గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
Published Thu, Feb 2 2017 3:07 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM
- 34 కిలోల గంజాయి స్వాధీనం
అనకాపల్లి: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక ఆటోతో పాటు 34 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువారం దాడులు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement