటాన్స్ జట్టు ఫొటో సెషన్ జరిగింది. ఈ సమయంలో డగౌట్లో ఉన్న కోహ్లీ గుజరాత్ జట్టు వైపు చూస్తూ.. ‘ బాగైంది.. మేం మీపై గెలిచి ఫైనల్కు చేరుకున్నాంలే’ అంటూ ఫన్నీ మోడ్లో తన చేతులతో స్నేక్ గెచ్చర్ ఇవ్వడం కనిపించింది. ఇది చూసిన గుజరాత్ ఆటగాళ్లు సరదాగా నవ్వుకున్నారు. అంతకముందు గుజరాత్ ఇన్నింగ్స్ సమయంలోనూ కోహ్లీ గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్తో కయ్యానికి కాలు దువ్వడం కనిపించింది. అయితే ఇదంతా సరదా కోసమే చేసినట్లు వీడియోలో క్లియర్గా కనిపించింది. ఇక జాకబ్ డఫీకి బంతి ఇవ్వడానికి ముందు కోహ్లీ చేసిన మరొక చర్య కూడా వైరల్గా మారింది. తాను బౌలింగ్కు దిగుతున్నట్లు అంపైర్ వద్దకు వెళ్లి తన క్యాప్ను ఇచ్చిన కోహ్లీ ఆ తర్వాత బంతి తీసుకొని రనప్కు సిద్ధమయ్యాడు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన జాకబ్ డఫీ బంతి ఇవ్వమని అడగడంతో అతని చేతిలో పెట్టాడు. ఆ తర్వాత తన క్యాప్ ఇవ్వాలంటూ అంపైర్ వద్దకు వెళ్లగా, అతడు నిరాకరించాడు. దీంతో 'ప్లీజ్ నా క్యాప్ ఇచ్చేయండి' అని అంపైర్ను అడగడం వీడియోలో కనిపించింది. గుజరాత్పై విజయం తర్వాత భార్య అనుష్క శర్మ దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం కనిపించింది. ఇలా మ్యాచ్ మొత్తం తన చర్యలతో కోహ్లీ హల్చల్ చేశాడు. ఇవన్నీ కోహ్లీ సరదాతో చేసినప్పటికీ సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు మాత్రం అతడి చర్యను తప్పుబట్టారు. కోహ్లికి వెటకారం అనుకున్నదాని కంటే ఎక్కువే ఉందని కామెంట్లు పెట్టారు. మొన్న హెడ్తో గొడవ పెట్టుకున్న కోహ్లి ఇవాళ గుజరాత్ టీమ్ను హేళన చేసేలా అతడి స్నేక్ గెచ్చర్ ఉందని పేర్కొన్నారు. మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్–1లో ఆర్సీబీ 92 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 19.3 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. ఓడినా గుజరాత్ ఫైనల్ చేరేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. బుధవారం జరిగే ‘ఎలిమినేటర్’ మ్యాచ్ విజేతతో శుక్రవారం జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్ జట్టు తలపడుతుంది. Virat Kohli teasing Gujarat Titans players during their photoshoot in Dharamshala 🤣🔥- Rajat Patidar did the same with GT too 😭 pic.twitter.com/368X6y0VpA— Jara (@JARA_Memer) May 26, 2026 -
తొలి ప్లేయర్గా కోహ్లి అరుదైన రికార్డు
ఐపీఎల్-2026లో భాగంగా ధర్మశాల వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 43 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ఈ క్రమంలో కోహ్లి ఈ ఏడాది సీజన్లో 600 పరుగుల మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్లో వరుసగా నాలుగు సీజన్లలో 600కుపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 2023, 2024, 2025 సీజన్లలో విరాట్ 600+ రన్స్ చేశాడు.ఇప్పడు ఈ ఏడాది సీజన్లో కూడా కోహ్లి 50.00 సగటు, 164.38 స్ట్రైక్రేట్తో600 పరుగులు చేశాడు. గతంలో క్రిస్ గేల్ (2011, 2012, 2013), డేవిడ్ వార్నర్ (2016, 2017, 2019), కేఎల్ రాహుల్ (2020, 2021, 2022) వరుసగా మూడు సార్లు ఈ ఫీట్ అందుకున్నారు. కానీ వరుసగా నాలుగు సీజన్లలో కోహ్లి మినహా మిగితా ఎవరూ ఈ ఘనత సాధించలేకపోయారు. అదేవిధంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడిన జాబితాలో కోహ్లి నాలుగో స్ధానానికి ఎగబాకాడు. కోహ్లి ఇప్పటివరకు 18 ప్లేఆఫ్స్ మ్యాచ్లు ఆడి శిఖర్ ధావన్, దినేష్ కార్తీక్, కిరాన్ పొలార్డ్ సరసన కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో సీఎస్కే దిగ్గజం ఎంఎస్ ధోని(28) అగ్రస్ధానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్, రైనా(24) తర్వాతి స్ధానంలో కొనసాగుతున్నారు.చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్కు భారీ షాక్.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
బాబర్ ఆజం కోసం విరాట్ కోహ్లికి డిమోషన్!
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బా-ఉల్-హక్ తన ఆల్ టైమ్ బెస్ట్ వన్డే వరల్డ్ ప్లేయింగ్ ఎలెవన్ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లికి మిస్బా చోటిచ్చాడు. కోహ్లితో పాటు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు ఛాన్స్ లభించింది. అయితే ఈ జట్టులో బాబర్ ఆజం కోసం కోహ్లి బ్యాటింగ్ ఆర్డర్ను మిస్బా మార్చడం గమనార్హం.వన్డేల్లో కోహ్లి సాధరణంగా మూడో స్ధానంలో బ్యాటింగ్ వస్తాడు. ఇదే స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి కోహ్లి ఎన్నో వరల్డ్ రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ మిస్బా మాత్రం విరాట్కు నాలుగో స్ధానంలో ఛాన్స్ ఇచ్చాడు. కోహ్లి స్ధానాన్ని బాబర్తో ఈ పాక్ లెజెండ్ భర్తీ చేశాడు.ఇక ఓపెనర్లగా శ్రీలంక స్టార్ కుశాల్ మెండిస్, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ను అతడు ఎంపిక చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మకు ఈ జట్టులో చోటు దక్కకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ జోఫ్రా ఆర్చర్, సౌతాఫ్రికా నుంచి డేవిడ్ మిల్లర్, మార్కో జానెసన్ ఈ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి మిచెల్ శాంట్నర్కు ఒక్కడికే ఈ జట్టులో చోటు దక్కింది.వన్డేల్లో తిరుగులేని విరాట్విరాట్ కోహ్లి 37 ఏళ్ల వయస్సులోనూ వన్డే క్రికెట్లో దూసుకుపోతున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్(14,797) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ కంటే మాత్రమే వెనుకబడి ఉన్నాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు మాత్రం కోహ్లి(54) పేరిటే ఉంది. వచ్చే నెలలో అఫ్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్లో కోహ్లి తిరిగి మళ్లీ భారత జెర్సీలో కన్పించనున్నాడు.చదవండి: PAK vs AUS: ఆస్ట్రేలియా కెప్టెన్గా విధ్వంసకర వీరుడు -
క్వాలిఫయర్ పోరు.. కోహ్లీ విషయంలో ఆందోళన!
ఐపీఎల్ 2026 సీజన్లో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ మధ్య క్వాలిఫయర్-1 పోరు జరగనుంది. ధర్మశాల వేదికగా జరగనున్న పోరులో అందరి కళ్లు ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్లో కోహ్లీ ప్రదర్శన అనుకున్నంత స్థాయిలో లేకపోవడం ఆర్సీబీ జట్టులో కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ప్లేఆఫ్స్లో 17 మ్యాచ్లాడిన కోహ్లీ 121 స్ట్రైక్రేట్తో 396 పరుగులు సాధించాడు. మరి గుజరాత్ టైటాన్స్తో క్వాలిఫయర్ పోరులో కోహ్లీ ఎలా ఆడుతాడన్నది ఆసక్తికరంగా మారింది. ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే గుజరాత్తో మ్యాచ్లో పిచ్పై అవగాహన వచ్చేవరకు నిలదొక్కుకుంటే మాత్రం కోహ్లీని ఆపడం ఎవరి తరం కాదు. పైగా ధర్మశాలలో కోహ్లీకి మంచి రికార్డే ఉంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ సీజన్లో కోహ్లీ ఇప్పటివరకు 14 మ్యాచ్ల్లో 557 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ రేసులోనూ కొనసాగుతున్నాడు. లీగ్ దశలో ఇరుజట్లు 18 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ నెట్ రన్రేట్ మెరుగ్గా ఉండడంతో టేబుల్ టాపర్గా నిలిచింది. క్వాలిఫయర్-1 పోరులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్లో అడుగుపెట్టనుండగా, ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం లభించనుంది. బుధవారం జరిగే ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది.చదవండి:‘వాళ్లంతా క్రికెట్ తెలియని మూర్ఖులు’ -
కోహ్లీకి షాక్.. వైభవ్ సూర్యవంశీకి చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ్టి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరగనున్నాయి. క్వాలిఫయర్-1 పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. అయితే సీజన్ ముగియకముందే మాజీ క్రికెటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ తన బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టును ప్రకటించాడు. అయితే ఈ జట్టులో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఊహించినట్లుగానే రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి స్థానం దక్కింది. ఓపెనింగ్లో వైభవ్కు జంటగా గుజరాత్ కెప్టెన్ శుబ్మన్ గిల్ను ఎంపిక చేసిన బద్రీనాథ్ కీలకమైన మూడో స్థానానికి కోహ్లీని కాదని ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్కు చోటు కల్పించాడు.మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), రజత్ పటీదార్ (ఆర్సీబీ), ఆల్రౌండర్ స్థానానికి కృనాల్ పాండ్యా (ఆర్సీబీ)ని ఎంపిక చేశాడు. జట్టులో ఏకైక స్పిన్నర్గా కేకేఆర్కు చెందిన సునీల్ నరైన్కు చోటు కల్పించిన బద్రీనాథ్ పేస్ బౌలింగ్ విభాగంలో ఏకంగా ఐదుగురిని ఎంపిక చేయడం విశేషం. పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న భువనేశ్వర్ కుమార్ (ఆర్సీబీ)తో పాటు జోఫ్రా ఆర్చర్ (రాజస్తాన్), కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్)లను ఎంచుకున్నాడు. మరో పేసర్ స్థానానికి యువ బౌలర్లు ప్రిన్స్ యాదవ్, కార్తిక్ త్యాగిలను ఎంపిక చేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లోనూ 500 పరుగుల మార్క్ను దాటాడు. కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్ కూడా స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నప్పటికీ జట్టులో చోటు దక్కలేదు. ఇక ఓపెనర్లుగా ఎంపికైన వైభవ్ సూర్యవంశీ (14 మ్యాచ్ల్లో 583 పరుగులు), శుబ్మన్ గిల్ (14 మ్యాచ్ల్లో 616 పరుగులు) సాధించారు. ఇక ఆర్సీబీకి కీలక బౌలర్గా ఉన్న భువనేశ్వర్ కుమార్, గుజరాత్కు చెందిన రబాడ చెరో 24 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.ఇక బద్రీనాథ్ టీమిండియా తరఫున రెండు టెస్టులు, ఏడు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్లో 95 మ్యాచ్లాడిన బద్రీనాథ్ 1441 పరుగులు సాధించాడు.బద్రీనాథ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్:వైభవ్ సూర్యవంశీ, శుబ్మాన్ గిల్, సాయి సుదర్శన్, హెన్రిచ్ క్లాసెన్, రజత్ పటీదార్, కృనాల్ పాండ్యా, సునీల్ నరైన్, భువనేశ్వర్ కుమార్, జోఫ్రా ఆర్చర్, కగిసో రబాడ, ప్రిన్స్ యాదవ్/కార్తీక్ త్యాగి.చదవండి: విండీస్తో సిరీస్.. లంక జట్టుకు కొత్త కెప్టెన్! -
కోహ్లి VS ట్రావిస్ హెడ్.. హెడ్ భార్యకు వేధింపులు..
-
హెడ్ భార్యకు వేధింపులు.. వికృత చేష్టలు ఆపండి!
ఐపీఎల్ 2026 సీజన్లో ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ ఫలితం కంటే విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ల మధ్య చోటుచేసుకున్న వివాదమే హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీపై హెడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడం, దీనికి కౌంటర్గా కోహ్లీ ధీటుగా బదులివ్వడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినా కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోవడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. అయితే వివాదం అక్కడితో సద్దుమణిగిందిలే అనకుంటే ఇప్పుడు అభిమానులు దీనిని మరింత పెద్దదిగా చేస్తున్నారనిపిస్తోంది. తాజాగా హెడ్ భార్య జెస్సికాను ఈ వివాదంలోకి లాగారు. జెస్సీకా సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసిన కొంతమంది ఆమెను కించపరుస్తూ అసభ్యకర పోస్టులతో ఆన్లైన్ వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఆటగాళ్లు వివాదాన్ని మైదానానికే పరిమితం చేస్తున్నప్పటికీ కొంతమంది ఫ్యాన్స్ మాత్రం వివాదాలను ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలతో ముడిపెట్టి తమ వికృత చేష్టలతో క్రీడా సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు.తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారంటూ హెడ్ భార్య జెస్సికా స్వయంగా సోషల్ మీడియా వేదికగా వాపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 'ప్రపంచకప్ సంఘటన తర్వాత నాపై వేధింపులు తిరిగి పునరావృతమైనట్లుగా అనిపిస్తోంది. నేను నిద్రలేవడంతోనే నా సోషల్ మీడియా ఖాతాలో కొంతమంది అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెట్టారు. నన్ను వేధింపులకు గురి చేసినా పట్టించుకునే దాన్ని కాదు, కానీ వాళ్లు శ్రుతి మించిపోయారు. నాతో పాటు నా కుటుంబసభ్యులను, మిత్రులపై వేధింపులకు దిగారు. క్రీడా సంబంధిత విషయాలను వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టడం సరికాదు. ఈ వికృత చేష్టలను దయచేసి ఆపాలని కోరుతున్నా.' అంటూ జెస్సికా ఆవేదనతో రాసుకొచ్చింది. మేము మనుషులమే..'ప్రస్తుతం అన్ని క్రీడల్లోనూ మానసిక ఆరోగ్యం, దృక్పథం, మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విధానం గురించి ఒక ముఖ్యమైన చర్చ జరుగుతోందని నేను అనుకుంటున్నాను. క్రీడల్లో ఆటగాళ్ల మధ్య గొడవలు సహజం. కానీ ఆటను ఆటగానే చూడాలి. అంతేకానీ ఆ వివాదాలను వ్యక్తుల కుటుంబాల దాకా తీసుకురాకూడదు. మేము మనుషులమే.. మాకు కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవడం ముఖ్యం.' అని ఆమె అన్నారు.గతంలోనూ వేధింపులు..అయితే హెడ్ భార్య జెస్సికాకు ఆన్లైన్ వేధింపులు కొత్త కాదు. గతంలో 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా ఫైనల్లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్ను హెడ్ అందుకున్నాడు. అప్పుడు కూడా హెడ్తో పాటు అతడి భార్య జెస్సికాను టార్గెట్ చేస్తూ కొంతమంది అభిమానులు అసభ్యకర కామెంట్లు చేశారు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ, హెడ్ మధ్య వివాదం జెస్సికాకు మరోసారి చేదు అనుభవాన్ని మిగిల్చింది.కోహ్లీ, హెడ్ వివాదమేంటి?ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్.. ‘కాస్త బౌండరీలు కొట్టు’ అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్ల కరచాలనం సందర్భంగా హెడ్ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కోహ్లీ అతడిని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయాడు.ఐపీఎల్ 2026 సీజన్లో లీగ్ దశ ముగిసింది. మంగళవారం తొలి క్వాలిఫయర్లో ఆర్సీబీ, గుజరాత్ తలపడునున్నాయి. బుధవారం ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్, రాజస్తాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. మే 29న క్వాలిఫయర్-2, మే 31న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది.Look behind the whole SRH coaching staff, including Daniel Vettori and Muttiah Muralitharan, were watching Virat Kohli and Travis Head, expecting some drama and ready to stop a fight. 😳But Kohli didn’t shake hands, and everyone started laughing. 😂 pic.twitter.com/9F9pHwiC8T— Jeet (@JeetN25) May 23, 2026255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’ -
కోహ్లీకి ఎదురుపడితే ఈసారి దబిడిదిబిడే!
ఐపీఎల్ 2026 సీజన్లో శుక్రవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ విజయం కన్నా విరాట్ కోహ్లీ, ట్రావిస్ హెడ్ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్హ్యాండ్ ఇవ్వడానికి కోహ్లీ నిరాకరించడంతో వివాదం మరో మలుపుకు తిరిగింది. వివాదం జరిగి ఒకరోజు కావొస్తున్నా ఇంకా ఆ వేడి తగ్గలేదనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిణామం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు క్వాలిఫయర్లో ఎదురుపడే అవకాశం లేదు. కానీ క్వాలిఫయర్-1 పోరులో ఆర్సీబీ ఓడి, ఎలిమినేటర్ పోరులో ఎస్ఆర్హెచ్ గెలిస్తే మాత్రం.. క్వాలిఫయర్-2 పోరులో ఈ రెండు జట్లు మళ్లీ తలపడనున్నాయి.అలా కాకుండా క్వాలిఫయర్-1లో ఆర్సీబీ గెలిచి.. మరోవైపు ఎలిమినేటర్తో పాటు క్వాలిఫయర్-2లోనూ ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్ చేరితే మాత్రం, తుది పోరులో ఆర్సీబీతో అమీతుమీ తేల్చుకోనుంది. ఏది ఏమైనప్పటికీ కోహ్లీ మాత్రం ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నాడు. మరోమారు ఎస్ఆర్హెచ్తో ఆర్సీబీ మ్యాచ్ ఆడితే మాత్రం హెడ్కు దబిడిదిబిడి అయ్యేలాగే పరిస్థితులు ఉన్నట్లు అభిమానులు పేర్కొంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. అసలేం జరిగిందంటే..ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో కోహ్లీ స్లోగా ఆడడంతో హెడ్ @కాస్త బౌండరీలు కొట్టు* అంటూ కాస్త వెటకారంగా పేర్కొన్నాడు. దీంతో కోహ్లీకి చిర్రెత్తుకొచ్చి 'నువ్వు బౌలింగ్ చెయ్యు.. బౌండరీలు కొడుతా. అయినా నువ్వు ఎప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గానే వస్తున్నావు. ఒక్కసారి బౌలింగ్ కూడా రాలేదు' అని పేర్కొన్నాడు. కానీ హెడ్ మాత్రం కోహ్లీ వ్యాఖ్యలను పట్టించుకోకుండా సరదాగా నవ్వేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత హెడ్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించడంతో కోహ్లీ దీనిని సీరియస్గా తీసుకున్నాడని స్పష్టంగా తెలిసొచ్చింది.You could easily notice that every time Venkatesh Iyer found the boundary, Kohli kept throwing Travis Head-related gestures. He sparked the whole drama himself, didn’t even shake hands afterward.His arrogance is on another level. 🥵pic.twitter.com/HEnvHnLjEw— Yorker__93™ (@Boom__93) May 23, 2026 255 on the board and the bowlers made sure it was never, ever in doubt 🔥#SRH cap off the league stage with a massive 5️⃣5️⃣-run win 🧡Scorecard ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/LiQBSJDDR2— IndianPremierLeague (@IPL) May 22, 2026చదవండి: అభిమానికి రోహిత్ క్షమాపణ.. ఎందుకంటే? -
పక్కా ప్లాన్తోనే.. సన్రైజర్స్ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్-2026లోనూ సత్తా చాటుతోంది. టేబుల్ టాపర్గా లీగ్ దశను ముగించి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది. కాగా తమ చివరి లీగ్ మ్యాచ్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ శుక్రవారం ఆర్సీబీతో తలపడ్డ సంగతి తెలిసిందే. భారీ స్కోరు సాధించినా..సొంతమైదానం ఉప్పల్లో ఆర్సీబీపై భారీ తేడాతో గెలిస్తేనే టాప్–2 దక్కే అవకాశం ఉండటంతో పట్టుదలగా ఆడి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ.. బెంగళూరును 166 పరుగులలోపు మాత్రం కట్టడి చేయలేకపోయింది. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన స్థితిలోఫలితంగా హైదరాబాద్ ఈ మ్యాచ్లో గెలిచినా మూడో స్థానంతో ముగించి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సిన స్థితిలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఓడినా... ముందుగా 166, ఆపై 178 స్కోరును దాటి అగ్రస్థానాన్ని సాధించడంలో సఫలమైంది. స్లోగా బ్యాటింగ్ చేస్తూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.TOP 2 confirmed for #RCB! ✅By surpassing 165-run mark with this boundary, the defending champions have secured a berth in Qualifier 1! 👏#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/d1ZT8DPTIM— Star Sports (@StarSportsIndia) May 22, 2026అవును.. పక్కా ప్లాన్తోనేఇదే విషయాన్ని ఆర్సీబీ హెడ్కోచ్ ఆండీ ఫ్లవర్ తాజాగా వెల్లడించాడు. తమ దృష్టి సన్రైజర్స్ను ఓడించడం కంటే కూడా.. టేబుల్ టాపర్గా నిలవాలంటే కావాల్సిన 166 పరుగుల మీదే ఉందని తెలిపాడు. డ్రెసింగ్రూమ్లో మాట్లాడుతూ..‘‘256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ముఖ్యమే. అయితే, పాయింట్ల పట్టికలో నెట్రన్రేటుతో అగ్రస్థానంలో నిలవడమే అంతిమ లక్ష్యం. అందుకే మనం వేర్వేరు టార్గెట్లు పెట్టుకున్నాం.166 పరుగుల మార్కు దాటితేముందుగా 166 పరుగుల మార్కు దాటితే మనకు టాప్-2 బెర్తు ఖరారు అవుతుంది. ఆ తర్వాత 179 పరుగుల మార్కుకు చేరుకున్నామంటే.. టేబుల్ టాపర్ మనమే. ఆ తర్వాత 256 పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్లో గెలుపు మనదే. ఇందుకు తగ్గట్లుగానే మన బ్యాటింగ్ కొనసాగింది.వెంకటేశ్ అయ్యర్ అత్యద్భుతంగా బ్యాటింగ్ చేసి మనం అగ్రస్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా మన లక్ష్యం 180 పరుగులేనని బ్యాటర్లు ఫీలయ్యేలా చేశాము’’ అని ఆండీ ఫ్లవర్ చెప్పుకొచ్చాడు.వెంకటేశ్ అయ్యర్ ధనాధన్తోకాగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్ విరాట్ కోహ్లి (15), వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (21) వికెట్లు కోల్పోయింది.ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (19 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్తో పరిస్థితి చక్కదిద్దాడు. ఇక మధ్య ఓవర్లలో కెప్టెన్ రజత్ పాటిదార్ (39 బంతుల్లో 56), కృనాల్ పాండ్యా (31 బంతుల్లో 41 నాటౌట్) కాస్త నెమ్మదిగానే ఆడారు. ఆఖర్లో టిమ్ డేవిడ్ 7 బంతుల్లో 15 పరుగులతో పాండ్యాతో కలిసి అజేయంగా నిలవగా.. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 200 పరుగులు చేసింది.ఓటమిపాలైనా.. టేబుల్ టాపర్గాసన్రైజర్స్ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమిపాలైనా.. టేబుల్ టాపర్గా నిలవడంలో సఫలమైంది. ఇక ఆర్సీబీ- సన్రైజర్స్ మ్యాచ్ ఫలితంతో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో నిలిచింది.ఈ క్రమంలో ‘ప్లే ఆఫ్స్’లో భాగంగా ఈనెల 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్–1లో ఆర్సీబీ జట్టుతో గుజరాత్ తలపడుతుంది. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో ఈనెల 27న న్యూచండీగఢ్లో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడుతుంది. ఇక క్వాలిఫయర్–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో ఈనెల 29న జరిగే క్వాలిఫయర్–2లో పోటీపడుతుంది. చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్ This defeat doesn’t hurt #RCB 💪They enter playoffs as table toppers 🔥#TATAIPL | #SRHvsRCB, #RajatPatidar, #Top2, #ViratKohli, #SakibHussain, #TravisHead pic.twitter.com/9qr9aAs29E— Star Sports (@StarSportsIndia) May 22, 2026 -
విరాట్ కోహ్లికి ఎస్ఆర్హెచ్, హెడ్ కౌంటర్!
సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్-2026 లీగ్ దశను ఘన విజయంతో ముగించింది. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని 55 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.హెడ్పై కోహ్లి ఆగ్రహంసొంతమైదానం ఉప్పల్లో ఆర్సీబీపై 255 పరుగులు స్కోరు చేసిన సన్రైజర్స్.. ప్రత్యర్థిని 200 పరుగులకే కట్టడి చేసింది. ఇక ఈ మ్యాచ్లో సన్రైజర్స్ ఓపెనర్ ట్రవిస్ హెడ్- ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి మధ్య కోల్డ్వార్ నడిచింది.విధ్వంసకర వీరుడిగా పేరొందిన హెడ్ ఈ మ్యాచ్లో 16 బంతుల్లో 26 పరుగులే చేసి.. రసిఖ్ దర్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ క్రమంలో కోహ్లి దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.అనంతరం ఆర్సీబీ ఇన్నింగ్స్లో శివంగ్ కుమార్ బౌలింగ్లో వెంకటేశ్ అయ్యర్ బౌండరీలు బాదుతున్న వేళ.. హెడ్పై కోహ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయి అన్నట్లుగా సైగలు చేశాడు. అయితే, హెడ్ మాత్రం ఇందుకు పెద్దగా స్పందించలేదు.#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026షేక్హ్యాండ్ ఇవ్వకుండాఇక మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకునే సమయంలోనూ కోహ్లి.. హెడ్ పట్ల కాస్త వింతగా ప్రవర్తించాడు. అతడికి షేక్హ్యాండ్ ఇవ్వకుండా ముఖం తిప్పేసుకున్నాడు. దీంతో హెడ్ అలా చూస్తుండిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.Virat Kohli ignored Travis Head when he tried to shake hands with him after the match 😭#SRHvsRCB pic.twitter.com/urAY79pYQ0— Indian Cricket (@IPL2025Auction) May 22, 2026 కాగా కోహ్లి తీరుకు ఎస్ఆర్హెచ్తో పాటు హెడ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు. ఈ మ్యాచ్లో హెడ్ అనూహ్య రీతిలో బౌలింగ్కు దిగాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (39 బంతుల్లో 56)ను అవుట్ చేశాడు. తద్వారా గత తొమ్మిదేళ్లలో ఐపీఎల్లో తన తొలి వికెట్ నమోదు చేశాడు.వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. వికెట్ తీశాడుఈ నేపథ్యంలో వికెట్ తీసిన తర్వాత హెడ్ సంతోషంగా ఉన్న ఫొటోను పంచుకున్న ఎస్ఆర్హెచ్.. ‘‘వచ్చాడు.. బౌలింగ్ చేశాడు.. వికెట్ తీశాడు’’ అని కోహ్లికి కౌంటర్ ఇచ్చింది. ఇక ఇదే ఫొటోను షేర్ చేసిన హెడ్.. ‘‘ఇదేంటో గెస్ చేయండి’’ అని క్యాప్షన్ జతచేశాడు. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి 11 బంతుల్లో 15 పరుగులు చేసి సకీబ్ హుసేన్ బౌలింగ్లో అవుటయ్యాడు.ఇదిలా ఉంటే.. ఆర్సీబీ, గుజరాత్లతో పాటు.. తాజా విజయంతో సన్రైజర్స్ ఖాతాలో కూడా 18 పాయింట్లు చేరాయి. అయితే, నెట్రన్రేటు పరంగా వెనుకబడిన సన్రైజర్స్ మూడో స్థానంతో ముగించింది. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడక తప్పని పరిస్థితి.చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్ -
చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ బౌలర్
సన్రైజర్స్ యువ పేసర్ సాకిబ్ హుసేన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ కెరీర్ తొలి 10 మ్యాచ్ల్లో కనీసం ఒక వికెట్ తీసిన తొలి భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కాడు. నిన్న (మే 22) ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లి వికెట్ తీయడంతో సాకిబ్ ఈ ఫీట్ను సాధించాడు. ఓవరాల్గా సాకిబ్కు ముందు ఫిల్ఫెన్హాస్ (13 వికెట్లు), ఎంగిడి (13) ఈ ఘనత సాధించిన బౌలర్లు ఉన్నారు. వీరిద్దరూ విదేశీయులే.ఇదే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ బిహారి బాయ్.. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి 15 వికెట్లు పడగొట్టాడు. తొలి మ్యాచ్లోనే అదిరిపోయే ప్రదర్శన (4-24) ఇచ్చి అందరినీ ఆకట్టుకున్న సాకిబ్.. సన్రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. యార్కర్లు, స్లో బాల్స్తో చెలరేగిపోయే ఈ నయా పేస్ సెన్సేషన్.. ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు.కాగా, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 55 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్సీబీ, గుజరాత్తో పాటు ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరిన ఈ జట్టుకు ఈ విజయం ఎలాంటి అక్కరకు రాలేదు. ఆర్సీబీపై గెలిచినా పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైన ఎలిమినేటర్ గండాన్ని దాటాల్సి వచ్చింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆర్సీబీ, గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. నాలుగో ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం, ఎలిమినేటర్లో సన్రైజర్స్ను ఎదుర్కొనేందుకు నాలుగు జట్లు (రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ) పోటీపడుతున్నాయి. లక్నో, ముంబై, సీఎస్కే ఇదివరకే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే.భారీ స్కోర్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్ప్లేలోనే మ్యాచ్ను హైదరాబాద్వైపు తిప్పేశాడు. ట్రవిస్ హెడ్ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51), నితీశ్కుమార్ రెడ్డి (29 నాటౌట్) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించాడు. కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
హెడ్ను అవమానించిన కోహ్లి
నిన్న (మే 22) జరిగిన ఆర్సీబీ-ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి-ట్రవిస్ హెడ్ మధ్య తేలికపాటి ఘర్షణ జరిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో వెంకటేష్ అయ్యర్ భారీ షాట్లు ఆడుతుండగా.. కోహ్లి హెడ్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించాడు. నువ్వే వచ్చి బౌలింగ్ చేయ్యి అంటూ సైగలు చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. హెడ్ మాత్రం చిరునవ్వుతో స్పందించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు పరస్పరం హ్యాండ్షేక్లు చేసుకుంటుండగా.. కోహ్లి హెడ్ పట్ల మరోసారి అవమానకరంగా ప్రవర్తించాడు. కమిన్స్, అభిషేక్ శర్మలతో మాట్లాడి.. హెడ్ వద్దకు వచ్చేసరికి మాత్రం ఎలాంటి స్పందన లేకుండా ముందుకు సాగిపోయాడు. కోహ్లి ఇలా చేయడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.#ViratKohli 🆚 #TravisHead 🥵🤯Tensions rise in high voltage clash🔥#TATAIPL Race to Playoffs 2026 👉 #SRHvRCB | LIVE NOW ➡️https://t.co/52qPTW2gSO pic.twitter.com/JOiWaxNW6T— Star Sports (@StarSportsIndia) May 22, 2026మ్యాచ్ విషయానికొస్తే.. ఆర్సీబీపై ఎస్ఆర్హెచ్ 55 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ గెలిచినా ఎస్ఆర్హెచ్కు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా.. ఎస్ఆర్హెచ్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. మిగిలిన నాలుగో బెర్త్ కోసం రాజస్థాన్, పంజాబ్, కేకేఆర్, ఢిల్లీ మధ్య పోటీ కొనసాగుతుంది. మూడో స్థానంలో నిలవడంతో ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ మ్యాచ్ అడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్సీబీ-గుజరాత్ క్వాలిఫయర్-1లో తలపడతాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు చేరుతుంది.భారీ స్కోర్టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని ఆర్సీబీ బౌలర్లపై విరుచుకుపడింది. అభిషేక్ శర్మ కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి పవర్ప్లేలోనే మ్యాచ్ను హైదరాబాద్వైపు తిప్పేశాడు. ట్రవిస్ హెడ్ (26) కూడా వేగంగా ఆడగా.. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 79 పరుగులతో మెరిపించాడు. చివర్లో హెన్రిచ్ క్లాసెన్ (24 బంతుల్లో 51), నితీశ్కుమార్ రెడ్డి (29 నాటౌట్) కూడా చెలరేగడంతో చేయడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 భారీ స్కోరు నమోదు చేసింది.అనంతరం లక్ష్యఛేదనను ఆర్సీబీ కూడా ఘనంగానే ప్రారంభించినప్పటికీ.. ఆతర్వాత ఆ జోరును కొనసాగించలేకపోయింది. ఆదిలో వెంకటేష్ అయ్యర్ (44) మెరుపులు మెరిపించినా, కోహ్లి (15) మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆతర్వాత వచ్చిన పడిక్కల్ (21), రజత్ పాటిదార్ (56), కృనాల్ పాండ్యా (41 నాటౌట్), టిమ్ డేవిడ్ (15 నాటౌట్) పర్వాలేదనిపించినప్పటికీ.. లక్ష్యం మరీ పెద్దది కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. -
విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. 256 పరుగుల లక్ష్య చేధనలో కోహ్లి తన మార్క్ చూపించలేకపోయాడు. 11 బంతుల్లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే కోహ్లి త్వరగా ఔటైనప్పటికి వెంకటేశ్ అయ్యర్తో కలిసి మొదటి వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.దీంతో విరాట్ ఓ ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 క్రికెట్లో అత్యధిక ఫిప్టి ప్లస్ భాగస్వామ్యాల్లో భాగమైన ఆటగాడిగా విరాట్ కోహ్లి ప్రపంచ రికార్డు సృష్టించాడు. కోహ్లి ఇప్పటివరకు 211 సార్లు యాభై ప్లస్ పార్ట్నర్షిప్స్లో భాగమయ్యాడు. ఇంతకుముందు ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ అలెక్స్ హేల్స్ (210 యాభై ప్లస్ భాగస్వామ్యాలు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్తో హేల్స్ను కోహ్లి అధిగమించాడు.టీ20ల్లో అత్యధిక 50+ భాగస్వామ్యాల్లో భాగమైన టాప్-5 బ్యాటర్లువిరాట్ కోహ్లి-211హేల్స్-210డేవిడ్ వార్నర్-200బాబర్ ఆజం-196క్రిస్ గేల్-191ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. సన్రైజర్స్ చేతిలో 55 పరుగుల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేయగల్గింది. అయినప్పటికి బెంగళూరు పాయింట్ల పట్టికలో తమ స్ధానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్రైజర్స్ బ్యాటర్లలో ఇషాన్ కిషన్ (79), అభిషేక్ (56), క్లాసెన్ (51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. -
అందరి దృష్టి కోహ్లిపైనే
సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ దశను అగ్రస్థానంతో ముగించాలనే లక్ష్యంతో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు తమ ఆఖరి మ్యాచ్కు సిద్ధమవుతోంది. ఉప్పల్ స్టేడియంలో నేడు జరిగే మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆర్సీబీ తలపడనుంది. టాప్–2లో నిలిచి ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలను సంపాదించాలని సన్రైజర్స్ కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారగా... అందరి దృష్టి మాత్రం ఆర్సీబీ సూపర్ స్టార్ విరాట్ కోహ్లిపైనే కేంద్రీకృతమైంది. రెండేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో ఆడనున్న కోహ్లి ఆటతీరును ప్రత్యక్షంగా చూడాలని అభిమానులు ఉబలాటపడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఈ స్టేడియంలో 10 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అతను 486 పరుగులు చేశాడు. గత శుక్రవారం ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా... నిమిషాల వ్యవధిలోనే అన్నీ అమ్ముడుపోయాయి. కోహ్లి ప్రధాన ఆకర్షణ కానుండటంతో దీనిని సొమ్ము చేసుకోవాలని సన్రైజర్స్ యాజమాన్యం భావించి ఈ మ్యాచ్ టికెట్ల ధరలను భారీగా పెంచేసింది. మరోవైపు సాధారణ ప్రేక్షకులకు టికెట్లు లభించలేదని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. స్థాయిభేదం లేకుండా ఎవరికి వారు తమ పరపతిని ఉపయోగించి ఈ మ్యాచ్ టికెట్లను సంపాదించడంపైనే దృష్టి పెట్టారు. దాంతో నిజమైన అభిమానుల గోడు వినేవాళ్లే కరువయ్యారు. రజత్ పాటీదార్ సారథ్యంలోని బెంగళూరు బృందం ఈ సీజన్ను సొంతగడ్డపై సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్తోనే ప్రారంభించింది. ఆ మ్యాచ్లో ఆరు వికెట్లతో గెలిచి శుభారంభం చేసింది. అదే జోరును కొనసాగిస్తూ ప్రస్తుతం 18 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. నేటి మ్యాచ్లో సన్రైజర్స్పై గెలిస్తే ఆర్సీబీ 20 పాయింట్లతో టాపర్గా ముగిస్తుంది.27ఆర్సీబీ, సన్రైజర్స్ జట్లు ముఖాముఖిగా 27 సార్లు తలపడ్డాయి. ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో... సన్రైజర్స్ 14 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక ఉప్పల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరిగాయి. ఆరింటిలో సన్రైజర్స్, రెండింటిలో బెంగళూరు గెలుపొందాయి. -
టెస్ట్ల్లోకి కోహ్లి రీఎంట్రీ..? క్లూ ఇచ్చిన కీలక వ్యక్తి
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. విరాట్ సుదీర్ఘ ఫార్మాట్కు వీడ్కోలు పలికి ఏడాది దాటిపోయినా.. అభిమానుల్లో మాత్రం ఇంకా అతన్ని వైట్ డ్రెస్లో చూడాలనే ఆశ కనిపిస్తూనే ఉంది. తాజాగా విరాట్ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ చేసిన వ్యాఖ్యలు కోహ్లి టెస్ట్ క్రికెట్ రీఎంట్రీపై చర్చకు మరింత ఊతమిచ్చాయి.రాజ్కుమార్ శర్మ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామంది విరాట్ మళ్లీ టెస్ట్ క్రికెట్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో నేనే అతన్ని ఒప్పించగలనని వారి నమ్మకం. వారు కోరుకున్న విధంగానే ఈ విషయాన్ని విరాట్ వద్ద ప్రస్తావించాను. చర్చలు కూడా జరుగుతున్నాయి. ఏమవుతుందో చూద్దామని అన్నాడు. ఈ వ్యాఖ్యలతో అభిమానులు విరాట్ కంబ్యాక్పై ఆశలు పెంచుకున్నారు. కొందరైతే "కింగ్ ఈజ్ కమింగ్ బ్యాక్" అంటూ సోషల్మీడియాలో హడావుడి మొదలు పెట్టారు.ఇదిలా ఉంటే, ఇటీవల కొన్ని సందర్భాల్లో విరాట్ తన టెస్ట్ పునరాగమనంపై పరోక్ష సంకేతాలు ఇచ్చాడు. పరస్పర నమ్మకం, గౌరవం, విలువ తగ్గిన వాతావరణంలో కొనసాగాలని తనకు ఆసక్తి లేదని చెప్పకనే చెప్పాడు. వీటిని బట్టి చూస్తే విరాట్ టెస్ట్ కంబ్యాక్ అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి.2025 మే 12న టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికిన విరాట్.. 123 టెస్ట్ల్లో 9230 పరుగులు చేశాడు. విదేశీ గడ్డపై భారత జట్టును దూకుడుగా నడిపించిన నాయకుడిగా, ఆధునిక యుగంలో అత్యుత్తమ టెస్ట్ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. అయితే అతని రిటైర్మెంట్ నిర్ణయం అప్పట్లో అభిమానులతో పాటు క్రికెట్ ప్రపంచాన్నే షాక్కు గురిచేసింది.టెస్ట్ క్రికెట్లో కోహ్లీ సాధించిన విజయాలు భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన అతడు.. కొద్ది కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అనంతరం కెప్టెన్గా బాధ్యతలు చేపట్టి భారత జట్టును ప్రపంచ నంబర్ వన్గా నిలబెట్టాడు. కెప్టెన్గా 68 టెస్టుల్లో భారత జట్టును నడిపించిన కోహ్లీ.. 40 విజయాలు అందించి దేశ చరిత్రలో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్గా నిలిచాడు. -
డబ్బు కన్నా... పట్టుదల ముఖ్యం
బెంగళూరు: ఐపీఎల్తో తక్షణమే పేరు ప్రఖ్యాతలు వచ్చినా... సుదీర్ఘ కాలం ఆటలో కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. ప్రస్తుతం కాలంలో ఐపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు భారీగా డబ్బు, పేరు వస్తోందని... అయితే అక్కడితో ఆగిపోకుండా మరింత కష్టపడితేనే ఆటలో గొప్ప స్థాయికి చేరగలరని కోహ్లి వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు, టి20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఆర్సీబీ స్పోర్ట్స్ సమ్మిట్ సందర్భంగా విరాట్ మాట్లాడుతూ... ‘అంతర్జాతీయ స్థాయిలో మూడు ఫార్మాట్ల ఆటగాడిగా కొనసాగాలంటే పట్టుదల ముఖ్యం. పట్టుదలను డబ్బుతో ముడిపెట్టలేం. ఎందుకంటే ఈ రోజుల్లో ఐపీఎల్ రూపంలో 20 బంతుల్లో 40–50 పరుగులు చేస్తే చాలు ఎనలేని పేరు, డబ్బు వస్తున్నాయి. అది సుఖవంతమైన జీవితాన్ని ఇస్తుంది. కానీ 10–15 ఏళ్లు ఏకబిగిన అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగాలంటే దానికి ఎంతో పట్టుదల ఉండాలి. అది టి20 క్రికెట్ ఆడినంత సులువు కాదు. మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అభిమానుల ఆదరణ, ఆట నుంచి గౌరవం పొందగలం. అలా అని టి20 క్రికెట్ను తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఇటీవలి కాలంలో చూస్తే... గొప్ప గొప్ప పవర్ హిట్టర్లు పుట్టుకొస్తున్నారు. వారు బంతిని బాదుతున్న విధానం నన్ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అవలీలగా సిక్స్లు కొడుతున్నారు. ఐపీఎల్ ఆరంభంలో మాదిరిగా ప్రతిసారి భారీ స్కోర్ల పిచ్లు ఎదురుకావు. కొన్నిసార్లు కఠినమైన పిచ్పై రెండు, మూడు వికెట్లు కోల్పోయినప్పుడు 175–180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించాల్సి వస్తుంది. అలాంటి స్థితిని తట్టుకున్న బ్యాటర్ దీర్ఘకాలం నిలబడగలుగుతాడు. పరిస్థితులు పరీక్షిస్తున్న సమయంలో అత్యుత్తమ ఆట తీరు కనబర్చడం ముఖ్యం. నా వరకైతే ఆటను ఎప్పటికప్పుడు విశ్లేషించుకొని... పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు సాగుతా. నైపుణ్యాలను మరింత మెరుగు పర్చుకోవాలి అంటే బలమైన పునాది అవసరం. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒక బంతిని ఎదుర్కొనే ముందు మీ దగ్గర ఎక్కువ మార్గాలు ఉండాలి. అప్పుడే కష్టమైన పిచ్పై కూడా పరుగులు రాబట్టగలం. అది కేవలం సాధన వల్లే సాధ్యమవుతుంది’ అని వివరించాడు. -
'ఆ సమయంలో ద్రవిడ్ భాయ్ అండగా నిలబడ్డాడు'
టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత చాలా బాధాకరమైన దశను ఎదుర్కొన్నట్లు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్న తనకు అప్పటి హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, విక్రమ్ రాథోర్ కొండంత అండగా నిలిచారని గుర్తుచేసుకున్నాడు. మంగళవారం ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ మూడో ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్లో పాల్గొన్న కోహ్లీ ఈ వ్యాఖ్యలు చేశాడు.‘నేను కెప్టెన్సీ వదిలేసిన తర్వాతే, రాహుల్ భాయ్, విక్రమ్ రాథోర్లతో మనసు విప్పి మాట్లాడగలిగాను. చాలా విషయాలు పంచుకున్నాను. 2023లో టెస్ట్ క్రికెట్లో నేను అద్భుతంగా రాణించాను. నేను కెప్టెన్సీ వదిలేసి ఒంటరిగా బాధపడుతున్న సమయంలో వీరిద్దరు నాకు అండగా నిలిచారు. నా కెరీర్ తిరిగి గాడిన పెట్టుకునేందుకు రాహుల్ భాయ్తో పాటు విక్రమ్ రాథోర్ ఎంతోగానో సహాయపడ్డారు. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. వారు నన్ను ఎంతో బాగా చూసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలిచారు’ అని కోహ్లీ తెలిపాడు.రవిశాస్త్రి హెడ్కోచ్గా ఉన్న సమయంలో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న కోహ్లీ ఒత్తిడిని భరించలేక 2022లో ఆ బాధ్యతల నుంచి తప్పుకు న్నాడు. కెప్టెన్గా ఉన్న సమయంలో కోహ్లీ ఆరు టెస్టుల్లో కేవలం ఒకే ఒక అర్ధశతకంతో, 26.5 సగటుతో 265 పరుగులు మాత్రమే చేశాడు. అయితే 2021 నవంబర్లో టీమిండియా హెడ్ కోచ్గా వచ్చిన ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్తో కలిసి కోహ్లీని మళ్లీ బ్యాటింగ్లో ట్రక్ ఎక్కించడంలో విజయవంతమయ్యాడు. ద్రవిడ్ కోచ్గా వచ్చిన తర్వాత 2023 ఏడాదిలో అద్భుతంగా రాణించిన కోహ్లీ 8 టెస్టుల్లో 671 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు హాప్ సెంచరీలున్నాయి.ఇక ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ తరఫున కోహ్లీ తన బ్యాటింగ్తో దుమ్మురేపుతున్నాడు. ఆడిన 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో ప్లేఆఫ్ చేరిన తొలి జట్టుగా ఆర్సీబీ నిలిచింది. గతేడాది తొలిసారి చాంపియన్గా నిలిచిన ఆర్సీబీ వరుసగా రెండో ఏడాది కూడా టైటిల్పై కన్నేసింది. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో వన్డేలకు మాత్రమే పరిమితమైన కోహ్లీ ఐపీఎల్ ముగిసిన తర్వాత అప్గానిస్తాన్తో జరగనున్న వన్డే సిరీస్కు ఎంపికయ్యాడు.చదవండి: పరువు తీసుకుంటున్న పాక్, బంగ్లా క్రికెటర్లు! -
అఫ్గాన్తో సిరీస్కు భారత జట్టు ప్రకటన
ఐపీఎల్ 2026 సీజన్లో వేర్వేరు జట్లలో ఆడుతున్న టీమిండియా ఆటగాళ్లు మళ్లీ ఒక్కటిగా కలిసి ఆడనున్నారు. ఐపీఎల్ ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో అప్గానిస్తాన్తో ఒక టెస్టు సహా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మంగళవారం భారత జట్టును ప్రకటించింది. ఏకైక టెస్టుతో పాటు వన్డేలకు శుబ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. జూన్ 6 నుంచి ముల్లన్పూర్ వేదికగా భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది.ఏకైక టెస్టు మ్యాచ్కు కెప్టెన్ గిల్కు కేఎల్ రాహుల్ డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. మరోవైపు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కోల్పోయాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ప్రిన్స్ యాదవ్కు తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు.ఇక టీమిండియా సీనియర్ క్రికెటర్లు రవీంద్ర జడేజాతో పాటు స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రాలకు అఫ్గాన్తో సిరీస్కు విశ్రాంతి కల్పించిట్లు బీసీసీఐ తెలిపింది. అఫ్గానిస్తాన్తో ఒకే టెస్టు మ్యాచ్ కావడంతో జడేజాను తప్పించామని, టీ20 ప్రపంచకప్ నుంచి బిజీగా క్రికెట్ ఆడుతున్న బుమ్రాను భవిష్యత్తులో టీమిండియా ఆడబోయే కీలక సిరీస్లను దృష్టిలో ఉంచుకొని అతడికి విశ్రాంతి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఇక సీనియర్ ఆటగాడు కోహ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాలను వన్డే జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ, ఫిట్నెస్ నిరూపించుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ఐపీఎల్లో అదరగొడుతున్న టీమిండియా సీనియర్ భువనేశ్వర్ కుమార్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. మరోవైపు మహ్మద్ షమీ విషయంలో సెలెక్షన్ కమిటీలో ఎలాంటి చర్చ జరగలేదని అగార్కర్ తెలిపాడు. ఇక తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి టెస్టు జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు.అఫ్గాన్తో ఏకైక టెస్టుకు టీమిండియా: శుబ్మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), సాయి సుదర్శన్, రిషబ్ పంత్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే.అఫ్గాన్తో వన్డేలకు భారత జట్టు: శుబ్మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అర్ష్దీప్ సింగ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ కృష్ణ, ప్రిన్స్ యాదవ్, గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే, రోహిత్ శర్మ*, హార్దిక్ పాండ్యా*.మ్యాచ్ల షెడ్యూల్..జూన్ 6 నుంచి 10 వరకు- ఏకైక టెస్టు (ముల్లన్ పూర్, ఛండీగఢ్)తొలి వన్డే : జూన్ 14 (ధర్మశాల)రెండో వన్డే : జూన్ 17 (లక్నో)మూడో వన్డే : జూన్ 20 (చెన్నై)🚨 News 🚨Presenting #TeamIndia's squads for the @IDFCFIRSTBank Test match and the 3️⃣-match ODI series against Afghanistan in June 🙌#INDvAFG pic.twitter.com/hFiABALLld— BCCI (@BCCI) May 19, 2026📸The Men's Selection Committee Meeting for #TeamIndia's squad announcement for the upcoming @IDFCFIRSTBank Test match and the three-match ODI series against Afghanistan is underway in Guwahati.#INDvAFG pic.twitter.com/VlA94h1nFC— BCCI (@BCCI) May 19, 2026చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
కోహ్లి, అయ్యర్ మెరుపులు.. ప్లే ఆఫ్స్కు ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (మే 17) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ఆర్సీబీ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.విరాట్ కోహ్లి (58), వెంకటేశ్ అయ్యర్ (73 నాటౌట్) మెరుపు అర్ద శతకాలతో చెలరేగారు. పడిక్కల్ (45), టిమ్ డేవిడ్ (28) కూడా బ్యాట్ ఝులిపించారు. జేకబ్ బేతెల్ (11) పేలవ ఫామ్ను కొనసాగించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 2 వికెట్లు తీయగా.. అర్షదీప్ సింగ్, చహల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఈ సీజన్ తొలి 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. ఆతర్వాతి 6 మ్యాచ్ల్లో ఓటమిపాలై, నిష్క్రమణ అంచుల్లో నిలిచింది. ఆర్సీబీతో మ్యాచ్లో పంజాబ్ ఆదిలోనే పట్టు కోల్పోయింది. భువనేశ్వర్ కుమార్ ధాటికి ఆ జట్టు 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతర్వాత కూపర్ కన్నోల్లీ (37), సూర్యాంశ్ షేడ్గే (35) కాసేపు క్రీజ్లో నిలదొక్కుకున్నారు. అయితే షెపర్డ్, సుయాశ్ శర్మ దెబ్బకు వీరిద్దరు ఔటయ్యారు. ఈ దశలో శశాంక్ సింగ్ (56), స్టోయినిస్ (37) పంజాబ్ శిబిరంలో ఆశలు రేకెత్తించారు. వీరు కూడా ఔట్ కావడంతో పంజాబ్ ఓటమి ఖరారైంది. ఆర్సీబీ బౌలర్లలో రసిక్ సలాం దార్ 3, భువీ 2, హాజిల్వుడ్, సుయాశ్ శర్మ, షెపర్డ్ తలో వికెట్ తీశారు. పంజాబ్ బ్యాటర్లలో ప్రియాంశ్ ఆర్య 0, ప్రభ్సిమ్రన్ 2, శ్రేయస్ 1, ఒమర్జాయ్ 14 పరుగులకు ఔటయ్యారు. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి అద్భుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. కింగ్ కోహ్లి 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కోహ్లి పలు సరికొత్త రికార్డులను లిఖించుకున్నాడు. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరపున ఓపెనర్గా 5500 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్గా విరాట్ రికార్డు సృష్టించాడు. ఆర్సీబీ తరపున కోహ్లి ఓపెనర్గా 5500 పరుగులు సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్ ఈ ఫీట్ను అందుకున్నాడు.అంతకముందు శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ వంటి ఆటగాళ్లు ఐపీఎల్లో ఓపెనర్లుగా 5500 పరుగుల మార్కును దాటినప్పటికీ.. వారు వేర్వేరు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించారు. కానీ కోహ్లి మాత్రం కేవలం ఆర్సీబీ తరుపున ఆడుతూ ఈ ఘనత సాధించాడు.అదేవిధంగా ఐపీఎల్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లి తన రికార్డును తానే బ్రేక్ చేశాడు. పంజాబ్ కింగ్స్పై కోహ్లి ఇప్పటివరకు 1175కు పైగా పరుగులు చేశాడు. ఇంతకముందు కోహ్లి చెన్నై సూపర్ కింగ్స్పై 1174 పరుగులు చేశాడు.ఐపీఎల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక పరుగులు చేసిన టాప్-5 బ్యాటర్లు:1175 పరుగులు – విరాట్ కోహ్లి (vs పంజాబ్ కింగ్స్)1174 పరుగులు – విరాట్ కోహ్లి (vs చెన్నై సూపర్ కింగ్స్) 1172 పరుగులు – విరాట్ కోహ్లి (vs ఢిల్లీ క్యాపిటల్స్) 1161 పరుగులు – రోహిత్ శర్మ (vs కోల్కతా నైట్ రైడర్స్) 1134 పరుగులు – డేవిడ్ వార్నర్ (vs పంజాబ్ కింగ్స్) ఈ ఇన్నింగ్స్తో కోహ్లీ ఐపీఎల్ 2026 సీజన్లో తన 500 పరుగుల మార్కును కూడా దాటేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 9 సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఏకైక బ్యాటర్గా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అత్యధిక సార్లు ఐపీఎల్ సీజన్లలో 500 ప్లస్ రన్స్ చేసిన ప్లేయర్లు వీరే9 సీజన్లు – విరాట్ కోహ్లీ 7 సీజన్లు – డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్ 5 సీజన్లు – శిఖర్ ధావన్చదవండి: PAK vs BAN: బాబర్ ఆజం అరుదైన రికార్డు -
2027 వరల్డ్ కప్ లో ఆడతారా! కుండబద్దలు కొట్టిన కోహ్లి
-
‘నా విలువను నిరూపించుకునే స్థితిలో లేను’
న్యూఢిల్లీ: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ప్రస్తుతం ఒక్క వన్డే ఫార్మాట్లోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఇటీవల పదేపదే 2027 వన్డే వరల్డ్ కప్లో అతని స్థానంపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై కోహ్లి తన ఆలోచనలేమిటో స్పష్టంగా చెప్పాడు. తన స్థాయి, విలువకు తగిన గౌరవం ఇస్తేనే ఆటలో కొనసాగుతానని, లేదంటే తప్పుకుంటానని అతను వ్యాఖ్యానించాడు. తాను ఇంకా ఏదో నిరూపించుకోవాల్సిన స్థితిలో లేనని కోహ్లి స్పష్టం చేశాడు.‘నన్ను ఇప్పటికి 2027 వరల్డ్ కప్లో ఆడటం గురించి చాలాసార్లు అడిగారు. నేను ఎప్పుడైనా ఆడేందుకు సిద్ధం. ఎందుకంటే అది నాకు నిత్యకృత్యం. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇల్లు వదిలి నా కిట్తో బయటకు వెళ్లడం, ఎంతో కష్టపడటం కూడా దాని కోసమే కదా. భారత్ తరఫున మరో ప్రపంచకప్ ఆడటం గొప్ప గౌరవం. కానీ నాకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉంది. జట్టుకు నా అవసరం ఉందని భావిస్తేనే ఆడతాను. అంతే కానీ నా విలువను, స్థాయిని నిరూపించుకుంటే ఆడాల్సిన పరిస్థితి వస్తే అందుకు సిద్ధంగా లేను. నన్ను నేను నిరూపించుకోవాల్సిన స్థితిలో ఇప్పుడు లేను’ అని కోహ్లి వెల్లడించాడు.గత ఏడాది ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. సిరీస్కు పూర్తిగా సన్నద్ధమై, ప్రత్యేకంగా సొంత ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొని బోర్డు నిబంధనల ప్రకారం రంజీ ట్రోఫీలో ఆడిన తర్వాత కూడా అతను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. కోహ్లిని తొలి రెండు టెస్టులకే ఎంపిక చేస్తామని, ఆ తర్వాత ప్రదర్శనను బట్టి కొనసాగిస్తామని సెలక్టర్లు చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ...‘మనం పని చేసే చోట మన ప్రతిభ, సామర్థ్యంపై నమ్మకం ఉందని చెప్పి బాధ్యతలు అప్పగించిన తర్వాత వారం రోజులకే మన పనితీరును ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది. నేను నిజాయితీగా పని చేస్తాను. ఆట కోసం ఎంతైనా కష్టపడతాను. వన్డేలో 40 ఓవర్ల పాటు బౌండరీ లైన్ల మధ్య ఆ మూల నుంచి ఈ మూలకు పరుగెత్తమని చెబితే కచ్చితంగా చేస్తా. ప్రతీ బంతిని నా కెరీర్ చివరి బంతిలా భావించి మైదానంలో పోరాడతా. దీనిపై ఫిర్యాదు చేయను. ఎందుకంటే దానికి అనుగుణంగానే నేను సాధన చేస్తా, సిద్ధమవుతా. కేవలం ఫలితాలు చూసి నిర్ణయం తీసుకోవద్దు. ఎందుకంటే వాటి గురించి ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరు. కాబట్టి ఏదైనా సమస్య ఉంటే ముందే చెప్పేయండి. లేదా ఒకసారి అవకాశం ఇచ్చాక నన్ను పని చేసుకోనివ్వండి’ అని విరాట్ తన ఉద్దేశాన్ని చెప్పాడు. -
వన్డే వరల్డ్కప్ ఆడటంపై కోహ్లి కీలక వ్యాఖ్యలు
భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి.. వన్డే వరల్డ్కప్-2027 టోర్నీలో ఆడతాడా? లేదా?.. చాన్నాళ్లుగా క్రికెట్ వర్గాల్లో ఈ చర్చ నడుస్తోంది. ‘సూపర్ స్టార్లు’ అయినా సరే తమను తాము ఎప్పటికప్పుడు నిరూపించుకోవాలని హెడ్కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గట్టిగానే చెబుతున్నారు.తమ దృష్టిలో దిగ్గజాలు, యువ ఆటగాళ్లు సమానమనే సంకేతాలు ఇస్తున్నారు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ను విజేతగా నిలిపిన తర్వాత కెప్టెన్ పదవి నుంచి రోహిత్ శర్మను తప్పించడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు రో-కోలను మేనేజ్మెంట్ దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తప్పక ఆడాలని ఆదేశించింది.మౌనం వీడిన కోహ్లిఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటి తమను తాము నిరూపించుకున్నారు. అయినప్పటికీ వయసు రిత్యా రో-కోను వరల్డ్కప్ ఆడిస్తారా? లేదా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో విరాట్ కోహ్లి (Virat Kohli) తన భవిష్యత్తుపై మౌనం వీడాడు.వన్డే వరల్డ్కప్-2027లో ఆడతారా? లేదా? అన్న అంశంపై స్పందిస్తూ.. ‘‘నా దృష్టి కోణం ఒక్కటే. నా జట్టు విలువ పెంచేలా నా శాయశక్తులా కృషి చేస్తా. అక్కడున్న వాళ్లు కూడా నా వల్ల జట్టుకు మేలు చేకూరుతుందని భావించాలి. అప్పుడే నేను జట్టులో ఉంటాను.పదే పదే నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే..అయితే, పదే పదే నన్ను నేను నిరూపించుకోవాలనే ఒత్తిడి వస్తే.. అక్కడ నాకు స్థానం ఉండదని పరోక్షంగా నాకు నేను చెబుతున్నట్లు అర్థం. ఏదేమైనా నిజాయితీగా ఆట కోసం సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యం. బ్యాటింగ్ చేయడానికి వెళ్లే ముందు ప్రతిసారి నా తల వంచుకుని.. కొత్తగా మైదానంలోకి దిగినట్లే వెళ్తాను.నా క్రికెట్ కెరీర్లో దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. అందుకు నేను కృతజ్ఞుడిని. కఠినంగా శ్రమించడమే నాకు తెలుసు. సరైన రీతిలో ఆడటమే నా లక్ష్యం. అలాగే ఆడతాను కూడా. వన్డే మ్యాచ్లో నలభై ఓవర్ల పాటు.. వికెట్ల మధ్య పరుగులు తీయాల్సి వస్తే నేను కచ్చితంగా ఆ పనిని పూర్తి చేస్తా.As I said, if Kohli feels the team management or BCCI wants him to prove his worth, he’ll retire the next day and that’s exactly what he said.He added "Ofc I want to play 2027 WC " 😭♥️ pic.twitter.com/eOv07nN6fc— Gaurav (@Melbourne__82) May 15, 2026ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరిది అనే ఆలోచనతోనేనాకెలాంటి ఫిర్యాదులూ ఉండవు. ఎందుకంటే.. మ్యాచ్లో ఊహించని పరిస్థితులు ఎదురైనా.. అందుకు తగ్గట్లుగా జట్టు కోసం ఉపయోగపడేలా ముందే నేను సన్నద్ధమవుతా. మ్యాచ్లో ఎదుర్కొనే ప్రతి బాల్ నా కెరీర్లో ఆఖరి బంతి అనే ఆలోచనతోనే సిద్ధమవుతా.వికెట్ల మధ్య అలుపు లేకుండా పరిగెడతా. ఇంత చేసినా నా విలువ, స్థాయి ఏమిటో నిరూపించుకోవాలని అంటున్నారంటే.. అక్కడ నా అవసరం లేదు అని అర్థం. నాకు అది అక్కర్లేదు కూడా!’’ అని కోహ్లి నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ పాడ్కాస్ట్లో కోహ్లి చేసిన ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. గంభీర్, అగార్కర్ వైఖరి నచ్చకే అతడు ఈ విధంగా స్పందించాడని అభిమానులు అంటున్నారు.కాగా 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన రో-కో.. గతేడాది అనూహ్యంగా టెస్టులకూ గుడ్బై చెప్పారు. ఇప్పుడు ఇద్దరూ వన్డేలతో పాటు ఐపీఎల్లో కొనసాగుతున్నారు. ఆర్సీబీ తరఫున కోహ్లి ఐపీఎల్-2026 సీజన్లో ఇప్పటికి 12 మ్యాచ్లు ఆడి 484 పరుగులు సాధించాడు.చదవండి: రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు! -
రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు!
టీమిండియా మాజీ హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత హెడ్కోచ్ గౌతం గంభీర్ ఆలోచనా విధానానికి తాను వ్యతిరేకమని చెప్పకనే చెప్పాడు. రవిశాస్త్రి తర్వాత భారత జట్టుకు మార్గనిర్దేశకుడిగా వచ్చిన ద్రవిడ్.. జట్టును విజయపథంలో నిలిపాడు.టైటిల్ గెలిచిన తర్వాతఆరంభంలో సవాళ్లు ఎదురైనా వాటిని అధిగమించి.. 2024లో టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత ద్రవిడ్ తన పదవి నుంచి సగర్వంగా వైదొలిగాడు. అంతకుముందు ద్రవిడ్ మార్గనిర్దేశనంలోనే భారత్ వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్కు చేరింది.ఇక ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అతడి కోచింగ్లో టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026 టైటిళ్లు గెలిచింది. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయంలో ద్రవిడ్దే కీలక పాత్ర అని.. అతడు నిర్మించిన జట్టే టైటిల్ గెలిచిందని నాటి కెప్టెన్ రోహిత్ శర్మ ద్రవిడ్కు క్రెడిట్ ఇచ్చాడు.కోహ్లి, రోహిత్ రిటైర్మెంట్కు కారణమా?ఇదిలా ఉంటే.. గంభీర్ టీమిండియాలో సూపర్స్టార్ సంస్కృతిని పారద్రోలి.. సూపర్ టీమ్గా ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తాడని అతడి సన్నిహిత వర్గాలు ఇటీవల తెలిపాయి. టెస్టు ఫార్మాట్ నుంచి దిగ్గజాలు, సూపర్ స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వారం వ్యవధిలోనే వైదొలగడంతో గంభీర్తో విభేదాలే కారణమనే వార్తలు వచ్చాయి.ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉందిఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ తాజాగా టీమిండియాలో ‘సూపర్ స్టార్ కల్చర్’పై స్పందించాడు. స్కూప్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. ‘‘ప్రతీ క్రీడకు ‘హీరో’ల అవసరం ఉంది. తమ ప్రదర్శనల ద్వారానే ప్లేయర్లు హీరోలుగా ఎదుగుతారు.మైదానంలో మన ప్రదర్శన బాగుంటునే జాతి మనల్ని గుర్తిస్తుంది. ముఖ్యంగా భారత్లో అద్భుతంగా ఆడితే ఓ రేంజ్లో ప్రశంసలు వస్తాయి. అదే సమయంలో విమర్శలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందరి దృష్టి ఆటగాళ్ల మీదే ఉంటుంది. మన ప్రదర్శనలను ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు.వారే స్ఫూర్తి దాతలుకాబట్టి ఈ దేశంలో ఎంతో గొప్పగా ఆడితే తప్ప సూపర్ స్టార్ లేదంటే దిగ్గజ ప్లేయర్ అనే హోదా రాదు. వ్యక్తిగత ప్రదర్శన బాగుంటే జట్టు విజయాలకూ మనం దోహదపడినవాళ్లము అవుతాము’’ అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. సూపర్ స్టార్లు భావితరాలకు స్ఫూర్తినిస్తారని.. వారి అవసరం తప్పక ఉందని ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. కాగా గంభీర్ సూపర్ స్టార్ ట్యాగులు వద్దంటూ అందరినీ ఒకే గాటన కట్టాలని చూస్తుంటే.. ద్రవిడ్ మాత్రం ఈ మేరకు స్పందించడం గమనార్హం.చదవండి: టీమిండియా టీ20 కెప్టెన్గా అతడే! -
బంగారు గొలుసు పారేసుకున్నాడు.. అదే పాక్లో అయితే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మ్యాచ్ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ ఓపెనర్ జేకబ్ బెతెల్ బంగారు గొలుసు నేల మీద పడిపోయింది. అయితే, అతడు దానిని తీసుకోవడం మర్చిపోయి పెవిలియన్కు చేరుకున్నాడు.ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఐపీఎల్-2026లో భాగంగా ఆర్సీబీ- కేకేఆర్ బుధవారం రాయ్పూర్ వేదికగా తలపడ్డ సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆర్సీబీ.. కేకేఆర్ను తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.ఆరు వికెట్ల తేడాతో గెలుపుఅంగ్క్రిష్ రఘువంశీ (71), కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ (49 నాటౌట్) రాణించారు. ఫలితంగా కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జేకబ్ బెతెల్ కేవలం 15 పరుగులు చేసి.. కార్తిక్ త్యాగి బౌలింగ్లో అవుటయ్యాడు.అయితే, మరో ఓపెనర్ విరాట్ కోహ్లి అజేయం సెంచరీ (105)తో మెరిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి తోడుగా వన్డౌన్ బ్యాటర్ దేవ్దత్ పడిక్కల్ (39) రాణించాడు. ఈ క్రమంలో 19.1 ఓవర్లలో ఆర్సీబీ నాలుగు వికెట్లు నష్టపోయి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది.కిందపడిన బంగారు గొలుసుఇదిలా ఉంటే.. కార్తిక్ త్యాగి సంధించిన బౌన్సర్ జేకబ్ బెతెల్ హెల్మెట్కు బలంగా తాకింది. ఈ క్రమంలోనే అతడి మెడలో ఉన్న గోల్డ్ చెయిన్ కింద పడిపోయింది. అయితే, అవుటై పెవిలియన్కు వెళ్లిపోతున్న క్రమంలో బెతెల్.. బంగారు గొలుసు తీసుకోవడం మర్చిపోయాడు. అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్.. ఈ విషయాన్ని గుర్తించాడు.PC: Xఅదే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇలా జరిగి ఉంటే..మైదానంలో పడిన బంగారు గొలుసు తీసి అంపైర్కు చూపించగా.. అది అక్కడి నుంచి బెతెల్కు చేరింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు పేలుస్తున్నారు.‘‘అసలే బంగారం ధర రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో గొలుసు దొరికితే ఎవరూ వదిలిపెట్టరు. ఇది ఐపీఎల్లో జరిగింది కాబట్టి సరిపోయింది. బెతెల్కు తన గొలుసు లభించింది. అదే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఇలా జరిగి ఉంటే.. గొలుసు మళ్లీ కనిపించేదే కాదు’’ అని వ్యంగ్యరీతిలో కామెంట్లు చేస్తున్నారు.చదవండి: సీఎస్కేకు భారీ షాక్!.. ఇంటికి వెళ్లిపోయిన స్టార్ ప్లేయర్ -
అది నన్ను తీవ్రంగా వేధించింది: విరాట్ కోహ్లి
వరుస వైఫల్యాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి బుధవారం బ్యాట్ ఝులిపించాడు. ‘వింటేజ్ కింగ్’ను గుర్తుచేస్తూ కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)పై శతక్కొట్టాడు. ప్రత్యర్థి విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకుని జట్టును గెలిపించాడు.గెలుపులో కీలక పాత్రరాయ్పూర్ వేదికగా కేకేఆర్తో మ్యాచ్లో మొత్తంగా 60 బంతుల్లో.. 105 పరుగులతో కోహ్లి (Virat Kohli) అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లిని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరించింది.అది నన్ను తీవ్రంగా వేధించిందిఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘గత రెండు మ్యాచ్లలో నేను పరుగులు చేయలేకపోయాను. అది నన్ను తీవ్రంగా వేధించింది. బాగా ఆడగలనని నాకు తెలుసు. ఈరోజు బంతిని బలంగా బాది అనుకున్నట్లుగా పని పూర్తి చేశాను.రోజురోజుకీ మరింత మెరుగ్గా ఆడటమే లక్ష్యం. అయితే, కొన్నిసార్లు వైఫల్యాలు ఎదురవుతాయి. వాటిని తేలికగా తీసుకోకూడదు. ఒత్తిడిని జయించి ముందుకు సాగాలి. ఒక్కోసారి ఒత్తిడిలో ఆడటం కూడా మంచిదే.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026కారణం అదేఅదే మనల్ని మరింత కఠినంగా శ్రమించేలా చేస్తుంది. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు తొలి అడుగు పడేలా ముందకు తోస్తుంది. గత రెండు మ్యాచ్లలో విఫలమైనప్పుడు నేను నిరాశ చెందిన మాట వాస్తవం. ఈరోజు సెంచరీ పూర్తైన తర్వాత గొప్పగా సంబరాలు చేసుకోకపోవడానికి కారణం అదే.కృతజ్ఞుడిగా ఉంటానునా దృష్టి మొత్తం వీలైనన్ని ఎక్కువగా పరుగులు రాబట్టి జట్టును గెలిపించడమే. బ్యాటింగ్ చేయడమంటే నాకు ఇష్టం. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా నాలో పరుగుల దాహం తీరదు. మళ్లీ మొదటి నుంచి వచ్చినట్లుగానే ఉంటుంది. ఆట కోసం ప్రాణం పెడతా. దేవుడి దయ వల్ల ఎన్నో రికార్డులు సాధించగలిగాను. అందుకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను’’ అని విరాట్ కోహ్లి ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు. కాగా ఐపీఎల్లో కోహ్లికి ఇది తొమ్మిదో సెంచరీ కాగా.. ఓవరాల్గా టీ20 ఫార్మాట్లో పదవ శతకం. ఇదిలా ఉంటే.. గత రెండు మ్యాచ్లలో కోహ్లి డకౌట్ అయిన సంగతి తెలిసిందే.చదవండి: ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర -
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. సరికొత్త చరిత్ర
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఐపీఎల్-2026లో గత రెండు మ్యాచ్ల్లో డకౌట్ అయిన ‘కింగ్’.. ఈసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో చెలరేగాడు.ఛేదనలో మొనగాడినని మరోసారి నిరూపిస్తూ ఐపీఎల్లో తన 9వ సెంచరీతో సత్తా చాటాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు.ప్రపంచ రికార్డు బద్దలుటీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. తద్వారా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అదే విధంగా టీ20 ఫార్మాట్లో అత్యధిక సెంచరీల వీరుల జాబితాలో డేవిడ్ వార్నర్ రికార్డును కోహ్లి సమం చేశాడు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రాయ్పూర్ వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కేకేఆర్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.ఈ లక్ష్యాన్ని ఆర్సీబీ 19.1 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కోహ్లి (105 నాటౌట్) శతక్కొట్టగా.. దేవ్దత్ పడిక్కల్ (27 బంతుల్లో 39) మెరుగ్గా రాణించాడు.Cometh the hour, cometh KING KOHLI! 👑The chase master. The run machine and we are running out of superlatives.Century No. 9️⃣ for #ViratKohli in TATA IPL! ❤️🌟[ #TATAIPL, #RCBvsKKR, #ManishPandey, #ViratKohli, #Narine, #RinkuSingh ] pic.twitter.com/BT9CGj4y7K— Star Sports (@StarSportsIndia) May 13, 2026టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 14 వేల పరుగుల మైలురాయిని చేరుకున్న క్రికెటర్లు👉విరాట్ కోహ్లి- 409 ఇన్నింగ్స్లో👉క్రిస్ గేల్- 423 ఇన్నింగ్స్లో👉డేవిడ్ వార్నర్- 431 ఇన్నింగ్స్లో👉జోస్ బట్లర్- 468 ఇన్నింగ్స్లో👉అలెక్స్ హేల్స్- 505 ఇన్నింగ్స్లో👉కీరన్ పోలార్డ్- 633 ఇన్నింగ్స్లోటీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు👉క్రిస్ గేల్- 22👉బాబర్ ఆజం- 13👉డేవిడ్ వార్నర్- 10👉విరాట్ కోహ్లి- 10👉రీలీ రొసోవ్, సాహిబ్జాదా ఫర్హాన్- 9👉క్వింటన్ డికాక్, అభిషేక్ శర్మ- 9.చదవండి: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు -
కోల్కతాపై బెంగళూరు విజయం
ఐపీఎల్-2026 సీజన్లో కీలక పోరులో కోల్కతా నైట్రైడర్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 193 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. రాయ్పూర్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసి విజయం అందుకుంది.విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో ఆర్సీబీని విజయ తీరాలకు చేర్చాడు. ఈ విజయంతో సీజన్లో 8వ విజయంతో ప్లేఆఫ్స్ రేసుకి మరింత చేరువైంది ఆర్సీబీ. -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. తొలి ప్లేయర్గా అరుదైన రికార్డు
టీమిండియా సూపర్ స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ప్లేయర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్-2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా కేకేఆర్తో మ్యాచ్లో కోహ్లి ఈ ఫీట్ను అందుకున్నాడు.కింగ్ కోహ్లికి ఇది 279వ ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్కు ముందు విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ ముగ్గురూ 278 మ్యాచ్లతో సమంగా ఉండేవారు. తాజా మ్యాచ్తో కోహ్లి వారిద్దరిని అధిగమించి అగ్రస్ధానానికి చేరుకున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి కోహ్లి ఆర్సీబీకే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఎంఎస్ ధోనీ సీఎస్కే ప్రాతినిథ్యం వహిస్తుండగా.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నాడు. మిస్టర్ కూల్ గాయం కారణంగా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ముంబై ఇండియన్స్ ఆడబోయే తదుపరి మ్యాచ్లో కోహ్లి రికార్డును రోహిత్ శర్మ సమం చేసే అవకాశముంది. కాగా విరాట్ కోహ్లి ఐపీఎల్లో 9,000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక బ్యాటర్గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఐపీఎల్లో అత్యధిక ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లి-279ఎంఎస్ ధోని-278రోహిత్ శర్మ-278రవీంద్ర జడేజా-265చదవండి: టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్!? -
‘నన్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’
జర్మన్ మోడల్, ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ పెట్టిన పోస్టుకు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లైక్ కొట్టడం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఆ తర్వాత ఆ లైక్ కనిపించకపోవడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో లిజ్ లాజ్ మరోసారి బాంబు పేల్చింది. కోహ్లీపై తప్పుడు ఆరోపణలు చేయాలంటూ కొందరు జర్నలిస్టులు తనను సంప్రదించారని, అందుకు భారీగా డబ్బులు కూడా ఆఫర్ చేశారని లిజ్ లాజ్ వెల్లడించింది. తనను పావులా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాలని భావించారని, కానీ డబ్బు కోసం లేదా పాపులర్ అవ్వడానికి కోహ్లీ పేరును వాడుకొని అతడి ప్రతిష్టను దెబ్బతీయాలన్న ఆసక్తి తనకు లేదని తెలిపింది. అందుకే వాళ్లు (జర్నలిస్టులు) ఇచ్చిన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు పేర్కొంది. ఇంటర్వ్యూలో లిజ్ లాజ్ మాట్లాడుతూ.. ‘మొదట విరాట్ కోహ్లీ నా ఫొటో లైక్ చేసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ప్రపంచస్థాయి క్రికెటర్ నా పోస్టును గమనించడం గర్వంగా అనిపించింది. కానీ తర్వాత ఆ విషయాన్ని సోషల్ మీడియాలో అతిగా చూపించడం బాధ కలిగించింది. ఒక సాధారణ సోషల్ మీడియా యాక్టివిటీని పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. కోహ్లీపై వచ్చిన ట్రోలింగ్ చూసి ఆశ్చర్యపోయాను. అతను ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి మాట్లాడుతూ, అతడిని ఫుట్బాల్ దిగ్గజాలు మెస్సీ, రొనాల్డోలతో పోల్చింది. ‘కోహ్లీ ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన క్రీడాకారుల్లో ఒకరు. ఆయనపై అనవసర ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఒక చిన్న విషయాన్ని పెద్ద వివాదంగా మార్చి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం బాధాకరం’ అని ఆమె పేర్కొంది. ఈ వివాదం తర్వాత భారత్లో లిజ్ లాజ్కు విపరీతమైన గుర్తింపు వచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్లు భారీగా పెరిగారు. పలు బ్రాండ్ ప్రమోషన్లు, రియాలిటీ షో అవకాశాలు కూడా వచ్చినట్లు సమాచారం. అయినప్పటికీ, తాను సంచలన ప్రచారం కోసం ఎవరి ప్రతిష్ఠతో ఆడుకోనని ఆమె స్పష్టం చేసింది. అంతేకాదు తాను ఐపీఎల్కు పెద్ద అభిమానినని, ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టును క్రమం తప్పకుండా ఫాలో అవుతానని స్పష్టం చేసింది.ఎవరీ లిజ్లాజ్?లిజ్ లాజ్ దక్షిణాఫ్రికాలో జన్మించింది. ఆమె తండ్రిది సౌతాఫ్రికా కాగా.. తల్లిది జర్మనీ. దీంతో లిజ్ లాజ్ జర్మన్, ఆఫ్రికా, డచ్, ఫ్రెంచ్, రష్యన్ వంటి భాషలను అనర్గళంగా మాట్లాడగలదు. సైకాలజీ విభాగంలో ఎంఎస్సీ పట్టా పొందింది. లైఫ్సేవింగ్ స్విమ్మర్ కూడా లిజ్ లాజ్ గుర్తింపు పొందింది. ఫుడ్ వ్లాగింగ్, ట్రావెలింగ్, పాటల రచన లిజ్ లాజ్ హాబీలు.చదవండి: చీర్గర్ల్స్ చిందులు.. కళ్లప్పగించిన పోలీసులు! -
సిల్వర్ టు గోల్డెన్ డక్.. కోహ్లీ చెత్త రికార్డు
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దీపక్ చాహర్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని మిడాఫ్ దిశగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడ కాచుకు కూర్చున్న రాజ్బవాకు స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో కోహ్లీ వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ డకౌట్ల విషయంలో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఈ సీజన్లో తొలిసారి గోల్డెన్ డక్ అయిన కోహ్లీకి ఓవరాల్గా ఐపీఎల్లో ఎనిమిదో గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం. అంతేకాదు ఈ సీజన్లో వరుసగా రెండో మ్యాచ్లోనూ డకౌట్గా వెనుదిరిగాడు. తద్వారా నాలుగేళ్ల తర్వాత రెండు వరుస మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. లక్నోతో జరిగిన గత మ్యాచ్లోనూ కోహ్లీ 2 బంతులెదుర్కొని సున్నా పరుగుల వద్ద ఔటయ్యాడు. 2022 సీజన్లో కోహ్లీ లక్నో, ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ల్లో ఇదే మాదిరిగా డకౌట్ అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు కోహ్లీని ట్రోల్ చేశారు. 'సిల్వర్ డక్ను గోల్డెన్ డక్గా మార్చుకున్న ఘనత కోహ్లీ సొంతం' అంటూ కామెంట్లు చేశారు. ఇక తాజా డకౌట్తో కోహ్లీ మరిన్ని చెత్త రికార్డులు మూట గట్టుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం.👉ముంబై ఇండియన్స్పై కోహ్లీ డకౌట్ కావడం ఇది మూడోసారి. గతంలో ఎస్ఆర్హెచ్పై కూడా మూడుసార్లు డకౌట్ అయ్యాడు. ఇక లక్నోపై రెండుసార్లు, పంజాబ్, గుజరాత్, కేకేఆర్, రాజస్తాన్లపై ఒక్కోసారి డకౌట్గా వెనుదిరిగాడు.👉 ఐపీఎల్లో కోహ్లీ గోల్డెన్ డకౌటవ్వడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి. 2022 సీజన్లో లక్నో సూపర్జెయింట్స్తో మ్యాచ్లో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. ఆ సీజన్లో ఎస్ఆర్హెచ్తో ఆడిన తర్వాతి మ్యాచ్లోనూ కోహ్లీ డకౌట్ అయ్యాడు. తాజా సీజన్లోనూ వరుసగా లక్నో, ముంబైతో మ్యాచ్ల్లోనూ మరోసారి రిపీట్ చేశాడు.👉 ఐపీఎల్ల్లో అత్యధిక సార్లు గోల్డెన్డక్ అయిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ (8 సార్లు).. ఇషాన్ కిషన్, సునీల్ నరైన్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. వీరి కంటే ముందు రషీద్ ఖాన్ (12 సార్లు), మ్యాక్స్వెల్ (10 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.👉ఈ సీజన్లో కోహ్లీ బ్యాటింగ్లో మెరుపులు తగ్గినప్పటికీ పర్వాలేదనిపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్ల్లో 379 పరుగులు సాధించాడు. అయితే గత నాలుగు ఇన్నింగ్స్లు కలిపి కోహ్లీ చేసిన పరుగులు 51 మాత్రమే కావడం గమనార్హం.Virat Kohli goes for a Golden Duck 😯Courtesy Deepak Chahar 🤌💙Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/LxCP62qvVJ— IndianPremierLeague (@IPL) May 10, 2026Silver duck now has been upgraded to golden duck 😂 pic.twitter.com/wxhEbgDBHC— Hitman (@Vijay456V60026) May 10, 2026చదవండి: లేటు వయసులో భువనేశ్వర్ కొత్త చరిత్ర! -
కోహ్లి సహచరుడు, పంజాబ్ కింగ్స్ మాజీ ప్లేయర్ ఆకస్మిక మృతి
ఐపీఎల్ 2026 మధ్యలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ పంజాబ్ క్రికెటర్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి అండర్ 19 జట్టు సహచరుడు, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) మాజీ ఆటగాడు అమన్ప్రీత్ సింగ్ గిల్ ఆకస్మికంగా కన్నుమూశాడు. ఆతని వయసు కేవలం 36 సంవత్సరాలు మాత్రమే. గిల్ మృతికి గల కారణాలు తెలియరాలేదు.Punjab Cricket Association deeply mourns the sad demise of Amanpreet Singh Gill, former Punjab cricketer and Member, Senior Selection Committee Punjab.He served Punjab cricket with dedication and passion, representing teams including India Under-19s, Kings XI Punjab and Punjab.… pic.twitter.com/tpr0EwEprk— Punjab Cricket Association (@pcacricket) May 6, 2026చండీగఢ్లో జన్మించిన అమన్ప్రీత్ సింగ్ గిల్, పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు భారత అండర్-19 జట్టు తరఫున కూడా ఆడాడు. అలాగే ఐపీఎల్ ప్రారంభ దశలో పంజాబ్ కింగ్స్ (అప్పటి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) జట్టులో భాగంగా ఉన్నాడు.క్రికెట్కు రిటైర్మెంట్ తర్వాత పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.కోహ్లీతో కలిసి అండర్-19లోఅమన్ప్రీత్ గిల్, బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లితో కలిసి 2007లో అండర్-19 ప్రపంచకప్లో ఆడాడు. ఆ టోర్నీలో 5 మ్యాచ్ల్లో 9 వికెట్లు తీసి మంచి ప్రతిభ చాటాడు.అమన్ప్రీత్ గిల్ మృతిపై పంజాబ్ క్రికెట్ అసోసిచయేషన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. "పంజాబ్ క్రికెట్కు అంకితభావంతో సేవలందించిన అమన్ప్రీత్ సింగ్ గిల్ మరణం చాలా బాధాకరం" అని పేర్కొంది. అమన్ప్రీత్ అంత్యక్రియలు ఇవాళ (మే 6) చండీగఢ్లోని మణిమజ్రా శ్మశానవాటికలో నిర్వహించారు. అమన్ప్రీత్ గిల్ మృతికి సంతాపంగా ఇవాళ జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్లు ధరించే అవకాశం ఉంది. -
విరాట్ కోహ్లి కాదు.. కొత్త 'కింగ్' అతడే..!
ఐపీఎల్ 2026 మధ్య దశకు చేరుకున్న వేళ ‘కింగ్’ అనే బిరుదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఈ ట్యాగ్కు ప్రతీకగా నిలిచిన విరాట్ కోహ్లికి ఇప్పుడు గట్టి పోటీదారు వచ్చాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ తమ జట్టు స్టార్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ను "కొత్త కింగ్"గా అభివర్ణిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. తాజాగా సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో నరైన్ 200 ఐపీఎల్ వికెట్ల మైలురాయిని అందుకోవడంతో ఈ చర్చ మొదలైంది.నరైన్ ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 200కు పైగా వికెట్లు, 1000కు పైగా పరుగులు, సెంచరీ, హ్యాట్రిక్, ఐదు వికెట్ల హాల్, మూడు సార్లు మోస్ట్ వాల్యుయబుల్ ప్లేయర్ అవార్డులు.. ఇలాంటి ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ కారణంగానే మైసూర్ నరైన్ను గేమ్ చేంజర్గా కొనియాడుతూ 'కింగ్'గా అభివర్ణించాడు.మరోవైపు విరాట్ కోహ్లి కింగ్ అనే బిరుదుకు సార్దకత చేకూరుస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా స్థిరమైన ప్రదర్శన, జట్టు విజయాల్లో కీలక పాత్ర, భారీ అభిమాన వర్గం.. ఇవి కోహ్లీని 'కింగ్'గా నిలబెట్టాయి.నరైన్ కూడా విరాట్లాగే కెరీర్ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో స్థిరంగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ కింగ్ బిరుదు కోసం పోటీపడుతున్నాడు. బ్యాటింగ్లో విరాట్.. ఆల్రౌండ్ ప్రదర్శనల్లో నరైన్ ఆధిపత్యం చాటుతుండటంతో కింగ్ ఎవరో డిసైడ్ చేయడం చాలా కష్టంగా మారింది.ఇదిలా ఉంటే, ఈ సీజన్ తొలి 6 మ్యాచ్ల్లో ఒక్క విజయం కూడా సాధించలేని కేకేఆర్.. అనూహ్యంగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఉనికి చాటుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు కలిగి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ అవకాశాలు గల్లంతు అయినప్పటికీ.. అధికారికంగా రేసులోనే ఉంది. మరోవైపు విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ 9 మ్యాచ్ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పట్టికలో రెండో స్థానంలో ఉంది. -
షాక్లో ఆర్సీబీ.. 18 ఏళ్ల బంధానికి స్వస్తి!
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సీజన్లో 9 మ్యాచ్లాడిన ఆర్సీబీ ఆరు విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈసారి సీజన్లో ఆర్సీబీ సక్సెస్ వెనుక చాలా మంది ఆటగాళ్ల కృషి దాగుంది. బ్యాటింగ్ విభాగంలో కోహ్లితో పాటు కెప్టెన్ పటీదార్, దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్లు అదరగొడుతుంటే, బౌలింగ్లో హాజిల్వుడ్, భువనేశ్వర్, సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యాలు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇక 19 ఏళ్లుగా ఒకే జట్టుకు ఆడుతున్న కింగ్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 2026 సీజన్లోనూ బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. 9 మ్యాచ్ల్లో కోహ్లి 165.50 స్ట్రైక్రేట్తో 379 పరుగులు సాధించాడు. గతేడాది తొలిసారి చాంపియన్స్గా నిలిచిన ఆర్సీబీ వరుసగా ఈ సీజన్లోనూ కప్ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే ఒక వార్త మాత్రం ఆర్సీబీని తెగ బాధపెట్టేస్తోంది. అదేంటంటే 18 ఏళ్ల పాటు ఆర్సీబీ ఫిజియోగా సేవలందించిన ఎవన్ స్పీచ్లీకి ఆర్సీబీ ఘనంగా ఫేర్వెల్ ఇచ్చింది. ఆర్సీబీ జట్టు వెనుక ఎవన్ స్పీచ్లీ పాత్ర మరువలేనిది. 2008 నుంచి 2025 సీజన్ వరకు ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి ఫిజియోగా పనిచేశాడు. ఈ 18 ఏళ్లలో ఎంతో మంది ఆర్సీబీ ఆటగాళ్ల ఫిట్నెస్తో పాటు వాళ్లు గాయాల నుంచి త్వరగా కోలుకునేందుకు ఎవన్ ఎంతో కృషి చేశారు. అయితే గత సీజన్ ముగిసిన అనంతరం ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీ ఫిజియోగా రిటైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎవన్ స్పీచ్లీకి ‘ఒక అధ్యాయం ముగిసింది’ (ఎండ్ ఆఫ్ ఎరా) పేరుతో ఫేర్వెల్ ఘనంగా నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోనూ ఆర్సీబీ తమ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసుకుంది. ఫిజియోగా రిటైర్ అయిన తర్వాత స్వదేశంలో ఉండిపోయిన ఎవన్ స్పీచ్లీ ఈ ఫేర్వెల్ వేడుక కోసం బెంగళూరుకు రావడం విశేషం. కోహ్లి సహా ఆర్సీబీ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ ఎవన్కు గార్డ్ ఆఫ్ హానర్తో గౌరవించారు. ‘ ఎండ్ ఆఫ్ ఎరా, ఎవన్ స్పీచ్లీ’. నీ లెగసీని ఆర్సీబీ ఎప్పటికీ గుర్తుం చుకుంటుంది. 18 ఏళ్లుగా ఎవన్ స్పీచ్లీ ఆర్సీబీకి హెడ్ ఫిజియోగా వ్యవహరించారు. అందుకే అతనికి ఘనంగా వీడ్కోలు పలుకుతున్నాం.’ అని క్యాప్షన్ జత చేసింది.𝙀𝙣𝙙 𝙤𝙛 𝙖𝙣 𝙚𝙧𝙖, 𝙀𝙫𝙖𝙣 𝙎𝙥𝙚𝙚𝙘𝙝𝙡𝙮! Your legacy at RCB will always be remembered. 🙌❤️Evan Speechly was our Head Physio for 18 long years, from 2008 to 2025 - one of the OGs of RCB. He flew down to Bengaluru for a special farewell, and we were all teary eyed!… pic.twitter.com/fjVJR80V1j— Royal Challengers Bengaluru (@RCBTweets) May 4, 2026 చదవండి: ‘ఇది జట్టు వైఫల్యం.. ఆ ముగ్గురినే నిందించలేం’ -
చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్.. ఒకే ఒక్కడు
ఐపీఎల్-2026లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. శుక్రవారం జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. రాజస్తాన్ నిర్ధేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 19.1 ఓవర్లలో ఊదిపడేసింది. ఢిల్లీకి ఛేజింగ్ పరంగా ఇదే అతి పెద్ద విజయం. ఈ రికార్డు విజయంలో కేఎల్ రాహుల్ (40 బంతుల్లో 75; 6 ఫోర్లు, 5 సిక్స్లు), పతుమ్ నిసాంక (33 బంతుల్లో 62; 6 ఫోర్లు, 3 సిక్స్లు)లది కీలక పాత్ర. వీరిద్దరూ తొలి వికెట్కు 110 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.ఆ తర్వాత నిస్సాంక ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన దూకుడును కొనసాగించాడు. ఆ తర్వాత ఆశుతోష్, స్టబ్స్ మ్యాచ్ను ఫినిష్ చేశారు. ఇక హాఫ్ సెంచరీతో సత్తాచాటిన రాహుల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఐపీఎల్ చరిత్రలో 200 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ ఓపెనర్గా రాహుల్ రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం ఓపెనర్గా రాహుల్ ఖాతాలో 202 సిక్సర్లు ఉన్నాయి. రాహుల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి(192) ఉన్నారు.ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్లుకేఎల్ రాహుల్ - 202* సిక్సర్లువిరాట్ కోహ్లీ - 192 సిక్సర్లురోహిత్ శర్మ - 148 సిక్సర్లుశిఖర్ ధావన్ - 143 సిక్సర్లుశుభమాన్ గిల్ - 129 సిక్సర్లుఅదేవిధంగా ఐపీఎల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న జాబితాలో రాహుల్ నాలుగో స్ధానంలో జడేజా సరసన నిలిచాడు. ఈ లిస్ట్లో రోహిత్ శర్మ(21) అగ్రస్ధానంలో ఉన్నాడు.అత్యధిక ప్లేయర్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ఇండియన్స్ వీరే21 - రోహిత్ శర్మ20 - విరాట్ కోహ్లీ18 - ఎంఎస్ ధోని17 - రవీంద్ర జడేజా17 - KL రాహుల్* -
Kohli vs Gill: ఏడిపించిన కోహ్లి.. ఇచ్చిపడేసిన గిల్!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. గత వారం ఎదురైన పరాభవానికి సొంతగడ్డపై బదులు తీర్చుకుంది. ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం గుజరాత్- ఆర్సీబీ తలపడ్డాయి.కోహ్లి, గిల్ స్కోర్లు ఎంతంటే?ఇందులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులుకు ఆలౌటైంది. దేవ్దత్ పడిక్కల్ (24 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, విరాట్ కోహ్లి (13 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు.అనంతరం గుజరాత్ 15.5 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి గెలిచింది. శుబ్మన్ గిల్ (18 బంతుల్లో 43; 4 ఫోర్లు, 3 సిక్స్లు), జోస్ బట్లర్ (19 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. 12 పరుగులు చేయడంతోపాటు, 2 వికెట్లు పడగొట్టి, 3 క్యాచ్లు పట్టిన జేసన్ హోల్డర్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ సందర్భంగా ఆర్సీబీ దిగ్గజం, కింగ్ కోహ్లి- గుజరాత్ కెప్టెన్, ప్రిన్స్ గిల్ మధ్య చోటు చేసుకున్న సరదా సన్నివేశాలు వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ సమయంలో గిల్ పట్ల పక్కా ప్రత్యర్థిలా వ్యవహరించిన కోహ్లి.. ఆ తర్వాత మాత్రం అతడిని టీజ్ చేశాడు. ఇందుకు గిల్ కూడా గట్టిగానే బదులిచ్చాడు.Vintage #ViratKohli energy! 🔥KING catches, PRINCE departs - Absolute cinema! 🙌 🎯#TATAIPL 2026 ➡️ #GTvRCB | LIVE NOW 👉https://t.co/K8vuSzrZ1d pic.twitter.com/jCKi1Qo4zA— Star Sports (@StarSportsIndia) April 30, 2026ఏడిపించిన కోహ్లి.. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో గిల్ ఇచ్చిన క్యాచ్ పట్టిన కోహ్లి.. అతడు పెవిలియన్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసమయంలో కోహ్లి వైల్డ్గా సెలబ్రేట్ చేసుకోగా.. గిల్ నిరాశగా వెనుదిరిగాడు. ఈ క్రమంలో గిల్ డగౌట్లో కూర్చోగా.. ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి.. అతడిని అవుట్ చేసిన విధానాన్ని సైగలతో చూపిస్తూ టీజ్ చేశాడు.Virat Kohli: "Ye le thullu, kaise catch out kiya 😭"Shubman Gill: "Scoreboard dekh lo, kya hi farak padta hai? Hum jeet rahe hain!"Kohli: "Run-out hote-hote bacha tu, kaise bhaag raha tha!"Gill: "Chhodo jaane do, Virat bhai hai ❤️" pic.twitter.com/KCWwV0xDWk— GillTheWill (@GillTheWill77) May 1, 2026ఇచ్చిపడేసిన గిల్!ఇందుకు గిల్.. ‘స్కోరు బోర్డు చూడు భయ్యా.. నేను అవుటైతే ఏంటి? గెలిచేది మేమే’ అన్నట్లుగా తానూ సైగలతోనే కౌంటర్ వేశాడు. ఇక ఈ మ్యాచ్లో గుజరాత్ ఆర్సీబీపై నాలుగు వికెట్ల తేడాతో గెలిచిన తర్వాత.. ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకునే సమయంలో గిల్- కోహ్లి ఆలింగనం చేసుకుని నవ్వులు చిందించారు.అయితే, ఆ తర్వాత కూడా గిల్ కోహ్లి, ఆర్సీబీని వదిలిపెట్టలేదు. కోహ్లి, తానూ ఉన్న ఫొటోను పంచుకుంటూ.. ‘జేసన్ హోల్డర్.. ప్లే హోల్డ్ బోల్డ్.. ఈరోజు రాత్రి అత్యద్భుతమైన ప్రదర్శన’ అంటూ ఆర్సీబీ, కోహ్లిని టార్గెట్ చేశాడు. కాగా ఈ మ్యాచ్లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఇచ్చిన క్యాచ్ను హోల్డర్ పట్టాడు.అయితే, ఇది క్లీన్ క్యాచ్ కాదని కోహ్లి వాదించగా.. థర్డ్ అంపైర్ మాత్రం అవుట్గా ప్రకటించాడు. దీంతో వివాదం చెలరేగింది. అయితే, ఫలితం మాత్రం గుజరాత్కు మేలు చేసింది. మరోవైపు.. ఆర్సీబీ ప్లే బోల్డ్ అన్న నినాదంతో ముందుకు సాగుతుందన్న సంగతి తెలిసిందే. ఈ రెండింటినీ ప్రస్తావిస్తూ గిల్ ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు.చదవండి: కింద పడేసి తొక్కుతా బిడ్డా!.. క్లాసెన్ మాస్ వార్నింగ్! The award for the best senior and junior duo goes to… 😁#TATAIPL #GTvRCB #ShubmanGill #ViratKohli pic.twitter.com/4lccF2wv9u— Star Sports (@StarSportsIndia) April 30, 2026 -
అంపైర్ తో కోహ్లి ఫైట్.. రెండు మ్యాచ్ లు నిషేధం!
-
కోహ్లి విధ్వంసం చేసినా కోలుకున్నాం.. ఆ క్రెడిట్ మొత్తం వారికే: గిల్
ఐపీఎల్-2026లో గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టైటాన్స్ ఆల్రౌండ్ షోతో అదరగొట్టింది. మొదట ఆర్సీబీని 155 పరుగులకే కట్టడి చేసిన గుజరాత్.. అనంతరం బ్యాటింగ్లోనూ సత్తాచాటింది.15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ స్పందిచాడు. ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమ బౌలర్లను గిల్ కొనియాడాడు."కీలక మ్యాచ్లో విజయం సాధించింనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఇలాంటి వికెట్పై ప్రత్యర్ధి జట్టును 160 పరుగులలోపు కట్డడి చేయడం అంత సులువు కాదు. కానీ మా బౌలర్లు మాత్రం ఆసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఫీల్డింగ్లో కూడా మెరుగ్గా రాణించాము. గత మ్యాచ్తో పోలిస్తే ఈ రోజు అన్ని విభాగాల్లో మేము పై చేయి సాధించాము. ప్రతీ ఒక్కరూ జట్టు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. రెండో ఓవర్లో విరాట్ భాయ్ వరుస బౌండరీలతో విరుచుకుపడ్డారు. కానీ ఆ తర్వాత మేము పుంజుకున్న తీరు చాలా బాగుంది. అతడి వికెట్తో తిరిగి మేము గేమ్లోకి వచ్చాము. నేనేమి ఈ మ్యాచ్లో ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగలేదు. నేను ఒక రిథమ్లో ఉన్నాను అన్పించింది. మొదటి బంతికి కాస్త అదృష్టం తోడైంది, రెండో బంతి నాకు కావాల్సిన స్లాట్లో పడింది. దీంతో ఈ రోజునే నాదే అనుకున్నాను.అందుకే బౌలర్లపై ఎదురుదాడికి దిగాను. ఇక తెవాటియా మా జట్టులో కీలక సభ్యుడు. ఈ రోజు అతడు మ్యాచ్ ఫినిష్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జోస్ భాయ్ మ్యాచ్ ఫినిష్ చేస్తాడనుకున్నా. కానీ ఆ తర్వాత వరుసగా మూడు వికెట్లు కోల్పోయాము. ఆ బాధ్యతను తెవాటియా తీసుకుని మ్యాచ్ను ముగించాడు" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో గిల్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్లో గిల్ 43 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: పాటిదార్ది అవుటా? నాటౌటా? రూల్స్ ఏమి చెబుతున్నాయి? -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గురువారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికి.. కోహ్లి మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 28 పరుగులు చేసి కోహ్లి ఔటయ్యాడు.ముఖ్యంగా గుజరాత్ పేసర్ కగిసో రబాడకు కింగ్ కోహ్లి చుక్కలు చూపించాడు. రబాడ వేసిన రెండో ఓవర్లో కోహ్లి వరుసగా 5 సిక్స్లు బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మ్యాచ్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి రెండు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే👉భారత గడ్డపై ఐపీఎల్లో 8,000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి ప్లేయర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. 12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ మైలు రాయిని విరాట్ అందుకున్నాడు. కాగా పలు ఐపీఎల్ సీజన్లు దక్షిణాఫ్రికా, యూఏఈ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. విదేశీ గడ్డపై జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో మొత్తంగా అతడు 1000కు పైగా పరుగులు చేశాడు. ఓవరాల్గా కోహ్లి పేరిట 9230 ఐపీఎల్ రన్స్ ఉన్నాయి. కాగా కోహ్లి దారిదాపుల్లో ఎవరూ లేరు.భారత్లో అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన ప్లేయర్లు వీరేవిరాట్ కోహ్లీ - 8,016రోహిత్ శర్మ - 6,274శిఖర్ ధావన్ - 5,819డేవిడ్ వార్నర్ - 5,689👉ఒకే ఓవర్లో 5 ఫోర్లు కొట్టిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా క్రిస్ గేల్, షేన్ వాట్సన్ సరసన కోహ్లి నిలిచాడు. క్రిస్ గేల్, షేన్ వాట్సన్ గతంలో పుణే వారియర్స్ పై ఈ ఫీట్ సాధించారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.156 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 6 వికెట్లు కోల్పోయి 15.5 ఓవర్లలో ఛేదించింది.కెప్టెన్ శుభ్మన్ గిల్(43) టాప్ స్కోరర్గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి(28), దేవ్దత్త్ పడిక్కల్(40) మినహా మిగితా బ్యాటర్లంతా తీవ్ర నిరాశపరిచారు.చదవండి: అతడి వల్లే ఈ ఓటమి.. కానీ భువీ మాత్రం అద్భుతం: ఆర్సీబీ కెప్టెన్ -
అంపైర్పై ఫైర్ అయిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్ టైటాన్స్తో ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తీవ్ర ఆగ్రహావేశానికి లోనయ్యాడు. గుజరాత్ ఆటగాడు జేసన్ హోల్డర్ పట్టిన ఓ క్యాచ్ (రజత్ పాటిదార్ది) అనుమానాస్పదంగా ఉన్నా, థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించడాన్ని తీవ్రంగా ఖండించాడు. Virat Kohli is unhappy with the decision by the third umpire on the catch of Rajat Patidar ❌Out or not-out - What are your thoughts? 👀 #RCBvsGT pic.twitter.com/3ItI5ZngJP— Hassi (@hass_1707) April 30, 2026ఈ క్రమంలో మైదానంలోనే అంపైర్తో కోపంగా చర్చించాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ కావడంతో విరాట్పై చర్యలేమైనా ఉంటాయా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?అంపైర్ నిర్ణయంపై బహిరంగంగా అసమ్మతి వ్యక్తం చేయడం నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుంది. అయితే, ప్రతి వాదనకూ నిషేధం విధించరు. తీవ్రతను బట్టి శిక్ష నిర్ణయిస్తారు.సాధారణంగా ఇలాంటి ఘటనలకు మ్యాచ్ ఫీజులో 25 నుంచి 50 శాతం వరకు జరిమానా, ఓ డీమెరిట్ పాయింట్ కేటాయిస్తారు. నిషేధం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. శారీరక దురుసుతనం లేదా తీవ్రమైన అవమానకర ప్రవర్తన ఉంటేనే కఠిన చర్యలు తీసుకుంటారు.ఇందుకు ఇటీవలి నితీశ్ రాణా ఉదంతం ఓ ఉదాహరణ. ఇదే సీజన్లో రాణా అంపైర్తో వాగ్వాదానికి దిగగా, అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించారు. ఇదే తరహాలో విరాట్కు కూడా శిక్ష పడే అవకాశం ఉంది.Ball clearly touched the ground, it's a clear notout. Virat Kohli wasn't happy with Umpire decision.He schooled Umpire live in front of 130k fans😭🔥pic.twitter.com/2QrEN2nDCh— ` (@wokenupkohli) April 30, 2026కాగా, హోల్టర్ క్యాచ్ నిజంగా క్లీన్గా పట్టాడా లేదా అన్న అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కోహ్లీ స్పందనను కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు నియంత్రణ కోల్పోయాడని విమర్శిస్తున్నారు. వాస్తవానికి రీ ప్లేల్లో హోల్డర్ క్యాచ్ పట్టిన సమయంలో బంతి నేలపై ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ క్షుణ్ణంగా పరిశీలించకుండా ఔట్ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ గుజరాత్ బౌలర్లు, ఫీల్డర్లు చెలరేగడంతో 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దారుణంగా దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. -
దడదడలాడించిన విరాట్ కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 30) జరుగుతున్న 42వ మ్యాచ్లో ఆర్సీబీ- గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో గుజరాత్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఊహించిన విధంగానే గుజరాత్ బౌలర్లు తొలుత బౌలింగ్ చేస్తూ చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. అయితే ఈ మధ్యలో ఆర్సీబీకి ఒకే ఒక ఊరట కలిగించే అంశం ఉంది. అదేంటంటే.. విరాట్ కోహ్లి. ఈ మ్యాచ్లో విరాట్ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు.చూడటానికి ఈ గణాంకాలు సాధారణంగానే ఉన్నా, ఈ ఇన్నింగ్స్ కెరీర్ తొలినాళ్లలో విరాట్లోని దూకుడుకు అభిమానులకు మరోసారి రుచి చూపించింది. ఈ ఇన్నింగ్స్లో విరాట్ గుజరాత్ బౌలర్ కగిసో రబాడపై విరుచుకుపడిన తీరు అమోఘంగా ఉండింది.Pace meets 𝙋𝙀𝙍𝙁𝙀𝘾𝙏𝙄𝙊𝙉 🤌🎥 Virat Kohli with 5️⃣ consecutive boundaries against Kagiso Rabada 🔥Updates ▶️ https://t.co/I5Hg8ybefh#TATAIPL | #KhelBindaas | #GTvRCB | @RCBTweets pic.twitter.com/mdunPUJiV0— IndianPremierLeague (@IPL) April 30, 2026ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రబాడ బౌలింగ్లో విరాట్ విశ్వరూపం ప్రదర్శించాడు. స్టార్ బౌలర్ అన్న కనికరం కూడా లేకుండా రెచ్చిపోయాడు. వరుసగా 5 బౌండరీలు బాది చుక్కలు చూపించాడు.పుల్ షాట్తో ఆరంభించిన కోహ్లీ.. కవర్స్, పాయింట్ ప్రాంతాల్లో అద్భుతమైన షాట్లతో బౌండరీల వర్షం కురిపించాడు. దీంతో ఆ ఓవర్లో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఐపీఎల్ కెరీర్లో కోహ్లీ ఒకే ఓవర్లో సాధించిన నాలుగో అత్యధిక స్కోరు ఇదే.* 30 పరుగులు vs గుజరాత్ లయన్స్ (2016)* 23 పరుగులు vs ఢిల్లీ (2013)* 22 పరుగులు vs డెక్కన్ ఛార్జర్స్ (2010)* 21 పరుగులు vs గుజరాత్ టైటాన్స్ (2026)మరో అరుదైన ఘనతఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్, షేన్ వాట్సన్ తర్వాత ఒకే ఓవర్లో ఐదు ఫోర్లు బాదిన మూడో ఆర్సీబీ బ్యాటర్గా విరాట్ రికార్డుల్లోకెక్కాడు.రబాడ ఓవర్ తర్వాత సిరాజ్ వేసిన మరుసటి ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన విరాట్.. రబాడ వేసిన ఆ మరుసటి ఓవర్లో మరో భారీ షాట్కు ప్రయత్నించి రషీద్ ఖాన్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో విరాట్ విధ్వంసకర ఇన్నింగ్స్కు తెరపడింది. వాస్తవానికి ఈ సీజన్ ప్రారంభం నుంచే విరాట్ చాలా దూకుడుగా కనిపిస్తున్నాడు. దాదాపు ప్రతి మ్యాచ్లో తన సహజ శైలికి భిన్నంగా బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. సాధారణంగా విరాట్ ఎక్కువగా గ్రౌండ్ షాట్లు ఆడుతూ బౌండరీలు కొడుతుంటాడు. అయితే ఈ సీజన్లో అందుకు భిన్నంగా సిక్సర్లతో చెలరేగుతున్నాడు. ఈ సీజన్లో విరాట్ ఇప్పటికే 42 బౌండరీలతో పాటు 15 సిక్సర్లు బాదాడు.కాగా, ఈ మ్యాచ్లో గుజరాత్ బౌలర్లతో పాటు ఫీల్డర్లు కూడా చెలరేగిపోయారు. హోల్డర్ 3, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ తలో 2 క్యాచ్లతో ఆర్సీబీని దెబ్బకొట్టారు. బౌలింగ్లో అర్షద్ ఖాన్ 3, హోల్డర్, రషీద్ ఖాన్ తలో 2, సిరాజ్, రబాడ చెరో వికెట్ పడగొట్టారు. ఆర్సీబీ ఇన్నింగ్స్లో పడిక్కల్ (40) టాప్ స్కోరర్ కాగా.. విరాట్ 28, బేతెల్ 5, పాటిదార్ 19, జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ 4, షెపర్డ్ 17, వెంకటేశ్ అయ్యర్ 12, భువనేశ్వర్ కుమార్ 15 (నాటౌట్), హాజిల్వుడ్ డకౌటయ్యారు. -
చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో కోహ్లితో గొడవపడిన వ్యక్తి
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి యుక్త వయసులో ఉన్నప్పుడు అతనితో కయ్యానికి కాలు దువ్విన ఓ ఇంగ్లీష్ క్రికెటర్ ఇప్పుడు అతని దేశ క్రికెట్ బోర్డు (ECB) చీఫ్ సెలెక్టర్ పదవి రేసులో ముందున్నాడు. ఇంగ్లండ్కు చెందిన 37 ఫాస్ట్ బౌలర్ స్టీవెన్ ఫిన్ 2012లో భారత్-ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీతో తీవ్రస్థాయిలో గొడవ పడ్డాడు. ఆ సందర్భంగా కోహ్లి-ఫిన్ మధ్య వాగ్వాదం తారాస్థాయికి వెళ్లింది. తనను రెచ్చగొట్టిన ఫిన్కు కోహ్లీ బ్యాట్తో సమాధానం చెప్పాడు. ఫిన్ సైతం తనకు అవకాశం వచ్చినప్పుడు కోహ్లిని ఔట్ చేశాడు. వీరిద్దరి మధ్య వైరం అప్పట్లో కొంతకాలం సాగింది.అయితే ఫిన్ 2023లో మోకాలి గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి కామెంటేటర్ అవతరామెత్తాడు. ఇంగ్లండ్ తరఫున 36 టెస్టులు, 21 టీ20లు ఆడిన ఫిన్, కామెంటేటర్గానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.తాజాగా ఫిన్ ఇంగ్లండ్ క్రికెట్లో అత్యంత కీలకమైన చీఫ్ సెలెక్టర్ పదవికి ప్రధాన పోటీదారుడిగా మారాడు. ఈ పదవి రేసులో ఫిన్ పేరు ప్రధానంగా వినినిస్తుంది. మాజీ చీఫ్ సెలెక్టర్ లూక్ రైట్ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ నిరాశాజనక ప్రదర్శన తర్వాత రైట్ తన పదవికి రాజీనామా చేశాడు.ఈ క్రమంలో చీఫ్ సెలెక్టర్ పదవికి ఎన్నిక అనివార్యం కాగా.. ఫిన్తో పాటు ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు డారెన్ గాఫ్, నిక్ నైట్ కూడా పోటీపడుతున్నారు. వీరిలో ఫిన్కు ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 4న ఇంగ్లండ్-న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే కొత్త సెలెక్టర్ను నియమించే అవకాశం ఉంది. తుది నిర్ణయం ఇంగ్లండ్ క్రికెట్ డైరెక్టర్ రాబర్ట్ కీ తీసుకోనున్నారు. ఇంగ్లండ్ చీఫ్ సెలెక్టర్ పదవికి సంవత్సరానికి సుమారు 150,000 పౌండ్ల వేతనం లభించనుంది. -
బాబర్ ఆజం ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ ఆటగాడికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించాడు. కాగా గత కొంతకాలంగా ఫామ్లేమితో విమర్శల పాలైన బాబర్.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)తో బిజీగా ఉన్నాడు.బాబర్ ఆజం శతకంపెషావర్ జల్మీ జట్టుకు కెప్టెన్గా ఉన్న బాబర్ (Babar Azam).. ఇటీవలే ఫామ్లోకి వచ్చాడు. తాజాగా ఇస్లామాబాద్ యునైటెడ్తో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు అదరగొట్టాడు. కరాచీ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన బాబర్ ఆజం శతక్కొట్టాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ మొత్తంగా 59 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు.151 పరుగులకే ఆలౌట్బాబర్ ఇన్నింగ్స్ కారణంగా పెషావర్ జల్మీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇస్లామాబాద్ యునైటెడ్ 151 పరుగులకే ఆలౌట్ అయింది. ఫైనల్కు పెషావర్ఫలితంగా 70 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన పెషావర్ జల్మీ ఫైనల్కు దూసుకువెళ్లింది. ఈ మ్యాచ్లో పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజంకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.కాగా పీఎస్ఎల్ తాజా సీజన్లో బాబర్ ఆజంకు ఇది రెండో సెంచరీ. ఈ క్రమంలోనే అతడు సౌతాఫ్రికా వెటరన్ స్టార్ ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టీ20 క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన క్రికెటర్గా బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు.టీ20 క్రికెట్లో కెప్టెన్ హోదాలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు👉బాబర్ ఆజం (పాకిస్తాన్)- తొమ్మిది సెంచరీలు👉ఫాఫ్ డుప్లెసిస్ (సౌతాఫ్రికా)- ఎనిమిది సెంచరీలు👉మైకేల్ క్లింగెర్ (ఆస్ట్రేలియా)- ఏడు సెంచరీలు👉విరాట్ కోహ్లి (భారత్)- ఐదు సెంచరీలు👉జేమ్స్ విన్స్ (ఇంగ్లండ్)- ఐదు సెంచరీలు.చదవండి: అదే మా కొంపముంచింది.. అతడు మాత్రం అద్భుతం: శ్రేయస్ -
రికార్డులు బద్దలు కొట్టిన విరాట్ అభిమాని కొడుకు
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి ప్రపంచవ్యాప్తంగా, ఆ వయసు-ఈ వయసు, మహిళలు-పురుషులు అన్న తేడా లేకుండా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఈ అభిమనగనంలోని ఒకరి కుమారుడు వెస్టిండీస్ దేశవాలీ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళితే.. 2023లో భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లింది. ఆ పర్యటనలో విండీస్ వికెట్కీపర్ బ్యాటర్ జాషువ డసిల్వా తల్లి కరోలిన్ డసిల్వా విరాట్ కోహ్లిని కలిసింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్కు వీరాభిమానినని చెప్పుకొచ్చింది. విరాట్ ఆటతీరు మాత్రమే కాకుండా కుటుంబ విలువలు, క్రమశిక్షణ తనను బాగా ఆకట్టుకున్నాయని తెలిపింది. ఆ సందర్భంగా కరోలినా విరాట్ను చాలా చనువుగా ఆలింగనం చేసుకున్న దృష్యాలు సోషల్మీడియాలో బాగా వైరలయ్యాయి.వాటిపై జాషువ డసిల్వ సైతం స్పందించాడు. మా అమ్మకు విరాట్ కోహ్లి అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. అతని ఆటతీరే కాకుండా ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ బిహేవియర్ను కూడా మా అమ్మ చాలా ఇష్టపడుతుందని అన్నాడు.ఆ జాషువ డసిల్వనే ప్రస్తుతం విండీస్ దేశవాలీ క్రికెట్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా అతని చేసిన ఓ డబుల్ సెంచరీ వెస్టిండీస్ దేశీయ క్రికెట్లో సంచలనంగా మారింది.వెస్టిండీస్ ఛాంపియన్షిప్ టోర్నీలో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఆడుతున్న జాషువ, లీవర్డ్ ఐలాండ్స్పై ఈ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చి, ఒంటరి పోరాటంతో (304 బంతుల్లో 220 పరుగులు, 29 ఫోర్లు, 2 సిక్సర్లు) తన జట్టుకు భారీ స్కోర్ (522/9) అందించాడు.ఈ ఇన్నింగ్స్తో జాషువ పలు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్కీపర్ బ్యాటర్గా నిలిచాడు.అలాగే ట్రినిడాడ్ అండ్ టొబాగో తరఫున సంయుక్తంగా అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ సెంచరీ డసిల్వకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తొమ్మిదవది. ఇందులోని ఓ సెంచరీ డసిల్వ వెస్టిండీస్ తరఫున చేశాడు.వెస్టిండీస్ తరఫున అడపాదడపా టెస్ట్ అవకాశాలు మాత్రమే దక్కించుకుంటున్న డసిల్వ.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్గా గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. -
పట్టించుకోని కోహ్లి.. కంటతడి పెట్టిన బుడ్డోడు!
క్రికెట్లో విరాట్ కోహ్లికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న పిల్లాడి నుంచి పెద్దవాళ్ల దాకా అతడి ఆటోగ్రాఫ్ లేదా ఫొటోల కోసం ఎగబడడం చూస్తుంటాం. ఇక ప్రస్తుతం కోహ్లి ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ ఆడింది. అయితే ఆర్సీబీ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ రూం వద్ద ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఒక చిన్న పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం బ్యాట్తో అతడి వద్దకు పరిగెత్తాడు. రెండు మూడుసార్లు ఆ పిల్లాడు కోహ్లి ఆటోగ్రాఫ్ కోసం తెగ ప్రయత్నించినప్పటికీ అధికారులు అతడిని అడ్డుకున్నారు. కోహ్లి కూడా ఆ పిల్లాడిని పట్టించుకోలేదు. దీంతో కోహ్లి తనకు ఆటోగ్రాఫ్ ఇవ్వకుండానే వెళ్లిపోయాడన్న కోపంతో తన చేతిలోని బ్యాట్ను విసిరేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే ఈ ఘటన మ్యాచ్కు ముందు జరిగిందా లేక తర్వాత జరిగిందా అన్నది స్పష్టంగా తెలియదు. కానీ బుడ్డోడు మాత్రం తన చర్యతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీ బౌలర్ల ధాటికి 75 పరుగులకే కుప్పకూలింది. అభిషేక్ పొరేల్ 30 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. హాజిల్వుడ్ 4, భువనేశ్వర్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో ఆర్సీబీ వికెట్ కోల్పోయి 77 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. పడిక్కల్ (34 నాటౌట్), కోహ్లి (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో ఆర్సీబీ 12 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్తో ఆడనుంది.Virat Kohli Little fan broke down 😭💔Virat kohli ignored this little fan who was waiting to get his autograph 😭Wait for that child frustration 😭💔 pic.twitter.com/BszA4JX5NW— Jeet (@JeetN25) April 27, 2026చదవండి: ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే? -
ఢిల్లీలోనే ఆగిపోయిన కోహ్లి.. ఎందుకంటే?
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ఐపీఎల్ 19వ సీజన్తో బిజీగా ఉన్నప్పటికీ తన మూలాలను మాత్రం మరిచిపోలేదు. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ అనంతరం ఆర్సీబీ జట్టు ఢిల్లీ వీడినప్పటికీ కోహ్లి మాత్రం తన స్వస్థలంలోనే ఉండిపోయాడు. దీనికి ఒక ప్రధాన కారణముంది. వెస్ట్ ఢిల్లీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మకు చెందిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీ (డబ్ల్యూడీసీఏ) కొత్త బ్రాంచ్ను ప్రారంభించారు. దీని ప్రారంభోత్సవానికి కోహ్లితో పాటు అతడి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ కూడా హాజరయ్యారు. ఇది తన కోచ్ రాజ్కుమార్ శర్మ క్రికెట్ అకాడమీ కావడంతో ఆయన మీద గౌరవంతో కోహ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీలోనే ఉండిపోయాడు. అయితే కార్యక్రమంలో భాగంగా అకాడమీ స్టూడెంట్లకు కోహ్లి అవార్డులు అందజేశాడు. ఈ నేపథ్యంలో ఒక స్టూడెంట్ కోహ్లి కాళ్లను మొక్కే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి వద్దని వారించి అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకున్నాడు. ఆ తర్వాత అకాడమీలోని స్టూడెంట్స్ను ఉద్దేశించి కోహ్లి మాట్లాడాడు. ‘నేను నా జీవితంలో చిన్న వయసులోనే క్రీడలను నా కెరీర్గా ఎంచుకున్నాను. కానీ ఏది చేసినా నిజయితీతో చేయాలనుకున్నా. అందుకే క్రికెటర్ కావాలని ధృడంగా నిర్ణయించుకున్నా. ఈ సమయంలో నా కుటుంబం, ఉపాధ్యాయుల వద్ద నిజాయితీగా ఉన్నాను. ఇక వర్ధమాన క్రికెటర్లు తమ ఆశయాల పట్ల పూర్తి నిజాయితీ, నిబద్ధతతో ఉండాల్సిన అవసరముంది. మీరు కంటున్న కలల పట్ల, ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై పూర్తి క్లారిటీగా ఉంటే మంచింది. ఆ కలను నెరవేర్చుకునేందుకు వందశాతం నిజాయితీతో కష్టపడితే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వస్తోంది’ అని చెప్పుకొచ్చాడు. ఇక అకాడమీతో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కోహ్లి.. అది తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నాడు. ‘నేను ఎనిమిదేళ్ల వయసులో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాను, ఇప్పటికీ సమయం దొరికినప్పుడల్లా అకాడమీకి వస్తూనే ఉంటాను. ఇది నా బాల్యంలోని ఒక పెద్ద భాగం, ఇక్కడ క్రికెట్ నేర్చుకోవడానికి వచ్చే పిల్లలందరూ దీనికి విలువ ఇస్తారని నేను ఆశిస్తున్నాను’ అని అతను ముగించాడు.ఐపీఎల్ 19వ సీజన్లో విరాట్ కోహ్లి 8 మ్యాచ్లాడి 351 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో 44 బంతుల్లోనే 81 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక సోమవారం ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో కోహ్లి ఒక అరుదైన రికార్డును సాధించాడు. ఢిల్లీతో మ్యాచ్లో 23 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్లో 9వేల పరుగుల మార్క్ను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 9వేల రన్స్ పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు.#WATCH | Delhi: Cricket star Virat Kohli inaugurated a branch of West Delhi Cricket Academy at DPS RK Puram. His childhood coach, Rajkumar Sharma was also with him. pic.twitter.com/gQumDN5om8— ANI (@ANI) April 28, 2026చదవండి: ‘ఎందుకీ డబుల్ గేమ్?’.. వినేశ్పై డబ్ల్యూఎఫ్ఐ ఆగ్రహం -
అటు కోహ్లి... ఇటు అజితేశ్... ప్లేయర్, అంపైర్గా నాటి సహచరులు
న్యూఢిల్లీ: 2008 అండర్–19 వరల్డ్ కప్... విరాట్ కోహ్లి కెప్టెన్సీలో భారత్ ఈ టోర్నీ గెలిచింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 5 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీసిన పేస్ బౌలర్ అజితేశ్ అర్గల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. ఈ 18 ఏళ్లలో ఇద్దరి ప్రస్థానం వేర్వేరుగా సాగింది. కోహ్లి దిగ్గజ క్రికెటర్ స్థాయికి చేరుకోగా, అజితేశ్ కెరీర్ పెద్దగా సాగలేదు. అండర్–19 స్థాయిలో ప్రతిభ చూపి ఆ తర్వాత కనుమరుగైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీలో 19 మ్యాచ్లకే పరిమితమైన అతడిని ఐపీఎల్లో పంజాబ్ జట్టు తీసుకున్నా... ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఆ తర్వాత అజితేశ్ అంపైరింగ్ వైపు మళ్లాడు. ఈ నెల 22న తొలిసారి ఐపీఎల్లో అంపైరింగ్ చేసిన అజితేశ్ తన మూడో మ్యాచ్లో కోహ్లిని కలుసుకున్నాడు. సోమవారం ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్లో కోహ్లి ఆడుతుండగా, అజితేశ్ అంపైరింగ్ చేశాడు. మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయత, ముచ్చట్లు ఆసక్తికర దృశ్యానికి చిరునామాగా నిలిచాయి. -
చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో విరాట్ కోహ్లి
ఐపీఎల్-2026లో సోమవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులను ఊరిస్తున్నాయి. ఢిల్లీతో మ్యాచ్లో కోహ్లి మరో 11 పరుగులు సాధిస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.కోహ్లి ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 274 మ్యాచ్లు ఆడి మొత్తంగా 8,989 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో 8 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా ఈ మ్యాచ్లో కోహ్లి 62 పరుగులు సాధిస్తే, భారత గడ్డపై 10,000 టీ20 రన్స్ నమోదు చేసిన ప్లేయర్గా అవతరిస్తాడు. ఈ ఫీట్ సాధించిన తొలి ప్లేయర్గా కోహ్లి రికార్డులకెక్కుతాడు. అంతేకాకుండా తన టీ20 కెరీర్లో 450 సిక్సర్ల మార్కును చేరడానికి కోహ్లి కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.కోహ్లి ఉన్న ఫామ్కు ఈ రికార్డులను అందుకోవడం పెద్ద విషయమేమి కాదు. ఈ ఏడాది సీజన్లోనూ ఎప్పటిలానే కోహ్లి పరుగులు వరద పారిస్తున్నాడు. గత మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కేవలం 44 బంతుల్లోనే 81 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తన సొంతమైదానం(అరుణ్ జైట్లీ స్టేడియం)లో సత్తాచాటేందుకు కింగ్ సిద్దమయ్యాడు. కోహ్లి(328) ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో ఆరో స్ధానంలో ఉన్నాడు.చదవండి: IPL 2026: రిషబ్ పంత్ సంచలన నిర్ణయం..! సీజన్ మధ్యలోనే? -
పొద్దున్నే విరాట్, రాత్రికి అభిషేక్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 25) డబుల్ హెడర్ మ్యాచ్లు జరిగాయి. ఆసక్తికరంగా రెండూ హై స్కోరింగ్ మ్యాచ్లే అయ్యాయి. రెండు మ్యాచ్ల్లో సిక్సర్లు, బౌండరీల వర్షం, సెంచరీల హోరు, పరుగుల వరద పారింది. ఈ క్రమంలో నిన్నటి రోజుకు ఓ ప్రత్యేకత సంతరించుకుంది.టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారికే ఇచ్చే ఆరెంజ్ క్యాప్ ఏకంగా నలుగురి చేతులు మారింది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.ఉదయం వరకు ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్గా ఉండగా.. మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ 67 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు.సాయంత్రానికి యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రంగంలోకి దిగి మెరుపు సెంచరీతో ఆరెంజ్ క్యాప్ను రాహుల్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. రాత్రికి అదే మ్యాచ్లో సన్రైజర్స్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ తన బ్యాట్కు పని చెప్పి, గంటలు కూడా గడవకముందే వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకున్నాడు.ఇలా ఒకే రోజులో ఆరెంజ్ క్యాప్ నాలుగు సార్లు చేతులు మారడంతో సోషల్ మీడియాలో అభిమానులు సరదాగా స్పందించారు. ఆరెంజ్ క్యాప్ 24 గంటల మెడికల్ షాప్ ఉద్యోగిలా షిఫ్ట్లు మారుతోంది అంటూ ఒక అభిమాని ట్వీట్ చేయగా, మరొకరు "ఉదయం కోహ్లీ, మధ్యాహ్నం కేఎల్, సాయంత్రం వైభవ్, రాత్రికి అభిషేక్.. ఐపీఎల్ 2026 పూర్తిగా సినిమానే" అని అన్నాడు. ఇలాంటి రకరకాల మీమ్స్తో సోషల్మీడియా హోరెత్తింది.కాగా, ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ పట్టికలో అభిషేక్ శర్మ 380 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. వైభవ్ సూర్యవంశీ, కేఎల్ రాహుల్ తలో 357 పరుగులతో రెండో స్థానాన్ని పంచుకున్నారు. సన్రైజర్స్ మరో ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ 349 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 328 పరుగులతో ఐదో స్థానానికి పడిపోయాడు. ఈ జాబితాలో ఉదయం అగ్రస్థానంలో ఉండిన కోహ్లి రాత్రి కంతా ఐదో స్థానానికి పడిపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. -
విరాట్పై విషం చిమ్మిన ఇంగ్లండ్ దిగ్గజం
ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం మైఖేల్ వాన్ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని మరోసారి కెలికాడు. తాజాగా తన దేశానికే చెందిన సామ్ బిల్లింగ్స్ విరాట్ను పొగుడుతూ సోషల్మీడియాలో ఓ పోస్ట్ చేయగా.. అందుకు బదులుగా వ్యంగ్యంగా స్పందించాడు. తాజాగా గుజరాత్పై విరాట్ మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన అనంతరం సామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశాడు. ఇందులో "ఫుల్ ఫ్లోలో ఉన్న విరాట్ను చూడటం కంటే గొప్పది ఏముంటుంది..?" అని రాసుకొచ్చాడు. దీనిపై స్పందించిన వాన్, "ఉంది.. జో రూట్" అంటూ విరాట్పై అక్కసును వెళ్లగక్కాడు.వాస్తవానికి వాన్కు విరాట్ను కెలకడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సందర్భాల్లో తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. విరాట్కు ఫాబ్-4లో ఉండే అర్హత లేదంటూ కొన్ని సార్లు.. విరాట్ ఫాబ్-4లో అథముడని మరికొన్ని సార్లు కామెంట్లు చేశాడు. తాజాగా విరాట్ కంటే రూట్ చాలా బెటర్ అన్న అర్దం వచ్చేలా బిల్లింగ్స్ ట్వీట్పై స్పందించి శునకానందం పొందాడు. వాన్ విరాట్పై చేసిన ట్వీట్ సోషల్మీడియాలో వైరలైంది. వాన్పై విరాట్ అభిమానులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కొందరు, వాన్కు ఇలాంటి చెత్త ప్రవర్తన కొత్తేమీ కాదంటూ లైట్ తీసుకుంటున్నారు.ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో విరాట్ మెరుపు హాఫ్ సెంచరీ (81) చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్తో అతను మరిన్ని ఘనతలు సాధించాడు. ఈ సీజన్లో లీడింగ్ రన్ స్కోరర్గా అవతరించడమే కాకుండా.. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ తరఫున 400 సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. విరాట్తో పాటు దేవ్దత్ పడిక్కల్ (55) కూడా మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో గుజరాత్ నిర్దేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ మరో 7 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఫలితంగా గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ అద్భుత శతకం వృధా అయ్యింది. -
తీవ్ర అసంతృప్తి.. కోపంతో ఊగిపోయిన కోహ్లి!
గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) దిగ్గజం విరాట్ కోహ్లి మెరుపులు మెరిపించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ మొత్తంగా 44 బంతులు ఎదుర్కొని 81 పరుగులు సాధించాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.అయితే, ఒకానొక దశలో సెంచరీ దిశగా పయనించిన కోహ్లి.. అనూహ్య రీతిలో అవుటయ్యాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి వెనుదిరిగాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లి బ్యాట్ను ప్యాడ్కేసి కొడుతూ కోపంగా మైదానం వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.కాగా బెంగళూరు వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో ఆర్సీబీ గుజరాత్ తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు సాధించింది.‘సున్నా’ వద్ద కోహ్లికి లైఫ్! ఇక లక్ష్య ఛేదనలో భాగంగా సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆర్సీబీ స్టార్ జాకబ్ బెతెల్ (14) ప్రభావం చూపలేకపోయాడు. మరోవైపు.. కోహ్లి ఆడిన తొలి బంతికే షార్ట్ మిడ్వికెట్ వద్ద వాషింగ్టన్ సుందర్ సునాయాస క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత కోహ్లి చక్కటి షాట్లతో దూసుకుపోగా టైటాన్స్ భారీ మూల్యం చెల్లించింది.మరో ఎండ్లో పడిక్కల్ (27 బంతుల్లో 55)... కోహ్లికంటే వేగంగా పరుగులు రాబట్టి ఆర్సీబీ పనిని సులువు చేశాడు. తొలి బంతికే సిక్స్తో మొదలు పెట్టిన అతను సిరాజ్ ఓవర్లో మరో సిక్స్ కొట్టాడు. రషీద్ ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్ కొట్టగా... ప్రసిధ్ ఓవర్లో పడిక్కల్ 2 సిక్స్లు, ఫోర్ బాదాడు. ఆపై రషీద్ ఓవర్లోనూ 2 సిక్స్లతో చెలరేగిన పడిక్కల్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకోవడం విశేషం. ఆ తర్వాత 30 బంతుల్లో కోహ్లి అర్ధ సెంచరీ పూర్తయింది.హోల్డర్ వైల్డ్గా సెలబ్రేషన్స్.. తీవ్ర అసంతృప్తిలో కోహ్లిపడిక్కల్ను రషీద్ అవుట్ చేయగా, హోల్డర్ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టిన కోహ్లి తర్వాతి బంతిని వికెట్లపైకి ఆడుకున్నాడు. దీంతో సున్నా వద్ద లైఫ్ పొంది సెంచరీ దిశగా పయనించిన కోహ్లి ఇన్నింగ్స్కు పద్నాలుగో ఓవర్లో తెరపడింది. హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయి కోపంగా కోహ్లి వెనుదిరగగా.. హోల్డర్ వైల్డ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు.Set batters gone 😯🎥 Rashid Khan and Jason Holder hit the timber \|/Updates ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @gujarat_titans pic.twitter.com/zVUsxy1NB2— IndianPremierLeague (@IPL) April 24, 2026ఇక ఆర్సీబీ మిగిలిన ఆటగాళ్లలో జితేశ్ శర్మ (10), కెప్టెన్ రజత్ పాటీదార్ (8) విఫలమైనా... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 23 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్), టిమ్ డేవిడ్ (10 నాటౌట్) కలిసి మ్యాచ్ను ముగించారు. చదవండి: అందుకే శ్రేయస్ అయ్యర్ను వదులుకున్నాం: కేకేఆర్ మాజీ కోచ్ -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
రికార్డుల రారాజు విరాట్ కోహ్లి ఖాతాలో మరో రెండు భారీ రికార్డులు చేరాయి. ఈ దిగ్గజ బ్యాటర్ ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 24) గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు అర్ద సెంచరీ (44 బంతుల్లో 81) చేసి తన జట్టును గెలిపించాడు. ఇందులో 8 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ బౌండరీలు, సిక్సర్ల ద్వారా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 800 ఫోర్లు, ఒకే ఫ్రాంచైజీ (ఆర్సీబీ) తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతలను ఇప్పటివరకు ఏ ఆటగాడు సాధించలేదు.వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున 300 సిక్సర్లను మాత్రం క్రిస్ గేల్ (కేకేఆర్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ- 357), రోహిత్ శర్మ (డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్- 310) సాధించారు. గుజరాత్పై మ్యాచ్ తర్వాత విరాట్ ఖాతాలో 807 ఫోర్లు, 303 సిక్సర్లు ఉన్నాయి. ఫోర్ల విషయంలో మాత్రం ప్రస్తుతమున్న ఆటగాళ్లలో విరాట్ కనుచూపు మేరల్లో కూడా ఎవరూ లేరు. ఐపీఎల్లో విరాట్ తర్వాత అత్యధిక బౌండరీలు సాధించిన ఘనత మాజీ డాషింగ్ ఓపెనర్ శిఖర్ ధవన్ (768) పేరిట ఉంది. ప్రస్తుమున్న ఆటగాళ్లలో విరాట్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (663), రోహిత్ శర్మ (653) ఉన్నారు.50 హాఫ్ సెంచరీస్ఈ హాఫ్ సెంచరీతో విరాట్ మరో ఘనత కూడా సాధించాడు. ఈ హాఫ్ సెంచరీ అతనికి ఐపీఎల్లో ఓపెనర్ 50వది. ఈ ఘనతను విరాట్కు ముందు డేవిడ్ వార్నర్ మాత్రమే సాధించాడు. తాజా ఇన్నింగ్స్తో విరాట్ ప్రస్తుత సీజన్లో లీడింగ్ రన్స్కోరర్గానూ అవతరించాడు. 7 ఇన్నింగ్స్ల్లో 328 పరుగులతో ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్, ఓపెనర్ సాయి సుదర్శన్ (100) సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లి (81), పడిక్కల్ (55) చెలరేగడంతో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
గర్జించిన కోహ్లి, పడిక్కల్.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతగడ్డపై మరో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), పడిక్కల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని అందుకుంది. చివర్లో హైడ్రామా నెలకొన్నప్పటికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్), కృనాల్ పాండ్యా (23 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, సుయాశ్ శర్మ, హాజిల్వుడ్ తలా ఒక వికెట్ తీశారు.సాయి సుదర్శన్ సెంచరీటాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుబ్మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్ ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్), హోల్డర్ (23 నాటౌట్) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్లో జాకబ్ బెతల్ (14) షారుక్ఖాన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు. ఈ సీజన్లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.Clinical at home...Again! ❤️@RCBTweets jump to 2⃣nd spot on the points table with another win in front of a roaring Bengaluru crowd 🥳Scorecard ▶️ https://t.co/5ZJjfv5Nr6#TATAIPL | #KhelBindaas | #RCBvGT | @RCBTweets pic.twitter.com/pYTwF4yzbo— IndianPremierLeague (@IPL) April 24, 2026 -
కోట్లు సంపాదించి అద్దె ఎగ్గొట్టిన విరాట్ కోహ్లి.. హోటల్ మూసివేత
-
బంధం తెంచుకున్న కోహ్లి!.. రెస్టారెంట్ మూసివేత
టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి బ్రాండ్ వాల్యూ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ద్వారా కీర్తిని గడించిన ఈ ఢిల్లీ స్టార్.. వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాడు. స్వయంగా ఎన్నో బ్రాండ్లు కూడా కలిగి ఉన్నాడు. వన్8 కమ్యూన్ ద్వారా ఆతిథ్య రంగంలోనూ కోహ్లి అడుగుపెట్టాడు.దేశ వ్యాప్తంగాదేశ వ్యాప్తంగా ఈ రెస్టారెంట్ చైన్ వ్యాపించి ఉంది. ఢిల్లీ, గురుగ్రామ్, పుణె, కోల్కతా, నోయిడా, హైదరాబాద్ వంటి సిటీల్లో వన్8 కమ్యూన్కు శాఖలు ఉన్నాయి. అయితే, బెంగళూరులో ఉన్న వన్8 కమ్యూన్ బ్రాంచీ కోర్టు ఆదేశాలతో మూతపడింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..అద్దె కట్టకుండా..బెంగళూరులో చిన్నస్వామి స్టేడియానికి సమీపంలో వన్8 కమ్యూన్ రెస్టారెంట్ ఉంది. ట్రియో హిల్స్ హాస్పిటాలిటీ దీనిని నిర్వహిస్తూ కోహ్లితో భాగస్వామ్యంలో ఉంది. అయితే, గత ఆర్నెళ్లుగా అద్దె చెల్లించడంలో ట్రియో హిల్స్ విఫలమైంది. మెయింటెనెన్స్ కూడా బాకీ పడింది. దీంతో సదరు భవన నిర్మాణ యజమాని ఈ విషయమై సివిల్ కోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో అద్దె చెల్లించి, యజమానితో సమస్యలు పరిష్కారం చేసుకునేంత వరకు రెస్టారెంట్ను మూసివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే.. వివిధ నిబంధనల ఉల్లంఘన కారణంగా బృహత్ బెంగళూరు మహానగర పాలికే కూడా ఇప్పటికే ఈ రెస్టారెంట్కు పలుమార్లు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బంధం తెంచుకున్న కోహ్లిఈ రెస్టారెంట్ అగ్రి పమాద భద్రతకు సంబంధించి నిరభ్యంతర పత్రం (NOC) కూడా పొందలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లి ఇప్పటికే తన బ్రాండ్ పేరును తొలగించాల్సిందిగా ట్రియో హిల్స్కు చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కస్టమర్ల రాక తగ్గిపోయి ఆర్థికంగానూ సదరు రెస్టారెంట్ నష్టాల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. కోహ్లి ప్రస్తుతం ఐపీఎల్-2026తో బిజీగా ఉన్నాడు. ఆర్సీబీ తరఫున ఇప్పటికి ఆడిన ఆరు మ్యాచ్లలో కలిపి 247 పరుగులు సాధించాడు. మరోవైపు.. ఆర్సీబీ ఆరింట నాలుగు విజయాలతో జోరు మీద ఉంది.చదవండి: పీసీబీ నెత్తిన పాలు పోసిన బంగ్లా క్రికెట్ బోర్డు -
కోహ్లి ‘టేస్ట్’పై కామెంట్.. మాజీ ‘గర్ల్ఫ్రెండ్’ స్పందన ఇదే!
విరాట్ కోహ్లి.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టీమిండియా దిగ్గజ బ్యాటర్, రన్మెషీన్గా పేరొందిన ఈ ఢిల్లీ స్టార్.. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికిన కోహ్లి.. వన్డేల్లో మాత్రం ‘రారాజు’గానే కొనసాగుతున్నాడు.ప్రస్తుతం ఐపీఎల్-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)కు ఆడుతూ బిజీగా ఉన్నాడు కోహ్లి. అయితే, గత కొంతకాలంగా ఆట కంటే కూడా వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ ఫొటోకు కోహ్లి లైక్ కొట్టినట్లు వార్తలు రాగా.. కాసేపటికే అతడు ఆ ఫొటోను డిస్లైక్ చేసినట్లు తెలిసింది.ఈ విషయంపై లిజ్లాజ్ స్పందిస్తూ.. కోహ్లి వల్ల తనకు ప్రచారరం లభించినా అతడు మాత్రం ఇబ్బంది పడాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేసింది. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్లూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ చేసినట్లు వార్తలు రాగా.. అల్గారిథమ్ పొరపాటు వల్లే ఇలా జరిగిందని అతడు వివరణ ఇచ్చాడు.అభ్యంతరకర కామెంట్ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇన్స్టాగ్రామ్ పేజ్లో బ్రెజిల్ మోడల్ ఇసబెల్ల లియట్, కోహ్లి భార్య అనుష్క శర్మ, అవనీత్ కౌర్, లిజ్లాజ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ.. ‘‘మహిళల విషయంలో విరాట్ కోహ్లి అభిరుచి ఎప్పుడూ గొప్పగానే ఉంటుందన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు’’ అని అభ్యంతరకర కామెంట్ పెట్టారు.ఈ పోస్టుపై ఇసబెల్ల స్పందించింది. ‘‘పన్నెండు ఏళ్ల కాలం గడిచిపోయింది. ఇప్పటికీ మీరెందుకు ఆ విషయం నుంచి బయటకు రావడం లేదు’’ అంటూ ఇసబెల్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కాగా అనుష్క శర్మ పరిచయం కాకముందు కోహ్లి 2012-2104 మధ్య ఇసబెల్లతో డేటింగ్ చేశాడనే వదంతులు ఉన్నాయి.కాగా 2014లో తన మూవీ ప్రమోషన్లో భాగంగా కోహ్లి- అనుష్క గురించి ప్రశ్న ఎదురు కాగా.. ‘‘నేను ఇక్కడ నా సినిమా గురించి మాట్లాడటానికి మాత్రమే ఉన్నాను. విరాట్ కోహ్లి గురించి నేనింక మాట్లాడటానికి ఏమీ లేదు’’ అని ఇసబెల్ల కౌంటర్ ఇచ్చింది.ఇదిలా ఉంటే.. ఇసబెల్ల పంజాబీ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లోనూ కనిపించింది. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీలో ఆమె తళుక్కుమంది. ఇక 2017లో పెళ్లి బంధంతో ఒక్కటైన కోహ్లి- అనుష్క తమ వైవాహిక జీవితంలో సంతోషంగా ముందుకు సాగుతున్నారు. ఈ జంట ఇటీవలే బృందావన్లోని ప్రేమానంద్జీ మహరాజ్ను దర్శించి ఆశీసులు తీసుకుంది.చదవండి: ‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’ -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఆదివారం కరాచీ స్టేడియం వేదికగా క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో బాబర్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో బాబర్ తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేశాడు.గ్లాడియేటర్స్ బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 52 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 12,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్గా బాబర్ ఆజం రికార్డులకెక్కాడు.బాబర్ కేవలం 338 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్(344) పేరిట ఉండేది. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్లు) ఉండేవాడు. తాజాగా ఇన్నింగ్స్తో వీరిద్దరిని బాబర్ అధిగమించాడు. కాగా బాబర్కు ఇది 12వ సెంచరీ.టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బాబర్ రెండో స్ధానంలో ఉన్నాడు. మొదటి స్ధానంలో క్రిస్ గేల్ (22 సెంచరీలు) కొనసాగుతున్నాడు. ఇక ఈ మ్యాచ్లో బాబర్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక ఇన్నింగ్స్ 50 కంటే ఎక్కువ బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క డాట్ బాల్ ఆడిన మొదటి ఆటగాడిగా బాబర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో బాబర్ ఎదుర్కొన్న 52 బంతుల్లో ఒకే డాట్ బాల్ ఉంది.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీకి బిగ్ ప్రమోషన్! -
ఇన్స్టా పోస్ట్కు కోహ్లీ లైక్.. మోడల్ షాకింగ్ రియాక్షన్
-
‘విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది’
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి పరిస్థితి చూస్తే బాధగా ఉందని జర్మన్ ఇన్ఫ్లూయెన్సర్ లిజ్లాజ్ పేర్కొంది. ఏదేమైనా అతడు తనకు మద్దతుగా నిలిచిన తీరును జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని తెలిపింది. కాగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే లిజ్లాజ్.. సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్ ఆద్వైత్ వైద్యతో ఫొటోషూట్ చేసింది.కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరు?భారత్లోని వివిధ నగరాల్లో ఫొటోలు దిగుతూ వాటిని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. వీటిలో ఓ పోస్టుకు కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించింది. దీంతో లిజ్లాజ్ ( LizLaz) ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. కోహ్లి లైక్ కొట్టిన ఈ అమ్మాయి ఎవరా? అంటూ నెటిజన్లు ఆరాతీశారు.అయితే, కాసేపటికే కోహ్లి నుంచి వచ్చిన లైక్ మాయమైపోయింది. ఈ నేపథ్యంలో కోహ్లిపై మీమ్స్ పేలాయి. గతంలో అవనీత్ కౌర్ అనే ఇన్ఫ్యూయెన్సర్ ఫొటోకు కూడా కోహ్లి లైక్ కొట్టినట్లు కనిపించగా వైరల్ అయింది. అయితే, తన ఇన్స్టా ఫీడ్ క్లియర్ చేస్తుండగా అనుకోకుండా అల్గారిథమ్ వల్లే అలా జరిగిందని కోహ్లి వివరణ ఇచ్చాడు.ఆ విషయాన్ని తాజాగా గుర్తుచేస్తూ కోహ్లి ఇప్పుడు కూడా ఇదే చెబుతాడంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏదేమైనా కోహ్లి పుణ్యమా అని లిజ్లాజ్ మాత్రం ట్రెండ్ అయింది. ఈ నేపథ్యంలో హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.విరాట్ కోహ్లిని చూస్తే బాధగా ఉంది‘‘నిద్రలేస్తూనే నేను ట్రెండ్ అవుతున్నానని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేశా. అసలు కోహ్లి నా ఫొటోను లైక్ చేశాడని నాకే తెలియదు. వార్తల్లో చూసి ఈ విషయం తెలుసుకున్నా. నా గురించి ఎన్నో ఆర్టికల్స్ వచ్చాయి.ఎంతో మంది సందేశాలు పంపించారు. అయితే, కోహ్లి విషయంలో జరిగినదానికి మాత్రం నేను బాధపడుతున్నాను. ఆయన నా ఫొటోను లైక్ కొట్టినందుకు సంతోషమే. కానీ ఇది అంతగా వైరల్ అవుతుందని ఊహించలేదు. ఇది ఆయన ఉద్దేశపూర్వకంగా చేసి ఉండకపోవచ్చు. కానీ ఆయన లైక్ వల్ల నాకు ఎంతో మద్దతు, ప్రచారం లభించాయి’’ అని లిజ్లాజ్ చెప్పుకొచ్చింది.చదవండి: నాకు అప్పులు ఉన్నాయి.. ఆదుకోమన్న క్రిస్ గేల్! -
దిగ్గజాలు విరాట్, రోహిత్ను అధిగమించిన మంధాన
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన టీ20 క్రికెట్లో చారిత్రాత్మక ఘనత సాధించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 13 పరుగులు చేసి ఆమె.. భారత తరఫున (పురుషులు, మహిళలు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా రికార్డుల్లోకెక్కింది. ఈ క్రమంలో పురుషుల విభాగంలో దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను అధిగమించింది. విరాట్ 125 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4188 పరుగులు.. రోహిత్ తన 159 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4231 పరుగులు చేయగా.. మంధాన 161 మ్యాచ్ల టీ20 కెరీర్లో 4244 పరుగులు చేసింది.భారత మహిళల విభాగం ఒక్కటే తీసుకుంటే.. మంధన తర్వాతి స్థానాల్లో హర్మన్ప్రీత్ కౌర్ (191 మ్యాచ్ల్లో 3854 పరుగులు), జెమీమా రోడ్రిగ్స్ (119 మ్యాచ్ల్లో 2587 పరుగులు), షఫాలీ వర్మ (99 మ్యాచ్ల్లో 2553 పరుగులు) ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. మహిళల విభాగంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ సూజీ బేట్స్ (181 మ్యాచ్ల్లో 4717 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా కొనసాగుతుండగా.. మంధాన రెండో స్థానంలో ఉంది. పురుషుల విషయానికొస్తే.. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ (145 మ్యాచ్ల్లో 4596 పరుగులు) టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన తొలి టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా... నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్ కాగా... జెమీమా రోడ్రిగ్స్ (29 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్), షఫాలీ వర్మ (20 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్) తలా కొన్ని పరుగులు చేశారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన (13), రిచా ఘోష్ (5), కాశ్వి గౌతమ్ (10) విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఖాకా 3 వికెట్లు పడగొట్టగా... టుమీ రెండు వికెట్లు తీసింది.అనంతరం బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ లారా వోల్వార్ట్డ్ (51), అన్నెరీ డెర్క్సన్ (44 నాటౌట్) సౌతాఫ్రికాను గెలిపించారు. సూన్ లస్ 13, తజ్మిన్ బ్రిట్స్ 10, అన్నెకే బాష్ 8, క్లో ట్రయాన్ 18 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 2, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలో వికెట్ తీశారు. రెండో టీ20 ఏప్రిల్ 19న ఇదే డర్బన్ వేదికగా జరుగనుంది. -
అచ్చిరాని జెర్సీ.. గెలుపు కంటే ఓటములే ఎక్కువ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2011 సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా ఒక మ్యాచ్లో గ్రీన్జెర్సీలో బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. 'గో గ్రీన్' కార్యక్రమంలో భాగంగా ఆర్సీబీ దీనిని పాటిస్తూ వస్తోంది. పచ్చదనాన్ని పరిరక్షించాలనే సందేశాన్ని ఇవ్వడానికే తమ రెగ్యులర్ జెర్సీని లేత ఆకుపచ్చ రంగులోకి మార్చుకుంది. ఈ సంప్రదాయాన్ని ఆర్సీబీ 2026 సీజన్లోనూ కంటిన్యూ చేయనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరగనున్న పోరులో ఆర్సీబీ ఆటగాళ్లు గ్రీన్ జెర్సీలతో దర్శనమివ్వనున్నారు. ఈ సీజన్లో మంచి జోష్ మీదున్న ఆర్సీబీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో4 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.అచ్చిరాని జెర్సీ..అయితే ఆర్సీబీకి ఈ గ్రీన్ జెర్సీ మ్యాచ్లు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పటివరకు 15మ్యాచ్ల్లో ఆర్సీబీ గ్రీన్జెర్సీతో బరిలోకి దిగింది. కానీ ఇందులో ఐదు మ్యాచ్ల్లోనే విజయం సాధించి.. మరో 9 మ్యాచ్ల్లో ఓటమి పాలయ్యింది. మరొక మ్యాచ్ మాత్రం రద్దయ్యింది. 2015లో ఢిల్లీ క్యాపిటల్స్తో గ్రీన్ డే మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.2011 నుంచి 'గ్రీన్ జెర్సీ' మ్యాచ్లను ఆడడం ప్రారంభించిన ఆర్సీబీకి పెద్దగా కలిసిరాలేదు. గత సీజన్లో రాజస్తాన్తో జరిగిన మ్యాచ్ వరకు 15 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచ్ల్లో ఆర్సీబీ గెలిచినప్పటికీ విరాట్ కోహ్లి రెండుసార్లు డకౌట్ కాగా, ఒక మ్యాచ్లో సెంచరీ, మరో మ్యాచ్లో కీలకమైన 27 పరుగులు చేశాడు.గ్రీన్జెర్సీతో ఆర్సీబీ విజయాలు..ఐపీఎల్ 2011లో కొచ్చి టస్కర్స్తో మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి 125/9 స్కోరుకే పరిమితం కాగా.. ఆర్సీబీ 13.1 ఓవర్లలోనే 128/1 స్కోరు చేసి గెలుపొందింది. విరాట్ (27*) నాటౌట్గా నిలిచాడు.2016 సీజన్లో గుజరాత్ లయన్స్పై 144 పరుగుల భారీ తేడాతో ఆర్ సీబీ గెలిచింది. ఈ మ్యాచ్లోనే విరాట్ కోహ్లి (109) సెంచరీ బాదాడు. ఏబీ డివిలియర్స్ (129*) కూడా శతకం చేయడంతో ఆర్సీబీ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 248 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం గుజరాత్ లయన్స్ 104 పరుగులకే ఆలౌటైంది.2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 67 పరుగుల తేడాతో విజయం సాధించి మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కోహ్లి గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. అయితే డుప్లెసిస్ (73*), రజత్ పటీదార్ (48) రాణించడంతో 192 పరుగుల చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ 125 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది.2023 సీజన్లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్లోనూ కోహ్లి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. అయితే మ్యాక్స్వెల్ (77*), డుప్లెసిస్ (62) విజృంభణతో రాజస్తాన్ ముందు 190 పరుగుల టార్గెట్ను ఉంచింది. అయితే ఛేదనలో రాజస్తాన్ పోరాడినప్పటికీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులకు పరిమితమైంది.గత సీజన్లోనూ రాజస్తాన్ రాయల్స్తోనే గ్రీన్ జెర్సీలో ఆర్సీబీతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విరాట్ కోహ్లి (62 నాటౌట్) అజేయ అర్థసెంచరీ సాధించి ఆర్సీబీని గెలిపించాడు.𝗜𝘁’𝘀 𝘁𝗵𝗮𝘁 𝘁𝗶𝗺𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘆𝗲𝗮𝗿 𝗮𝗴𝗮𝗶𝗻 - 𝗹𝗲𝘁’𝘀 𝗚𝗼 𝗚𝗿𝗲𝗲𝗻! 😍💚More than a tradition. A purpose we wear with pride. 🙌Tomorrow, our boys take the field donning the Green Jersey against Delhi, to raise awareness by pledging to protect the… pic.twitter.com/UzvgUdXllf— Royal Challengers Bengaluru (@RCBTweets) April 17, 2026 చదవండి: వైభవ్ సేఫ్.. రోమి భిందర్కు బీసీసీఐ షాక్! -
అతడి కోసం ఢిల్లీ విరాట్ కోహ్లిని వద్దనుకుంది: సెహ్వాగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంత వరకు టైటిల్ గెలవని జట్లలో ఢిల్లీ క్యాపిటల్స్ ఒకటి. క్యాష్ రిచ్ లీగ్ ఆరంభ సీజన్ (2008)లో ఢిల్లీ డేర్డెవిల్స్తో పేరుతో ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. 2018లో ఢిల్లీ క్యాపిటల్స్గా పేరు మార్చుకుంది.తప్పటడుగు వేసి ఉండకపోతే..అయినా సరే ఆ జట్టు రాత మాత్రం మారడం లేదు. ఈ నేపథ్యంలో భారత విధ్వంసకర ఓపెనర్, ఢిల్లీ మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఢిల్లీ ఫ్రాంఛైజీ గనుక ఆరోజు తప్పటడుగు వేసి ఉండకపోతే.. ఆ జట్టుకు మంచి క్రేజ్ అయినా దక్కి ఉండేదని నెటిజన్లు అంటున్నారు. ఇంతకీ వీరూ భాయ్ ఏం చెప్పాడంటే.. టాపార్డర్ కిక్కిరిసిపోయి ఉండేది‘‘ఐపీఎల్ ఆరంభ సీజన్ అంటే.. 2008లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టులో శిఖర్ ధావన్, తిలక్రత్నె దిల్షాన్ కూడా ఉన్నట్లు నాకు గుర్తు. వీరిద్దరు ఓపెనింగ్ బ్యాటర్లే. అయితే, నేను, గౌతమ్ ఇన్నింగ్స్ ఆరంభించేవాళ్లం.కాబట్టి ధావన్, దిల్షాన్ ఆలస్యంగా వచ్చేవాళ్లు. మనోజ్ తివారి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అప్పుడ మా టాపార్డర్.. ఇలా కిక్కిరిసిపోయి ఉండేది. కాబట్టి కొత్తగా బ్యాటర్ను తీసుకునే అవకాశం లేకుండా పోయింది.కోహ్లికి బదులు జట్టులోకి అతడుఆ సమయంలో విరాట్ కోహ్లి వన్డౌన్ లేదంటే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కాబట్టి అతడిని జట్టులోకి తీసుకోలేకపోయారు. అప్పుడు మాకు బౌలర్ అవసరం ఉంది. అందుకే కోహ్లికి బదులు ఢిల్లీ ప్రదీప్ సాంగ్వాన్ను జట్టులోకి తీసుకుంది’’ అని చాంపియన్స్ వాలీ కామెంట్రీలో జియోస్టార్ ఎక్స్పర్ట్ వీరేందర్ సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.కాగా ఆరోజు అలా ఢిల్లీ కోహ్లిని కెరీర్ తొలినాళ్లలో వదిలేసుకోగా.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సొంతం చేసుకుంది. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజంగా ఎదిగినా.. కోహ్లి మాత్రం ఇప్పటికీ ఆర్సీబీతోనే కొనసాగుతున్నాడు. కెప్టెన్గా ట్రోఫీ గెలవలేకపోయినా.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ తరఫున కోహ్లి తొలిసారి కప్పును ముద్దాడాడు. మరోవైపు.. ఢిల్లీ టైటిల్ వేట ఇంకా కొనసాగుతూనే ఉంది.చదవండి: T20 WC 2026: మ్యాచ్ ఫిక్సింగ్!.. రంగంలోకి ఐసీసీ -
కోహ్లీ లైక్ కొట్టిన చిన్నది! ఈమె ఎవరంటే.. (ఫొటోలు)
-
విరాట్ కోహ్లి కాదు.. వారిద్దరి వల్లే గెలిచాము: ఆర్సీబీ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ జోరును కొనసాగిస్తోంది. బుధవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్ధానానికి చేరుకుంది.ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆల్రౌండ్షో తో అదరగొట్టింది. తొలుత బౌలింగ్లో లక్నోను 146 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ.. అనంతరం ఆ స్వల్ప లక్ష్యాన్ని కేవలం 15.1 ఓవర్లలోనే ఊదిపడేసింది. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ స్పందించాడు. లక్నోను నామమాత్రపు స్కోర్కే పరిమితం చేసిన తమ బౌలర్లపై పాటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు."ఈ మ్యాచ్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం మాకు కలిసొచ్చింది. తొలుత ఫాస్ట్ బౌలర్లు పిచ్ కండీషన్స్ను ఉపయోగించుకుని బౌలింగ్ చేసిన తీరు అమోఘం. ఇక కృనాల్ ఒక ధైర్యవంతుడైన బౌలర్. అతడు బంతికి బంతికి వైవిధ్యం ప్రదర్శిస్తుంటాడు. అతడు తర్వాత ఏ బంతి వేస్తాడో కెప్టెన్గా నేను కూడా అంచనా వేయలేకపోతున్నా. అతడితో పాటు సుయాశ్ శర్మ కూడా స్టంప్ టూ స్టంప్ బౌలింగ్ చేసి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా టీ20 లీగ్లలో భువనేశ్వర్, హాజిల్వుడ్ వంటి స్పెషలిస్ట్ బౌలర్లు జట్టులో ఉంటే కెప్టెన్ పని మరింత సులువు అవుతోంది. వారి అనుభవం జట్టులోని ఇతర బౌలర్లకు కూడా ఎంతో మేలు చేస్తోంది. ఐపీఎల్ ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫీల్డింగ్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. ఇప్పుడు అదే స్పూర్తిని ఫిల్ సాల్ట్ కొనసాగిస్తున్నాడు. సాధారణంగానే అతడు ఒంటి చేత్తో గాల్లోకి ఎగిరి అద్భుతమైన క్యాచ్లను అందుకుంటాడు. ఈ రోజ్ కూడా సంచలన క్యాచ్ అందుకున్నాడు. మేము ప్రస్తుతానికి టైటిల్ గురించి ఆలోచించడం లేదన్నాడు. ఇదొక సుదీర్ఘ టోర్నీ. ప్రస్తుతం మా దృష్టి అంతా ఒక్కో మ్యాచ్పైనే ఉందని" పాటిదార్ పేర్కొన్నాడు. కాగా 49 పరుగులతో సత్తాచాటిన కోహ్లి గురుంచి పాటిదార్ మాట్లడకపోవడం గమనార్హం.చదవండి: IPL 2026: సీఎస్కేకు ఘోర అవమానం.. ఆర్సీబీపై బీసీసీఐకి ఫిర్యాదు -
విరాట్ ఖాతాలో మరో భారీ రికార్డు
దిగ్గజ బ్యాటర్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి మరో భారీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఓపెనర్గా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 15) లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో విరాట్ ఓ సిక్సర్ కొట్టి ఐపీఎల్లో ఓపెనర్గా తన సిక్సర్ల సంఖ్యను 185కు పెంచుకున్నాడు. విరాట్ ఈ రికార్డు సాధించే క్రమంలో కేఎల్ రాహుల్ను అధిగమించాడు. రాహుల్ ఐపీఎల్లో ఓపెనర్గా 184 సిక్సర్లు బాదాడు. రాహుల్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (148) ఉన్నాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత టాప్-5 ఓపెనర్లువిరాట్ కోహ్లి- 185కేఎల్ రాహుల్- 184రోహిత్ శర్మ- 148శిఖర్ ధవన్- 143శుభ్మన్ గిల్- 118ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఓపెనర్ (ఓవరాల్గా) రికార్డు క్రిస్ గేల్ (326) పేరిట ఉంది. గేల్ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ (210), విరాట్ కోహ్లి (185), కేఎల్ రాహుల్ (184) ఉన్నారు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 ఓపెనర్లుక్రిస్ గేల్- 326డేవిడ్ వార్నర్- 210విరాట్ కోహ్లి- 185కేఎల్ రాహుల్- 184ఫాఫ్ డుప్లెసిస్- 159కాగా, నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కోహ్లి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్లో అతను 34 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, సిక్సర్ సాయంతో 49 పరుగులు చేశాడు. విరాట్ బాదిన సిక్సర్ దిగ్వేశ్ రాఠీ బౌలింగ్లో వచ్చింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీశారు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. విరాట్ (49), కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. -
చారిత్రక మైలురాయిని తాకిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్లో చారిత్రక మైలురాయిని తాకాడు. ఈ ఫార్మాట్లో 100 అర్ద సెంచరీల (341 ఇన్నింగ్స్ల్లో) అత్యంత అరుదైన ఫీట్ను సాధించాడు. పొట్టి క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఘనత సాధించారు. వీరిలో డేవిడ్ వార్నర్ (117) అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి (107), జోస్ బట్లర్ (100) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు. తాజాగా బాబర్ వీరి సరసన చేరాడు.పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్తో నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో బాబర్ 100 హాఫ్ సెంచరీల ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో అతను 51 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో అజేయమైన 71 పరుగులు చేసి తన జట్టు (పెషావర్ జల్మీ) విజయంలోనూ ప్రధానపాత్ర పోషించాడు. పాక్ తరఫున సెంచరీ హాఫ్ సెంచరీలు చేసిన మొదటి ప్లేయర్గా బాబర్ చరిత్రకెక్కాడు.తన టీ20 కెరీర్లో ఇప్పటివరకు 341 ఇన్నింగ్స్లు ఆడిన బాబర్ 100 హాఫ్ సెంచరీలతో పాటు 11 సెంచరీలు కూడా చేశాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో వార్నర్ (126), విరాట్ (116) మాత్రమే బాబర్ (111) కంటే ముందున్నారు.బాబర్ టీ20 గణాంకాలు- 341 ఇన్నింగ్స్ల్లో 12,206 పరుగులు - సగటు – 42.38 - స్ట్రైక్ రేట్ – 128.41 - 100 ఫిఫ్టీలు, 11 సెంచరీలుఇటీవలే బాబర్ పీఎస్ఎల్లోనూ ఓ చారిత్రక ఘనత సాధించాడు. ఈ లీగ్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. పీఎస్ఎల్లో 106 మ్యాచ్లు ఆడిన బాబర్ 127.86 స్ట్రయిక్రేట్తో 45.98 సగటున 4093 పరుగులు చేశాడు. పీఎస్ఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్ తర్వాతి స్థానాల్లో ఫకర్ జమాన్ (3039), మహ్మద్ రిజ్వాన్ (2853), రిలీ రొస్సో (2392), షోయబ్ మాలిక్ (2350) ఉన్నారు. -
గాయంపై అప్డేట్ ఇచ్చిన కోహ్లి
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 15) జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ లక్నో సూపర్ జెయింట్స్ను 5 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నోను 146 పరుగులకే (20 ఓవర్లు) కుప్పకూల్చారు. రసిక్ సలామ్ దార్ 4, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2, హాజిల్వుడ్ ఓ వికెట్ తీశారు. హాజిల్వుడ్ తీసింది ఓ వికెటే అయినా అత్యంత పొదుపుగా (4-0-20-1) బౌలింగ్ చేసి ఆర్సీబీ గెలుపులో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. లక్నో ఇన్నింగ్స్లో మిచెల్ మార్ష్ (40), ముకుల్ చౌదరి (39), ఆయుశ్ బదోని (38), మార్క్రమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. ఈ మ్యాచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన కోహ్లి 49 పరుగులతో రాణించాడు. సాల్ట్ (7), పడిక్కల్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (27), వికెట్కీపర్ జితేశ్ శర్మ (23) మెరుపు ఇన్నింగ్స్లు ఆడి ఆర్సీబీ గెలుపును సునాయాసం చేశారు. టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14) మ్యాచ్ను లాంఛనంగా ముగించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3, ఆవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు.మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి తన గాయం (knee injury)పై అప్డేట్ ఇచ్చాడు. మోకాలి నొప్పితో ఇంకా ఇబ్బందిగానే ఉందని అన్నాడు. అయితే గత మ్యాచ్తో పోలిస్తే కాస్త బెటర్ అని తెలిపాడు. గేమ్ ఫినిష్ చేయాలనుకున్నా, పిచ్ స్లో కావడంతో కాస్త కష్టమైందని వివరించాడు. -
ఆర్సీబీ ఆడుతూ పాడుతూ...
బెంగళూరు: సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ‘హ్యాట్రిక్’ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన ఏకపక్ష పోరులో గెలిచి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ముకుల్ చౌదరి (28 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్లు), ఆయుశ్ బదోని (24 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ (4/24) లక్నోను పడగొట్టగా... భువనేశ్వర్కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బెంగళూరు 15.1 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసి విజయాన్నందుకుంది. విరాట్ కోహ్లి (34 బంతుల్లో 49; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్స్కోరర్గా నిలవగా...రజత్ పాటీదార్ (13 బంతుల్లో 27; 1 ఫోర్, 3 సిక్స్లు), జితేశ్ శర్మ (9 బంతుల్లో 23; 2 ఫోర్లు, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో మరో 29 బంతులు ఉండగానే ఆర్సీబీ గెలుపు ఖాయమైంది. మూడు కీలక వికెట్లు తీసిన రసిఖ్ సలామ్కు కాకుండా ఒక వికెట్ పడగొట్టిన హాజల్వుడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు ఇవ్వడం గమనార్హం. సమష్టి వైఫల్యం... చిన్నస్వామి స్టేడియంలో లక్నో ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మొత్తం పవర్ప్లేలో ఆ జట్టు 1 ఫోర్, 2 సిక్స్లతో 35 పరుగులే చేయగలిగింది. మార్క్రమ్ (12) విఫలం కాగా, మార్ష్ మాత్రం ఫర్వాలేదనిపించాడు. పూరన్ (1) తన వైఫల్యాన్ని కొనసాగించగా, కృనాల్ తన వరుస ఓవర్లలో మార్ష్ , సమద్ (0)లను వెనక్కి పంపించాడు. ఇలాంటి స్థితిలో బదోని కొన్ని చక్కటి షాట్లతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. మరోవైపు నుంచి ముకుల్ కూడా అతనికి అండగా నిలిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా జార్జ్ లిండే (7)ను బరిలోకి దించినా లాభం లేకపోయింది. ఆర్సీబీ పదునైన బౌలింగ్ ముందు మిగతా బ్యాటర్లూ తేలిపోయారు. ఆఖరి 4 ఓవర్లలో లక్నో జట్టు 5 వికెట్లు చేజార్చుకొని 29 పరుగులే చేసింది. కోహ్లి తొలిసారి... ఛేదనలో సాల్ట్ (7) తొందరగానే అవుటైనా... కోహ్లి జోరుగా మొదలు పెట్టాడు. గత మ్యాచ్లో మడమ గాయంతో ఫీల్డింగ్ చేయని కోహ్లి ఈ మ్యాచ్లో కూడా నేరుగా బ్యాటింగ్కే వచ్చాడు. ఐపీఎల్లో అతను మొదటిసారి ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగాడు. ప్రిన్స్ వేసిన నాలుగో ఓవర్లో అతను 4 ఫోర్లు బాదాడు. కోహ్లి తాను ఆడిన తొలి 14 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్తో 34 పరుగులు సాధించడం విశేషం! మరో ఎండ్లో పడిక్కల్ (10) విఫలమైనా... పాటీదార్, జితేశ్ దూకుడుతో ఆర్సీబీ వేగంగా లక్ష్యం దిశగా దూసుకుపోయింది. షమీ ఓవర్లో పాటీదార్ రెండు వరుస సిక్స్లు కొట్టగా... రాఠీ ఓవర్లో జితేశ్ వరుసగా 6, 4, 6, 4 బాదాడు. వీరిద్దరు ఒకే ఓవర్లో అవుటైనా...మిగిలిన 25 పరుగులను బెంగళూరు తర్వాతి 15 బంతుల్లో సాధించి మ్యాచ్ ముగించింది. స్కోరు వివరాలు లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మిచెల్ మార్ష్ (బి) కృనాల్ పాండ్యా 40; మార్క్రమ్ (సి) పడిక్కల్ (బి) సలామ్ 12; పంత్ (సి) సాల్ట్ (బి) భువనేశ్వర్ 1; నికోలస్ పూరన్ (బి) హాజల్వుడ్ 1; ఆయుశ్ బదోని (సి) జితేశ్ (బి) సలామ్ 38; సమద్ (సి) పాటీదార్ (బి) కృనాల్ పాండ్యా 0; ముకుల్ (బి) సలామ్ 39; లిండే (సి) డేవిడ్ (బి) భువనేశ్వర్ 7; షమీ (బి) భువనేశ్వర్ 0; అవేశ్ (బి) సలామ్ 1; దిగ్వేశ్ రాఠీ (నాటౌట్) 0; ఎక్స్ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఆలౌట్) 146. వికెట్ల పతనం: 1–32, 2–35, 3–71, 4–83, 5–118, 6–124, 7–137, 8–137, 9–145, 10–146. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–27–3, హాజల్వుడ్ 4–0–20–1, రసిఖ్ సలామ్ 4–0–24–4, కృనాల్ పాండ్యా 4–0–38–2, సుయాశ్ శర్మ 4–0–34–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: సాల్ట్ (బి) ప్రిన్స్ 7; కోహ్లి (సి) పూరన్ (బి) అవేశ్ 49; పడిక్కల్ (సి) (సబ్) హిమ్మత్ (బి) అవేశ్ 10; రజత్ పాటీదార్ (సి) రాఠీ (బి) ప్రిన్స్ 27; జితేశ్ (సి) ముకుల్ (బి) ప్రిన్స్ 23; డేవిడ్ (నాటౌట్) 14; షెఫర్డ్ (నాటౌట్) 14; ఎక్స్ట్రాలు 5; మొత్తం (15.1 ఓవర్లలో 5 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1–9, 2–66, 3–86, 4–121, 5–122. బౌలింగ్: షమీ 3–0–30–0, ప్రిన్స్ యాదవ్ 3–0–32–3, దిగ్వేశ్ రాఠీ 4–0–51–0, అవేశ్ ఖాన్ 4–0–23–2, లిండే 1.1–0–9–0.పంత్కు గాయం...హాజల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతి బలంగా తగలడంతో లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ (1) ఎడమ మోచేతికి గాయమైంది. మూడు బంతులు ఆడిన అనంతరం అతను రిటైర్డ్హర్ట్గా పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత 16వ ఓవర్లో తిరిగి బ్యాటింగ్కు వచ్చినా మరో మూడు బంతులే ఆడి అతను అవుటయ్యాడు. పంత్ గాయం తీవ్రత ఇంకా తెలియాల్సి ఉంది. అతను కీపింగ్ కూడా చేయకపోవడంతో ముకుల్ చౌదరి ఆ బాధ్యత తీసుకున్నాడు. ఐపీఎల్లో నేడుముంబై X పంజాబ్ వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
విరాట్ కోహ్లి అరుదైన ఫీట్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరుదైన ఫీట్ సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రావడం కోహ్లికి ఇదే తొలిసారి. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి తన కెరీర్లో అన్ని మ్యాచ్ల్లోనూ ఓపెనర్గానే బరిలోకి దిగేవాడు. ఐపీఎల్ 2026 సీజన్లోనూ ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ కోహ్లి ప్రధాన జట్టులో సభ్యుడిగానే ఆడాడు. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కోహ్లి చీలమండ గాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇన్నింగ్స్ సమయంలో కోహ్లి ఫీల్ఢింగ్కు దూరంగా ఉన్నాడు. లక్నోతో మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సమయంలోనూ కోహ్లీ కాలికి బ్యాండేజీతో కనిపించడంతో మ్యాచ్ ఆడేది అనుమానంగానే కనిపించింది. అయితే ఐపీఎల్లో ఇంపాక్ట్ రూల్ బ్యాటర్లకు ఉపయోగకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే కోహ్లి లక్నోతో మ్యాచ్లో తొలుత తుది జట్టులో లేకపోయేసరికి అభిమానులు కంగారు పడినప్పటికీ కెప్టెన్ పటిదార్ మ్యాచ్లో కోహ్లి ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడని పేర్కొన్నాడు. తొలిసారి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన కోహ్లి విలువైన ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. 34 బంతుల్లో 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కోహ్లి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. Virat in a chase. Period. 🙇♂️ pic.twitter.com/1uSeL3PaF8— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2026 -
కోహ్లి, రసిక్ సలామ్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని నమోదు చేసుకుంది. బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో విధించిన 147 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 15.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (49) టాప్ స్కోరర్గా నిలవగా, పటిదార్ (27), జితేశ్ శర్మ (23) రాణించారు. మధ్యలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయినప్పటికీ చివర్లో టిమ్ డేవిడ్ (14 నాటౌట్), షెపర్డ్ (14 నాటౌట్)_ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్జెయింట్స్ 20 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (40) టాప్ స్కోరర్గా నిలవగా.. ముకుల్ చౌదరీ (39), ఆయుశ్ బదోని (38) పర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లలో రషీక్ సలామ్ 4 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్ 3, కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. కాగా ఆర్సీబీ ఆడిన ఐదు మ్యాచ్ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మరోవైపు ఆడిన 5 మ్యాచ్ల్లో రెండు విజయాలు, మూడు ఓటములతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.As convincing as it gets 🙌A comfortable 5️⃣-wicket win and @RCBTweets remain unbeaten at home ✌️Scorecard ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/pFkug0okkt— IndianPremierLeague (@IPL) April 15, 2026 -
బాంబు పేల్చిన టీమిండియా మాజీ క్రికెటర్!
టీమిండియా మాజీ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్ మునాఫ్ పటేల్ భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో పెద్ద బాంబు పేల్చాడు. కోచ్గా గంభీర్ను తొలగిస్తే టీమిండియాలో విపత్తు తప్పదంటూ బీసీసీఐని హెచ్చరించాడు. 2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్కు టీమిండియా హెడ్కోచ్గా బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే గంభీర్ సారథ్యంలో భారత జట్టు మిశ్రమ ఫలితాలను అందుకుంది. చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్లు భారత్ గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే వచ్చాయి. అయితే ఇదే సమయంలో జట్టులో సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవడం వెనుక గంభీర్ పాత్ర ఉందన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. వన్డే, టీ20 ఫార్మాట్లో గంభీర్ కోచ్గా పర్వాలేదనిపించినప్పటికీ టెస్టు ఫార్మాట్లో దారుణంగా విఫలమవ్వడంతో అతన్ని కోచ్గా తప్పించాలనే డిమాండ్లు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మునాఫ్ పటేల్ గంభీర్కు అండగా నిలిచాడు. మునాఫ్ పటేల్ మాట్లాడుతూ.. ‘గంభీర్ వంటి నిఖార్సైన వ్యక్తిని కోచ్ పదవి నుంచి తొలగిస్తే, భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను మేనేజ్ చేయడం ఎవరికైనా చాలా కష్టమవుతుంది. గంభీర్ అత్యంత నిజాయితీ గల వ్యక్తి. ముక్కుసూటిగా మాట్లాడే అతని తత్వాన్ని అందరూ ఇష్టపడరు. కానీ జట్టు ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలనైనా తీసుకోవడానికి వెనుకాడరు. ముఖ్యంగా జట్టులో క్రమశిక్షణ తప్పినా లేదా ఆటగాళ్లు సరిగ్గా రాణించకపోయినా, వారిని జట్టు నుంచి తప్పించే ధైర్యం గంభీరకు ఉంది. విరాట్ కోహ్లి లేదా రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లకు 'నో' చెప్పడం అంత తేలికైన విషయం కాదు. తన కఠిన నిర్ణయాలతో శత్రువులను కూడా పెంచుకున్నాడు. అయితే కోచ్గా తన పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాడని మాత్రం బలంగా చెప్పగలను.’ అని మునాఫ్ వెల్లడించాడు. ఎన్సీఏ క్రికెట్ అకాడమీలో సౌకర్యాల్లో కొరత స్పష్టంగా కనిపిస్తోందని మునాఫ్ పేర్కొన్నాడు. ఆటగాళ్ల ఫిట్నెస్, ప్రాక్టీస్, రీహాబిలిటేషన్ సెంటర్ సహా ఇతర కార్యక్రమాలకు వినియోగించే ఎన్సీఏ అకాడమీలో ప్రస్తుతం బలమైన వ్యవస్థ కనిపించడం లేదని తెలిపాడు. వెంటనే ఎన్సీఏ అకాడమీని పటిష్టపరిచేందుకు బీసీసీఐ చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఫిజియోథెరపిస్టులు, కోచ్లు, సరైన శిక్షణ వంటి ప్రాథమిక సౌకర్యాలను మరింత మెరుగుపరచాలని మునాఫ్ వెల్లడించాడు. కాగా దేశ వ్యాప్తంగా క్రికెట్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో బీసీసీఐ 2000 సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఎన్సీఏ అకాడమీని స్థాపించింది. ప్రస్తుతం మునాఫ్ పటేల్ ఐపీఎల్ 2026 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించి, నాలుగు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.చదవండి: సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్! -
కోహ్లికి గాయం.. లక్నోతో ఆడేది అనుమానమే!
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లాడిన ఆర్సీబీ మూడు విజయాలతో పట్టికలోమూడో స్థానంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం లక్నో సూపర్జెయింట్స్తో ఆర్సీబీ తలపడనుంది. ఈ మ్యాచ్లో కోహ్లీ ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. అయితే సోమవారం ట్రైనింగ్ సెషన్లో కోహ్లీ కాలికి బ్యాండేజ్తో కనిపించాడు. ప్రాక్టీస్ అనంరతం కోహ్లీ మాజీ క్రికెటర్ కేన్ విలియమ్సన్, కెప్టెన్ రిషబ్ పంత్లను నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియోను లక్నో ఫ్రాంచైజీ తమ ఎక్స్లో షేర్ చేసుకుంది. అయితే వీడియోలో కోహ్లీ కుంటుతూ నడుస్తున్నట్లుగా కనిపించింది. దీంతో చీలమండ గాయం నుంచి కోహ్లి ఇంకా కోలుకోలేదని క్లియర్గా తెలుస్తోంది. అందుకే లక్నోతో మ్యాచ్లో కోహ్లి ఆడుతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. ఒకవేళ ఆడినా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే అవకాశముంది. ఇక ఈ సీజన్లో కోహ్లి నాలుగు మ్యాచ్లు కలిపి 179 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్థసెంచరీలున్నాయి. ఇక ఆదివారం ముంబై ఇండియన్స్తో మ్యాచ్లోనూ కోహ్లీ కేవలం బ్యాటింగ్కే పరిమితమయ్యాడు.Yaari dosti 🥹🤌 pic.twitter.com/lgdcrCTITI— Lucknow Super Giants (@LucknowIPL) April 14, 2026చదవండి: ‘రుతురాజ్ నీకో దండం.. ఇకనైనా ఆయుశ్కు చాన్స్ ఇవ్వు’ -
విరాట్ కోహ్లికి ఏమైంది..? టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించినప్పటికి.. ఆర్సీబీ శిబిరంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయంపై ఆందోళన నెలకొంది. బ్యాటింగ్లో హాఫ్ సెంచరీతో సత్తాచాటిన కోహ్లి, సెకెండ్ ఇన్నింగ్స్లో మాత్రం ఫీల్డింగ్ రాలేదు. కోహ్లికి ఏమైంది?అతడి స్ధానంలో ఇంగ్లండ్ యువ ఆటగాడు జాకబ్ బెతల్ సబ్స్ట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి వచ్చాడు. కోహ్లి చీలమండ గాయం కారణంగా ఫీల్డింగ్కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మెడికల్ టీమ్ డ్రెస్సింగ్ రూమ్లోనే కోహ్లికి చికిత్స అందించింది. అయితే విరాట్ గాయంపై మ్యాచ్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ అప్డేట్ ఇచ్చాడు."ప్రస్తుతానికి కచ్చితంగా విరాట్కు ఏమైందన్నది తెలియదు. కానీ అతడు ఇప్పుడు బాగానే ఉన్నాడు" అని పాటిదార్ పేర్కొన్నాడు. ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 15న లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ నాటికి కోహ్లి కోలుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడిన విరాట్.. 179 పరుగులు చేశాడు.చదవండి: IPL 2026: ఐపీఎల్ నుంచి రోహిత్ శర్మ అవుట్? -
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా
ఐపీఎల్-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో కోహ్లి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫిల్ సాల్ట్తో ఆర్సీబీ ఇన్నింగ్స్ను ప్రారంభించిన విరాట్.. ముంబై బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు.తొలుత దూకుడుగా ఆడిన కోహ్లి, మిడిల్ ఇన్నింగ్స్లో కాస్త నెమ్మదించాడు. ఫిల్ సాల్ట్తో కలిసి తొలి వికెట్ ఏకంగా 124 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నమోదు చేశాడు. మొత్తంగా 38 బంతులు ఎదుర్కొన్న విరాట్.. 5 ఫోర్లు, ఒక సిక్సర్తో 50 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో కింగ్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి సాధించిన రికార్డులు ఇవేఐపీఎల్లో ముంబై ఇండియన్స్పై 1000 పరుగులు పూర్తి చేసిన మొట్టమొదటి బ్యాటర్గా విరాట్ రికార్డులకెక్కాడు. కోహ్లి ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్, సీఎస్కేపై 1000 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు.అదేవిధంగా టీ20ల్లో అత్యధిక సెంచరీ (100+) భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా కోహ్లి వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్(29), పాకిస్తాన్ స్టార్ బాబర్ ఆజం(28)లను కోహ్లి అధిగమించాడు. -
అరుదైన మైలురాయిని తాకిన గిల్.. కోహ్లి కంటే వేగంగా..!
ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్తో ఇవాళ (ఏప్రిల్ 12) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో గిల్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయిని అధిగమించాడు. తద్వారా అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.గిల్ ఈ మైలురాయిని 118వ ఇన్నింగ్స్లో చేరుకోగా.. రాహుల్ 105, క్రిస్ గేల్ 112, డేవిడ్ వార్నర్ 114, జోస్ట్ బట్లర్ 116 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించారు. ఈ జాబితా టాప్-5లో గిల్ రెండో భారత ప్లేయర్గా నిలిచాడు. దిగ్గజం విరాట్ కోహ్లికి ఈ మైలురాయిని తాకేందుకు 128 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. గిల్ అతని కంటే వేగంగా ఈ ఘనత సాధించాడు.బంతుల ప్రకారం చూస్తే.. అత్యంత వేగంగా 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో గిల్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్లో ఉండగా.. దిగ్గజం విరాట్ కోహ్లి టాప్-5లో కూడా లేడు.అత్యంత వేగంగా (బంతులు) 4000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 భారత ఆటగాళ్లు..సూర్యకుమార్ యాదవ్- 2714శుభ్మన్ గిల్- 2875సురేష్ రైనా- 2886 ఎంఎస్ ధోని- 2887 సంజూ శాంసన్- 2915మ్యాచ్ విషయానికొస్తే.. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ద్ కృష్ణ (4-0-28-4), అశోక్ కుమార్ (4-0-32-2), సిరాజ్ (4-0-19-1) అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోను కట్టడి చేశారు. లక్నో ఇన్నింగ్స్లో 30 పరుగులు చేసిన మార్క్రమ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 16 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసి, లక్ష్యం దిశగా సాగుతోంది. -
1089 రోజుల రికార్డు పునరావృతం చేసిన బిష్ణోయ్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 10) జరిగిన ఆసక్తికర సమరంలో ఆర్సీబీపై రాజస్థాన్ రాయల్స్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ తొలుత తడబడినా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రజత్ పాటిదార్ బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (63) ఆర్సీబీ పతనాన్ని అడ్డుకున్నాడు అతనికి రొమారియో షెపర్డ్ (22), వెంకటేశ్ అయ్యర్ (29 నాటౌట్) సహకరించారు. మిగతా బ్యాటర్లలో విరాట్ కోహ్లి (32) పర్వాలేదనిపించగా.. సాల్ట్ (0), పడిక్కల్ (14), కృనాల్ (1), జితేశ్ (5), టిమ్ డేవిడ్ (13) నిరాశపరిచారు. రాయల్స్ బౌలర్లలో బిష్ణోయ్ (4-0-32-2), బ్రిజేష్ శర్మ (4-0-32-2), ఆర్చర్ (3-0-33-2) అద్భుతంగా బౌలింగ్ చేయగా.. సందీప్ శర్మ (4-0-47-1) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి పేట్రేగిపోయాడు. కేవలం 26 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. ఆతర్వాత ధృవ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోయాడు. ఫలితంగా రాయల్స్ 18 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ ఓటమి ఆర్సీబీకి ఈ సీజన్లో మొదటిది కాగా.. ఈ గెలుపుతో రాయల్స్ తమ అజేయ యాత్రను కొనసాగించింది. ఈ సీజన్ రాయల్స్ ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్ల్లో విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో రాయల్స్ బౌలర్ రవి బిష్ణోయ్ ఓ ప్రత్యేక ఘనత సాధించాడు. విరాట్ను అద్భుతమైన గూగ్లీతో క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా.. 1089 కిందటి ఓ ఘట్టాన్ని పునరావృతం చేశాడు. విరాట్ ఐపీఎల్లో చివరిసారి 2023 ఎడిషన్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మళ్లీ ఇప్పుడే అతను ఈ తరహాలో వికెట్ సమర్పించుకున్నాడు. అంటే ఐపీఎల్లో విరాట్ 1089 రోజుల తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యాడన్న మాట. 2023 ఎడిషన్లో విరాట్ సీఎస్కే బౌలర్ ఆకాశ్ సింగ్ చేతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. -
వైభవ్ సూర్యవంశీ ఆటకు విరాట్ కోహ్లి ఫిదా
రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్-2026లో ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మ్యాచ్లో అతడు విధ్వంసకర బ్యాటింగ్తో విరుచుకుపడ్డాడు. లక్ష్యం ఎంతైనా.. ప్రత్యర్థి ఎవరైనా బంతిని బాదడమే లక్ష్యంగా ముందుకు సాగిపోయాడు.26 బంతుల్లోనే 78 పరుగులతోబెంగళూరు విధించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ సూర్యవంశీ 26 బంతుల్లోనే 78 పరుగులతో దుమ్ములేపాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉండటం విశేషం. వైభవ్కు తోడు ధ్రువ్ జురెల్ (43 బంతుల్లో 81 నాటౌట్) రాణిచండంతో రాయల్స్ 18 ఓవర్లలోనే టార్గెట్ పూర్తి చేసి.. ఆర్సీబీపై ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.1️⃣5️⃣ years of age. 1️⃣5️⃣ deliveries for a half-century 🤯🎥 Vaibhav Sooryavanshi taking on the best in the business with ease 🤌What a special talent 💎Updates ▶️ https://t.co/X76bJjmq1j#TATAIPL | #KhelBindaas | #RRvRCB | @rajasthanroyals pic.twitter.com/6TCpgCMnjy— IndianPremierLeague (@IPL) April 10, 2026కోహ్లి సైతం ఫిదాఇక వైభవ్ ఆటను చూసి ఆర్సీబీ దిగ్గజం, టీమిండియా లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం ఆశ్చర్యపోయాడు. ఈ బిహారీ పిల్లాడిపై ప్రశంసలు కురిపిస్తూ అతడిని అభినందించాడు. అంతేకాదు.. వైభవ్ రాయల్స్ క్యాప్పై.. ‘‘ప్రియమైన వైభవ్.. అత్యద్భుతంగా ఆడావు’’ అని రాసి తన ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను రాయల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.కాగా సొంతమైదానం గువాహటి వేదికగా శుక్రవారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్తాన్.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల నష్టానికి 201 పరుగులు సాధించింది. కోహ్లి (16 బంతుల్లో 32), కెప్టెన్ రజత్ పాటిదార్ (40 బంతుల్లో 63) రాణించారు. ఆఖర్లో రొమారియో షెఫర్డ్ (11 బంతుల్లో 22), వెంకటేశ్ అయ్యర్ (15 బంతుల్లో 29 నాటౌట్) మెరుపులు మెరిపించారు.ఇక లక్ష్య ఛేదనలో వైభవ్, ధ్రువ్ జురెల్లతో పాటు రవీంద్ర జడేజా (25 బంతుల్లో 24) కూడా తన వంతు సహకారం అందించాడు. కాగా ఈ సీజన్లో వైభవ్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లలో కలిపి 200 పరుగులు పూర్తి చేసుకుని అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచి.. ఆరెంజ్ క్యాప్ విజేతగా కొనసాగుతున్నాడు. Player of the Match ✅Orange Cap ✅An autograph from Kohli 🐐✅Good night to everyone and remember to keep believing in yourself no matter what 💗 pic.twitter.com/Up2BZuYObM— Rajasthan Royals (@rajasthanroyals) April 10, 2026 -
బిష్ణోయ్ సూపర్ డెలివరీ.. కోహ్లి ఫ్యూజ్లు ఔట్? వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గౌహతి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో బిష్ణోయ్ బంతితో మ్యాజిక్ చేశాడు. బిష్ణోయ్ తన తొలి ఓవర్లోనే అద్బుతమైన బంతితో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని బోల్తా కొట్టించాడు. ఆర్సీబీ తమ ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫిల్ సాల్ట్ వికెట్ కోల్పోయింది. అయినప్పటికి కోహ్లి మాత్రం బౌండరీలతో రాజస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే డేంజర్గా మారుతున్న కోహ్లిని అవుట్ చేయడానికి కెప్టెన్ రియాన్ పరాగ్..ఐదో ఓవర్లోనే రవి బిష్ణోయ్ను రంగంలోకి దించాడు. కెప్టెన్ నమ్మకాన్ని బిష్ణోయ్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో నాలుగో బంతికి కోహ్లికి బిష్ణోయ్ గుగ్లీగా సంధించాడు. బిష్ణోయ్ వేసిన ఆ అద్భుతమైన డెలివరీని అంచనా వేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. కోహ్లి బంతిని బౌలర్ తల మీదుగా కొట్టడానికి ప్రయత్నించాడు.అయితే బంతి బ్యాట్కు మిస్స్ అయ్యి స్టంప్స్ను గిరాటేసింది. దీంతో కోహ్లి ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కోహ్లి కేవలం 16 బంతుల్లో 7 ఫోర్లు సాయంతో 32 పరుగులు చేశాడు. బిష్ణోయ్ విషయానికి వస్తే తన నాలుగు ఓవర్ల కోటాలో 32 పరుగులు లిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.చదవండి: IPL 2026: 'రోజుకు 150 సిక్సర్లు.. ఇదే నా సక్సెస్ సీక్రెట్' -
కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన పాక్ క్రికెటర్
పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ ఆజం విరాట్ కోహ్లి రికార్డును అధిగమించాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాబర్ ఆజం పెషావర్ జాల్మీ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. దీనిలో భాగంగా కరాచీ కింగ్స్ జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజం టీ20 క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో బాబర్ ఆజం 12 వేల పరుగుల మైలురాయిని చేరుకుని ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. తన కెరీర్లో 351వ టీ20 మ్యాచ్ ఆడుతున్న బాబర్ 338 ఇన్నింగ్స్ ల్లో ఈ రికార్డును చేరుకోవడం విశేషం. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (343 ఇన్నింగ్స్లు) పేరిట ఉంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (360 ఇన్నింగ్స్) మూడో స్థానంలో ఉన్నాడు. బాబర్ ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ బ్యాటర్ కాగా, ఇప్పటికీ పాక్ తరపున అత్యధిక టీ20 పరుగుల రికార్డు షోయబ్ మాలిక్ పేరిట ఉంది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ బరిలోకి దిగిన బాబర్ 51 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కుశాల్ మెండిస్తో కలిసి రెండో వికెట్కు ఏకంగా 191 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో పెషావర్ జల్మీ 20 ఓవర్లలో 246/3 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్.. పెషావర్ బౌలర్ల ధాటికి పేకమేడలా కూలిపోయింది. ఇఫ్రికార్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, సుఫియాన్ ముఖీమ్ చెరో మూడు వికెట్లతో చెలరేగడంతో కరాచీ కేవలం 87 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా బాబర్ సేన ఘన విజయాన్ని అందుకుంది.చదవండి: ‘సరదాగా అన్న మాట ఇవాళ నిజమైంది’ -
విరాట్ కోహ్లితోపోలికా?.. మండిపడ్డ బాబర్ ఆజం
పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజంకు కోపమొచ్చింది. టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లితో పోలుస్తూ అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది. కాగా ఒకప్పుడు పాకిస్తాన్ ముఖచిత్రంగా పేరొందిన బాబర్కు ఇప్పుడు జాతీయ జట్టులో చోటే కరువయ్యే దుస్థితి.మూడు ఫార్మాట్ల కెప్టెన్గా ఒకప్పుడు మంచి ఫామ్లో ఉన్న బాబర్ ఆజం (Babar Azam).. గత మూడేళ్లుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. వన్డే వరల్డ్కప్-2023, టీ20 ప్రపంచకప్-2024లో పాక్ సెమీస్ చేరకుండానే నిష్క్రమించడంతో వన్డే, టీ20లతో పాటు టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా అతడు తప్పుకొన్నాడు. ఫామ్లేమిజట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నా ఫామ్లేమితో విమర్శల పాలయ్యాడు. ఇటీవల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ చెత్త ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయాడు. బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా పాక్ సెలక్టర్లు యాభై ఓవర్ల ఫార్మాట్ నుంచీ పక్కనపెట్టారు. దీంతో బాబర్ ఆజం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.ఒకప్పుడు కోహ్లితో బాబర్ను పోల్చిన పాక్ మాజీ క్రికెటర్లు సైతం ఇప్పుడు అతడి ప్రదర్శనపై పెదవి విరుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్-2026లో పెషావర్ జల్మీ జట్టు కెప్టెన్గా బాబర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. హైదరాబాద్ కింగ్స్మన్తో బుధవారం నాటి మ్యాచ్లో బాబర్ 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు.15వ ఓవర్లో హసన్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అయితే, ఈ మ్యాచ్లో పెషావర్ నాలుగు వికెట్ల తేడాతో గెలవడంతో బాబర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం విలేకరులతో మాట్లాడిన సమయంలో అతడికి ఊహించని ప్రశ్న ఎదురైంది.అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!‘‘విరాట్ కోహ్లి మాదిరే మీకు కూడా మంచి పేరు ఉంది. అయితే, అతడు మ్యాచ్లను గొప్పగా ఫినిష్ చేస్తాడు. మీరు మాత్రం ఆ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు. చాలా మంది అతడితో మిమ్మల్ని పోలుస్తారు కదా!.. మరి ఈ పోలికపై మీ అభిప్రాయం ఏమిటి?’’ అని ఓ విలేఖరి ప్రశ్నించారు.మండిపడ్డ బాబర్ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలాంటి విషయాల్లో నీ అభిప్రాయాలను నీతోనే పెట్టుకో. ఈ పోలికలు ఆపేసి అంతా ముందుకు సాగండి. నేను మ్యాచ్లు ఫినిష్ చేయలేననుకోవడం నీ తప్పు. అది నీ అభిప్రాయం మాత్రమే’’ అని బాబర్ ఆజం ఆగ్రహం వ్యక్తం చేశాడు.చదవండి: ‘సింగిల్’తో ఢిల్లీ డీలా🚨 BABAR RESPONDED TO A QUESTION ON KOHLI-BABAR COMPARISON 🚨• Journalist - "Virat Kohli comes with the same shot of game as you but he finishes the match which you lack. People compare him with you what are your views on the comparison?" • Babar Azam - "Let these things to… pic.twitter.com/A69fIV9urI— Abdullah. (@Abdullahh_56) April 8, 2026 -
ధురంధర్-2పై విరాట్ కోహ్లి రివ్యూ.. ఆశ్చర్యమంటూ దర్శకుడు పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ధరంధర్-2 చిత్రంపై టీమిండియా క్రికెటర్ కోహ్లీ, అనుష్క శర్మ స్పందించారు. ఈ క్రమంలో డైరెక్టర్ ఆదిత్య ధర్పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సినిమా చూసిన వారిద్దరూ రివ్యూ ఇచ్చారు. దీంతో వారు చేసిన పోస్ట్ను ఆదిత్య ధర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ చిత్రం రూ.1600 కోట్లకు పైగానే వసూళ్లు చేసింది.ధురంధర్ 2 మూవీ తనకు మంచి అనుభూతిని ఇచ్చిందని విరాట్ దంపతులు తెలిపారు. ఈ మూవీ ఒక అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి అనుభవం తనకు ఎప్పుడూ కలగలేదని వారు అన్నారు. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయానన్నారు. ప్రతి సన్నివేశం ఎంతో భావోద్వేగంతో ఉందని తెలిపారు. ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరు బాగా నటించారని తెలిపిన విరాట్.. ప్రత్యేకంగా రణ్వీర్ను అభినందించారు. అతనొక శిఖరాన్ని చేరుకున్నారని కొనియాడారు. ఆపై మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ ఒక జీనియస్ అంటూ మెచ్చుకున్నారు. అనుష్క శర్మ కూడా ధురంధర్పై అభినందనలు కురిపించారు. సినిమా అదిరిపోయిందని పోస్ట్ చేశారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే లభించే పాత్రను దక్కించుకుని, అద్భుతమైన నటనతో ప్రతిభ కనబరిచారని రణ్వీర్ను ప్రశంసించారు.అయితే, విరాట్ దంపతులు చేసిన పోస్ట్లపై ఆదిత్య ధర్ ధన్యవాదాలు చెబుతూ స్పందించారు. విరాట్ సినిమా చూసి అభినందించారని తెలిసి నమ్మలేకపోతున్నానంటూ తన సంతోషాన్ని వ్యక్తంచేశారు. విరాట్ మాటలు ఎంతో విలువైనవి అని ఆయన అన్నారు. తాను విరాట్కు వీరాభిమానిని ఆదిత్య ధర్ తెలిపారు. దేశం గర్వించేలా గ్రౌండ్లో ఆయన చేసే పోరాటం తమకు ఎంతో స్ఫూర్తి అని కొనియాడారు. అనుష్క ప్రశంసలు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
BCCI: అది సరికాదు.. యువీకే తప్పలేదంటే...
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు యువరాజ్ సింగ్. భారత జట్టు 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ గెలవడంతో ఈ మాజీ ఆల్రౌండర్ది కీలక పాత్ర. ఈ మెగా టోర్నీ తర్వాత క్యాన్సర్ఉందని తేలగా.. మొక్కవోని విశ్వాసంతో మహమ్మారి జయించి తిరిగి మైదానంలో అడుగుపెట్టిన ఘనుడు యువీ.అయితే, కెరీర్ చరమాంకంలో యువీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. జట్టులో చోటు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో 2019 వన్డే వరల్డ్కప్లో ఆడాలన్న కోరిక తీరకుండానే యువీ రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా..ఈ విషయం గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పోర్ట్స్ తక్ ఇంటర్వ్యూలో స్పందించాడు. నాటి కెప్టెన్ విరాట్ కోహ్లి, హెడ్కోచ్ రవిశాస్త్రి తన పేరును పరిగణనలోకి తీసుకోలేదని.. అందుకు సంబంధించి కనీస సమాచారం కూడా ఇవ్వలేదని వాపోయాడు. ఫిట్నెస్ పరీక్ష పాసైనా ఎదురుచూపులు తప్పలేదని.. అందుకే రిటైర్మెంట్ ఇచ్చానని తెలిపాడు.అంతటి యువీకే తప్పలేదంటేఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ యువీ వ్యాఖ్యలపై స్పందించాడు. యువరాజ్ పట్ల యాజమాన్యం వైఖరి తనను నిరాశపరిచిందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘మొదట్లో వార్తా పత్రికల్లో చూసి ఆటగాళ్లు తమ కెరీర్ కొనసాగుతుందా? ముగిసిపోయిందా? అని తెలుసుకునేవాళ్లు.అయితే, యాజమాన్యం మరీ ఇంత ఘోరంగా ఉండాల్సింది కాదు. టీమిండియాకు రెండు వరల్డ్కప్లు అందించిన యువరాజ్ సింగ్ వంటి దిగ్గజాల విషయంలోనైనా కాస్త మెరుగ్గా ప్రవర్తించాల్సింది. తనను ఎవరూ సంప్రదించకుండానే రిటైర్మెంట్ తీసుకునేలా చేశారని యువీ అన్నాడు. ఇలా చేయడం సరికాదు. కచ్చితంగా ఆటగాళ్లతో చర్చించి వారికి మేనేజ్మెంట్ స్పష్టతనివ్వాలి’’ అని వసీం జాఫర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నాడు. రో-కోలకు చెప్పండికాగా యువీ ఇటీవల మాట్లాడుతూ.. మేనేజ్మెంట్ తన విషయంలో వ్యవహరించినట్లు మరెవరి విషయంలో వ్యవహరించకూడదని అన్నాడు. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతూ.. వరల్డ్కప్-2026 రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలకు కూడా మేనేజ్మెంట్ సరైన సమాచారం ఇవ్వాలని యువీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరు గొప్ప ఆటగాళ్లని.. వారిని సాదరంగా పంపితే బాగుంటుందని పేర్కొన్నాడు.చదవండి: CSKకు గుడ్న్యూస్.. విధ్వంసకర వీరుడు వచ్చేస్తున్నాడు! -
భువనేశ్వర్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు భువనేశ్వర్ కుమార్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వయసు పెరుగుతున్న కొద్దీ బౌలింగ్లోనూ పదును పెంచుకుంటున్న భువనేశ్వర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.ఈ ఘనత సాధించిన తొలి ఫాస్ట్ బౌలర్గానూ భువనేశ్వర్ చరిత్ర పుటల్లో నిలిచాడు. ఆదివారం సీఎస్కేతో మ్యాచ్ సందర్భంగా ఆయుశ్ మాత్రే వికెట్ తీసిన భువీ 200 వికెట్ల మార్క్ను అందుకున్నాడు. అయితే టీమిండియా తరఫున ఐపీఎల్లో 200 వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచిన భువనేశ్వర్ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో మాత్రం అగ్రస్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా ఐపీఎల్లో 200 వికెట్ల మార్క్ను చేరుకున్న తొలి ఆటగాడిగా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ నిలిచాడు. చాహల్ ఇప్పటివరకు 176 మ్యాచ్ల్లో 224 వికెట్లు పడగొట్టాడు. తాజాగా భువనేశ్వర్ 192 మ్యాచ్ల్లో ఈ ఫీట్ను సాధించాడు. భువనేశ్వర్ తర్వాత కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ 191 మ్యాచ్ల్లో 193 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేకాదు ఈ స్వింగ్ కింగ్ మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో ఫాస్ట్ బౌలర్లకు సాధ్యం కాని 200 వికెట్ల మార్క్ను అధిగమించిన తొలి బౌలర్గా భువీ నిలిచాడు. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా, శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగలు కూడా భువనేశ్వర్ కంటే వెనుకబడి ఉన్నారు. ఇక మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ ఖాతాలో మరో రికార్డు..రికార్డులు పెట్టడానికే కోహ్లీ పుట్టినట్లున్నాడు. తాజగా సీఎస్కేతో మ్యాచ్ ద్వారా కోహ్లీ మరో టీమిండియా సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ రికార్డును బద్దలుకొట్టాడు. సీఎస్కేతో మ్యాచ్లో 28 పరుగులు చేయడం ద్వారా కోహ్లీ ఆ జట్టుపై 1,174 పరుగులు సాధించాడు. తద్వారా ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. ఇంతకముంఉద ఈ రికార్డు రోహిత్ పేరిట ఉంది. రోహిత్ శర్మ కోల్కతా నైట్రైడర్స్పై 1,161 పరుగులు సాధించాడు. తాజాగా కోహ్లీ రోహిత్ను దాటి తొలి స్థానంలో నిలిచాడు.చదవండి: ద్రవిడ్, కుంబ్లేలకు అరుదైన గౌరవం! -
సీఎస్కే అంటే కోహ్లీకి పూనకమే!
టీమిండియా సీనియర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. చేజింగ్ మాస్టర్, కింగ్ కోహ్లీ, విరాట్ కింగ్ వంటి బిరుదులు అతడి సొంతం. చేజింగ్లో కోహ్లీని కొట్టే మొనగాడు లేడంటే అతిశయోక్తి కాదు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయినా, ఐపీఎల్ మ్యాచ్ అయినా చేజింగ్లో కోహ్లీ బరిలో ఉన్నాడంటే ఆ జట్టు గుండెలపై హాయిగా చేయి వేసుకొని నిద్రపోతాయి. టీమిండియా తరఫున ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇక ఐపీఎల్లో 19 సీజన్లుగా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ చేజింగ్లో లెక్కలేనన్ని సార్లు గెలిపించాడు. అయితే ఐపీఎల్లో కూడా కోహ్లీకి ఒక ఫేవరెట్ జట్టు ఉంది. ఆ జట్టు పేరు చెబితే చాలు బ్యాటింగ్లో పూనకం వచ్చేస్తుంది. ఆ జట్టు పేరే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). ఐపీఎల్ 2026 సీజన్లో ఆదివారం డబుల్హెడర్లో భాగంగా ఇవాళ ఆర్సీబీ తమ హోంగ్రౌండ్లో సీఎస్కేతో తలపడనుంది. తమ తొలి మ్యాచ్లో నెగ్గిన ఆర్సీబీ రెండో విజయంపై కన్నేయగా.. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటములతో పట్టికలో చివరి స్థానంలో ఉన్న సీఎస్కే ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఖాతా తెరవాలని చూస్తోంది. కాగా సీఎస్కేపై కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐపీఎల్లో సీఎస్కేతో 35 మ్యాచ్లాడిన కోహ్లీ 34 ఇన్నింగ్స్ల్లో 1146 పరుగులు సాధించాడు. చెన్నైపై అత్యధిక స్కోరు 90 నాటౌట్గా ఉంది. ఇందులో 10 అర్థసెంచరీలున్నాయి. మరో 14 పరుగులు చేస్తే ఒకే జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్గా తన రికార్డును తానే బద్దలుకొట్టనున్నాడు. పంజాబ్ కింగ్స్పై కోహ్లీ 1159 పరుగులు సాధించాడు.చదవండి: ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు వర్షం ముప్పు! -
రోహిత్ను ఊరిస్తున్న అరుదైన రికార్డు!
ఐపీఎల్ 2026 సీజన్ శనివారం డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్పై రోహిత్ శర్మ ఇప్పటివరకు 37 మ్యాచ్ల్లో 1057 పరుగులు సాధించాడు. కాగా రోహిత్ కంటే ముందు కోహ్లీ ఉన్నాడు. ఈ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ 30 ఇన్నింగ్స్ల్లో 1,130 పరుగులు సాధించాడు. కోహ్లీ కంటే 73 పరుగులు వెనుకబడి ఉన్న రోహిత్ ఢిల్లీతో మ్యాచ్లోనే ఆ ఫీట్ను సాధిస్తాడా లేదా అనేది చూడాలి. ఈ సీజన్ను రోహిత్ శర్మ మంచి ఈజ్తో ప్రారంభించాడు. కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లోనే రోహిత్ 38 బంతుల్లోనే 78 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కేకేఆర్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఇక ఇవాళ్టి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో పోలిస్తే ముంబై ఇండియన్స్ ఫేవరెట్గా కనిపిస్తోంది. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై 21-16 విజయాలతో ఢిల్లీపై ఆధిక్యతను కలిగి ఉంది. గత ఐదు మ్యాచ్ల్లో ఢిల్లీపై ముంబై నాలుగు విజయాలు సాధించడం విశేషం.చదవండి: ‘నువ్వొక అద్భుతం.. ప్రపంచం నీ పాదాల చెంతకు’ -
BCCI: రోహిత్, కోహ్లికి ముఖం మీదే చెప్పేయండి: యువీ
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మను ఉద్దేశించి లెజెండరీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే వరల్డ్కప్-2027లో ఆడించే విషయంలో యాజమాన్యం (బీసీసీఐ) వీరిద్దరికి ఇప్పుడే స్పష్టతనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగాకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్గా నిలిచిన తర్వాత రో-కో (Rohit Sharma- Virat Kohli) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అనూహ్య రీతిలో గతేడాది రోజుల వ్యవధిలోనే వీరిద్దరు టెస్టులకూ గుడ్బై చెప్పేశారు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న రోహిత్- కోహ్లి ప్రపంచకప్ ఆడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.అయితే, రోహిత్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన క్రమంలో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ రో-కో భవితవ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరు వరల్డ్కప్ ఆడేందుకు కట్టుబడి ఉన్నారో లేదో తమకు తెలియదన్నాడు. అయితే, రో-కో మాత్రం ఇందుకు భిన్నంగా సూపర్ ఫామ్తో ముందుకు సాగుతూ తమ లక్ష్యం ఏమిటో ఆటతోనే చెప్పకనే చెబుతున్నారు.తుది నిర్ణయం సెలక్టర్లదేఈ పరిణామాల గురించి యువరాజ్ సింగ్ తాజాగా స్పందించాడు. స్పోర్ట్స్ తక్ చానెల్తో మాట్లాడుతూ.. ‘‘రోహిత్- కోహ్లి ఆలోచన ఏమిటో నాకైతే తెలియదు. అయితే, ఈ ఇద్దరూ కూడా వరల్డ్కప్ ఆడేందుకు నిబద్ధతతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే, వారిని ఆడించాలా? లేదా? అన్న నిర్ణయం మాత్రం సెలక్టర్లదే.నిజం నిష్ఠూరంగా ఉన్నా.. వీరిద్దరి భవితవ్యాన్ని నిర్ణయించేంది సెలక్టర్లే. నా అభిప్రాయం ప్రకారం వారిద్దరు గొప్ప ఆటగాళ్లు. అయితే, వరల్డ్ ఆడించే విషయంలో మేనేజ్మెంట్ వారికి స్పష్టతనిస్తే మంచిది. ఇలాంటి విషయాల గురించి ఆటగాళ్లతో మనస్ఫూర్తిగా చర్చించాలి.ముఖ్యంగా ఇద్దరూ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. కాబట్టి వారి విషయంలో నిజం నిష్ఠూరంగా ఉన్నా.. ముందుగానే ముఖం మీద చెప్పేస్తే బాగుంటుంది. కాకపోతే భారత క్రికెట్లో ఇలా జరగడం లేదు’’ అని యువీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.ఎక్కడి నుంచో వచ్చి ధోనీ కెప్టెన్ అయ్యాడు ఇక టీమిండియా యాజమాన్య వైఖరిని ఈ సందర్భంగా యువీ గుర్తు చేసుకున్నాడు. కెప్టెన్ ఎంపిక అంచనాలకు అందకుండా సాగుతుందని పేర్కొన్నాడు. తాను టీమిండియాకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ... అనూహ్యంగా ధోనీని భారత జట్టు కెప్టెన్గా ఎంపిక చేసిన విషయాన్ని యువీ గుర్తు చేసుకున్నాడు.తాజాగా ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్... ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టు పగ్గాలు అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్కు అప్పగించిన నేపథ్యంలో యువీ మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘ఈ నిర్ణయం నన్ను నిరాశ పరిచింది. దీన్ని ఒక ఆటగాడి కోణం నుంచి చూస్తే... ఉదాహరణకు ఒక ఆటగాడు ప్రపంచకప్నకు ముందు చక్కటి ఫామ్తో తన రాష్ట్ర జట్టు తరఫున సత్తా చాటి వరల్డ్కప్నకు ఎంపికయ్యాడు.అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో జట్టుకు వరల్డ్కప్ అందించాడు. అలాంటి ప్లేయర్ను ఫ్రాంచైజీ కెప్టెన్గా ఎంపిక చేసింది. మరోవైపు ఏడేళ్లుగా ఒక ప్లేయర్ ఆ ఫ్రాంచైజీ కోసం ప్రాణం పెట్టి అద్భుతంగా ఆడుతున్నాడు. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగిందిఅయినప్పటికీ అతడికి జట్టు కెప్టెన్ పదవి కాకుండా వైస్కెప్టెన్ పదవి దక్కింది. మైదానంలో అడుగు పెట్టినప్పుడు అతడి మానసిక స్థితి ఎలా ఉంటుంది. ఇలాంటి అనుభవం నాకు కూడా జరిగింది.నేను భారత జట్టుకు వైస్కెప్టెన్గా వ్యవహరిస్తున్న సమయంలో హర్భజన్, సెహ్వాగ్ వంటి సీనియర్లు జట్టులో ఉన్నా... ఎక్కడి నుంచో వచ్చి ధోని కెపె్టన్ అయ్యాడు. కారణాలు ఏవైనా మీరు భారత కెప్టెన్గా ఉంటారా లేదా అనేది ఫ్రాంచైజీ క్రికెట్ నిర్ణయించదు. కానీ ఆటగాడి కోణం నుంచి చూస్తే ఇది నిరాశ కలిగించే అంశం’ అని యువరాజ్ అన్నాడు. 2007లో జట్టులో సీనియర్ ప్లేయర్లు ఉన్నప్పటికీ ధోనీకి అనూహ్యంగా జట్టు పగ్గాలు అప్పజెప్పడంపై యువీ ఈ పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ఎంతపని చేశావ్ అయ్యర్.. పంజాబ్ జట్టుకు షాక్! -
విరాట్ కోహ్లిపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను రిటైర్మెంట్ ప్రకటించడానికి నాడు టీమిండియా కెప్టెన్గా ఉన్న విరాట్ కోహ్లి, హెడ్ కోచ్ రవిశాస్త్రి కారణమని బాంబు పేల్చాడు. తన ఎంపికను పరిగణలోకి తీసుకోవడం లేదన్న కనీస సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారని వాపోయాడు. సీనియర్ని అన్న గౌరవం కూడా లేకుండా తన పట్ల అవమానకరంగా ప్రవర్తించారని ఫైరయ్యాడు. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసి, సెలెక్టర్ల నుంచి పిలుపు కోసం చాలాకాలం ఎదురుచూశానని తెలిపాడు. చివరికి ధోనితో మాట్లాడితే కాని విషయం అర్దం కాలేదని అన్నాడు. చేసేదేమీ లేక రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. నిజాయితీగా పరిస్థితిని వివరించి సహాయం చేశాడని ధోనికి కృతజ్ఞతలు తెలిపాడు. తన రిటైర్మెంట్ విషయంలో నేషనల్ క్రికెట్ అకాడమీ తీరు కూడా తప్పుబట్టాడు. తాజాగా స్పోర్ట్స్ టాక్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించాడు.కాగా, యువీ 2019 జూన్ 10న రిటైర్మెంట్ను ప్రకటించాడు. అతను చివరిగా 2017లో టీమిండియా తరఫున వన్డే ఆడాడు. అవకాశాల కోసం చాలాకాలం వేచి చూసి, చేసేదేమీ లేక ఆట నుంచి వైదొలిగాడు. యువీ చివరి వన్డే ఆడే సమయానికి మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఆ ఏడాది 11 మ్యాచ్ల్లో 98.67 స్ట్రయిక్రేట్తో 372 పరుగులు చేశాడు. అయినా టీమిండియాలో స్థానం దక్కలేదు. 17 ఏళ్ల పాటు భారత క్రికెట్కు సేవలు చేసి, రెండు ప్రపంచకప్ విజయాల్లో (2007 టీ20, 2011 వన్డే) కీలకపాత్ర పోషించిన యువీ అవమానకర రీతిలో రిటైర్మెంట్ ప్రకటించడాన్ని అప్పట్లో చాలామంది జీర్ణించుకోలేకపోయారు. క్యాన్సర్పై విజయం సాధించి, తిరిగి జట్టులోకి వచ్చిన యువరాజ్ ఆటకు సంబంధించి తన చివరి కోరికను తీర్చుకోకుండానే రిటైరయ్యాడు. యువీకి 2019 వన్డే వరల్డ్కప్ ఆడాలని కోరిక ఉండింది. ఇందుకోసమే అతను వయసు మీద పడుతున్నా తీవ్రంగా శ్రమించి ఫిట్నెస్ మెయిన్టైన్ చేశాడు. అయినా సెలెక్టర్లు అతనికి మొండిచెయ్యి చూపించారు. వాస్తవానికి యువీని పక్కకు పెట్టడానికి విరాట్-రవిశాస్త్రి వద్ద కూడా ఎలాంటి వ్యక్తిగత కారణాలూ లేవు. కేవలం యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేశారు. 2015 వరల్డ్ కప్ సమయంలో నాటి కెప్టెన్ ధోని కూడా గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్లను ఈ కారణంగానే పక్కన పెట్టాడు. -
IPL 2026: ముగ్గురు మొనగాళ్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై రెండు రోజులే అయినప్పటికీ రెండు మ్యాచ్ల్లోనూ చేజింగ్ చేసిన జట్లే గెలవడం అభిమానులకు కిక్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కిక్ ఇస్తున్న వార్త ఏదైనా ఉందంటే.. టీమిండియా సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, అజింక్యా రహానే, విరాట్ కోహ్లీల బ్యాటింగ్ అని చెప్పొచ్చు. 40 ఏండ్లకు దగ్గర్లో ఉన్న ఈ ముగ్గురు మొనగాళ్లు బ్యాటింగ్లో అద్భుతాలు చేస్తున్నారు. ఈ సీజన్లో తాము ఆడిన తొలి మ్యాచ్లోనే ఈ త్రయం తమ ప్రదర్శనతో అదరగొట్టారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత రోహిత్, కోహ్లీలు పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికితే.. జట్టులో అవకాశాల్లేక టీ20 క్రికెట్ ఆడే అవకాశం రహానే ఎప్పుడో కోల్పోయాడు. కానీ తాజాగా ప్రారంభమైన ఐపీఎల్ 19వ సీజన్లో మాత్రం తమ బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరిస్తున్నారు. ఈ ముగ్గురూ ఇలాగే ఆడుతూ పోతే రాబోయే మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలే అని చెప్పొచ్చు.రోహిత్ శర్మ..భారత కెప్టెన్గా 2024 టీ20 ప్రపంచకప్ను అందుకున్న రోహిత్ శర్మ ఆ తర్వాత ఆ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోహిత్ శర్మ జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేదు. మూడు వన్డేలు కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఇవాళ ఐపీఎల్లో మాత్రం తొలి మ్యాచ్లోనే రోహిత్ శర్మ విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. కేకేఆర్తో మ్యాచ్లో 38 బంతుల్లోనే 78 పరుగులు చేసిన రోహిత్ అలవోకగా బంతులను బౌండరీ అవతలకు పంపిస్తూ పాత హిట్మ్యాన్ను గుర్తు చేశాడు. రికిల్టన్ కంటే ముందే ఔటైనప్పటికీ ఫోర్లు, సిక్సర్లతో కేకేఆర్కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముఖ్యంగా మ్యాచ్లో రోహిత్ ఫుట్వర్క్ అద్భుతమని చెప్పొచ్చు. ఎక్కడా చిన్న తప్పిదం లేకుండా ఇన్నింగ్స్ ఆసాంతం మంచి టైమింగ్తో షాట్లు ఆడాడు. తొలి మ్యాచ్తోనే ఫామ్ అందుకున్న రోహిత్ నుంచి సీజన్ ముగిసేలోపు మరిన్ని అద్భుత ఇన్నింగ్స్లు వచ్చే అవకాశముంది. View this post on Instagram A post shared by IPL (@iplt20)విరాట్ కోహ్లీ..కోహ్లీది కూడా అచ్చం రోహిత్ స్టోరీనే. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాలో సభ్యుడైన కోహ్లీ రోహిత్తో కలిసి ఏకకాలంలో టీ20లకు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత జనవరిలో న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లోనూ కోహ్లీ అదరగొట్టాడు. ఆ సిరీస్లో కోహ్లీ 3 మ్యాచ్ల్లో 240 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. తాజాగా అదే ఫామ్ను ఐపీఎల్లోనూ కంటిన్యూ చేశాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్తో జరిగిన ఆరంభ మ్యాచ్లో బెంగళూరు స్టార్ కోహ్లీ చివరి వరకు నాటౌట్గా నిలిచి జట్టును గెలిపించాడు. కోహ్లీ (38 బంతుల్లో 69 నాటౌట్) చేజింగ్లో తనను కొట్టేవారు లేరని మరోసారి నిరూపించాడు. కోహ్లీ ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. సీజన్ ఆద్యంతం కోహ్లీ ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఆరెంజ్ క్యాప్ కూడా సొంయ్యే అవకాశం లేకపోలేదు. View this post on Instagram A post shared by IPL (@iplt20)అజింక్యా రహానే..రోహిత్, కోహ్లీలు రెండేళ్ల కిందట టీ20లకు వీడ్కోలు పలికితే రహానే టీమిండియా తరఫున తన చివరి టీ20 ఆడి దాదాపు పదేళ్లు కావొస్తోంది. రహానే 2016లో వెస్టిండీస్తో చివరి టీ20 ఆడాడు. అప్పటి నుంచి టెస్టుల్లో కొన్నాళ్లు ఆడిన రహానే ఇప్పుడు అవకాశాలు లేవు. దీంతో ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్న రహానే గత రెండు, మూడు సీజన్లలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. రహానేను ఎక్కువగా టెస్టు క్రికెట్లో చూడడం వల్ల అతడి నుంచి నెమ్మదైన ఆటనే అభిమానులు ఊహించేవారు. కానీ ఐపీఎల్లో రహానే ఆడుతున్న తీరు షాక్ కలిగిస్తోందని చెప్పొచ్చు. తాజాగా ఐపీఎల్ 19వ సీజన్లో ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో రహానే కేకేఆర్ కెప్టెన్గా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లో 67 పరుగులు చేసిన రహానే ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. గతంలో చెన్నై సూపర్కింగ్స్కు ఆడినప్పుడు కూడా రహానే ఇదే దూకుడును ప్రదర్శించి సరికొత్త ఆటను రుచి చూపించాడు. మొత్తంగా టీమిండియా సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానేలు ఒక్క మ్యాచ్తోనే ఆటలో మొనగాళ్లమని నిరూపించుకున్నారు.చదవండి: ‘14 ఏండ్లకు మమ్మల్ని కరుణించాడు’ -
కోహ్లీ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ శుభారంభం చేసింది. 2012 సీజన్ తర్వాత తాము ఆడిన తొలి మ్యాచ్లో విజయాన్ని అందుకొని సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. క్రీజులో తాను ఉన్నాడంటే పరుగులు రావాల్సిందే. 38 బంతుల్లో 78 పరుగులు చేసిన రోహిత్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తన సహచరుడు, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. టీ20 క్రికెట్లో ఒకే జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ తొలి స్థానానికి చేరుకున్నాడు. గతంలో డెక్కన్ చార్జర్స్తో పాటు ముంబై ఇండియన్స్ తరఫున కేకేఆర్పై రోహిత్ శర్మ 36 మ్యాచ్ల్లో 1161 పరుగులు సాధించాడు. ఇక కేకేఆర్తో మొత్తం 36 మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరఫున 6 మ్యాచ్ల్లో 116 పరుగులు, ముంబై ఇండియన్స్ తరఫున 30 మ్యాచ్ల్లో 1045 పరుగులు సాధించడం విశేషం.ఇంతకముందు విరాట్ కోహ్లీ చెన్నై సూపర్కింగ్స్పై 36 మ్యాచ్ల్లో 1160 పరుగులు చేశాడు. తాజాగా కేకేఆర్తో మ్యాచ్లో రోహిత్ 78 పరుగులు చేయడంతో కోహ్లీ రికార్డు బ్రేక్ చేసినట్లయింది. అయితే కోహ్లీ పంజాబ్ కింగ్స్పై (36 మ్యాచ్ల్లో 1159 పరుగులు), ఢిల్లీ క్యాపిటల్స్పై( 32 మ్యాచ్ల్లో 1154 పరుగులు) సాధించాడు. అయితే ఆర్సీబీ తమ తదుపరి మ్యాచ్ పంజాబ్ లేదా ఢిల్లీతో ఎప్పుడు ఆడినా ఈసారి రోహిత్ శర్మను కోహ్లీ దాటేసి మరోసారి నంబర్వన్ స్థానాన్ని ఆక్రమించనున్నాడు. మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగుల భారీ స్కోరు చేసింది. రహానే (67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) రాణించారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు తీయగా, పాండ్యా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఓపెనర్లు రికిల్టన్ (81), రోహిత్ శర్మ (78) దూకుడుతో 19.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
IPL 2026: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. తొలి మ్యాచ్లోనే అదిరిపోయే విజయం సాధించింది. నిన్న (మార్చి 28) జరిగిన టోర్నీ ఓపెనర్లో సన్రైజర్స్పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది, ఏకపక్ష విజయం నమోదు చేసింది. సన్రైజర్స్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని మరో 26 బంతులు మిగిలి ఉండగానే (15.4 ఓవర్లలో) ఛేదించడం ద్వారా ఓ భారీ రికార్డు నెలకొల్పింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ను ఊదేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు రాజస్థాన్ రాయల్స్ పేరిట ఉండేది. రాయల్స్ గత ఎడిషన్లో (2025లో గుజరాత్పై) 200 ప్లస్ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించింది. తాజాగా ఆర్సీబీ ఈ రికార్డును బద్దలు కొట్టింది.ఆర్సీబీ ఈ రికార్డు సాధించడంలో కింగ్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషించాడు. భారీ ఛేదనలో విరాట్ తన సహజ శైలికి భిన్నంగా భారీ షాట్లతో అలరించి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), మ్యాచ్ను వేగంగా ముగించాడు. గెలుపుకు 17 పరుగులు కావాల్సిన తరుణంలో విరాట్ వరుసగా 6, 4, 4, 4 బాది ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకునేలా చేశాడు.ఆర్సీబీ ఈ రికార్డు సొంతం చేసుకోవడంలో దేవ్దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా తమవంతు పాత్ర పోషించారు. వీరిద్దరు కూడా వేగంగా ఆడి కొండంత లక్ష్యాన్ని కరిగించారు. అంతకుముందు ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా సన్రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 200 ప్లస్ లక్ష్య ఛేదనలు..15.4 - RCB vs SRH, బెంగళూరు, 2026*15.5 - RR vs GT, జైపూర్, 202516.0 - RCB vs GT, అహ్మదాబాద్, 202416.3 - MI vs RCB, వాంఖేడే, 202317.3 - DC vs GL, ఢిల్లీ, 2017 -
ఎస్ఆర్హెచ్పై విజయం.. కోహ్లీ ఫ్లయింగ్ కిస్
ఐపీఎల్ 2026 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) శుభారంభం చేసింది. శనివారం ఎస్ఆర్హెచ్తో జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్లో ఆర్సీబీ విజయం ఖరారు కాగానే స్టేడియంలో అందరినీ ఆకట్టుకునేలా ఒక క్యూట్ ‘విరుష్క’ మూమెంట్ చోటుచేసుకుంది. గెలుపు ఆనందంలో విరాట్ కోహ్లీ తన హెల్మెట్ తీసి, స్టాండ్స్లో తన కోసం ఉత్సాహంగా చీర్ చేస్తున్న భార్య అనుష్క శర్మ వైపు చూస్తూ ముద్దుగా ‘ఫ్లయింగ్ కిస్’ ఇచ్చాడు. దానికి స్పందనగా అనుష్క కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతే ప్రేమగా కోహ్లీకి రిటర్న్ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఈ దృశ్యాన్ని అక్కడే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆర్సీబీ మహిళల జట్టు క్రికెటర్లు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, శ్రేయాంక పాటిల్ నవ్వుతూ ఆశ్చర్యంగా చూశారు. ఈ అందమైన క్షణంతో చిన్నస్వామి స్టేడియం ఒక్కసారిగా అభిమానుల అరుపులతో హోరెత్తిపోయింది.మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు, కెప్టెన్ ఇషాన్ కిషన్ 80 పరుగుల మెరుపు ఇన్నింగ్స్తో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ క్రీజులో ఉండటంతో ఆర్సీబీ చాలా సులువుగా ఊదేసింది. కేవలం 15.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ విజయాన్ని అందుకుంది. THE WAY VIRAT KOHLI GIVING FLYING KISS TO ANUSHKA SHARMA AFTER WON THE MATCH. ♥️😍- Video of the Day! pic.twitter.com/lQugBW89Ju— Tanuj (@ImTanujSingh) March 28, 2026 -
అందుకే చేజింగ్ మాస్టర్ అనేది!
ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లోనే పలు రికార్డులు బద్దలయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అసలైన చాంపియన్ ఆటతీరును ప్రదర్శించి సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగుల టార్గెట్ను ఉఫ్ అని ఉదేసింది. పడిక్కల్, పటిదార్లు మెరుపు ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంటే.. కోహ్లీ మాత్రం లక్ష్య ఛేదనలో తనను మాస్టర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. చేజింగ్ అంటేనే కోహ్లీలో ఎక్కడలేని ఊపు కనిపిస్తుంది. అందుకేనేమో ఈ చేజింగ్ మాస్టర్ను వెతుక్కుంటూ రికార్డులు వస్తుంటాయి. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లోనూ కోహ్లీ రెండు అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఐపీఎల్లో లక్ష్య ఛేదన సమయంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా కోహ్లీ రికార్డులకెక్కాడు. 4027 పరుగులతో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ తర్వాత వార్నర్ (3,285), రోహిత్ శర్మ (3,238), శిఖర్ ధావన్ (2,843), రాబిన్ ఊతప్ప (2,832) వరుసగా ఉన్నారు. ఎస్ఆర్హెచ్తో గత ఐదు మ్యాచ్ల్లో వరుసగా 100, 42, 51, 43, 69* పరుగులు చేయడం ద్వారా మరో రికార్డు లిఖించుకున్నాడు. మరిన్ని రికార్డులు..ఇక కోహ్లీకి వరుసగా రెండో ఐపీఎల్ సీజన్ను కూడా అర్థసెంచరీతోనే మొదలుపెట్టాడు. 2025 సీజన్లో కేకేఆర్తో జరిగిన తొలి మ్యాచ్లో అర్థసెంచరీ చేశాడు. తాజాగా ఎస్ఆర్హెచ్పై అర్థసెంచరీతో ఈ సీజన్లో బ్యాటింగ్ను షురూ చేశాడు.ఇక ఐపీఎల్లో 200 పరుగులకు పైగా ఛేదనను అతి తక్కువ ఓవర్లలో చేధించిన జట్టుగాను ఆర్సీబీ రికార్డు అందుకుంది. ఎస్ఆర్హెచ్ విధించిన 202 పరుగులు లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించింది. అంతకముందు 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్ 15.5 ఓవర్లలో అందుకుంది.ఐపీఎల్లో 200లకు పైగా పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఛేదించడం ఇది నాలుగోసారి. గతంలో 2025లో లక్నో సూపర్జెయింట్స్పై, 2010లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్పై, 2024లో గుజరాత్ టైటాన్స్పై 200 ప్లస్ స్కోర్లు ఛేదించింది. -
ఆర్సీబీ అదరగొట్టింది...
బ్యాటింగ్లో ఆశించినంత భారీ స్కోరు చేయలేకపోయిన సన్రైజర్స్ హైదరాబాద్... బౌలింగ్లో ఎలాంటి మ్యాజిక్ కనబర్చలేక పరాజయంతో ఐపీఎల్ను ప్రారంభించింది. డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... చాంపియన్ ఆటతీరుతో సీజన్లో బోణీ కొట్టింది. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొడితే... షెఫర్డ్ అతడికి సంపూర్ణ సహకారం అందించాడు. వీరిద్దరి బౌలింగ్ మెరుపులకు... ఫిల్ సాల్ట్ ఫీల్డింగ్ విన్యాసాలు తోడవడంతో సన్రైజర్స్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ‘ఛేజ్ మాస్టర్’ విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ దూకుడుతో మరో 26 బంతులు మిగిలుండగానే బెంగళూరు లక్ష్యాన్ని ఛేదించింది. బెంగళూరు: సొంతగడ్డపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ను ఘన విజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన టోర్నీ ఆరంభ పోరులో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్స్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో విజృంభించగా... అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించాడు. క్లాసెన్ (31; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హెడ్ (11), అభిషేక్ శర్మ (7), నితీశ్ కుమార్ రెడ్డి (1), సలిల్ అరోరా (9), హర్ష్ దూబే (3) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో జేకబ్ డఫీ, రొమారియో షెఫర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 15.4 ఓవర్లలో 4 వికెట్లకు 203 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్లు), దేవదత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధశతకాలతో అదరగొట్టగా.. కెప్టెన్ రజత్ పాటీదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు దంచికొట్టాడు. ఇషాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ జాకబ్ డఫీ ధాటికి సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టిన సమయంలో ఇషాన్ చక్కటి ఇన్నింగ్స్తో అలరించాడు. కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో అనూహ్యంగా జట్టు పగ్గాలు అందుకున్న ఇషాన్... బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం రాబట్టాడు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఇషాన్ వరుసగా 6, 4, 6 కొట్టి మైదానంలో జోష్ నింపాడు. కాసేపటికి క్లాసెన్ కూడా రెండు ఫోర్లతో సత్తాచాటాడు. సుయాశ్ శర్మ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్ 27 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కృనాల్ వేసిన 13వ ఓవర్లో ఈ ఇద్దరు కలిసి మూడు సిక్స్లు బాదారు. నాలుగో వికెట్కు 97 పరుగులు జోడించిన అనంతరం క్లాసెన్ వివాదాస్పద క్యాచ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత హైదరాబాద్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా... అనికేత్ దూకుడు కొనసాగించడంతో సన్రైజర్స్ మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆడుతూ పాడుతూ... దూకుడుకు మారుపేరైన ప్రత్యర్థి ఓ మాదిరి స్కోరుకే పరిమితం చేసిన బెంగళూరు... సొంతగడ్డపై దుమ్మురేపింది. సాల్ట్ (8) రెండో ఓవర్లోనే అవుటైనా... ఆ తర్వాత రైజర్స్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెంగళూరు దంచికొట్టింది. మంచి ఫామ్లో ఉన్న పడిక్కల్ అలవోకగా భారీ షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. సిక్స్తో ఖాతా తెరిచిన అతడు... నితీశ్ రెడ్డి ఓవర్లో రెండు ఫోర్లు, పైన్ ఓవర్లో 6, 4, 6 బాదాడు. కోహ్లి కూడా 6, 4తో జోరు పెంచడంతో పవర్ప్లే ముగిసే సరికి బెంగళూరు 76/1తో నిలిచింది. దూబే బౌలింగ్లో 4, 6 కొట్టిన అనంతరం పడిక్కల్ అవుటయ్యాడు. దీంతో 101 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. కెప్టెన్ రజత్ పాటీదార్ ఉన్నంతసేపు భారీ షాట్లతో చెలరేగడంతో... స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. బెంగళూరు విజయానికి 48 బంతుల్లో 40 పరుగుల అవసరమైన దశలో... వరుస బంతుల్లో పాటీదార్, జితేశ్ శర్మ (0) అవుటైనా... టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి కోహ్లి మిగిలిన పని పూర్తిచేశాడు. హడలెత్తించిన డఫీ న్యూజిలాండ్ పేసర్ జేకబ్ డఫీ ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 48 టి20లు ఆడి 62 వికెట్లు తీశాడు. అయితే ఇప్పుడు తొలిసారి అతను ఐపీఎల్లో అడుగు పెట్టాడు. హేజల్వుడ్కు ప్రత్యామ్నాయంగా ఆర్సీబీ అతడిని తీసుకోగా, తన ఎంపికకు పూర్తి న్యాయం చేస్తూ సత్తా చాటాడు. తన రెండో ఓవర్లోనే కీలక బ్యాటర్లు అభిషేక్, హెడ్లను వెనక్కి పంపిన అతను తర్వాతి ఓవర్లో నితీశ్ను అవుట్ చేసి పవర్ప్లేలోనే 3/17తో రైజర్స్ పని పట్టాడు. కేవలం 530 మంది జనాభా ఉండే ఎలాంటి సౌకర్యాలు లేని చిన్న ఊరిలో పుట్టిన డఫీ ప్రస్థానం కివీస్ క్రికెట్ వర్గాల్లో ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. మరో ఇద్దరు... ఈ మ్యాచ్తో మరో ఇద్దరు భారత క్రికెటర్లు ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. పేస్ బౌలర్ అభినందన్ సింగ్కు ఆర్సీబీ అవకాశమిచ్చింది. యూపీ టి20 లీగ్లో లక్నో ఫాల్కన్స్ తరఫున ఆడిన అతనికి సీనియర్ స్థాయిలో ఇదే తొలి అధికారిక టోర్నీ. గత సీజన్లోనూ ఆర్సీబీతోనే ఉన్నా మ్యాచ్ ఆడే చాన్స్ రాలేదు. సన్రైజర్స్ తరఫున ఆడిన సలీల్ అరోరాకు కూడా ఇదే తొలి మ్యాచ్. పంజాబ్కు చెందిన 23 ఏళ్ల సలీల్ ముస్తాక్ అలీ టోర్నీలో ఎనిమిది మ్యాచ్లలో దాదాపు 200 స్ట్రయిక్ రేట్తో 358 పరుగులు చేశాడు. టోర్నీలో ఏకంగా 28 సిక్సర్లతో అదరగొట్టి ఐపీఎల్ చాన్స్ దక్కించుకున్నాడు. స్కోరు వివరాలు సన్రైజర్స్ హైదరాబాద్: హెడ్ (సి) సాల్ట్ (బి) డఫీ 11; అభిషేక్ (సి) జితేశ్ (బి) డఫీ 7; ఇషాన్ (సి) సాల్ట్ (బి) అభినందన్ 80; నితీశ్ రెడ్డి (సి) అభినందన్ (బి) డఫీ 1; క్లాసెన్ (సి) సాల్ట్ (బి) షెఫర్డ్ 31; సలిల్ అరోరా (సి) పడిక్కల్ (బి) సుయాశ్ 9; అనికేత్ వర్మ (సి) కోహ్లి (బి) షెఫర్డ్ 43; హర్ష్ దూబే (సి) పడిక్కల్ (బి) షెఫర్డ్ 3; హర్షల్ (సి) పడిక్కల్ (బి) భువనేశ్వర్ 0; డేవిడ్ పైన్ (నాటౌట్) 6; ఉనాద్కట్ (నాటౌట్) 4; ఎక్స్ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–18, 2–23, 3–29, 4–126, 5–137, 6–155, 7–167, 8–174, 9–192. బౌలింగ్: డఫీ 4–0–22–3; భువనేశ్వర్ 4–0–31–1; అభినందన్ 3–0–38–1; షెఫర్డ్ 4–0–54–3; సుయాశ్ 3–0–28–1; కృనాల్ 2–0–26–0. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: సాల్ట్ (సి) క్లాసెన్ (బి) ఉనాద్కట్ 8; కోహ్లి (నాటౌట్) 69; పడిక్కల్ (సి) క్లాసెన్ (బి) హర్ష్ 61; పాటీదార్ (సి) హర్ష్ (బి) పైన్ 31; జితేశ్ (సి) ఉనాద్కట్ (బి) పైన్ 0; టిమ్ డేవిడ్ (నాటౌట్) 16; ఎక్స్ట్రాలు 18; మొత్తం (15.4 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–9, 2–110, 3–163, 4–163. బౌలింగ్: నితీశ్ రెడ్డి 2–0–19–0; ఉనాద్కట్ 3–0–29–1; డేవిడ్ పైన్ 3–0–35–2; హర్ష్ దూబే 3–0–35–1; ఇషాన్ మలింగ 2–0–35–0; హర్షల్ 2.4–0–39–0.ఐపీఎల్లో నేడుముంబై X కోల్కతా వేదిక: ముంబైరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
పంతమే నెగ్గింది.. ఉచితంగా ఐపీఎల్ టికెట్లు!
ఐపీఎల్ టికెట్ల విషయంలో కర్ణాటక అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పంతం నెగ్గించుకున్నారు. ఐపీఎల్ టికెట్లు కొనడానికి క్యూలైన్లో నిలబడేందుకు నిరాకరించిన ఎమ్మెల్యేలు ఉచితంగా ఐపీఎల్ టికెట్లు పొందనున్నారు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) అధ్యక్షుడు, టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ సీఎం సిద్ధరామయ్యను కలిసి ఎమ్మెల్యేలకు ఐపీఎల్ ఉచిత టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతోపాటు శనివారం చిన్నస్వామి వేదికగా జరగనున్న సీజన్ తొలి మ్యాచ్ ఆర్సీబీ, హైదరాబాద్ మ్యాచ్కు రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యేలకు చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ స్టేటస్లో ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పించ నున్నట్లు తెలిపారు. చిన్న స్వామి స్టేడియంలో జరిగే అన్ని మ్యాచులకు ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక్కొక్కరికి 3 టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే ఈ పరిణామం జరగడానికి ఒక రోజు ముందు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే చేసిన ఆరోపణలే ఇవాళ వారికి ఉచిత ఐపీఎల్ టికెట్లు రావడానికి కారణమైంది. రాష్ట్ర ఎమ్మెల్యేలకు కేఎస్సీఏ ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, సామాన్యుల లాగే టికెట్స్ కోసం క్యూలో నిలబడడం ఏంటని విమర్శలకు దిగింది. దీంతో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రంగంలోకి దిగి ప్రజాప్రతినిధులకు ఒక్కొక్కరికి రెండేసి టికెట్లు ఇవ్వాల్సిందిగా కర్ణాటక క్రికెట్ బోర్డును కోరారు. దీంతో ఉచిత టికెట్లు ఇచ్చేందుకు కేఎస్సీఏ ముందుకు వచ్చింది. గతేడాది ఐపీఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ ఈసారి తమ ఏడు హోం మ్యాచ్లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో ఆడుతుంది. గత ఏడాది విజయోత్సవంలో జరిగిన విషాదం నేపథ్యంలో ఈసారి చిన్నస్వామిలో మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో తొలుత హోం గ్రౌండ్ను రాయ్పూర్కు మార్చాలని ముందుగా నిర్ణయించింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు అనుమతి లభించింది. అయితే ముందుగా ఇచ్చిన మాట ప్రకారం రెండు మ్యాచ్లను రాయ్పూర్లో ఆడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. #WATCH | Bengaluru: On State MLAs' demand for IPL tickets, Karnataka Deputy CM DK Shivakumar says, "...Four tickets can't be given. So, every MLA, MP and Minister used to get one seat each. Now, we have requested them to give two tickets if the family members go. For tomorrow's… pic.twitter.com/1bA5wUNAnc— ANI (@ANI) March 27, 2026చదవండి: బుమ్రా స్థానంలో ఆకాశ్ మధ్వాల్! -
రోహిత్, కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త
టీమిండియా బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అభిమానులకు కిక్కెక్కించే వార్త ఇది. టెస్ట్లు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న ఈ ఇద్దరు, వచ్చే ఏడాది (2027) మే వరకు 20 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రో-కో ఎలాంటి విరామాలు తీసుకోకుండా ఆడితే ఇది జరుగుతుంది.తాజాగా బీసీసీఐ రానున్న హోం సీజన్లో టీమిండియా షెడ్యూల్ను ప్రకటించింది. ఇందులో ఏకంగా 9 వన్డేలు ఉన్నాయి. మిగతా 11 వన్డేలకు భారత్ విదేశాల్లో ఆడనుంది. 2027 మే వరకు ఇంటా-బయటా టీమిండియా షెడ్యూల్ ఇలా ఉండబోతుంది.ఐపీఎల్ తర్వాత జూన్ 6 నుంచి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏకైక టెస్ట్ మరియు 3 వన్డేల సిరీస్ కోసం భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో జరిగే టెస్ట్ మ్యాచ్ జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా జరుగనుంది. అనంతరం ధర్మశాల (జూన్ 14), లక్నో (జూన్ 17), చెన్నై (జూన్ 20) వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి.అనంతరం భారత్ జులైలో ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి. టీ20లు జులై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్ లీ స్ట్రీట్, ఓల్డ్ ట్రాఫర్డ్, ట్రెంట్ బ్రిడ్జ్, బ్రిస్టల్, సౌథాంప్టన్ వేదికలుగా జరుగనుండగా.. వన్డేలు జులై 14, 16, 19 తేదీల్లో ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్లో జరుగనున్నాయి.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వెస్టిండీస్ జట్టు భారత్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు సహా 5 టీ20లు జరుగనున్నాయి. వన్డేలు సెప్టెంబర్ 27, 30, అక్టోబర్ 3 తేదీల్లో తిరువనంతపురం, గౌహతి, ముల్లాన్పూర్ వేదికలుగా జరుగనుండగా.. టీ20లు అక్టోబర్ 6, 9, 11, 14, 17 తేదీల్లో లక్నో, రాంచీ, ఇండోర్, డెహ్రాడూన్, బెంగళూరు నగరాల్లో జరుగనున్నాయి.తర్వాత టీమిండియా ఆడబోయే వన్డేల వివరాలు..టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో 5 వన్డేలు ఆడే అవకాశం ఉంది. ఈ సిరీస్పై స్పష్టత రావాల్సి ఉంది.డిసెంబర్లో శ్రీలంక భారత్లో పర్యటించి 3 వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచ్లు డిసెంబర్ 13, 16, 19 తేదీల్లో ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్లో జరుగనున్నాయి.వచ్చే ఏడాది జనవరిలో జింబాబ్వే 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత్లో పర్యటిస్తుంది. ఈ మ్యాచ్లు జనవరి 3, 6, 9 తేదీల్లో కోల్కతా, హైదరాబాద్, ముంబైలో జరగుతాయి. -
'ఒక్క నిమిషం కూడా వృథా చేయొద్దు'.. సహచరులకు కోహ్లి వార్నింగ్
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మార్చి 28 నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్ షురూ కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ.. టైటిల్ను ఎలాగైనా రిటైన్ చేసుకోవాలని పట్టుదలతో ఉంది. రజిత్ పాటిదార్ నేతృత్వంలో ఆర్సీబీ జట్టు తాజాగా చిన్నస్వామి స్టేడియంలో తమ మొదటి ట్రైనింగ్ సెషన్లో పాల్గోంది. ఈ సందర్భంగా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఆటగాళ్లలలో స్ఫూర్తి నింపుతూ ప్రసంగించాడు. "గత రెండు, మూడు సీజన్లలో మనం పడ్డ కష్టానికి ఫలితం గతేడాది దక్కింది. కానీ ఈసారి మరిన్ని కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. ఎందుకంటే అన్ని జట్లు మనల్ని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాయి. గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ సమయాన్ని వృథా చేయొద్దు. ప్రతీ సెషన్లోనూ ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి. ఈ టోర్నీలో సత్తాచాటేందుకు మనమంతా ఉత్సాహంగా ఉన్నామని అందరి ముఖాల్లో కనిపిస్తోంది" అని కోహ్లి పేర్కొన్నాడు. కాగా ఆర్సీబీ తొలి టైటిల్ సాధించడంలో కోహ్లిది కీలక పాత్ర. మొత్తం 15 మ్యాచ్లలో 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లోనూ ఆర్సీబీ విరాట్ కీలకం కానున్నాడు.చదవండి: IPL 2026: దుమ్ములేపిన పప్పు యాదవ్ కొడుకు.. కేవలం 16 బంతుల్లోనే -
IPL 2026: బోల్తా కొట్టిన విరాట్ కోహ్లీ!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి మరో వారం రోజుల సమయం మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్లోని ఆయా జట్లు ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నాయి. మార్చి 28న జరగనున్న సీజన్ ఆరంభ మ్యాచ్లోనే డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో తలపడనుంది. ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇప్పటికే లండన్ నుంచి భారత్ చేరుకొని తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. తాజాగా ప్రాక్టీస్ సందర్భంగా టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన యార్కర్ బంతికి కోహ్లీ వద్ద సమాధానం లేకుండా పోయింది. 36 ఏళ్ల వయసులోనూ బంతిని స్వింగ్ చేయడంలో తన పదును చూపెడుతున్నాడు. భువీ వేసిన అద్భుత యార్కర్ కోహ్లీ లెగ్స్టంప్ను తాకుతూ వెళ్లింది. దీంతో అదుపు తప్పిన కోహ్లీ పక్కకు పడిపోగా బంతి వెళ్లి నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో షాక్ తిన్న కోహ్లీ ‘వాట్ ఏ బాల్ భువీ’ అంటూ పేర్కొన్నాడు. దీనికి భువనేశ్వర్ నవ్వుతోనే రియాక్షన్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను ఒక అభిమాని తన ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేసుకోవడంతో వైరల్గా మారింది. గతేడాది ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీతో పాటు భువనేశ్వర్ కూడా కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్లో కోహ్లీ 15 ఇన్నింగ్స్ల్లో 657 పరుగులు సాధించగా.. భువనేశ్వర్ 14 మ్యాచ్ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లోనూ ఈ ఇద్దరు సీనియర్లు ఆర్సీబీకి కీలకం కానున్నారు. బ్యాటింగ్లో కోహ్లీ పెద్దన్న పాత్ర పోషించనుండగా.. బౌలింగ్ దళాన్ని భువనేశ్వర్ నడిపించనున్నాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు జోష్ హాజిల్వుడ్ గాయం కారణంగా సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరంగా ఉండడనున్నాడు. మరోవైపు భారత బౌలర్ యశ్ దయాల్ విషయంలో కూడా స్పష్టత లేదు. దీంతో రషీక్ సలామ్, మంగేశ్ యాదవ్లకు భువనేశ్వర్ మెంటార్గా కూడా వ్యవహరించే అవకాశముంది. ఐపీఎల్ 2025 మెగావేలంలో భువనేశ్వర్ కుమార్ను ఆర్సీబీ రూ. 10.75 కోట్లకు కొనుగోలు చేయడం విశేషం.This yorker from Bhuvneshwar Kumar completely beat Virat Kohli.🫡In the last two years, Bhuvneshwar Kumar’s name has gone a bit down, but maybe in this IPL he will definitely do something special.🙌 pic.twitter.com/L0bF9BsR0Z— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 19, 2026చదవండి: ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు! -
ODI WC: బీసీసీఐ బిగ్ ప్లాన్.. షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా 2024 నుంచి ఏకంగా మూడు టైటిళ్లు గెలిచింది. టీ20 ప్రపంచకప్-2024, చాంపియన్స్ ట్రోఫీ-2025, టీ20 ప్రపంచకప్-2026లలో చాంపియన్గా నిలిచింది. తదుపరి వన్డే వరల్డ్కప్-2027 టోర్నీ రూపంలో మరో ఐసీసీ ఈవెంట్ వేచి ఉంది.షార్ట్లిస్టులో ఇరవై పేర్లు!ఈ మెగా టోర్నీకి దాదాపు పద్దెనిమిది నెలలకు పైగానే సమయం ఉంది. అయినప్పటికీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటి నుంచే జట్టు ఎంపికపై దృష్టి సారించింది. ఇప్పటికే దాదాపు ఇరవై మంది ఆటగాళ్లను షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 ప్రదర్శన కూడా ఇందులో కీలకం కానున్నట్లు సమాచారం.ప్రణాళికలు సిద్ధంచీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా ఎస్ఎస్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, ప్రజ్ఞాన్ ఓజా ఇందుకు సంబంధించి కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు PTIతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్క సెలక్టర్ ఐపీఎల్లో వారానికి ఒక్క మ్యాచ్ అయినా ప్రత్యక్షంగా చూసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉంది.తద్వారా వారానికి ఐదు మ్యాచ్లు కవర్ అవుతాయి. ఇక టీవీలోనూ మ్యాచ్లు వీక్షించడం ద్వారా ఆటగాళ్ల ఫామ్పై సెలక్టర్లు ఓ అంచనాకు వస్తారు’’ అని పేర్కొన్నాయి. కాగా టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలపై సెలక్టర్లు ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది.వారికి చోటు ఉందా?ఐపీఎల్లో కోహ్లి బెంగళూరు జట్టు తరఫున, రోహిత్ ముంబై తరఫున కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టెస్టు, అంతర్జాతీయ టీ20లకు స్వస్తి పలికిన రో-కోలకు ఈసారి ఐపీఎల్ అత్యంత కీలకం కానుంది. గతేడాది దేశీ వన్డే క్రికెట్ బరిలో దిగిన ఈ ఇద్దరూ అక్కడా సత్తా చాటారు. ఆ తర్వాత టీమిండియా తరఫునా అదరగొట్టారు. తద్వారా తాము వన్డే వరల్డ్కప్-2027 టోర్నీకి సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇచ్చారు. అయితే, సెలక్టర్లు వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.చదవండి: పాకిస్తాన్కు షాకిచ్చిన బంగ్లా క్రికెట్ బోర్డు! -
విరాట్ కోహ్లి విశ్వరూపం.. తొలి రోజే సిక్సర్ల వర్షం!
ఐపీఎల్-2026 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సన్నద్దమవుతున్నాడు. బుధవారం ఆర్సీబీ జట్టుతో చేరిన కోహ్లి.. తన తొలి నెట్ ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించాడు. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి తన ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు.ముఖ్యంగా ఫుట్ వర్క్ ఉపయోగిస్తూ ముందుకు వచ్చి మరి భారీ షాట్లతో విరుచుపడ్డాడు. దాదాపు ఏడాది నుంచి కేవలం వన్డేలకు పరిమితమైన కోహ్లి.. ఇప్పుడు టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా తన బ్యాటింగ్ను మలుచుకోవడం విశేషం. అయితే కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు.విరాట్ తను చివరగా ఆడిన న్యూజిలాండ్, సౌతాఫ్రికా వన్డే సిరీస్లో దుమ్ములేపాడు. సౌతాఫ్రికా సిరీస్లో మూడు మ్యాచ్లు ఆడిన కోహ్లి.. 151 సగటుతో 302 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ ఉంది. ఆ తర్వాత న్యూజిలాండ్పై కూడా తన ఫామ్ను కొనసాగించాడు. 3 మ్యాచ్ల్లో 80 సగటుతో 240 పరుగులు చేశాడు. ఇప్పుడు అదే జోరును ఐపీఎల్లో కూడా కొనసాగించాలని కింగ్ ఉవ్విళ్లూరుతున్నాడు. కాగా గత సీజన్లోనూ కోహ్లి అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంలో కోహ్లిది కీలక పాత్ర. కోహ్లి మరోసారి తన అద్భుత ప్రదర్శనలతో ఆర్సీబీకి టైటిల్ను అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఆర్సీబీ తమ తొలి మ్యాచ్లో మార్చి 28న చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడనుంది.చదవండి: IPL 2026: 'అతడితో జాగ్రత్త.. స్టార్ బ్యాటర్లను సైతం భయపెట్టగలడు'Wtf is Virat Kohli cooking in nets. Man is Dealing only in sixes 😭😭Someone really said, 2026 is the new 2016. pic.twitter.com/rSBD0HUkmc— Selfless⁴⁵ (@SelflessCricket) March 18, 2026 -
అతడు ఆర్సీబీ గుండెచప్పుడు: డివిలియర్స్
ఐపీఎల్-2026 సీజన్ కోసం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో చేరాడు. త్వరలోనే అతడు ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది.వరుసగా రెండో సీజన్లోనూ విజేతగా నిలవాలని బెంగళూరు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం, ఆర్సీబీ స్టార్ ఏబీ డివిలియర్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్-19వ సీజన్లోనూ ఆర్సీబీకీ కోహ్లి కీలకం కానున్నాడని డివిలియర్స్ తెలిపాడు. కాగా బెంగళూరు తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో విరాట్ది కీలక పాత్ర. ఐపీఎల్-2025 సీజన్లో కోహ్లి అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్లు ఆడిన కోహ్లి 657 పరుగులు చేసి ఆర్సీబీ తరపున టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే జోరును విరాట్ కొనసాగించాలని ఏబీడీ కోరుకుంటున్నాడు."ఆర్సీబీకి విరాట్ కోహ్లి గుండెచప్పుడు లాంటి వాడు. కేవలం తన అద్భుతమైన బ్యాటింగ్తో మాత్రమే కాకుండా, అతడు చూపించే పట్టుదల, ఎనర్జీ జట్టులోని ఇతర ఆటగాళ్లకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి. మైదానంలోనూ, మైదానం వెలుపలా కోహ్లి వ్యవహరించే తీరు అమోఘం.విరాట్ నుంచి యువ ఆటగాళ్లు చాలా విషయాలు నేర్చుకున్నారు. కోహ్లి సృష్టించిన ఈ సానుకూల వాతావరణమే, గత సీజన్లో ఆర్సీబీ తన తొలి టైటిల్ నెగ్గడానికి ప్రధాన కారణం. అంతకుముందు సీజన్ వరకు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లపై మాత్రమే ఆర్సీబీ ఆధారపడేది. కానీ ఇప్పుడు మాత్రం తొలి టైటిల్ గెలవడంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంతు పాత్ర పోషించారు" అని జియో హాట్స్టార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏబీడీ పేర్కొన్నాడు.చదవండి: సీఎస్కే వైస్ కెప్టెన్గా అతడే సరైనోడు: అనిల్ కుంబ్లే -
రికార్డు స్థాయి బిడ్.. తుది దశకు ఆర్సీబీ అమ్మకం!
ఐపీఎల్లో 2025లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చాంపియన్గా నిలిచింది. అయితే 17 సీజన్ల పాటు కింగ్ఫిషర్ కంపెనీ నిర్వహిస్తూ వచ్చిన ఆర్బీబీ ఫ్రాంచైజీని అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్సీబీ అమ్మకం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. స్వీడన్కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఈక్యూటీ భారీ బిడ్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు మణిపాల్ హాస్పిటల్స్ అధినేత రంజన్ పై, అమెరికా సంస్థ కోల్బెర్గ్ క్రావిస్ రాబర్ట్స్ అండ్ కో (కేకేఆర్), సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ టెమాసెక్ కలసిన కన్సార్టియం కూడా పోటీలో ఉంది. కాగా మొత్తం డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా. ప్రారంభంలో మాంచెస్టర్ యునైటెడ్ సహ యజమానులు గ్లేజర్స్, అదార్ పూనావాలా కూడా ఆసక్తి చూపినప్పటికీ చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. గ్లేజర్స్ సుమారు 1.8 బిలియన్ డాలర్ల నాన్ బైండింగ్ ఆఫర్ ఇచ్చినట్లు, అయితే ఈక్యూటీ దాన్ని దాటేలా బిడ్ పెంచినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ డీల్ సూటిగా బిడ్డింగ్ పోరుగా మారింది. డయాజియో గ్రూప్ మార్చి 31ని గడువుగా పెట్టి ఈ అమ్మకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడం వెనుక కూడా ఈ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. మూడు సంస్థలు బైండింగ్ బిడ్లు సమర్పించినట్లు తెలుస్తోంది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఫేవరెట్గా నిలుస్తోంది. మొదట మెజారిటీ వాటా అమ్మాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం ఇప్పుడు పూర్తి విక్రయానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీ విలువ 1.1 బిలియన్ నుంచి 1.35 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా. రైన్ గ్రూప్ ఈ అమ్మక ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అమెరికాకు చెందిన డేవిడ్ బ్లిట్జర్, ఆదిత్య బిర్లా గ్రూప్ కలిసి కన్సార్టియంగా బిడ్ సమర్పించినట్లు తెలుస్తోంది. మార్చి 31 ఈ డీల్ కూ కీలక గడువుగా ఉంది. అయితే ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అభిమానులు చాలా మంది ఉంటారు. ఖరీదైన జట్టుగా పేరున్న ఆర్సీబీని దక్కించుకోవడానికి రెండు ప్రధాన సంస్థలు పోటీలో ఉన్నాయి. అంతిమంగా ఐపీఎల్ ఫ్రాంచైజీల విలువలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, ఆర్సీబీ అమ్మకం ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద డీల్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.చదవండి: ఐపీఎల్ ఖరీదైన ఆటగాడి అసహనం! -
’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హెడ్కోచ్గా గౌతం గంభీర్ తన పనిని సరిగ్గానే చేశాడని పేర్కొన్నాడు. ఏదేమైనా సరైన సమయంలోనే తాను ఆటకు వీడ్కోలు పలికానని భావిస్తున్నట్లు తెలిపాడు.గంభీర్ హెడ్కోచ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నాళ్లకే టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. టూర్ మధ్యలోనే అనూహ్యంగా అశూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్తో తొలి టెస్టులో అశూను బెంచ్కే పరిమితం చేసిన యాజమాన్యం.. వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించింది.పిలిచి.. మళ్లీ తప్పించిఅయితే, రెండో టెస్టు కోసం అశూను పిలిపించింది. ఆ తర్వాత మూడో టెస్టులో అతడి స్థానాన్ని రవీంద్ర జడేజా (Ravindra Jadeja)తో భర్తీ చేశారు. దీంతో ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం చర్చకు దారితీసింది. ఇందుకు గంభీర్ కారణం అయి ఉంటాడనే ఊహాగానాలు వచ్చాయి.ఏదేమైనా టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (619) తర్వాతి స్థానాన్ని ఆక్రమించిన అశూ (537).. ఇంకొన్నాళ్లు ఆడి ఉంటే అతడి రికార్డు సమం చేయగలిగే వాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అశూ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.అదే అతిపెద్ద బలం‘‘సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం నాకున్న అతిపెద్ద బలం. అది తప్పా, ఒప్పా అని ప్రజలు చర్చించుకున్నా నేనేం పట్టించుకోను. పెర్త్లో వాషీ, ఆ తర్వాత అడిలైడ్లో నేను, బ్రిస్బేన్లో జడేజా.. ఇలా ఒకరి తర్వాత ఒకరం స్పిన్ దళాన్ని నడిపించాము.నేను జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాను. దానర్థం వాషీ, జడ్డూకు నేను మార్గం సుగమం చేయాలనే కదా అనిపించింది. వద్దన్నా నేను పట్టుకుని వేలాడే రకం కాదు. కెరీర్లో నేను చాలా దూరం వచ్చేశాను. అనుకున్నవి సాధించగలిగాను. కొంతమంది ఈ విషయంలో గంభీర్ గురించి వారికి నచ్చినట్లు మాట్లాడారు.నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదుకోచ్గా తన జాబ్ తాను చేశాడు. ఒకవేళ నేను, విరాట్, రోహిత్.. రిటైర్మెంట్ ప్రకటించాలని ఆయన కోరుకుని ఉండవచ్చు. హెడ్కోచ్గా ఆయన ఆలోచనలు ఆయనకు ఉంటాయి. ఇందులో తప్పుబట్టడానికి ఏమీలేదు.స్వార్థం, ఈగో వదిలేయాలని నేను ఎల్లప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం మనుషులం. భావోద్వేగాలు ఉండటం సహజం’’ అని అశూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. కాగా ఆసీస్ టూర్ తర్వాత అకస్మాత్తుగా రోహిత్ శర్మ టెస్టులకు గుడ్బై చెప్పగా.. అనూహ్య రీతిలో టెస్టు దిగ్గజ బ్యాటర్ కోహ్లి సైతం ఇదే బాటలో నడిచాడు. దీంతో గంభీర్పై మరోసారి విమర్శలు వచ్చాయి. చదవండి: T20 WC Final: ’అర్ష్దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
కోహ్లి కాదు!.. అత్యుత్తమ టీ20 క్రికెటర్ అతడే: డివిలియర్స్
ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఒకడు. జాతీయ జట్టు తరఫునే కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని టీ20 లీగ్లలో ఆడిన ఘనత ఈ బ్యాటర్కు ఉంది.ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఏబీడీకి ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ జట్టు మాజీ ఆటగాడు, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్, ప్రస్తుత లెజెండరీ బ్యాటర్ విరాట్ కోహ్లితోనూ డివిలియర్స్ బంధం విడదీయలేనిది. ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి ఐదేసిసార్లు చాంపియన్లుగా నిలిచిన జట్లతో ఏబీడీ మ్యాచ్లు ఆడాడు.ఇది వివాదాస్పదం కావొచ్చుటీ20 ఫార్మాట్లో అపార అనుభవం ఉన్న ఏబీ డివిలియర్స్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ఆల్టైమ్ టీ20 క్రికెటర్ ఎవరన్న ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబు వైరల్గా మారింది. ‘‘ఇది వివాదాస్పదం కావొచ్చు.. కాదు కాదు.. వివాదానికి తావులేదు. ఇదొక చర్చనీయాంశమైన జవాబు కావొచ్చు.ఎందుకంటే.. అత్యుత్తమ టీ20 ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా అని నేను అనుకుంటున్నా. కానీ అతనెప్పుడూ నాకు బౌలింగ్ చేయలేదు. అయితే, నిలకడైన ఆటకు అతడు మారుపేరు. ముఖ్యంగా 20 ఓవర్ల ఆటలో ఏ సమయంలోనైనా.. ఎంత ఒత్తిడిలో ఉన్నా.. కొత్త బంతి లేదంటే పాత బంతితో అతడు అద్భుతాలు చేయగలడు.గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తాసూపర్ ఓవర్ అయినా.. మరి ఇంకేదైనా బంతి అతడికి చేతికి ఇస్తే గెలుపును బహుమానంగా ఇవ్వగల సత్తా అతడికి ఉంది. దటీజ్ జస్ప్రీత్ బుమ్రా’’ అని డివిలియర్స్ బుమ్రాను ఆకాశానికెత్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.పదిహేను పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లుకాగా టీ20 ప్రపంచకప్-2026లో బుమ్రా సత్తా చాటిన విషయం తెలిసిందే. టీమిండియా మరోసారి వరల్డ్కప్ చాంపియన్గా నిలవడంలో అతడి పాత్ర కీలకం. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో బుమ్రా.. నాలుగు ఓవర్ల కోటాలో కేవలం పదిహేను పరుగులే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు కూల్చాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఓవరాల్గా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పద్నాలుగు వికెట్లు కూల్చి అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో బుమ్రాపై ప్రశంసల వర్షం కొనసాగుతుండగా.. డివిలియర్స్ సైతం ఈ మేరకు కొనియాడటం గమనార్హం. సత్తా చాటుతున్న బుమ్రాఇదిలా ఉంటే.. వరల్డ్కప్ టోర్నీలో మరో భారత బౌలర్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా పద్నాలుగు వికెట్లు తీసి బుమ్రా సరసన నిలిచాడు. కాగా బుమ్రా ఇప్పటికి 95 అంతర్జాతీయ టీ20లలో కలిపి 121 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో 145 మ్యాచ్లు ఆడి 183 వికెట్లు కూల్చాడు. ఇక ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్ తరఫున మరోసారి సత్తా చాటేందుకు బుమ్రా సిద్ధయ్యాడు. View this post on Instagram A post shared by Nikhil Uttamchandani (@nikuttam) -
రోహిత్, కోహ్లీతో విభేదాలు.. మౌనం వీడిన గంభీర్!
టీమిండియా స్టార్క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మెరుగైన సంబంధాలు కొనసాగించలేదా అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీనే. ఎందుకంటే గంభీర్ కోచ్గా వచ్చిన కొద్ది రోజులకే బోర్డర్ గావస్కర్ టెస్టు సిరీస్ వైఫల్యం అనంతరం రోహిత్, విరాట్లు ఏకకాలంలో టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఈ ఇద్దరు టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలకడానికి ఒకరకంగా గంభీరే కారణమని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. తాజాగా కోల్కతాలో ఒక ప్రైవేటు కార్యక్రమానికి అతిథిగా హాజరైన గంభీర్ చాలా విషయాలు పంచుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్, కోహ్లీతో ఉన్న బంధాన్ని నేరుగా కాకుండా పరోక్షంగా ప్రస్తావించడం ఆసక్తి కలిగించింది. ‘మనిషిగా నేను తప్పులు చేయడం సహజం. కోచ్ పాత్రలో ఉన్నప్పుడు తప్పులు జరుగుతాయి. అలాగే ఆటగాళ్లు కూడా తప్పులు చేయడం జరుగుతుంటుంది. గత 18 నెలల్లో కోచ్గా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ దాని గురించి పెద్దగా పట్టించుకోను. సోషల్ మీడియాలో నేను కోహ్లి, రోహిత్లకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతి కామెంట్కు సమాధానం ఇవ్వడం నా పని కాదు. భారత జట్టు నా ఒక్కడిదే కాదు.. అది డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నవాళ్లతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరిది. కానీ ఒక విషయం మాత్రం కచ్చితంగా నమ్ముతా. అదేంటంటే కొన్నిసార్లు మంచి ఉద్దేశంతో తీసుకునే నిర్ణయాలు విఫలం కావొచ్చు. కానీ తప్పుడు ఉద్దేశంతో కూడిన తప్పుడు నిర్ణయాలు మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. పని విషయంలో నేను నిజాయితీగా ఉన్నంతవరకు, ఎదుటివారి కళ్లలోకి చూస్తూ ధైర్యంగా మాట్లాడగలను. నా తప్పు లేనంత వరకు అన్ని విషయాల్లో కఠినంగానే ఉంటాను.’అని గంభీర్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ల ఓటమి తర్వాత కోచ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మలను బీసీసీఐ సమీక్షకు పిలిచింది. ఆ సమయంలో టీమిండియా ఆటగాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛను అడ్డుకుంటూ బోర్డు అనేక మార్గదర్శకాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని గంభీర్ స్వాగతించగా, రోహిత్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. అప్పుడే రోహిత్ శర్మను టెస్టు కెప్టెన్గా వైదొలగాలని బోర్డు ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలానికే రోహిత్ శర్మ, కోహ్లీలు టెస్టు కెరీర్కు గుడ్బై చెప్పారు. రోహిత్ టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలు శుబ్మన్ గిల్కు అప్పగించారు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్, వెస్టిండీస్లపై టెస్టు సిరీస్లు నెగ్గినప్పటికీ, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్లో మిశ్రమ ఫలితమే వచ్చింది. ఇక కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత ఈ ఇద్దరు అంతర్జాతీయ కెరీర్కు గుడ్బై చెప్పే అవకాశముంది.🚨 BREAKING & EXCLUSIVE 🚨 "I am human, I am allowed to make mistakes": Gautam Gambhir opens up on dressing room relationships. He also shares his views on Rohit Sharma-Virat Kohli@AgeasFederal #GautamGambhir #Trailblazers4 pic.twitter.com/alsJdNHvm4— RevSportz Global (@RevSportzGlobal) March 16, 2026 -
కోహ్లీ అత్యుత్తమ టీ20 ఓపెనర్ అతడే!
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి ప్రస్తుతం లండన్లోనే మకాం పెట్టాడు. మార్చి 28 నుంచి ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభం కానుండడంతో కోహ్లీ తన ప్రాక్టీస్ను ఇప్పటికే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ప్రాక్టీస్కు సంబంధించిన వీడియోను కూడా ఇటీవలే తన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నాడు. తాజాగా కోహ్లీ తన బెస్ట్ టీ20 ఓపెనర్గా విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ను ఎంచుకున్నాడు. విషయంలోకి వెళితే బెస్ట్ టీ20 ఓపెనర్గా టీమిండియా నుంచి కానీ, అంతర్జాతీయ క్రికెటర్ల నుంచి ప్రస్తుత, మాజీల్లో ఎవరిని ఎన్నుకుంటారని విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రశ్న వేసింది. అయితే మొదట సచిన్, సెహ్వాగ్లలో ఎవరిని ఎన్నుకుంటారని అడగ్గా.. ‘టీ20 ఓపెనర్ కాబట్టి నా మొదటి ప్రాధాన్యత సెహ్వాగ్’ అని కోహ్లీ జవాబిచ్చాడు. ఆ తర్వాత ఫైనల్ చాయిస్లో రోహిత్ శర్మ, క్రిస్ గేల్ పేర్లు వచ్చాయి. కానీ ఇక్కడ కోహ్లీ రోహిత్ను కాదని ఆర్సీబీ మాజీ సహచర ఆటగాడు గేల్కే ఓటేశాడు. రోహిత్, సెహ్వాగ్ కూడా నా దృష్టిలో గొప్ప టీ20 ఓపెనర్లే అని పేర్కొన్నాడు. కానీ ఆర్సీబీ తరఫున ఆడేటప్పుడే ఓపెనర్గా గేల్ విధ్వంసాన్ని కళ్లారా చూశానని తెలిపాడు. ఆరంభం నుంచే బంతిని బౌండరీ లేదా సిక్సర్గా మలవాలన్న కోరిక గేల్లో బలంగా కనిపించేదదన్నాడు. అందుకే గేల్ టీ20ల్లో అత్యుత్తమ ఓపెనర్ అని చెప్పగలనని స్పష్టం చేశాడు. ఇక గతేడాది ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు కోహ్లీ ఐపీఎల్లో 267 మ్యాచ్ల్లో 132 స్ట్రైక్రేట్ తో 8,661 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలున్నాయి. 2025 సీజన్లో కోహ్లీ 15 మ్యాచ్ల్లో 657 పరుగులు సాధించాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు జట్టు ఆరు పరుగుల తేడాతో పంజాబా్ కింగ్స్పై విజయం సాధించి తొలిసారి టైటిల్ను ముద్దాడింది.చదవండి: ‘అభిషేక్ను అందుకే వెనుకేసుకొచ్చా’ -
న్యూ లుక్లో విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
ఐపీఎల్-2026 సీజన్కు ముందు టీమిండియా స్టార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దిగ్గజం విరాట్ కోహ్లి కొత్త హెయిర్ స్టైల్తో దర్శనమిస్తున్నాడు. ఈ కొత్త లుక్ను ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ జార్డన్ టబాక్మాన్ డిజైన్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను జార్డన్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. కోహ్లి దాదాపు ప్రతీ ఐపీఎల్ సీజన్లోనూ కొత్త లుక్తో బరిలోకి దిగుతుంటాడు. ఇప్పుడు మరోసారి తన న్యూ లుక్తో అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నాడు. కాగా విరాట్ ప్రస్తుతం లండన్లోనే ఉన్నాడు. కోహ్లి త్వరలోనే ఆర్సీబీ క్యాంపులో చేరనున్నాడు.ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఐపీఎల్ 19వ సీజన్ మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. View this post on Instagram A post shared by Jordan Tabakman (@jordantabakman)తొలిసారి ఛాంపియన్స్కాగా 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ గతేడాది తొలి ఐపీఎల్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ చారిత్రత్మక విజయంలో కింగ్ కోహ్లిది కీలక పాత్ర. గత సీజన్లో కోహ్లీ 657 పరుగులతో లీడింగ్ రన్స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు అదే ఫామ్ను ఈ ఏడాది సీజన్లో కొనసాగించాలని చేజ్ మాస్టర్ ఉవ్విళ్ళూరుతున్నాడు. తను చివరిగా ఆడిన న్యూజిలాండ్ సిరీస్లోనూ కోహ్లి దుమ్మలేపాడు.చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్ -
రోహిత్-కోహ్లి అభిమానులకు శుభవార్త
భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త అందుతుంది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా క్రికెట్లో కొనసాగుతున్న రో-కోకు ఆ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలు ఆడే ఆస్కారమున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్లో (FTP) షెడ్యూలైన మ్యాచ్లకు అదనంగా కొన్ని దేశాలు భారత్తో వన్డేలు ఆడేందుకు బీసీసీఐని సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఏడాది భారత్ షెడ్యూల్ కిక్కిరిసిపోయింది. అదనంగా మ్యాచ్లు అంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఐర్లాండ్ దేశాల క్రికెట్ బోర్డులు అదనపు మ్యాచ్ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది.కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచకప్ ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్ జూన్లో ఆఫ్ఘనిస్తాన్ సిరీస్తో మొదలవుతుంది.అనంతరం జులై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ల కోసం ఇంగ్లండ్లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది.ఆతర్వాత భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో టెస్ట్, టీ20 సిరీస్ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివర్లో భారత్తో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందని తెలుస్తుంది.ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు షెడ్యూల్ అయ్యాయి. వీటికి అదనంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు మరిన్ని వన్డేలు ఆడాలని బీసీసీఐని కోరుతుంది.వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఇంగ్లండ్ కూడా భారత్తో అదనపు వన్డే సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాక బంగ్లాదేశ్, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల సిరీస్లు కూడా FTPకి అదనంగా ప్రోగ్రెస్లో ఉన్నట్లు తెలుస్తుంది.మొత్తానికి 2027 వన్డే ప్రపంచకప్కు సన్నద్దం కావాలనుకుంటున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. ఇది వారివారి అభిమానులకు పండగే. రో-కో టెస్ట్, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా అక్టోబర్, నవంబర్ నెలల్లో జరుగనుంది. ఈ లోపు రో-కో పదుల సంఖ్యలో వన్డేలు ఆడే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగ్గజాలు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, అభిమానుల గుండెల్లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకుంటారు.ఐపీఎల్ 2026 అనంతరం టీమిండియా షెడ్యూల్ (అంచనా)..ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేలు, ఓ టెస్ట్ఐర్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు సన్నాహాలు జరుగుతున్నాయిఇంగ్లండ్తో 3 వన్డేలు, 5 టీ20లు (అదనపు మ్యాచ్లపై ఆసక్తి)శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్ట్లుబంగ్లాదేశ్తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి అవసరం)ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20లుజింబాబ్వే టీ20 సిరీస్కు సన్నాహాలు జరుగుతున్నాయివెస్టిండీస్తో 3 వన్డేలు, 5 టీ20లుఆసియా క్రీడలున్యూజిలాండ్తో 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్ట్లు (అదనంగా 2 వన్డేలకు అభ్యర్థన)శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లుఆస్ట్రేలియాతో 5 టెస్ట్లు -
T20 WC: రోహిత్, ద్రవిడ్పై సూర్యకుమార్ విమర్శలు?!
టీమిండియా ఇప్పటికి మూడు టీ20 ప్రపంచకప్ ట్రోఫీలు గెలిచింది. ఐసీసీ తొలిసారి 2007లో ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్ వరల్డ్కప్లో ధోని సారథ్యంలో విజేతగా నిలిచిన భారత్.. 2024లో రోహిత్ కెప్టెన్సీలో టైటిల్ గెలిచింది. తాజాగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.2024 మాదిరి కాదుఅయితే, 2024లో నాటి కెప్టెన్ రోహిత్- హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rohit Sharma- Rahul Dravid) అనుసరించిన విధానాలకు, 2026లో సూర్య- గంభీర్ వ్యూహాలకు చాలా తేడా ఉందని యాజమాన్యం చెబుతోంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై స్వయంగా స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదనే నియమం పెట్టుకున్నామని.. అదే తమకు సత్ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నాడు.వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి..‘‘2024 టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఎలా ఆడామో మాకు తెలుసు. అయితే, అదే బ్రాండ్ ఆఫ్ క్రికెట్తో కొనసాగితే కష్టమని అర్థమైంది. అందుకే.. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి మ్యాచ్లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.ఈసారి సెమీ ఫైనల్ వరకు అందరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు.. మా జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరూ టాప్ రన్ స్కోరర్ లేదంటే లీడింగ్ వికెట్ టేకర్గా లేరు. అయినా సరే మేము గెలుస్తూనే ఉన్నాం.ప్రతి మ్యాచ్లో ప్రతి ఒక్క ఆటగాడు తనవంతు సహకారం అందించాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఇలా జట్టుగా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని ఓ వైరస్లాగా వ్యాప్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పద్దెనిమిది నెలల క్రితమే ఈ సంప్రదాయాన్ని జట్టులో ప్రవేశ పెట్టాము’’ అని సూర్యకుమార్ యాదవ్ ఇండియన్ ఎక్స్ప్రెస్తో పేర్కొన్నాడు.కోహ్లిపై విమర్శలుఇక టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ సైతం సూర్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘‘గత వరల్డ్కప్ గెలిచిన జట్టులో రోహిత్, విరాట్, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.ఈసారి బుమ్రా, హార్దిక్ తప్ప పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. అయితే, అప్పటికి ఇప్పటికి మేము ఇన్నింగ్స్ ప్లాన్ చేసిన విధానం వేరుగా ఉంది. మా ఆలోచనకు తగినట్లు అప్పుడు రోహిత్ శర్మ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు.కానీ విరాట్ కోహ్లి యాంకర్ ఇన్నింగ్స్ ఆడేవాడు. ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం, కాస్త నెమ్మదిగా ఆడటం వంటి వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. హార్దిక్, అభిషేక్ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో కొత్త జోష్ తీసుకువచ్చారు. 2024, 2026 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’ -
IPL 2026: కోహ్లీ ప్రాక్టీస్.. ఐపీఎల్ జరుగుతుందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభ తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రం తన ప్రాక్టీస్ను మొదలుపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్బీబీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లీ తాజాగా ఐపీఎల్ కోసం నెట్స్లో తీవ్రంగా కసరత్తులు చేస్తున్న వీడియోనూ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ‘ఐపీఎల్ 2026’ అని క్యాప్షన్ మాత్రమే జత చేసినప్పటికీ కోహ్లీ ప్రాక్టీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నెట్స్లో బరిలోకి దిగిన కోహ్లీ చేతికి గ్లోవ్స్, తలకు హెల్మెట్ పెట్టుకొని బరిలోకి దిగడం, బ్యాటింగ్ ప్రాక్టీస్లో కొన్ని అద్భుతమైన షాట్లు ఆడడం ముగ్ధమనోహరంగా అనిపించింది. కోహ్లీ చివరిసారిగా గత జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ఆడాడు. ఆ సిరీస్లో కోహ్లీ ఒక సెంచరీ, అర్థసెంచరీ సాయంతో టీమిండియా తరఫున టాప్ స్కోరర్గా నిలిచినప్పటికీ భారత్ మాత్రం 1-2 తేడాతో కివీస్కు సిరీస్ కోల్పోయింది. ఇక ఐపీఎల్ 2025 విజేతగా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో కోహ్లీ 144 స్ట్రైక్రేట్తో 657 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు కొనసాగుతూ వచ్చిన కోహ్లీ మొత్తంగా ఐపీఎల్లో 8,661 పరుగులు సాధించాడు. ఇక గతేడాది తొలిసారి టైటిల్ సాధించిన బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ గెలవాలన్న కృతనిశ్చయంతో ఉంది. మార్చి 28 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ షురూ కావాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ ఇప్పటికీ షెడ్యూల్ విడుదల చేయకపోవడం గమనార్హం. అయితే దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈసారి ఐపీఎల్ను రెండు విడతల్లో నిర్వహించాలని ఇప్పటికే ఐపీఎల్ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. కానీ పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా విమాన సర్వీసుల రద్దుతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణాలకు ఇబ్బంది ఏర్పడడం, ఎల్పీజీ సంక్షోభంతో బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూతపడడం లాంటి కారణాల వల్ల అసలు అనుకున్న సమయానికి ఐపీఎల్ సీజన్ ప్రారంభమవుతుందా లేక వాయిదా పడుతుందా అన్నది చూడాలి.చదవండి: స్లో బంతుల వెనుక 16 ఏళ్ల కథ! View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
కోహ్లీ అందుకే రాలేకపోయాడా!
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ప్రపంచకప్కు అందుకుంది. అయితే ఈ మ్యాచ్కు ముఖ్య అతిథులుగా మాజీ కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ హాజరైన సంగతి తెలిసిందే. అయితే కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రపంచప్ ఫైనల్ మ్యాచ్ వీక్షించేందుకు రాకపోవడం వెనుక సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చే జరుగుతున్నది. కోహ్లీ రాకపోవడం వెనుక అభిమానులు ఎవరికి వారే తమకు నచ్చింది ఊహించుకుంటున్నారు. ధోనీ, రోహిత్లు కెప్టెన్లుగా ఐసీసీ ట్రోఫీలు సాధించారని, కానీ కోహ్లీ మాత్రం కెప్టెన్గా ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడని, అందుకే తాజా టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు హాజరయ్యేందుకు సముఖత వ్యక్తం చేయలేదని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా వేదికగా 2007 తొలి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు ధోనీ సారథ్యం వహించగా, అమెరికా, వెస్టిండీస్లు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన 2024 టీ20 ప్రపంచకప్ను నెగ్గిన టీమిండియాకు రోహిత్ కెప్టెన్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే కోహ్లీ 2017 చాంపియన్స్ ట్రోఫీ, 2019 వన్డే వరల్డ్కప్, 2021 ఐసీసీ టెస్టు చాంపియన్షిప్, 2021 టీ20 ప్రపంచకప్ వంటి మేజర్ టోర్నీల్లో కెప్టెన్గా వ్యవహరించినప్పటికీ టైటిల్ అందుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. మరోవైపు టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన కుటుంబంతో సహా లండన్లో స్థిరపడిన సంగతి తెలిసిందే. మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడినంత కాలం కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయాడు. తాజాగా ఒక్క ఫార్మాట్కే పరిమితం కావడంతో కుటుంబంతో సమయం గడపడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడని, అందుకే టీ20 ప్రపంచకప్ ఫైనల్ వీక్షించేందుకు అహ్మదాబాద్కు రాలేకపోయాడని పలువురు అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ప్రపంచకప్ ఫైనల్తో పాటు అంతకముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్కు కూడా రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు తమ కుటుంబాలతో కలిసి వీక్షించేందుకు వచ్చారు. కేవలం వన్డే ఫార్మాట్కు మాత్రమే ఆడుతున్న కోహ్లీ గత జనవరిలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఆడాడు. ఆ సిరీస్లో కోహ్లీ సెంచరీ సహా అర్థసెంచరీ సాధించి జట్టు తరఫున టాప్ స్కోరర్గా నిలిచి తన ఫామ్ను కొనసాగిస్తూ వస్తున్నాడు.చదవండి: ఐపీఎల్ 2026పై బిగ్ అప్డేట్ -
ధోని, కోహ్లీ, రోహిత్ గ్రూప్లో సంజూ
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 మ్యాచ్లో వెస్టిండీస్పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా వికెట్కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఆ ఇన్నింగ్స్కు భారత అభిమానులే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా ముగ్దులయ్యారు. ప్రస్తుతం భారత క్రికెట్ సర్కిల్స్లో ఏ నోట విన్నా సంజూ పేరే వినిపిస్తుంది. అప్పటిదాకా తిట్టిపోసిన వారు కూడా విండీస్పై చారిత్రక ఇన్నింగ్స్ తర్వాత సంజూను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.అప్పటికే స్టార్ డమ్ ఉన్న సంజూ, ఆ ఒక్క ఇన్నింగ్స్తో దాన్ని మరింత పెంచుకున్నాడు. ఎంతలా అంటే.. భారత మాజీ వికెట్కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ సంజూను దిగ్గజలు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో పోల్చేంతలా. డీకే సంజూను ధోని, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మతో సమానంగా అభిమానుల ఆదరణ పొందుతున్న ఆటగాడిగా అభివర్ణించాడు. అతని మాటల్లో.. సంజూ దేశంలో అత్యంత అభిమానించబడే క్రికెటర్. ఆయనలో ఏదో ప్రత్యేకత ఉంది. ఎత్తుపల్లాలు ఎదురైనా, అభిమానులు ఎప్పుడూ ఆయనపై నమ్మకం ఉంచారని అన్నాడు.డీకే అభిప్రాయం ప్రకారం, సంజూ ప్రపంచకప్ ప్రారంభం నుంచే జట్టులో ఉండాల్సింది. ముఖ్యంగా ఆఫ్ స్పిన్నర్లపై కష్టపడుతున్న ఎడమచేతి వాటం బ్యాటర్లకు ప్రత్యామ్నాయంగా సంజూ సమతుల్యతను తీసుకొచ్చాడు.వాస్తవానికి సంజూ టాలెంట్ ఎప్పుడూ గుర్తింపు పొందినా.. గాయాలు, అస్థిరత, ఎంపికల మార్పులు అతని కెరీర్ను దెబ్బతీశాయి. అయినప్పటికీ, అతను సహజమైన స్ట్రోక్ ప్లే, ఆత్మవిశ్వాసంతో తిరిగి తనను చాటుకున్నాడు.కాగా, విండీస్తో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత టాపార్డర్ తడబడింది. ఈ దశలో సంజూ (50 బంతుల్లో 97 పరుగులు; 12 ఫోర్లు, 4 సిక్సులు) తానున్నానంటూ ముందుకొచ్చి టీమిండియాను గెలిపించాడు. తద్వారా భారత్ సెమీస్ బెర్త్ ఖరారైంది. రేపు జరుగబోయే సెమీస్లో భారత్ ఇంగ్లండ్తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లోనూ సంజూ కీలకమయ్యే అవకాశం ఉంది. -
IPL 2026: ఆర్సీబీ అభిమానులకు గుడ్న్యూస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఐపీఎల్-2026లో ఆర్సీబీ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదు మ్యాచ్లు ఆడనుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ మంగళవారం ధ్రువీకరించాడు.తీవ్ర విషాదంకాగా 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి క్రేజీ జట్టుగా పేరొందిన ఆర్సీబీ.. గతేడాది వరకు టైటిల్ గెలవలేకపోయింది. పదిహేడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2025లో తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు ఆనందంలో మునిగిపోగా.. ఫ్రాంఛైజీ తొందరపాటు చర్య తీవ్ర విషాదానికి దారితీసింది.హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో.. అనుమతి లేకుండానే ఆర్సీబీ విజయోత్సవ సభ ఏర్పాటు చేయగా.. అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరిగి పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆర్సీబీపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది.ఈ క్రమంలో ఐపీఎల్-2026లో ఆర్సీబీ తమ హోం గ్రౌండ్ను మారుస్తుందనే వార్తలు వచ్చాయి. పుణె, ముంబై సహా ఇతర నగరాల్లో తమ మ్యాచ్లు ఆడేలా ఆర్సీబీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే, కర్ణాటక ప్రభుత్వం అనుమతితో తిరిగి చిన్నస్వామి స్టేడియంలోనే తమ మ్యాచ్లు ఆడేందుకు ఆర్సీబీ నిర్ణయించుకుంది.ఎంతో సంతోషిస్తున్నాఈ విషయం గురించి ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మీనన్ స్పందిస్తూ.. ‘‘సుదీర్ఘ చర్చలు.. అన్ని అనుమతులు తీసుకున్న అనంతరం మీకు ఈ విషయం చెప్పేందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఆర్సీబీ ఈసారి ఐదు మ్యాచ్లు బెంగళూరులోనే ఆడుతుంది. కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక క్రికెట్ సంఘానికి ధన్యవాదాలు.బెంగళూరులో మ్యాచ్లు సజావుగా సాగేలా హామీ ఇచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు’’ అని ప్రకటన విడుదల చేశాడు. కాగా భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి ఐపీఎల్ ఆరంభం నుంచి ఆర్సీబీతోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే కెప్టెన్గా టైటిల్ అందుకోలేకపోయిన కోహ్లి.. గతేడాది రజత్ పాటిదార్ సారథ్యంలో తొలిసారి ట్రోఫీని ముద్దాడాడు. ఇదిలా ఉంటే.. ఆర్సీబీ తమ మిగిలిన రెండు హోం మ్యాచ్లను రాయ్పూర్లో ఆడనుంది.చదవండి: అతడి రెండు ఫోర్లు కీలకం.. లేదంటే సంజూ ఇన్నింగ్స్ వేస్ట్: గంభీర్ -
విరాట్ కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టిన రష్మిక.. అదేంటో తెలుసా?
కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. ఇన్ని రోజులుగా సీక్రెట్గా రిలేషన్లో ఉన్న వీరిద్దరు పెళ్లికి కొద్ది రోజుల ముందు అఫీషియల్గా ప్రకటించారు. గత నెల ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో గల మెమెంటోస్ ప్యాలెస్లో అతికొద్దిమంది సమక్షంలో వీరిద్దరి పెళ్లి వేడుక గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.పెళ్లి తర్వాత విజయ్, రష్మిక తమ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ జంట తమ భావాలను ప్రకటిస్తూ భావోద్వేగంగా రాసుకొచ్చారు. ఈ పిక్స్ షేర్ చేసిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి. అత్యధిక లైక్స్తో పలువురి సెలబ్రిటీల ఫోటోలు క్రియేట్ చేసిన రికార్డ్స్ను విరోష్ జంట తుడిచిపెట్టేసింది. తాజాగా ఈ పిక్స్ మరో రికార్డ్ సృష్టించాయి.2024లో టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోకు దాదాపు 23 మిలియన్ల లైక్స్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డ్ను రష్మిక షేర్ చేసిన పెళ్లి ఫోటోలు బద్దలు కొట్టాయి. రష్మిక పోస్ట్కు ఏకంగా 25 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ పోస్ట్ రికార్డ్ను రష్మిక అధిగమించింది. కాగా.. ఇన్స్టాలో రష్మికకు 50 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంటే దాదాపు సగం మంది ఈ వెడ్డింగ్ ఫోటోలను లైక్ చేశారు. అంతేకాకుండా విజయ్ దేవరకొండ పోస్ట్ చేసిన ఫోటోలకు 19.8 మిలియన్ల లైక్ వచ్చాయి. కాగా.. మరోవైపు విరాట్కు ఇన్స్టాలో 274 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రష్మిక పోస్ట్కు ఈ రేంజ్లో ఆదరణ దక్కడం చూస్తుంటే ఆమె క్రేజ్ ఏంటో తెలిసిపోతోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
చరిత్ర సృష్టించిన పాక్ ఓపెనర్.. కోహ్లి వరల్డ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్-2026లో పాకిస్తాన్ యువ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా పల్లెకలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న కీలక మ్యాచ్లో ఫర్హాన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.కేవలం 60 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఫర్హాన్ 9 ఫోర్లు, 5 సిక్స్లతో 100 పరుగులు చేశాడు. ఈ అద్బుత ఇన్నింగ్స్తో పర్హాన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.ఫర్హాన్ సాధించిన రికార్డులు ఇవే👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేరిట ఉండేది. 2014 టీ20 ప్రపంచకప్లో విరాట్ 319 పరుగులు చేశాడు. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్లో ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి ఆల్టైమ్ రికార్డును ఫర్హాన్ బ్రేక్ చేశాడు.👉టీ20 వరల్డ్కప్ ఒక ఎడిషన్లో అత్యధిక సిక్స్లు బాదిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మైర్(17)ను ఫర్హాన్(18) అధిగమించాడు.👉టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో రెండు సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్గా సాహిబ్జాదా ఫర్హాన్ నిలిచాడు. ఇంతకుముందు ఏ ఆటగాడు కూడా ఒకే టోర్నీలో రెండు శతకాలు బాదలేదు.👉అదేవిధంగా టీ20 ప్రపంచకప్లో ఓవరాల్గా రెండు సెంచరీలు చేసిన ప్లేయర్గా క్రిస్ గేల్ రికార్డును ఫర్హాన్ సమం చేశాడు. -
వైభవ్ సూర్యంశీ సంచలన నిర్ణయం!
విధ్వంసకర ఆట తీరుతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నయా సంచలనం వైభవ్ సూర్యవంశీ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)తో సత్తా చాటి వెలుగులోకి వచ్చిన ఈ బిహారీ పిల్లాడు.. భారత్ తరఫునా అదరగొడుతున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే అండర్-19 స్థాయిలో అదరగొడుతున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. వరల్డ్కప్ ఫైనల్లోనూ దుమ్ములేపాడు.జింబాబ్వే వేదికగా ఇంగ్లండ్పై భారీ శతకం (80 బంతుల్లో 175) బాదిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ ఆరోసారి వరల్డ్కప్ ట్రోఫీని ముద్దాడటంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు భారత్ అండర్-19 జట్టు తరఫున ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా గడ్డ మీద ఈ చిచ్చరపిడుగు సత్తా చాటాడు.అంతేకాదు.. దక్షిణాఫ్రికాలో ఏకంగా కెప్టెన్గా వ్యవహరించిన వైభవ్.. యూత్ వన్డే సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేయడం విశేషం. ఇలా టీనేజ్లోనే క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ఆటతో బిజీగా ఉన్న కారణంగా చదువు విషయంలో ఏడాది వెనుకపడనున్నాడు.బిహార్లోని తేజ్పూర్కు చెందిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడి మాడెస్టీ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 17- మార్చి 11 మధ్య జరగాల్సిన సీబీఎస్ఈ క్లాస్ 10 బోర్డు ఎగ్జామ్కు వైభవ్ సూర్యవంశీ హాజరు కావాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలు రాస్తాడని వార్తలు వచ్చాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం వైభవ్ సూర్యవంశీ ఈ ఏడాది పరీక్షలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మాడెస్టీ స్కూల్ డైరెక్టర్ ఆదర్శ్ కుమార పింటూ నిర్ధారించారు. వైభవ్కు అడ్మిట్ కార్డు కూడా జారీ చేశామని.. అయితే, ఆఖరి నిమిషంలో అతడు మనసు మార్చుకున్నట్లు వెల్లడించారు.వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ ఈ మేరకు తమ నిర్ణయాన్ని తెలిపినట్లు పింటూ పేర్కొన్నారు. కాగా వరుస సిరీస్లు, వరల్డ్కప్ టోర్నీతో బిజీగా గడిపిన వైభవ్.. ప్రస్తుతం రాజస్తాన్ రాయల్స్ క్యాంపుతో ఐపీఎల్కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. దీంతో పరీక్షలకు సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయాడని.. అందుకే ఈసారి పరీక్షలు రాయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆటతో పాటు వైభవ్ చదువును కూడా బ్యాలెన్స్ చేస్తే బాగుండనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దిగ్గజాల క్వాలిఫికేషన్ తెలుసా?ఇక వైభవ్ పరీక్షలు స్కిప్ చేసిన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజాల విద్యార్హతల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. క్రికెట్ దేవుడిగా పేరొందిన సచిన్ టెండుల్కర్ పదో తరగతిలో ఫెయిల్ అయ్యాడు. ఈ ముంబైకర్ ఆట మీద మాత్రమే దృష్టి పెట్టి అంతర్జాతీయ క్రికెట్లో వంద శతకాలు సాధించిన ఏకైక క్రికెటర్గా ప్రసిద్ధికెక్కాడు.మరోవైపు.. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించిన దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఇంటర్ చదివాడు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ టీమిండియాలోకి వచ్చి జట్టు గతినే మార్చివేశాడు ఈ జార్ఖండ్ డైనమైట్. ఇక ఢిల్లీకి చెందిన రన్మెషీన్ విరాట్ కోహ్లి కూడా పన్నెండో తరగతి వరకే చదివాడు. అదే విధంగా.. భారత్కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన సారథి, ముంబైకర్ రోహిత్ శర్మ సైతం ఇంటర్తోనే ఆపివేసినట్లు తెలుస్తోంది.చదవండి: IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య -
‘ఎ’ గ్రేడ్లో గిల్, బుమ్రా, జడేజా
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సీనియర్ జట్టు ఆటగాళ్లకు సంబంధించి 2025–26కు గాను వార్షిక కాంట్రాక్ట్లను ప్రకటించింది. గత సీజన్ వరకు ఉన్న ‘ఎ ప్లస్’ గ్రేడ్ను తొలగించిన బోర్డు... ఈ సారి ‘ఎ’, ‘బి’, ‘సి’ గ్రేడ్లతోనే జాబితాను ఖరారు చేసింది. భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్తో పాటు ఆల్ ఫార్మాట్ స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ఎ’ గ్రేడ్లో స్థానం లభించగా...భారత టెస్టు జట్టులో అందరికంటే ఎక్కువ అనుభవజు్ఞడైన రవీంద్ర జడేజాకు కూడా ‘ఎ’ గ్రేడ్ దక్కడం విశేషం. ఇప్పుడు కేవలం వన్డేలకే పరిమితమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిను ‘బి’ గ్రేడ్లో చేర్చగా, టి20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ‘బి’లోనే ఉన్నాడు. వాషింగ్టన్ సుందర్కు ‘సి’ నుంచి ‘బి’కు ప్రమోషన్ లభించగా...వన్డే, టి20ల్లో రెగ్యులర్ సభ్యుడైన అక్షర్ పటేల్ స్థాయిని తగ్గించి ‘సి’లోకి చేర్చారు. 2024–25 కాంట్రాక్ట్తో పోలిస్తే ఎవరినీ అదనంగా చేర్చలేదు. నాడు 34 మందితో జాబితా ఉండగా...ఇప్పుడు నలుగురు ఆటగాళ్లు షమీ, సర్ఫరాజ్, రజత్ పాటీదార్, ముకేశ్ కుమార్లను కాంట్రాక్ట్నుంచి తప్పించి 30 మందికి పరిమితం చేశారు. అక్టోబర్ 1, 2025 నుంచి 26 సెప్టెంబర్, 2026 మధ్య కాలానికి కొత్త కాంట్రాక్ట్లు వర్తిస్తాయి. గ్రేడ్ ‘ఎ’ – శుబ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్. గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్‡్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిõÙక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్. ‘ఆ నలుగురు’ టాప్ గ్రేడ్లో...భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజయం అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన నలుగురు ప్లేయర్లకు ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ లభించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన, ఆల్రౌండర్ దీప్తి శర్మ, బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ ‘ఎ’ జాబితాలో ఉన్నారు. గ్రేడ్ ‘బి’లో నలుగురు ప్లేయర్లు ఉండగా, గ్రేడ్ ‘సి’లో 13 మంది కలిపి మొత్తం 21 మంది సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్ట్ ఇచి్చంది. గ్రేడ్ ‘ఎ’ – హర్మన్ప్రీత్, స్మృతి మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ గ్రేడ్ ‘బి’ – రేణుకా ఠాకూర్, షఫాలీ వర్మ, రిచా ఘోష్, స్నేహ్ రాణా గ్రేడ్ ‘సి’ – రాధ యాదవ్, అమన్జోత్ కౌర్, ప్రతీక రావల్, క్రాంతి గౌండ్, ఉమా ఛెత్రి, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, కాశ్వీ గౌతమ్, కమలిని, వైష్ణవి శర్మ, తేజల్ హసబ్నిస్. 🚨 BCCI ANNUAL CONTRACT 2025-26 🚨 pic.twitter.com/UxNOSYkEnE— Johns. (@CricCrazyJohns) February 9, 2026ఆయా కాంట్రాక్ట్ల్లో ఉన్న వారికి వార్షిక వేతనం కింద ఎంత మొత్తం అందనుందో తెలియరాలేదు. గత వార్షిక కాంట్రాక్ట్ల్లో ఏ ప్లస్ గ్రేడ్లో ఉండిన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాకు రూ. 7 కోట్లు లభించేవి. గ్రేడ్-ఏలో ఉండిన వారికి రూ. 5 కోట్లు, గ్రేడ్-బిలో ఉండిన వారికి రూ. 3 కోట్లు, గ్రేడ్-సిలో ఉండిన ప్లేయర్లకు రూ. కోటి రూపాయలు లభించేవి. -
చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. నిన్న (ఫిబ్రవరి 7) యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఎంపికైన అతను.. భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్లు గెలిచిన ఆటగాడిగా విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టాడు. విరాట్ 125 మ్యాచ్ల్లో 16 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిస్తే.. స్కై కేవలం 105 మ్యాచ్ల్లోనే 17 ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచాడు. ఈ జాబితాలో స్కై, విరాట్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ (159 మ్యాచ్ల్లో 14) ఉన్నాడు. ఓవరాల్గా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలిచిన ఘనత మలేషియాకు చెందిన విరన్దీప్ సింగ్కు (22) దక్కుతుంది. విరన్దీప్ తర్వాతి స్థానాల్లో సికందర్ రజా (19), సూర్యకుమార్ (17) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. నిన్న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్లో టీమిండియా 29 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 84 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. స్కై మినహా భారత ఇన్నింగ్స్లో మిగతా వారంతా విఫలమయ్యారు. తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి డకౌట్లు అయ్యారు. రింకూ సింగ్ 6, హార్దిక్ పాండ్యా 5,అక్షర్ పటేల్ 14చ, అర్షదీప్ సింగ్ 4 పరుగులు చేశారు. యూఎస్ఏ బౌలర్లలో వాన్ స్కాల్విక్ 4, హర్మీత్ సింగ్ 2, మొహమ్మద్ మొహిసిన్, అలీ ఖాన్ తలో వికెట్ తీశారు.అనంతరం 162 పరుగుల లక్ష్య ఛేదనలో యూఎస్ఏ తడబడింది. సిరాజ్ (4-0-29-3), అర్షదీప్ సింగ్ (4-0-18-2), అక్షర్ పటేల్ (4-0-24-2), వరుణ్ చక్రవర్తి (4-0-24-1) ధాటికి 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. యూఎస్ఏ ఇన్నింగ్స్లో సంజయ్ కృష్ణమూర్తి, శుభమ్ రంజనే తలో 37 పరుగులు చేసి టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిలింద్ కుమార్ 34 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లలో అండ్రియస్ గౌస్ 6, సాయితేజ ముక్కామల 2, మొహిసిన్ ఖాన్ 8, స్కాల్విక్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్ డకౌట్లయ్యారు. -
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా దిగ్గజాలు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు భారీ షాకిచ్చినట్లు తెలుస్తుంది. త్వరలో ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్ట్ల జాబితాలో వీరిద్దరూ డిమోషన్కు గురైనట్లు సమాచారం. గతంలో విరాట్, రోహిత్ ఏ ప్లస్ కేటగిరిలో ఉండేవారు. తాజాగా ఆ కేటగిరిని పూర్తిగా రద్దు చేస్తూ.. రో-కోను బి కేటగిరిలోకి తరలించినట్లు ప్రచారం జరుగుతుంది. రో-కో టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీసీసీఐ నిబంధనల ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉన్న వారికే అత్యుత్తమ కేటగిరి (ఏ ప్లస్) లభిస్తుంది. రో-కో రెండు ఫార్మాట్ల నుంచి తప్పుకోవడంతో వారు బి కేటగిరిలోకి పడిపోయారు.అయితే ఇక్కడ ఓ ఆసక్తికర విషయం బయటపడింది. టీ20, టెస్ట్ల నుంచి తప్పుకున్న రో-కో ఏ ప్లస్ నుంచి బి కేటగిరికి పడిపోగా.. టీ20ల నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా మాత్రం ఏ కేటగిరిలోనే ఉన్నట్లు తెలుస్తుంది. జడ్డూతో పాటు భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్, పేసు గుర్రం మరియు ఆల్ ఫార్మాట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే ఏ కేటగిరిలో ఉన్నారు. బుమ్రా, జడ్డూ 2024-25 సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో విరాట్, రోహిత్తో పాటు ఏ ప్లస్లో ఉండేవారు. ఇప్పుడు ఏ ప్లస్ రద్దు కావడంతో బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలోకి వచ్చారు.ఇకపై సెంట్రల్ కాంట్రాక్ట్లో మూడు కేటగిరిలు (ఏ, బి, సి) మాత్రమే ఉంటాయని సమచారం. గిల్, బుమ్రా, జడ్డూ ఏ కేటగిరిలో ఉండగా.. రో-కోతో పాటు టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, హార్దిక్ పాండ్యా, సిరాజ్, పంత్, శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, కుల్దీప్ యాదవ్ కేటగిరి బిలో ఉన్నారు.సి కేటగిరిలో అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దుబే, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ద్ కృష్ణ, ఆకాష్ దీప్, ధృవ్ జురెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయి సుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నట్లు సమాచారం. -
RCB: విరాట్ కోహ్లి పోస్ట్ వైరల్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో రెండోసారి చాంపియన్స్గా నిలిచి ఆర్సీబీ కుటుంబానికి గర్వకారణమయ్యారంటూ స్మృతి మంధాన సేనను కొనియాడాడు. ఇదొక అద్భుత విజయమని.. ట్రోఫీని ముద్దాడేందుకు ఆర్సీబీ మహిళా జట్టుకు పూర్తి అర్హత ఉందని పేర్కొన్నాడు.కాగా డబ్ల్యూపీఎల్-2026 సీజన్లో ఆర్సీబీ ఆరంభం నుంచే వరుస విజయాలు సాధించింది. ఐదు మ్యాచ్లు గెలిచి మిగిలిన జట్ల కంటే ముందుగా ప్లే ఆఫ్స్ చేరింది. ఇక ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడ్డ ఆర్సీబీ.. ప్రత్యర్థి విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి టైటిల్ గెలుచుకుంది.జెమీమా కెప్టెన్ ఇన్నింగ్స్వడోదర వేదికగా టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఢిల్లీని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఓపెనర్లు లిజెల్లి లీ (37), షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా.. లారా వొల్వర్ట్ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ (37 బంతుల్లో 57)తో మెరవగా.. చినెల్లి హెన్రీ (15 బంతుల్లో 35 నాటౌట్) ధనాధన్ దంచికొట్టింది.ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 203 పరుగులు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్గరే, అరుంధతి రెడ్డి, నదైన్ డిక్లెర్క్ తలా ఒక వికెట్ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగింది.స్మృతి మంధాన, జార్జియా వోల్ ధనాధన్అయితే, మరో ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన.. వన్డౌన్ బ్యాటర్ జార్జియా వోల్తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. స్మృతి 41 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 87 పరుగులు సాధించగా.. వోల్ 54 బంతుల్లో 79 పరుగులు చేసింది.మిగిలిన వారిలో రిచా ఘోష్ (6) విఫలమైనా.. స్మృతి- వోల్ వేసిన బలమైన పునాదిపై నదైన్ డిక్లెర్క్ (5 బంతుల్లో 7), రాధా యాదవ్ (5 బంతుల్లో 12) అజేయంగా నిలిచి పని పూర్తి చేశారు. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఢిల్లీకి మరోసారి చేదు అనుభవందీంతో వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన ఢిల్లీకి మరోసారి చేదు అనుభవం ఎదురుకాగా.. ఆర్సీబీ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్ మొదలుకాగా.. 2024లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలిచింది. ఇక గతేడాది ఆర్సీబీ పురుషుల జట్టు తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవగా.. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ రూపంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీకి మరో టైటిల్ దక్కింది.అద్భుతమైన విజయంఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి.. ‘‘మరోసారి చాంపియన్స్గా నిలిచారు. ఆర్సీబీ విజయ పతకాన్ని ఎగురవేస్తూనే ఉండాలి. జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. ముఖ్యంగా స్మృతి.. నీకు, జట్టుకు, ఆర్సీబీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఇదొక అద్భుతమైన విజయం. ఇందుకు మీరు అర్హులు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మన అభిమానులు పంచే ప్రేమను ఎంజాయ్ చేయండి’’ అని ప్రశంసలు కురిపించాడు. ఈ పోస్టు ఏడు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. చదవండి: ఆరో టైటిల్ వేటలో... -
ఇషాన్ కిషన్కు అండగా విరాట్ కోహ్లి
న్యూజిలాండ్ టీ20 సిరీస్లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఒకనొక దశలో మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి తనకు అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివని అన్నాడు. విరాట్ ఓదార్పు తనను కెరీర్లో తిరిగి పుంజుకునేలా చేసిందని తెలిపాడు.మానసికంగా విరిగిపోయిన సమయంఇషాన్ 2020 ఐపీఎల్ ఎడిషన్లో ముంబై ఇండియన్స్ తరఫున 516 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ 2021లో పరిస్థితి పూర్తిగా మారింది. 10 మ్యాచ్ల్లో కేవలం 241 పరుగులు మాత్రమే సాధించాడు. అతని ఆటలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ అతన్ని “బ్రోకెన్ యంగ్ మాన్” అని వ్యాఖ్యానించారు. విరాట్ కోహ్లీ ఇచ్చిన మానసిక బలం ఆ సమయంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లీ ఇషాన్ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆ క్షణం ఇషాన్ జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచింది. “నేను కన్నీళ్లు ఆపుకుంటూ ఉన్నాను. విరాట్ భాయ్ వచ్చి నన్ను ఓదార్చారు. ఆ సమయంలో నాకు ఆ మాటలు చాలా అవసరం అయ్యాయి” అని ఇషాన్ ఇటీవల ఒక పోడ్కాస్ట్లో చెప్పాడు. బాధను విజయంగా మార్చిన క్షణం విధి చాలా నాటకీయమైంది. 2022లో ఇషాన్ కిషన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ (ఫాస్టెస్ట్) సాధించినప్పుడు, నాన్-స్ట్రైకర్ ఎండ్లో నిలిచింది విరాట్ కోహ్లీనే. ఇద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఒకప్పుడు కన్నీళ్లు ఆపుకున్న ఆటగాడు, అదే కోహ్లీ సాక్షిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.నమ్మకముంచిన ముంబై ఇండియన్స్ ఇషాన్ 2021లో విఫలమైనప్పటికీ, ముంబై ఇండియన్స్ అతనిపై నమ్మకముంచింది. 2022 వేలంలో రూ. 15.25 కోట్ల భారీ మొత్తానికి అతన్ని తిరిగి కొనుగోలు చేసింది. ఎంఐ విశ్వాసాన్ని ఇషాన్ నిలబెట్టుకున్నాడు. ఆ ఎడిషన్లో 14 ఇన్నింగ్స్ల్లో 133.88 స్ట్రైక్రేట్తో 418 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.ఇషాన్ 2.0ఐపీఎల్ అనుభవాలు పక్కన పెడితే, ఇషాన్ అంతర్జాతీయ కెరీర్లోనూ అద్భుతమైన పునరాగమనం చేశాడు. రెండేళ్ల కిందట అతనికి టీమిండియాలో స్థానమే ఉండేది కాదు. స్వయంకృతాపరాధాల వల్ల జట్టులో స్థానం కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. అయితే ఇషాన్ తిరిగి అద్భుత రీతిలో పుంజుకున్నాడు.గడిచిన రెండేళ్లలో దేశీయ క్రికెట్లో విశేషంగా రాణించి, ఇటీవల న్యూజిలాండ్ టీ20 సిరీస్కు అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఈ వెర్షన్ ఇషాన్లోని 2.0 వెర్షన్. రీఎంట్రీలో ఇషాన్ మరింత చెలరేగిపోయాడు. మొదటి మూడు మ్యాచ్ల్లోనే వరుసగా 76, 28, 103 పరుగుల స్కోర్లు చేశాడు. ఈ ప్రదర్శనల తర్వాత అతను త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్కప్లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయడం ఖరారైపోయింది. -
విరాట్ కోహ్లి పేరిట ఉండిన భారీ రికార్డును బద్దలు కొట్టిన బాబర్ ఆజమ్
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ భారత దిగ్గజం విరాట్ కోహ్లి పేరిట ఉండిన ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 1) జరుగుతున్న మూడో టీ20లో హాఫ్ సెంచరీ చేసిన బాబర్.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక అర్ద సెంచరీలు (39) చేసిన ఆటగాడిగా అవతరించాడు. ఈ రికార్డు విరాట్ కోహ్లి (38) పేరిట ఉండేది. తాజాగా బాబర్ తన పేరిట బదలాయించుకున్నాడు. ఈ జాబితాలో బాబర్, విరాట్ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ (32), మొహమ్మద్ రిజ్వాన్ (30), డేవిడ్ వార్నర్ (28), జోస్ బట్లర్ (28) ఉన్నారు.మరో రికార్డుతాజా హాఫ్ సెంచరీతో బాబర్ మరో రికార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఆరు సార్లు 50+ స్కోర్లు చేసిన ఆటగాడిగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (8) అగ్రస్థానంలో ఉన్నాడు.ఫామ్లోకి వచ్చిన బాబర్BBL 2025–26లో సిడ్నీ సిక్సర్స్ తరఫున నిరాశాజనకమైన ప్రదర్శనలు (11 ఇన్నింగ్స్ల్లో 202 పరుగులు) చేసిన బాబర్.. ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఆస్ట్రేలియాపై చివరి టీ20లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, ఫామ్లోకి వచ్చాడు.మ్యాచ్ పరిస్థితి లాహోర్ వేదికగా జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్లో పాక్ తొలుత బ్యాటింగ్ చేసిన 207 పరుగుల (6 వికెట్ల నష్టానికి) భారీ స్కోర్ చేసింది. సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించగా.. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. 15.5 ఓవర్ల తర్వాత 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు మాత్రమే చేసి ఘోర ఓటమి దిశగా పయనిస్తుంది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్లు గెలిచిన పాక్ ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. -
విరాట్ కోహ్లి వికెట్ తీస్తే.. ఏం చేస్తానంటే?
ఐపీఎల్-2026లో ఉత్తరప్రదేశ్కు చెందిన యువ స్పిన్నర్ విశాల్ నిషాద్ సత్తాచాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో నిషాద్ను రూ. 30 లక్షల కనీస ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఒక్క ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం లేనప్పటికి అతడిపై పంజాబ్ యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది.అతి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నిషాద్.. తన స్పిన్ మయాజాలంతో అందరిని ఆకట్టుకున్నాడు. 2024 యూపీ టీ20 ప్రిమియర్ లీగ్ విశాల్ కెరీర్ను మలుపు తిప్పింది. ఈ టోర్నీలో గోరఖ్పూర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.గతేడాది సీజన్లో అతడు ఐపీఎల్లో ఆడుతాడని అంతా భావించారు. కానీ దురుదృష్టవశాత్తూ అప్పుడు అవకాశం లభించలేదు. అయితే ఇప్పుడు మాత్రం పంజాబ్ కింగ్స్ సువర్ణ అవకాశం కల్పించింది. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తనకు రోల్మోడల్ అని అతడు చెప్పుకొచ్చాడు.విరాట్ కోహ్లి నాకు ఆదర్శం. అతడు ఆడే ఫియర్ లెస్ క్రికెట్, కవర్ డ్రైవ్ షాట్లు నాకెంతో ఇష్టం. ఒకవేళ నేను కోహ్లి వికెట్ తీస్తే, సెలబ్రేషన్స్ చేసుకోను. అతడు నా రోల్ మోడల్ కాబట్టి నేరుగా వెళ్లి తన పాదాలకు నమస్కరిస్తాను. నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్దాయికి చేరుకున్నాను. మా నాన్నతో పాటు పనికి వెళ్లేవాడిని. ఒకనొక సమయంలో క్రికెట్ వదిలేయాలని కూడా అనుకున్నాను. క్రికెటర్ కావడం చాలా కష్టమని, వేరే ఏదైనా వర్క్ చేసుకోమని మా అమ్మ సూచించింది. కానీ నేను మాత్రం నా ఆశయాన్ని వదులుకోలేదు. ఏదో ఒక రోజు కచ్చితంగా విజయం సాధిస్తాను అని మా అమ్మతో అన్నాను. ఆ తర్వాత నా కుటంబం కూడా సపోర్ట్ చేసింది. అందరి సహకరంతో ఇప్పుడు నా కలను నేరవేర్చుకున్నా అని 20 ఏళ్ల నిషాద్ పేర్కొన్నాడు. -
కోహ్లీ ఇన్ స్టా ఖాతా అదృశ్యం.. అనుష్క శర్మకు ఫ్యాన్స్ మెసేజ్
-
గుడ్బై చెప్పాడా?.. కంగారుపడ్డ విరాట్ కోహ్లి ఫ్యాన్స్!
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం భారత్లోనే కాకుండా ఈ రన్మెషీన్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలోనూ కోహ్లి ఫాలోయింగ్ ఎక్కువే.274 మిలియన్ల ఫాలోవర్లుముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కోహ్లి (Virat Kohli)కి 274 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఎక్కువగా వాణిజ్యపరమైన పోస్టులు పెట్టే ఈ ఢిల్లీ బ్యాటర్... భార్య అనుష్క శర్మ (Anushka Sharma), ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను అరుదుగా షేర్ చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి.. ముఖ్యంగా అనుష్కతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తే మిలియన్ల కొద్దీ లైకులతో గంటల్లోనే ఆ పోస్టు వైరల్గా మారుతుంది. ఇటీవల కొ త్త ఏడాది సందర్భంగా విరుష్క ఫొటోకు 15 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. కోహ్లి ఉన్న క్రేజ్కు ఇది నిదర్శనం.కాసేపు డీయాక్టివేట్అయితే, శుక్రవారం ఉదయం కోహ్లి అభిమానులు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లు కాసేపు ఆందోళనకు గురయ్యారు. అతడి ఇన్స్టా అకౌంట్ కాసేపు డీయాక్టివేట్ అయిపోయింది. దీంతో కంగారుపడ్డ కింగ్ ఫ్యాన్స్.. అనుష్క శర్మ ఇన్స్టా అకౌంట్లోకి వెళ్లి.. ఆరా తీశారు.వదినమ్మా.. అసలేం జరిగింది? ‘‘వదినమ్మా.. అసలేం జరిగింది? భయ్యా అకౌంట్ కనపడటం లేదు. కంగారుగా ఉంది. రిప్లై ఇవ్వండి’’ అంటూ అనుష్క ఇదివరకు పెట్టిన పోస్టుల కింద కామెంట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో కాసేపటికే కోహ్లి అకౌంట్ రీయాక్టివేట్ అయింది. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.వన్డేల రారాజుకాగా బాలీవుడ్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శర్మకు కూడా ఇన్స్టాలో భారీ ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. 68 మిలియన్లకు పైగా ఆమెను అనుసరిస్తున్నారు. అనుష్కతో ప్రేమలో పడిన కోహ్లి 2017లో ఆమెను వివాహమాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు కుమార్తె వామిక, కుమారుడు అకాయ్ సంతానం. ఇక ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్న కోహ్లి చివరగా.. సొంతగడ్డపై న్యూజిలాండ్తో సిరీస్లో ఆడాడు. ఆఖరి వన్డేలో సెంచరీ సాధించి.. యాభై ఓవర్ల ఫార్మాట్లో తన శతకాల సంఖ్యను 54కు పెంచుకుని ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli)చదవండి: నిప్పులు చెరిగిన సిరాజ్ View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) -
అందుకే రిటైర్మెంట్ ప్రకటించాను: యువీ షాకింగ్ కామెంట్స్
టీమిండియా అత్యుత్తమ క్రికెటర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు అందించిన సేవలు మరువలేనివి. టీ20 ప్రపంచకప్- 2007, 2011లో వన్డే వరల్డ్కప్ టైటిళ్లను భారత్ గెలవడంలో ఈ ఆల్రౌండర్ది కీలక పాత్ర.ఇక 2007 ప్రపంచకప్ టోర్నీలో ఇంగ్లండ్తో మ్యాచ్లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యువీ (Yuvraj Singh) తన పేరిట అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే వరల్డ్కప్-2011లో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూల్చి సత్తా చాటాడు. తద్వారా ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు.క్యాన్సర్ బారిన పడి..అయితే, యువీ జీవితం నల్లేరు మీద నడకేమీకాదు. చిన్ననాడు తండ్రి యోగ్రాజ్ సింగ్ శిక్షణలో ఎన్నో కష్టాలు అనుభవించిన యువీ.. ఆ తర్వాత తల్లిదండ్రులు విడిపోగా.. తల్లి సమక్షంలో ఉన్నాడు. అవరోధాలను అధిగమించి క్రికెటర్గా ఉన్నత శిఖరాలకు చేరిన వేళ క్యాన్సర్ మహమ్మారి బారినపడ్డాడు. వన్డే వరల్డ్కప్ గెలిచిన తర్వాత అతడికి క్యాన్సర్ ఉన్నట్లు తేలింది.పడిలేచిన కెరటంఛాతిలో నొప్పి, రక్తపు వాంతులు తదితర లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన యువీకి.. ఊపిరి తిత్తులు, గుండె మధ్య భాగంలో ట్యూమర్ ఉన్నట్లు నిర్దారణ అయింది. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లి చికిత్స తీసుకున్న యువరాజ్ సింగ్. కీమోథెరపీ చేయించుకున్నాడు. క్రమక్రమంగా కోలుకుని 2012 సెప్టెంబరులో క్రికెటర్గా రీఎంట్రీ ఇచ్చాడు.ఆ తర్వాత టీమిండియా తరఫున 2014, 2016 టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో పాల్గొన్న యువీ.. 2017 చాంపియన్స్ ట్రోఫీలోనూ భాగమయ్యాడు. అయితే, వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడ్డ యువీ 2019లో అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో తన కుమారుడిని అప్పటి కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి తొక్కేసారంటూ యోగ్రాజ్ సింగ్ గతంలో ఎన్నోసార్లు ఆరోపణలు చేశాడు.తాజాగా తన రిటైర్మెంట్ గురించి స్పందిస్తూ యువరాజ్ సింగ్ సైతం పరోక్షంగా తండ్రి వ్యాఖ్యలకు మద్దతు పలికినట్లు సంకేతాలు ఇచ్చాడు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా యూట్యూబ్ షోలో మాట్లాడుతూ..గౌరవం దక్కడం లేదనే భావన‘‘కెరీర్ భారంగా మారిపోయింది. నా ఆటను ఆస్వాదించలేకపోతున్నాని అప్పుడు స్పష్టంగా తెలిసింది. నా ఆటకు.. రిటైర్మెంట్కు నడుమ సన్నని గీత. అసలు ఆటను ఆస్వాదించలేనపుడు ఆడటం ఎందుకన్న ప్రశ్న.నాకెవరూ మద్దతుగా లేరనిపించింది. నాకు గౌరవం దక్కడం లేదనే భావన కలిగింది. నాలో సత్తా లేకున్నా ఆడటం ఎందుకనే ప్రశ్న తలెత్తింది. ఆట నాకెంతో ఇచ్చింది. అందుకు ప్రతిగా నేనూ అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చాను.ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి?మరి అలాంటి ఆటను నేనెందుకు ఆస్వాదించలేకపోతున్నానని బాధగా అనిపించింది. నేను ఆడాల్సిన అవసరం ఇక లేదనిపించింది. ఇంకా నేనేమీ నిరూపించుకోవాలి? శారీరకంగా, మానసికంగా ఇంతకంటే నేను ఏమీ చేయలేను. ఏదో తెలియని బాధ. కాబట్టి ఆటను ఇక ఆపివేయాలనే నిర్ణయానికి వచ్చాను. ఎప్పుడైతే ఇక ఆడకూడదని నిర్ణయించుకున్నానో.. అప్పుడే మళ్లీ నన్ను నేను.. అసలైన నన్ను చేరుకోగలిగాను’’ అంటూ తాను పడిన మానసిక వేదన, ఒత్తిడిని గుర్తు చేసుకుంటూ యువీ ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ఇంతకంటే ఇంకేం కావాలి: మిచెల్ సాంట్నర్ -
విరాట్ కోహ్లి సరసన సంజూ శాంసన్
గౌహతి వేదికగా న్యూజిలాండ్తో నిన్న (జనవరి 25) జరిగిన మూడో టీ20లో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ ఓ అవమానకర రికార్డును మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో గోల్డెన్ డకౌటైన (తొలి బంతికే ఔట్) శాంసన్.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్లైన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి సరసన చేరాడు. విరాట్, శాంసన్ భారత్ తరఫున అంతర్జాతీయ టీ20ల్లో తలో ఏడు సార్లు గోల్డెన్ డకౌట్లు అయ్యారు. విరాట్ ఈ అవాంఛిత రికార్డును చేరుకునేందుకు 117 మ్యాచ్లు తీసుకుంటే, శాంసన్ కేవలం 47 మ్యాచ్ల్లోనే ఈ అపవాదును మూటగట్టుకున్నాడు. ఈ జాబితాలో మరో దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ తన 151 మ్యాచ్ల అంతర్జాతీయ టీ20 కెరీర్లో ఏకంగా 12 సార్లు ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు.అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక గోల్డెన్ డకౌట్స్- 12 – రోహిత్ శర్మ (151 మ్యాచ్లు) - 7 – సంజు సాంసన్ (47 మ్యాచ్లు)* - 7 – విరాట్ కోహ్లీ (117 మ్యాచ్లు) - 6 – సూర్యకుమార్ యాదవ్ (96 మ్యాచ్లు) - 5 – కేఎల్ రాహుల్ (68 మ్యాచ్లు) మ్యాచ్ విషయానికొస్తే.. న్యూజిలాండ్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లలనే ఛేదించిన భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన భారత్.. న్యూజిలాండ్ను 153 పరుగులకే (9 వికెట్లకు) కట్టడి చేసింది. బుమ్రా (4-0-17-3), బిష్ణోయ్ (4-0-18-2), హార్దిక్ (3-0-23-2), హర్షిత్ రాణా (4-0-35-1) అద్బుతంగా బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్గా నిలువగా.. చాప్మన్ (32), సాంట్నర్ (27) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో సంజూ శాంసన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి భారత గెలుపును ఆదిలోనే ఖరారు చేశారు. వీరిద్దరూ ప్రతి బంతిని బౌండరీ, సిక్సర్గా తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడారు. ఇషాన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అభిషేక్, ఇషాన్ విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరి ధాటికి భారత్ కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. అభిషేక్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 68 పరుగులు.. స్కై 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 57 పరుగులు చేసి టీమిండియాకు మెరుపు విజయాన్ని అందించారు.శాంసన్ ఫామ్పై ఆందోళనలు ఈ సిరీస్లో శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది. మొదటి రెండు మ్యాచ్ల్లోనూ అతను దారుణంగా విఫలమయ్యాడు. కేవలం 10, 6 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సిరీస్కు ముందు సౌతాఫ్రికా సిరీస్లోనూ శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. అయినా అతనికి ప్రపంచకప్ బెర్త్ దక్కింది. వరస వైఫల్యాల నేపథ్యంలో శాంసన్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అతనికి పోటీగా ఇషాన్ కిషన్ దూసుకొస్తున్నాడు. ఇషాన్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ శాంసన్ స్థానానికి ఎసరు పెట్టేలా ఉన్నాడు. ఇషాన్ కాకపోయినా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పేరును సెలెక్టర్లు పరిశీలించవచ్చు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
దిగ్గజాలకు షాక్!.. అది నిజమే: బీసీసీఐ
ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టు గ్రేడ్లలో మార్పులపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) స్పందించింది. A+ గ్రేడ్ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా శనివారం ధ్రువీకరించారు.బోర్డు సంతృప్తితో లేదు‘‘A+ గ్రేడ్ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం ఈ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు కాకుండా.. కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు. A+ గ్రేడ్లో కొనసాగేందుకు కావాల్సిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగిలేరు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదు.ఈ గ్రేడ్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారు. మా నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్ను తీసివేయాలని ఫిక్సయిపోయాం’’ అని దేవజిత్ సైకియా స్పోర్ట్స్స్టార్తో పేర్కొన్నారు.రో-కో వన్డేలలో మాత్రమేకాగా గతేడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మలతో పాటు.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్లో ఉన్నారు. వీరిలో కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు.మరోవైపు.. జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెప్పి కేవలం వన్డే, టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా మూడు ఫార్మాట్లు ఆడుతున్నా పనిభారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే, టెక్నికల్గా మాత్రం మూడు ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క.బుమ్రాకు మాత్రం ఏడు కోట్లు?ఈ క్రమంలో రో-కోలతో పాటు జడ్డూకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ.. బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం రూ. 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు. అదే విధంగా C గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు రూ. కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది బీసీసీఐ.చదవండి: RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్! -
RCB: ‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, రన్మెషీన్ విరాట్ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్ మనదే’’ అనుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.పద్దెనిమిదేళ్లకుఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్ పాటిదార్ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. లీగ్ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.చేతులు మారనున్న యాజమాన్యంఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.ఆదార్ పూనావాలా ఆసక్తిఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్మెంట్ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్స్టిట్యూట్ చీఫ్ ఆదార్ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్బీర్ కపూర్!తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ తెలిపింది.మరోవైపు.. రణ్బీర్ కపూర్ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. చదవండి: ఆస్ట్రేలియాతో టెస్టుకు భారత జట్టు ప్రకటన -
టెస్ట్ క్రికెట్లోకి విరాట్ కోహ్లి రీఎంట్రీ..?
టీమిండియాకు సంబంధించిన ఓ సంచలన వార్త ప్రస్తుతం క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. సుదీర్ఘ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడని ప్రచారం జరుగుతుంది. టీ20 వరల్డ్కప్-2026 తర్వాత ఈ విషయం కార్యరూపం దాల్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రముఖ యూట్యూబర్ రోహిత్ జుగ్లాన్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బీసీసీఐ అధికారులు కోహ్లిని మళ్లీ టెస్ట్ల్లో ఆడమని సంప్రదించారు. ఈ విషయంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ క్రియాశీలకపాత్ర పోషిస్తున్నారు. టెస్ట్ రిటైర్మెంట్ వెనక్కు తీసుకునే విషయంలో కోహ్లి కూడా సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే భారత క్రికెట్లో పెను సంచలనంగా మారుతుంది.కోహ్లి గతేడాది మే 12న అనూహ్యంగా 14 ఏళ్ల టెస్ట్ కెరీర్కు గుడ్బై చెప్పాడు. సరిగ్గా ఐదు రోజుల ముందే నాటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఐదు రోజుల వ్యవధిలో టెస్ట్ల నుంచి తప్పుకోవడాన్ని భారత క్రికెట్ అభిమానులు నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. రో-కో టెస్ట్ల నుంచి అనూహ్యంగా తప్పుకోవడం వెనుక భారత క్రికెట్లో ఓ కీలక వ్యక్తి హస్తం ఉందని టాక్ నడిచింది.సదరు వ్యక్తితో విభేదాల కారణంగా రో-కో టెస్ట్ల నుంచి అనూహ్యంగా తప్పుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. రో-కో అప్పటికే టీ20ల నుంచి వైదొలిగారు. టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత వారిద్దరు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం రో-కో వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ, అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు సాధిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. గత కొంతకాలంగా భారత్ టెస్ట్ల్లో ఆశాజనకమైన ప్రదర్శన చేయకపోవడంతో కోహ్లి తిరిగి రావాలని సర్వత్రా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ బీసీసీఐ పెద్ద తలకాయ చొరవ తీసుకొని కోహ్లితో మాట్లాడినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లే జరిగి కోహ్లి టెస్ట్ల్లో రీఎంట్రీ ఇస్తే.. ప్రస్తుత ఫామ్ ప్రకారం అతను అతి త్వరలోనే 10000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ప్రస్తుతం కోహ్లి 123 టెస్ట్ల్లో 30 శతకాలు, 31 అర్ధశతకాల సాయంతో 9230 పరుగులు చేశాడు. అతను మరో 770 పరుగులు చేస్తే అరుదైన 10000 క్లబ్లో చేరతాడు. కోహ్లి టెస్ట్ రీఎంట్రీపై సానుకూల వార్తలు ఎన్ని వినిపిస్తున్నా, ఇది అంత ఈజీ విషయమైతే కాదు. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కోహ్లి టెస్ట్ల్లోకి తిరిగి రావడం చాలా సవాళ్లతో కూడుకున్న విషయం. శారీకంగా అతను ఫిట్గా ఉన్నప్పటికీ.. మెంటల్ ఫిట్నెస్ సాధించడం అంత సులువు కాదు. కోహ్లి లాంటి వ్యక్తికి ఇది అసాధ్యం కాకపోయినా, రిటైర్మెంట్ వెనక్కు తీసుకోవడం లాంటి సాహసం చేయకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇటీవలికాలంలో కోహ్లి బహిరంగా చేసిన వ్యాఖ్యలను అనలైజ్ చేస్తే, అతని ఫోకస్ అంతా కేవలం 2027 వన్డే ప్రపంచకప్పైనే ఉన్నట్లు సుస్పష్టమవుతుంది. ఈ ప్రణాళిక ఉన్న కోహ్లి టెస్ట్ల్లో రీఎంట్రీ ఇచ్చి తన లాంగ్ టర్మ్ ప్లానింగ్ను డిస్టర్బ్ చేసుకోకపోవచ్చు. ఏదిఏమైనా టీ20 ప్రపంచకప్ పూర్తయ్యేలోపు ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
టాప్ ర్యాంక్ కోల్పోయిన విరాట్ కోహ్లి
ఐసీసీ తాజాగా (జనవరి 21) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. గత వారం ర్యాంకింగ్స్లో టాప్ ప్లేస్లో ఉండిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఓ స్థానం కోల్పోయి రెండో స్థానానికి పడిపోయాడు. అప్పటిదాకా నంబర్-2గా ఉన్న న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డారిల్ మిచెల్ సరికొత్త వన్డే నంబర్ వన్ బ్యాటర్గా అవతరించాడు.తాజాగా భారత్పై ఓ అర్ద సెంచరీ సహా వరుసగా రెండు సెంచరీలు (84, 131 నాటౌట్, 137) చేయడంతో డారిల్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగాయి. అప్పటిదాకా టాప్ ప్లేస్లో ఉండిన విరాట్పై డారిల్ ఏకంగా 50 పాయింట్ల ఆధిక్యం సాధించాడు. ప్రస్తుతం డారిల్ ఖాతాలో 845 రేటింగ్ పాయింట్లు ఉండగా.. విరాట్ ఖాతాలో 795 పాయింట్లు ఉన్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో డారిల్ టాప్ ర్యాంక్ను కైవసం చేసుకోవడం ఇదే మొదటిసారి. భారత్తో సిరీస్లో డారిల్ చారిత్రక ప్రదర్శన చేసి, తన జట్టుకు చిరస్మరణీయ సిరీస్ విజయాన్ని (2-1) అందించాడు.మరోవైపు రెండు వారాల కిందట టాప్ ర్యాంక్లో ఉండిన మరో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్లో మరో స్థానం దిగజారి నాలుగో స్థానానికి పడిపోయాడు. గత వారం నాలుగో స్థానంలో ఉండిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మూడో స్థానానికి ఎగబాకాడు. న్యూజిలాండ్ సిరీస్లో రెండు అర్ద సెంచరీలతో పర్వాలేదనిపించిన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.న్యూజిలాండ్తో రెండో వన్డేలో సూపర్ సెంచరీతో అదరగొట్టిన మరో టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ టాప్-10లోకి (10వ స్థానం) ప్రవేశించాడు. న్యూజిలాండ్ సిరీస్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ స్థానం కోల్పోయి 11వ స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజమ్, ఐర్లాండ్ బ్యాటర్ హ్యారీ టెక్టార్, విండీస్ ప్లేయర్ షాయ్ హోప్, శ్రీలంక ఆటగాడు చరిత్ అసలంక వరుసగా 6 నుంచి 9 స్థానాల్లో కొనసాగుతున్నారు.తాజాగా ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్తో మూడో వన్డేలో సూపర్ సెంచరీతో అలరించిన ఫిలిప్స్ ఏకంగా 16 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరాడు.బౌలర్ల విభాగంలో ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ, దక్షిణాఫ్రికా బౌలర్ కేశవ్ మహారాజ్, నమీబియా బౌలర్ బెర్నార్డ్ స్కోల్ట్జ్ తలో స్థానాన్ని మెరుగుపర్చుకొని టాప్-5లో ఉన్నారు. న్యూజిలాండ్ సిరీస్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు స్థానాలు కోల్పోయి ఏడో స్థానానికి పడిపోయాడు. భారత్తో సిరీస్లో బరిలోకి దిగని న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ సైతం 3 స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా రాణించిన భారత యువ పేసర్ హర్షిత్ రాణా ఏకంగా 27 స్థానాలు ఎగబాకి 50వ స్థానానికి చేరాడు. మరో భారత పేసర్ అర్షదీప్ సింగ్ 15 స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరాడు. భారత్తో సిరీస్లో న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించిన మైఖేల్ బ్రేస్వెల్ 6 స్థానాలు మెరుగుపర్చుకొని 33వ స్థానానికి ఎగబాకాడు.ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు అజ్మతుల్లా ఒమర్జాయ్, జింబాబ్వే సికందర్ రజా, ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మహ్మద్ నబీ టాప్-3లో కొనసాగుతున్నారు. -
BCCI: బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!
టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వార్షిక వేతనంలో ఎలాంటి మార్పు ఉండబోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వర్గాలు పేర్కొన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడుతున్న కారణంగా సెంట్రల్ కాంట్రాక్టులో అతడిని అత్యుత్తమ గ్రేడ్లోనే కొనసాగిస్తామని సంకేతాలు ఇచ్చాయి. ఏటా రూ. 7 కోట్లుకాగా జాతీయ జట్టు ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టులను క్రమబద్దీకరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం టీమిండియాలోని ఆటగాళ్లను ఎ+, ఎ, బి, సి అనే నాలుగు కేటగిరీలుగా విభజించి వార్షిక ఫీజులు చెల్లిస్తున్న బోర్డు... ఇక మీద ‘ఎ+’ కేటగిరీని తొలగించాలనే ఆలోచనలో ఉంది. ఇప్పటి వరకు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ‘ఎ+’ కేటగిరీలో ఉండగా... వీరికి ఏటా రూ. 7 కోట్లు చెల్లిస్తున్నారు.రో-కోలతో పాటు జడ్డూను తొలగిస్తారు!మరోవైపు.. ‘ఎ’ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు ఏడాదికి రూ. 5 కోట్లు... ‘బి’ కేటగిరీలోని ప్లేయర్లకు రూ. 3 కోట్లు... ‘సి’ కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయలు ఇస్తున్నారు. అయితే కోహ్లి, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే.మరోవైపు.. టీ20లకు స్వస్తి పలికిన జడేజా కూడా టెస్టు, వన్డే ఫార్మాట్లలోనే ఆడుతున్నాడు. ఈ ముగ్గురితో పాటు ఎ+ గ్రేడ్లో ఉన్న బుమ్రా ఒక్కడే అన్ని ఫార్మాట్లలో కొనసాగుతున్నాడు. దీంతో 2025–26 కోసం ప్రకటించనున్న జాబితాలో ‘ఎ+’ కేటగిరీని తొలగించాలని బోర్డు భావిస్తోంది.బుమ్రా ఒక్కడికే ఆ ఛాన్స్.. వాళ్లకి ప్రమోషన్లు!అయితే బుమ్రాకు ఇస్తున్న వేతనంలో ఎలాంటి మార్పు చేసే అవకాశాలైతే లేవు. 2018 సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ‘ఎ+’ జాబితాను ప్రవేశపెట్టింది. కోహ్లి, రోహిత్ ఒక్క ఫార్మాట్లో మాత్రమే ఆడుతుండటంతో వారికి ‘బి’ కేటగిరీలో చోటు దక్కనుంది. ఇక ప్రస్తుతం ‘బి’ కేటగిరీలో ఉన్న అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయి.త్వరలో జరగనున్న బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో కొత్త కాంట్రాక్టులపై నిర్ణయం తీసుకోనున్నారు. ‘కాంట్రాక్టుల విధానాన్ని సరళీకరించే ప్రయత్నమే ఇది. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లు ఆడుతున్న ఆటగాళ్లు తక్కువ మందే ఉన్నారు. మూడు ఫార్మాట్లు ఆడుతున్న బుమ్రా అత్యుత్తమ కేటగిరీలోనే ఉంటాడు. అతడి వేతనంలో ఎలాంటి కోత ఉండదు’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా పనిభారం తగ్గించుకునే క్రమంలో బుమ్రా ఇప్పటికే పలు కీలక మ్యాచ్లు.. టోర్నీలకు దూరమయ్యాడు. అయినప్పటికీ జట్టులో అతడి ప్రాధాన్యం దృష్ట్యా బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చదవండి: భారత్లో ఆడబోము.. ఇదే మా నిర్ణయం: బంగ్లాదేశ్ ఓవరాక్షన్ -
బీసీసీఐ సంచలన నిర్ణయం!.. రో-కోలకు భారీ షాక్!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలనాత్మక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్టుల విషయంలో పెను మార్పులు చేయాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ప్రస్తుతం సెంట్రల్ కాంట్రాక్టులో నాలుగు కేటగిరీలు ఉన్న విషయం తెలిసిందే. A+, A, B, C అనే గ్రేడ్లు ఉన్నాయి. చివరగా గతేడాదికి గానూ ఏప్రిల్లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. దీని ప్రకారం..రూ. 7 కోట్ల వార్షిక వేతనంA+ గ్రేడ్లో బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మతో పాటు ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ప్రధాన ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఉన్నారు. వీరికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం లభిస్తుంది.వీరికి ఐదు.. వారికి మూడుఇక A గ్రేడ్లో ఉన్న రిషభ్ పంత్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్, హార్దిక్ పాండ్యాలు రూ. 5 కోట్ల వార్షిక వేతనం అందుకుంటున్నారు. అదే విధంగా.. B గ్రేడ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్లకు రూ. 3 కోట్ల వార్షిక వేతనం లభిస్తోంది.వీళ్లందరికి కోటిఇక C గ్రేడ్లో ఉన్న రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్, ముకేశ్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణాలకు రూ. కోటి వేతనం అందుతోంది.A+ గ్రేడ్ను ఎత్తివేసే యోచనతాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది వార్షిక క్రాంటాక్టుల విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది. A+ గ్రేడ్ను ఎత్తివేసి.. A, B, C అనే మూడు గ్రేడ్లను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, వార్షిక వేతనం విషయంలోనూ ఈ మార్పులు వర్తిస్తాయా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.రో-కోకు భారీ షాక్తదుపరి అపెక్స్ మీటింగ్లో ఈ విషయమై బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ అండ్ కో ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపితే.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలకు భారీ షాక్ తప్పదు. ప్రస్తుతం వీరిద్దరు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. కాబట్టి ఈసారి వీరిని B గ్రేడ్లోకి వేసే అవకాశం ఉంది.ఈ నలుగురు అంతేకాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత రో-కోలతో పాటు జడేజా కూడా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికాడు. ఇక గతేడాది రో-కో టెస్టులకూ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు.. ప్రధాన పేసర్ బుమ్రా పనిభారం తగ్గించుకునే క్రమంలో పలు కీలక సిరీస్లకు దూరమవుతున్నాడు. ఇలా A+ గ్రేడ్లో ఉన్న నలుగురు ఆటగాళ్లు గత కొంతకాలంగా జాతీయ విధుల్లో ఏదో ఒక ఫార్మాట్కు మాత్రమే పరిమితం కావడం గమనార్హం.చదవండి: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
కోహ్లికే షాకిచ్చాడు!.. కివీస్ యంగ్స్టార్కి గోల్డెన్ ఛాన్స్
భారత్తో టీ20 సిరీస్కు ముందు న్యూజిలాండ్ కీలక ప్రకటన చేసింది. తమ జట్టులో ఓ మార్పు చేసినట్లు మంగళవారం వెల్లడించింది. టీమిండియాతో వన్డే సిరీస్లో సత్తా చాటిన యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ (Kristian Clarke)కు టీ20 జట్టులోనూ చోటు ఇచ్చినట్లు తెలిపింది.మూడు మ్యాచ్లకుఅయితే, తొలి మూడు టీ20లకు మాత్రమే క్లార్క్ను ఎంపిక చేసినట్లు ఈ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ వెల్లడించింది. స్టార్ ఆటగాడు మైకేల్ బ్రేస్వెల్ (Michael Bracewell) గాయపడిన కారణంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ‘‘ఇండియాలో పర్యటిస్తున్న బ్లాక్కాప్స్ (న్యూజిలాండ్)తో బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్టియన్ క్లార్క్ అక్కడే ఉండిపోతాడు.ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా మూడు మ్యాచ్లకు అతడు అందుబాటులో ఉంటాడు. ఇండోర్లో ఆదివారం నాటి ఆఖరి వన్డే సందర్భంగా మైకేల్ బ్రేస్వెల్ గాయపడ్డాడు. అయినప్పటికీ నాగ్పూర్లో తొలి టీ20 కోసం అతడు జట్టుతో ప్రయాణిస్తాడు.అయితే, పిక్కల్లో గాయంతో బాధపడుతున్న అతడి పరిస్థితిని వైద్యులు పర్యవేశక్షిస్తున్నారు. అతడు పూర్తి టూర్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది త్వరలోనే తేలుతుంది’’ అని న్యూజిలాండ్ క్రికెట్ తమ ప్రకటనలో పేర్కొంది.అరంగేట్రంలోనే..కాగా మైకేల్ బ్రేస్వెల్ కెప్టెన్సీలో టీమిండియాతో వన్డే సిరీస్ ఆడిన కివీస్ జట్టు.. భారత గడ్డపై తొలిసారి సిరీస్ కైవసం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతోనే 2-1 తేడాతో గిల్ సేనను ఓడించి సత్తా చాటింది. ఇక ఈ సిరీస్ సందర్భంగానే క్రిస్టియన్ క్లార్క్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.కోహ్లికే షాకిచ్చాడుభారత్తో తొలి వన్డేలో హర్షిత్ రాణాను అవుట్ చేసి తన ఖాతాలో తొలి వికెట్ జమచేసుకున్న క్లార్క్.. రెండు, మూడో వన్డేల్లో దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లిని పెవిలియన్కు పంపాడు. రెండో వన్డేలో మొత్తంగా 3 వికెట్లు తీసిన 24 ఏళ్ల ఈ రైటార్మ్ మీడియం పేసర్.. మూడో వన్డేలోనూ మూడు వికెట్లతో సత్తా చాటాడు.ఈ క్రమంలోనే టీ20 సిరీస్ జట్టులోనూ క్రిస్టియన్ క్లార్క్ స్థానం సంపాదించగలిగాడు. ఈ విషయం గురించి న్యూజిలాండ్ కోచ్ రాబ్ వాల్టర్ మాట్లాడుతూ.. ‘‘వన్డే సిరీస్లో తన ప్రతిభ ఏమిటో అతడు నిరూపించుకున్నాడు.తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలోనూ రాణించి అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. అందుకే టీ20 సిరీస్ జట్టులోనూ అతడికి చోటు దక్కింది’’ అని పేర్కొన్నాడు.టీమిండియాతో టీ20 సిరీస్కు న్యూజిలాండ్ జట్టు (అప్డేటెడ్)మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైల్ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి, క్రిస్టియన్ క్లార్క్ (మొదటి 3 మ్యాచ్లకు).షెడ్యూల్: జనవరి 21, 23, 25, 28, 31టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి న్యూజిలాండ్ జట్టుమిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి.చదవండి: Sunil Gavaskar: ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి -
ఓటమిని అంగీకరించడు.. అతడిని చూసి నేర్చుకోండి!
న్యూజిలాండ్ చేతిలో మరోసారి టీమిండియాకు భంగపాటు ఎదురైంది. సొంతగడ్డపై కివీస్కు తొలిసారి భారత్ వన్డే సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.టీమిండియా ఓటమికి కారణం అదేన్యూజిలాండ్తో మ్యాచ్లలో సరైన ఆరంభాలు లేకపోవమే భారత్ సిరీస్ కోల్పోయేందుకు కారణమని గావస్కర్ అభిప్రాయ పడ్డారు. భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో ఇన్నింగ్స్లు ఎలా నిర్మించాలో విరాట్ కోహ్లి (Virat Kohli)ని చూసి సహచరులు నేర్చుకోవాలని సూచించాడు. ‘కోహ్లికి సరైన సహకారం లభించకపోతే లక్ష్య ఛేదన చాలా కష్టమని అర్థమైపోయింది. చివరకు అదే జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ సిరీస్లో మనకు సరైన ఆరంభాలు లభించలేదు. అదే జరిగితే సగం పని సులువయ్యేది. రాహుల్లాంటి బ్యాటర్ అవుటైన తర్వాత నితీశ్ (Nitish Kumar Reddy), హర్షిత్ (Harshit Rana)లాంటి ఆటగాళ్ల నుంచి ఎలాంటి ప్రదర్శన వస్తుందో ఎవరూ అంచనా వేయలేరు. అందుకే పరిస్థితి ఇబ్బందికరంగా మారిపోయింది’ అని గావస్కర్ విశ్లేషించారు. సెంచరీతో చివరి వరకు పోరాడిన కోహ్లిపై సన్నీ ప్రశంసలు కురిపించారు. ఓటమిని అంగీకరించకుండా‘కోహ్లి ఆలోచనధోరణి, అతని నిలకడను అందరూ అందిపుచ్చుకోవాలి. ఒకే శైలికి కట్టుబడకుండా పరిస్థితులకు తగినట్లుగా కోహ్లి తన ఆటను మార్చుకున్నాడు. చివరి వరకు ఓటమిని అంగీకరించకుండా అతను ప్రయత్నించాడు. ఇది యువ ఆటగాళ్లకు మంచి పాఠం అవుతుంది’ అని దిగ్గజ క్రికెటర్ పేర్కొన్నారు. చదవండి: భారత్ నెత్తిన మిచెల్ పిడుగు -
భారత జెర్సీలో మళ్లీ రో-కోలు కనిపించేది ఎప్పుడంటే?
టీమిండియా స్టార్ జోడీ విరాట్ కోహ్లి-రోహిత్ శర్మల ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ముగియడంతో రో-కో ద్వయం దాదాపు 6 నెలల పాటు భారత జెర్సీలో కన్పించరు. మళ్లీ వచ్చే ఏడాది జూలైలో ఇంగ్లండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్లో వీరిద్దరూ భారత్ తరపున ఆడనున్నారు.అంతకంటే మందు జూన్లో అఫ్గానిస్తాన్ జట్టు మూడు వన్డేల సిరీస్ కోసం భారత పర్యటనకు రావాల్సి ఉంది. కానీ ఈ ద్వైపాక్షిక సిరీస్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ఒకవేళ అఫ్గానిస్తాన్తో భారత్ ఆడితే విరాట్-రోహిత్ కూడా బరిలోకి దిగనున్నారు. లేదంటే ఆ తర్వాత నెలలో ఇంగ్లండ్పై కచ్చితంగా ఆడనున్నారు.కాగా ఇప్పటికే టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, కోహ్లిలు.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్తో వన్డేల తర్వాత టీమిండియా టీ20 సిరీస్లు ఎక్కువగా ఆడనుంది. వీరిద్దరూ టీ20లకు వీడ్కోలు పలకడంతో వన్డే సిరీస్ షెడ్యూల్ వరకు అభిమానులు అగాల్సిందే.అయితే ఈ సీనియర్ ప్లేయర్లు ఐపీఎల్లో మాత్రం తమ తమ జట్లు తరపున సందడి చేయనున్నారు. ఈ ఏడాది ఆఖరిలో మాత్రం విరాట్, రోహిత్ వరుస అంతర్జాతీయ సిరీస్లలో బీజీబీజీగా గడపనున్నారు. ఇంగ్లండ్తో వన్డేలు ముగిసిన తర్వాత సెప్టెంబర్లో భారత్ వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో ఆతిథ్య విండీస్తో మెన్ ఇన్ బ్లూ 3 వన్డేలు ఆడనుంది. అనంతరం అక్టోబర్-నవంబర్ నెలల్లో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనుంది.విరాట్ హిట్.. రోహిత్ ఫట్ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో విరాట్ కోహ్లి దుమ్ములేపితే.. రోహిత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ సిరీస్లో కోహ్లి మొత్తంగా 240 పరుగులు చేసి భారత తరఫున టాప్ స్కోరర్గా నిలిచాడు. సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో కూడా కోహ్లి వీరోచిత శతకంతో పోరాడాడు. రోహిత్ మాత్రం మూడు మ్యాచ్లలో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: IND vs NZ: వాళ్ల సెంచరీలే కాదు.. అతడి 28 రన్స్ కీలకం! -
కోహ్లితో ప్రేమాయణం? స్పందించిన సంజనా గల్రానీ
సంజనా గల్రానీ.. అప్పుడెప్పుడో బుజ్జిగాడు మూవీలో అలరించిన ఈ నటి కొంతకాలంగా సినిమాల్లో యాక్టివ్గా కనిపించడం లేదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో హీరోయిన్గా చేసిన ఈమె ఇటీవల తెలుగు బిగ్బాస్ తొమ్మిదో సీజన్లో పాల్గొంది. ముక్కుసూటిగా వ్యవహరిస్తూ ఏకంగా టాప్ 5లో చోటు దక్కించుకుంది. అయితే గతంలో సంజనాపై ఓ రూమర్ ఉంది. క్రికెటర్ విరాట్ కోహ్లితో లవ్ ట్రాక్ నడిపిందంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.ఆ పబ్లిసిటీ వద్దుకెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఈ ఊహాగానాలు వెలువడ్డాయి. తాజాగా ఈ రూమర్స్పై క్లారిటీ ఇచ్చింది సంజనా. ఆమె మాట్లాడుతూ.. నేను బెంగళూరు అమ్మాయిని. కన్నడలో టాప్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్కు అతిథిగా వెళ్లాను. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండేది తప్ప అంతకుమించి ఏమీ లేదు. అదంతా గతం. విరాట్ కోహ్లి గర్ల్ఫ్రెండ్గా గుర్తింపు పొందడం, ఆ పబ్లిసిటీ నాకవరసరమే లేదు. కానీ, ఈ లేనిపోని లవ్ రూమర్స్ మా స్నేహాన్ని చెడగొట్టాయి. ఈ రూమర్స్ రాకపోయుంటే ఇప్పటికీ మేము మంచి ఫ్రెండ్స్గా కొనసాగేవాళ్లం. ఆ బాధ నాకెప్పుడూ ఉంది అని చెప్పుకొచ్చింది.ఏం జరిగిందంటే?సంజనా గల్రానీ, క్రికెటర్ విరాట్ కోహ్లి 2011 సమయంలో ప్రేమించుకున్నారంటూ అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఆ ఏడాది ఐపీఎల్లో బెంగళూరుకు సపోర్ట్ చేసింది సంజనా.. ఈ క్రమంలోనే తరచూ మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లేది. అలా ఓసారి ఆర్సీబీ జెర్సీ ధరించిన ఈ నటి.. విరాట్ కోహ్లితో కలిసి మైదానంలో ముచ్చట్లు పెట్టింది. ఈ మేరకు ఓ ఫోటో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. ఇంకేముంది, వీళ్లిద్దరికీ లింక్ పెడుతూ కథనాలు బయటకు వచ్చాయి. కానీ, కొంతకాలానికి వీరిద్దరూ మరెక్కడా కలిసి కనిపించలేదు.చదవండి: సికందర్ విషయంలో అదే జరిగింది: రష్మిక మందన్నా -
ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి
న్యూజిలాండ్తో మూడో వన్డేలో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లి అద్భుత శతకంతో అలరించాడు. ఇండోర్ వేదికగా ఈ వన్డౌన్ బ్యాటర్.. 91 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 108 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. పది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 124 పరుగులు సాధించాడు.ప్రపంచ రికార్డులు బద్దలుతద్వారా వన్డే ఫార్మాట్లో తన పేరిట ఉన్న అత్యధిక సెంచరీ (53)ల రికార్డును కోహ్లి సవరించాడు. ఈ మ్యాచ్ సందర్భంగా 54వ వన్డే సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. తన అంతర్జాతీయ కెరీర్లో ఓవరాల్గా 85వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లి రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026 పాంటింగ్, సెహ్వాగ్లను దాటేసిన్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గా కోహ్లి చరిత్ర సృష్టించాడు. కాగా న్యూజిలాండ్పై కోహ్లికి వన్డేల్లో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. తద్వారా కివీస్పై అత్యధిక వన్డే శతకాలు బాదిన క్రికెటర్లుగా కొనసాగుతున్న భారత దిగ్గజం వీరేందర్ సెహ్వాగ్ (6), ఆస్ట్రేలియా లెజెండ్ రిక్కీ పాంటింగ్ (6) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును కోహ్లి బద్దలు కొట్టాడు.కలిస్ను అధిగమించిఅంతేకాదు.. మూడు ఫార్మాట్లలో కలిపి న్యూజిలాండ్పై అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్గానూ కోహ్లి చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్పై కోహ్లి 73 ఇన్నింగ్స్లో కలిపి 10 సెంచరీలు చేశాడు. తద్వారా సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (9) వరల్డ్ రికార్డును బ్రేక్ చేశాడు.కాగా ఆదివారం నాటి ఈ మ్యాచ్లో కివీస్ యువ పేసర్ క్రిస్టియన్ క్లార్క్ బౌలింగ్లో డారిల్ మిచెల్కు క్యాచ్ ఇచ్చి కోహ్లి పెవిలియన్ చేరాడు. కోహ్లితో పాటు నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) మాత్రమే రాణించారు. మిగిలిన వారు విఫలం కాగా.. భారత్ 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా సొంతగడ్డపై తొలిసారి న్యూజిలాండ్కు వన్డే సిరీస్ను కోల్పోయింది.న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 36 ఇన్నింగ్స్లో 7 సెంచరీలువీరేందర్ సెహ్వాగ్- 51 ఇన్నింగ్స్లో 6 సెంచరీలురిక్కీ పాంటింగ్- 23 ఇన్నింగ్స్లో 6 సెంచరీలుసనత్ జయసూర్య- 47 ఇన్నింగ్స్లో 5 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 42 ఇన్నింగ్స్లో 5 సెంచరీలున్యూజిలాండ్పై మూడు ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్లువిరాట్ కోహ్లి- 73 ఇన్నింగ్స్లో 10 సెంచరీలుజాక్వెస్ కలిస్- 76 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుజో రూట్- 71 ఇన్నింగ్స్లో 9 సెంచరీలుసచిన్ టెండుల్కర్- 80 ఇన్నింగ్స్లో 9 సెంచరీలు.చదవండి: అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డిని అందుకే ఆడిస్తున్నాం: గిల్ -
అతడు అద్భుతం.. నితీశ్ రెడ్డికి అందుకే ఛాన్స్: గిల్
సొంతగడ్డపై టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. ఇండోర్లో ఇప్పటి వరకు వన్డే ఓటమి రుచి చూడని భారత జట్టుకు న్యూజిలాండ్ షాకిచ్చింది. మూడో వన్డేలో టీమిండియాను ఓడించి సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి శతక్కొట్టినా మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం లభించకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు.ఈ నేపథ్యంలో సిరీస్ ఓటమిపై భారత జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ (Shubman Gill) స్పందించాడు. ‘‘తొలి మ్యాచ్లో గెలిచాం. రెండో వన్డేలో వాళ్లు గెలిచి 1-1తో సమం చేశారు. అయితే, ఇక్కడ ఈరోజు మా ఆట తీరు నన్నెంతగానో నిరాశపరిచింది.విరాట్ భాయ్ అద్భుతం.. హర్షిత్ సూపర్మేము ఆటను సరిదిద్దుకోవాల్సి ఉంది. పొరపాట్లను సరిచేసుకుంటాం. విరాట్ (Virat Kohli) భాయ్ బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతం. ఈ మ్యాచ్లో మాకు అదే అతిపెద్ద సానుకూలాంశం. ఇక ఈ సిరీస్లో ఎనిమిదో స్థానంలో వచ్చి హర్షిత్ రాణా బ్యాటింగ్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంది.A sight that never gets old, a sight we’re never tired of! 💯👑#ViratKohli’s 7th ODI century against New Zealand - most by any batter 🙌Another run chase, another masterclass, and he knows the job is not done yet 🎯#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/0qf8wSXfVW— Star Sports (@StarSportsIndia) January 18, 2026నితీశ్ రెడ్డిని అందుకే ఆడించాంఅందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. మా ఫాస్ట్ బౌలర్లు సిరీస్ ఆసాంతం మెరుగ్గా బౌలింగ్ చేశారు. ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy)కి అవకాశాలు ఇస్తున్నాం. సరిపడా ఓవర్లు వేయించడంతో పాటు బ్యాటింగ్ కూడా చేయిస్తున్నాం.A cracker to bring up his maiden ODI fifty! Well played, Nitish Kumar Reddy.#INDvNZ | LIVE NOW 👉 https://t.co/CixSjUFkhU pic.twitter.com/hKLft9Eu0G— Star Sports (@StarSportsIndia) January 18, 2026వివిధ రకాల కాంబినేషన్లు ట్రై చేస్తున్నాం. ఇందులో నితీశ్ కూడా భాగం. అతడి బౌలింగ్ తీరును కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం’’ అని గిల్ పేర్కొన్నాడు. కాగా మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది.41 పరుగుల తేడాతో ఓటమిఈ క్రమంలో తొలుత వన్డే సిరీస్ జరుగగా.. వడోదరలో టీమిండియా.. రాజ్కోట్లో కివీస్ గెలిచాయి. ఆఖరిదైన నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి న్యూజిలాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 337 పరుగులు సాధించింది.లక్ష్య ఛేదనలో 46 ఓవర్లలో భారత్ కేవలం 296 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా 41 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇక ఈ మ్యాచ్లో కోహ్లి సెంచరీ (124) చేయగా.. నితీశ్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రాణా (52) అర్ధ శతకాలతో రాణించారు. మిగిలిన వారిలో గిల్ (23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చదవండి: IND vs NZ: ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా! వీడియో -
కోహ్లి వీరోచిత పోరాటం వృథా.. ఇండోర్లో భారత్ ఓటమి
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో 41 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో టీమిండియా కోల్పోయింది. సొంతగడ్డపై కివీస్తో వన్డే సిరీస్ను భారత్ కోల్పోవడం ఇదే తొలిసారి. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి విరోచిత సెంచరీతో పోరాడినప్పటికి జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయాడు. కోహ్లి 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. భారీ లక్ష్య చేధనలో భారత్కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. కేవలం 11 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ ఔటయ్యాడు. అనంతరం గిల్, కోహ్లి కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే వరుస క్రమంలో గిల్(23), శ్రేయస్ అయ్యర్(3), రాహుల్(1) వికెట్లు భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి(53), విరాట్ కోహ్లి కలిసి జట్టును ఆదుకున్నారు. ఆ తర్వాత నితీశ్(53), జడేజా(12) వెంటవెంటనే ఔట్ కావడంతో మళ్లీ కథ మొదటికి వచ్చింది. అయితే క్రీజులోకి వచ్చిన హర్షిత్ రాణా(52).. కోహ్లితో కలిసి మెరుపులు మెరిపించాడు. కానీ వరుస క్రమంలో హర్షిత్, కోహ్లి వికెట్లు కోల్పోవడంతో భారత్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో చెలరేగారు. -
విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీ
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీతో చెలరేగాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు. ఓ వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నప్పటకి.. కోహ్లి మాత్రం తన అద్బుత బ్యాటింగ్తో అభిమానుల్లో గెలుపు ఆశలను రేకెత్తించాడు.ఈ క్రమంలో విరాట్ 91 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. కోహ్లికి ఇది 54వ వన్డే సెంచరీ. విరాట్ 108 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. చివరికి భారత్ 46 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. దీంతో 41 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. మూడు వన్డేల సిరీస్ను 2-1 తేడాతో భారత్ కోల్పోయింది.న్యూజిలాండ్ బౌలర్లలో ఫౌల్క్స్, క్లార్క్ తలా మూడు వికెట్టు పడగొట్టగా.. లినెక్స్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ స్టార్ బ్యాటర్లు డారిల్ మిచెల్(137), గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీలతో సత్తాచాటారు. -
ఏంటి రోహిత్ ఇది..? ఛాన్స్ వచ్చినా కూడా!
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తీవ్ర నిరాశపరిచాడు. తొలి రెండు వన్డేల్లో విఫలమైన రోహిత్.. ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ అదే తీరును కనబరిచాడు. 338 పరుగుల లక్ష్య చేధనలో హిట్మ్యాన్ నామమాత్రపు స్కోర్కే పరిమితమయ్యాడు. భారత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన జకారీ ఫౌల్క్స్ బౌలింగ్లో రోహిత్ ఔటయ్యాడు.మిడాన్లో క్లార్క్కు క్యాచ్ ఇచ్చి రోహిత్ ఔటయ్యాడు. అయితే అదే ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను వికెట్ కీపర్ మిచిల్ హే జారవిడిచాడు. కానీ తనకు లభించిన అవకాశాన్ని రోహిత్ అందిపుచ్చుకోలేకపోయాడు. రోహిత్ కేవలం 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.ఈ సిరీస్ మొత్తంగా రోహిత్ కేవలం 61 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సిరీస్లోనూ రోహిత్ దుమ్ములేపాడు. కానీ ఆ ఫామ్ను కివీస్పై మాత్రం కొనసాగించలేకపోయాడు. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికలలో ఉన్న హిట్మ్యాన్ నుంచి టీమ్ మెనెజ్మెంట్ మెరుగైన ప్రదర్శలను ఆశిస్తోంది.తడబడుతున్న భారత్..కాగా 338 పరుగుల లక్ష్య చేధనలో భారత్ తడబడుతోంది. కేవలం 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. శుభ్మన్ గిల్ 23 పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్(3), కేఎల్ రాహుల్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. క్రీజులో విరాట్ కోహ్లి(35), నితీశ్ కుమార్ రెడ్డి(7) ఉన్నారు. కివీస్ బౌలర్లలో ఇప్పటివరకు ఫౌల్క్స్, క్లార్క్, లినిక్స్, జేమిసన్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్.. -
చరిత్ర సృష్టించిన డారిల్ మిచెల్..
వన్డే క్రికెట్లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.ప్రస్తుతం భారత్తో జరుగుతున్న వన్డే సిరీస్లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు. మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్లతో 137 పరుగులు చేశాడు. భారత్పై అతడికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్పై గత ఐదు మ్యాచ్లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.ఈ మ్యాచ్లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా కలిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్గా మిచెల్ చరిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో కోహ్లిని మిచెల్ అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో భారత కెప్టెన్ శుభ్మన్ గిల్(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు.చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్ -
చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డు బ్రేక్
అండర్-19 ప్రపంచకప్ 2026లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే కెప్టెన్ ఆయూశ్ మాత్రే(6), అయుష్ మాత్రే (6), వేదాంత్ త్రివేది (0), విహాన్ మల్హోత్రా (7) వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది.ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ తన సహచర ఆటగాడు అభిజ్ఞాన్ కుండు(80)తో కలిసి జట్టును ఆదుకున్నాడు. వైభవ్ మొత్తంగా 67 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 72 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో 14 ఏళ్ల సూర్యవంశీ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.తొలి ప్లేయర్గా..అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో హాఫ్ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయష్కుడిగా వైభవ్ నిలిచాడు. సూర్యవంశీ కేవలం 14 ఏళ్ల 296 రోజుల వయస్సులో ఈ ఫీట్ సాధించాడు. ఇంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ క్రికెటర్ షాహిదుల్లా కమల్ పేరిట ఉంది. 2014 అండర్-19 ప్రపంచకప్లో కమల్ 15 ఏళ్ల 19 రోజుల వయస్సులో ఈ ఘనత సాధించాడు. తాజా మ్యాచ్తో కమల్ ఆల్టైమ్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు.అదేవిధంగా యూత్ వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో వైభవ్ సూర్యవంశీ.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని అధిగమించాడు. కోహ్లి 28 మ్యాచ్లలో 978 పరుగులు చేయగా.. సూర్యవంశీ 20 మ్యాచ్ల్లోనే 1,047 పరుగులు సాధించాడు. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో విజయ్ జోల్ (1,404 పరుగులు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఓవరాల్గా అయితే బంగ్లాదేశ్ స్టార్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (1,820 పరుగులు) టాప్లో కొనసాగుతున్నాడు.కాగా మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో వైభవ్, కుండు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. బంగ్లాదేశ్ బౌలర్లలో అల్ ఫహాద్ 5 వికెట్లతో సత్తాచాటగా.. ఇక్బాల్, ఎండి అజీజుల్ హకీం తమీమ్ తలా రెండు వికెట్లు సాధించారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్తో మూడో వన్డే.. భారత జట్టులో కీలక మార్పులు! -
లేటు వయసులోనూ ఇరగదీస్తున్న స్టార్ వెటరన్లు
దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జో రూట్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో చెలరేగిపోతున్నారు. వీరిలో వార్నర్ అయితే మరీనూ. ఈ ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్బాష్ లీగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. గడిచిన నాలుగు ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో (130 నాటౌట్, 67 నాటౌట్, 82, 110 నాటౌట్) పట్టపగ్గాల్లేకుండా ఉన్నాడు. తాజా సెంచరీతో వార్నర్ భాయ్ టీ20ల్లో అత్యంత అరుదైన ఘనత సాధించాడు. క్రిస్ గేల్ (22), బాబర్ ఆజమ్ (11) తర్వాత రెండంకెల సెంచరీ మార్కును (10) తాకిన మూడో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.మరో ఆసీస్ వెటరన్, టెస్ట్ ప్లేయర్గా ముద్ర పడిన స్టీవ్ స్మిత్ అయితే ఫార్మాట్లకతీతంగా రెచ్చిపోతున్నాడు. ఇటీవల యాషెస్ సిరీస్లో అద్భుత శతకం బాదిన అతను.. తాజాగా బిగ్బాష్ లీగ్లో అదిరిపోయే విధ్వంసకర శతకం బాదాడు. వార్నర్ తాజా సెంచరీ చేసిన మ్యాచ్లోనే స్టీవ్ కూడా శతక్కొట్టాడు. ఈ మ్యాచ్లో స్టీవ్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి బిగ్బాష్ లీగ్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు.ఇంగ్లండ్ బ్యాటింగ్ దిగ్గజం జో రూట్ గురించి అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఎవరికీ సాటిరాని విధంగా టెస్ట్ల్లో వరుస సెంచరీలతో దూసుకుపోతున్నాడు. గత ఐదేళ్లలో అతను టెస్ట్ల్లో ఏకంగా 24 సెంచరీలు బాదాడు. వన్డేల్లోనూ మూడు శతకాలు చేశాడు. తాజాగా అతను ఆస్ట్రేలియా గడ్డపై రెండు సెంచరీలతో సత్తా చాటాడు.టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం లేటు వయసులో ఇరగదీస్తున్నారు. టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు.. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్ల్లో చెలరేగిపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి వయసుతో సంబంధం లేకుండా ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ సహా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీ చేసిన రోహిత్.. సౌతాఫ్రికాపై 2, ఆస్ట్రేలియాపై మరో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.విరాట్ కోహ్లి విషయానికొస్తే.. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఇతను, ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు మ్యాచ్ల్లో డకౌటై అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. చాలామంది విరాట్ పని అయిపోయిందని కూడా అనుకున్నారు. ఈ దశలో విరాట్ అనూహ్యంగా పుంజుకొని సెంచరీల మీద సెంచరీలు బాదుతూ కెరీర్ పీక్స్లో ఉన్నప్పటి విరాట్ను గుర్తు చేస్తున్నాడు. విరాట్ గత 8 ఇన్నింగ్స్ల్లో 3 సెంచరీలు, 4 అర్ద సెంచరీలు చేసి అత్యుత్తమ ఫామ్లో కొనసాగుతున్నాడు.వీరే కాకుండా ఫాబ్ ఫోర్లోని మరో వెటరన్ స్టార్ కేన్ విలియమ్సన్ కూడా అడపాదడపా సెంచరీలతో సత్తా చాటుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో వీరంతా సత్తా చాటుతుంటే, బౌలింగ్లో ఒక్కరు మాత్రం ఊహకందని విధంగా చెలరేగిపోతున్నారు. ఆ స్టార్ వెటరన్ బౌలర్ పేరు మిచెల్ స్టార్క్. స్టార్క్ తాజాగా ముగిసిన యాషెస్ 2025-26లో 5 మ్యాచ్ల్లో 31 వికెట్లు పడగొట్టి, కుర్ర పేసర్లు కూడా సాధ్యం కాని ప్రదర్శనలు చేశాడు. ఈ సిరీస్లో అతను బ్యాట్తోనూ ఆకట్టుకోవడం మరో విశేషం.ప్రస్తుతం జో రూట్ వయసు 35, మిచెల్ స్టార్క్ వయసు 35, స్టీవ్ స్మిత్ వయసు 36, విరాట్ కోహ్లి వయసు 37, రోహిత్ శర్మ వయసు 38, డేవిడ్ వార్నర్ వయసు 39. వీరంతా మహా అయితే కెరీర్ను మరో రెండేళ్లు కొనసాగించగలరు. ఇలాంటి దశలో సాధారణ ఆటగాళ్లైతే అడపాదడపా ప్రదర్శనలతో మమ అనిపించే వాళ్లు. కానీ వీళ్లు మాత్రం అలా కాదు. వైన్ వయసు పెరిగే కొద్ది మత్తు ఎక్కువగా ఇస్తుందన్నట్టు సత్తా చాటుతున్నారు. -
విరాట్ కోహ్లీ, అనుష్క ఫెస్టివ్ వైబ్ : రూ. 38 కోట్ల ఆస్తి కొనుగోలు
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ కు సంబంధించిన ఒక శుభవార్త ప్రస్తుతం నెట్టింట సందడిగామారింది. అలీబాగ్లోని రాయ్గఢ్ జిల్లాలో ఐదు ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేశారు. సీఆర్ఈ (CRE) మ్యాట్రిక్స్ ఆస్తి పత్రాల ప్రకారం, దీని విలువ 37.86 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.మహరాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా (402201)లోని అలీబాగ్లోని గాట్ నంబర్లు 157 158లోని విలేజ్ జిరాద్లో ఈ భూమి ఉంది. రిజిస్టర్డ్ సేల్ డీడ్ ప్రకారం, మొత్తం భూమి 21,010 చదరపు మీటర్లు లేదా దాదాపు 5.19 ఎకరాలు ఉంటుంది. ఈ లావాదేవీ జనవరి 13, 2026న రిజిస్టర్ చేశారు. సోనాలి అమిత్ రాజ్పుత్ నుంచి అనుష్క, విరాట్ దంపతులు ఈ భూమిని కొనుగోలు చేసినట్టు CRE మ్యాట్రిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అభిషేక్ కిరణ్ గుప్తా వెల్లడించారు. నిబంధనల ప్రకారం విరాట్, అనుష్క రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.30,000, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు రూ.1,000గా నమోదయ్యాయి. ఇదీ చదవండి: పండగవేళ విషాదం : చేపలకోసం ఎగబడ్డ జనంమరోవైపు సెలబ్రిటీ జంట విరుష్క అలీబాగ్లో ఇదే తొలి రియల్ ఎస్టేట్ పెట్టుబడి కాదు. 2022లో, ఈ జంట 2022లో అలీబాగ్లో 19.24 కోట్ల రూపాయలకు దాదాపు 8 ఎకరాలు కొనుగోలు చేశారు. తరువాత ఈ జంట సంపాదించిన ప్లాట్లలో ఒక విలాసవంతమైన వెకేషన్ హోమ్ను నిర్మించారు. ఇదే ప్రాంతంలో ల్యాండ్ను కొనుగోలు చేసినవారిలో ప్రముఖ కొనుగోలుదారులలో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఉన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 2025లో చాటౌ డి అలీబాగ్లో సుమారు రూ. 2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. అలాగే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడి పెట్టారు. 2024 ఏప్రిల్లో రూ. 10 కోట్లకు 10,000 చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేశారు, ఆ తర్వాత అక్టోబర్ 2025లో రూ. 6.6 కోట్లకు మొత్తం 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడు ఆనుకుని ఉన్న ప్లాట్లను కొనుగోలు చేశారు. షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ కూడా అలీబాగ్లో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసిన ప్రముఖులలో ఉండటం విశేషం.ఇదీ చదవండి: కన్నకూతుళ్లపై తండ్రి అఘాయిత్యం, 6 ఏళ్ల వయసు నుంచి -
కేఎల్ రాహుల్ సెంచరీ.. భారత్ స్కోరెంతంటే?
రాజ్కోట్ వేదికగా న్యూజిలాండ్తో జరగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 120 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును రాహుల్ తన సెంచరీతో ఆదుకున్నాడు.టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు వీరిద్దరూ 70 పరుగుల భాగస్వామమ్యం నెలకొల్పారు. రోహిత్(24) ఔటయ్యాక గిల్(56), శ్రేయస్ అయ్యర్(8), విరాట్ కోహ్లి(23) వెంటవెంటనే పెవిలియన్కు చేరారు.ఈ క్రమంలో రాహుల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(27)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. జడేజా ఔటైనప్పటికి రాహుల్ మాత్రం తన ఏకాగ్రతను కోల్పోలేదు. ఆచితూచి ఆడుతూ 87 బంతుల్లో తన ఎనిమిదివ వన్డే సెంచరీ మార్క్ను కేఎల్ అందుకున్నాడు.ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మొత్తంగా రాహుల్ 92 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, ఒక సిక్సర్తో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌలర్లలో క్రిస్టేన్ క్లార్క్ మూడు వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, పౌల్క్స్చ, బ్రెస్వెల్ తలా వికెట్ సాధించారు.చదవండి: BBL: పాక్ ప్లేయర్కు ఘోర అవమానం.. బ్యాటింగ్ మధ్యలోనే పిలిచేశారు


