ఘనంగా గురుపౌర్ణమి | Richly gurupaurnami | Sakshi
Sakshi News home page

ఘనంగా గురుపౌర్ణమి

Published Sat, Aug 1 2015 2:06 AM | Last Updated on Sun, Sep 3 2017 6:31 AM

ఘనంగా  గురుపౌర్ణమి

రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కోలారు జిల్లా మాలూరులోని శిరిడి సాయిబాబా ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా అఖండ భజన, పూల పల్లకి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు.

ఆలయంలోని సాయిబాబా మూలవిరాట్‌ను విశేషంగా అలంకరించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమాలను ఆలయ సమితి అధ్యక్షుడు ఆర్.సి.అప్పాజీగౌడ, విజయ్‌కుమార్, వి.గోవిందరాజశెట్టి, ఎం.ఎన్.లోకేష్, సోమశేఖర్
 పర్యవేక్షించారు.
 - మాలూరు
 

Advertisement
Advertisement
Advertisement