CELEBRATIONS
-
కాళేశ్వరంలో మొదలుకానున్న మహాశివరాత్రి ఉత్సవాలు
-
కరీనా కపూర్ కజిన్ ఆదార్ జైన్ మెహందీ ఫంక్షన్ (ఫోటోలు)
-
అంగరంగ వైభవంగా శివాజీ జయంతి, ఊయల వేడుకలు
సోలాపూర్: హైందవ స్వరాజ్య స్థాపకుడు, బహుజనుల పాలకుడు, జనతా రాజా శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా శ్రీ శివ జన్మోత్సవ మధ్యవర్తి మహా మండల్ ఆధ్వర్యంలో ఊయల వేడుకను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్థరాత్రి సోలాపూర్ బస్టాండ్ సమీపంలోని శివాజీ మహారాజ్ చౌక్ వద్ద జరిగిన ఈ వేడుకలకు సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా 25 వేల మందికి పైగా మహిళలు హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించి ఊయల గేయాలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమం జరుగుతున్నంతసేపూ బాణాసంచా వెలుగులతో , ఛత్రపతి శివాజీ మహారాజ్ కీ జై అనే నినాదాలతో శివాజీచౌక్ పరిసరాలు మార్మోగాయి. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటుచేశారు. శివాజీ మహారాజ్ జీవితం యువతకు స్ఫూర్తిదాయకం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు బుధవారం దత్తనగర్ లోని సీపీఎం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సీపీఎం మాజీ కార్పొరేటర్ వెంకటేశ్ కొంగారి మాట్లాడుతూ... ప్రజాస్వామ్య బద్దంగా అన్ని కులాలు, వృత్తుల వారికి ఆత్మగౌరవాన్ని అందించే లౌకిక వ్యవస్థతో పాటు హైందవ స్వరాజ్యం ఏర్పాటు కోసం అహరి్నశలు కృషిచేసిన మహనీయుడు ఛత్రపతి శివాజీ అన్నారు. దౌర్జన్యం, బానిసత్వాన్ని పారద్రోలేందుకు విదేశీయులపై దండయాత్ర చేసి స్వయం ప్రతిపత్తి గల రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ మహారాష్ట్రతో పాటు యావత్ భారతదేశానికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. శివాజీ మహారాజ్ వ్యక్తిత్వం ,ఆయన భావజాలాన్ని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవలసిన అవసరముందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కామిని ఆడం, శేవంత దేశముఖ్, శకుంతల పానీబాతే, రంగప్ప మారెడ్డి, మురళీధర్ సుంచు, బాలకృష్ణ మల్యాల, వీరేంద్ర పద్మ, అభిజిత్ నీకంబే, అనిల్ వాసం, విజయ్ హర్సూర్ తదితరులు పాల్గొన్నారు.ఛత్రపతి స్ఫూర్తితోసమాజ ఐక్యత కోసం కృషిచేయాలి ఛత్రపతి శివాజీ మహరాజ్ ధైర్యసాహసాలు, ఆదర్శాలను స్ఫూర్తిగా తీసు కుని సమాజంలో ఐక్యతను నెలకొల్పేందుకు ప్రయతి్నంచాలని కలెక్టర్ కుమార్ ఆశీర్వాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి రంగుభవన్ చౌక్లోని చత్రపతి శివాజీ మహారాజ్ ఉద్యానవనం వరకు ‘జై శివాజీ జై భారత్’పేరిట పాదయాత్ర నిర్వహించారు. శివాజీ మహారాజ్ 395 వ జయంతి సందర్భంగా మహారాష్ట్రలోని మొత్తం 36 జిల్లాలలో జై శివాజీ జై భారత్ పాదయాత్ర నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు కలెక్టర్ కుమార్ ఆశీ ర్వాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. అనంతరం జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. జై శివాజీ,జై భారత్ పాదయాత్ర మరాఠా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని పే ర్కొన్నారు. ఈ యాత్ర ద్వారా శివాజీ భావాజాలాన్ని రాష్ట్రమంతటా వ్యాప్తిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ కులదీ ప్ జంగం, పట్టణ పోలీస్ కమిషనర్ ఎం రాజ్ కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ మౌనిక సింగ్ ఠాకూర్, మనీషా కుంబార్ జిల్లా పరిపాలన విభాగానికి చెందిన అధికారులు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
బుజ్జి.. ఇక పోట్లాడుకుంది చాలు.. ఇప్పటికైనా..! (ఫోటోలు)
-
సింగర్ గీతామాధురి తనయుడి ఫస్ట్ బర్త్డే (ఫోటోలు)
-
బేగంపేట : హుషారుగా..డార్లింగ్స్ డే.. (ఫొటోలు)
-
తండేల్ మూవీ సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్గా శోభిత- నాగచైతన్య (ఫోటోలు)
-
అంతా ప్రేమమయం...
అలనాడు భక్త రామదాసుకు అంతా రామమయంగా, జగమంతా రామమయంగా అగుపించింది గాని, ప్రేమికులకు మాత్రం అంతా ప్రేమమయంగా, జగమంతా ప్రేమమయంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే. ప్రేమికులు జరుపుకొనే రోజు కాబట్టి ఇది ప్రేమికుల దినోత్సవంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మన దేశంలో ఆర్థిక సరళీకరణలు మొదలయ్యాక ప్రపంచీకరణ నేపథ్యంలో పలు విదేశీ వేడుకలు మన దేశానికీ పాకాయి. మూడు దశాబ్దాలకు ముందు మనవాళ్లకు వాలంటైన్స్ డే ఏమిటో తెలీదు. వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల దినోత్సవం అని ఇప్పుడు అందరికీ తెలుసు. దీనికి కారకుడైన సెయింట్ వాలంటైన్ చరిత్ర గురించి కూడా జనాలకు కొంతవరకు తెలుసు. అయితే, వాలంటైన్స్ డే గురించి చాలామందికి తెలియని విశేషాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని అరుదైన విశేషాలు మీ కోసం..» వాలంటైన్స్ డే నేపథ్యం క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ది నాటిది. అప్పట్లో రోమన్ ప్రజలు ‘లూపర్కేలియా’ పేరుతో సంతాన సాఫల్య వేడుకను ఫిబ్రవరి 13–15 తేదీలలో జరుపుకునేవారు. వారు ఈ వేడుకలో సంతాన సా«ఫల్యానికి అధిదైవమైన లూపర్కస్ను ఆరాధించేవారు. ఈ సందర్బంగా జంతుబలులు ఇచ్చేవారు. పోప్ గెలాషియస్–ఐ క్రీస్తుశకం ఐదో శతాబ్ది చివరి రోజుల్లో ‘లూపర్కేలియా’ వేడుకను నిషేధించి, దాని బదులుగా ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేను ప్రవేశపెట్టాడనే కథనం ఉంది.»సెయింట్ వాలంటైన్ ఒకరు కాదు, ముగ్గురు అని కూడా చెబుతారు. విచిత్రంగా వీరిలో ఇద్దరు క్రీస్తుశకం మూడో శతాబ్ది నాటి రోమన్ పాలకుడు క్లాడియస్–ఐఐ చేతిలో ప్రాణాలు కోల్పోయినవారే! యుద్ధ సమయంలో సైనికులు పెళ్లిళ్లు చేసుకోరాదన్న క్లాడియస్– ఐఐ ఆజ్ఞలను ఉల్లంఘించి, రోమ్ నగరంలో సైనికులకు ప్రేమ వివాహాలు జరిపించినందుకు సెయింట్ వాలంటైన్ మరణశిక్ష పొందాడు.ఈ కథనం చాలామందికి తెలిసినదే! రోమ్కు చేరువలోనే తెర్ని పట్టణానికి చెందిన సెయింట్ వాలంటైన్ పేరు గల మరో వ్యక్తి కూడా క్లాడియస్–ఐఐ చేతిలో మరణశిక్షకు గురయ్యాడు. అయితే, కేథలిక్ ఎడ్యుకేషన్ రిసోర్స్ సెంటర్ సమాచారం ప్రకారం సెయింట్ వాలంటైన్ పేరుతో ముగ్గురు వ్యక్తులు ఉన్నారట!» సైనికులకు పెళ్లిళ్లు జరిపించాడనే అభియోగంపై సెయింట్ వాలంటైన్ను క్లాడియస్–ఐఐ నిర్బంధించాడు. చెరసాల నుంచి సెయింట్ వాలంటైన్, చెరసాల పర్యవేక్షకుడి కూతురికి ప్రేమలేఖ రాశాడు. దాంతో అప్పటి వరకు చూపులేని ఆమెకు చూపు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది. అయితే, సెయింట్ వాలంటైన్కు క్రీస్తుశకం 270 ఫిబ్రవరి 14న ఉరిశిక్ష అమలు చేశారు. » వాలంటైన్స్ డే వేడుక ఖండాంతరాలకు పాకిన తర్వాత వాలంటైన్స్ డే గ్రీటింగ్ కార్డులకు గిరాకీ పెరిగింది. తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు ఆధునిక కాలానికి చెందినదై ఉంటుందని చాలామంది భావిస్తారు. అయితే, క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో లండన్ టవర్ జైలులో బందీగా ఉన్న ఖైదీ అక్కడి నుంచి తన భార్యకు బొమ్మలతో కూడిన ప్రేమలేఖ రాశాడు. బహుశా అదే తొలి వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డు అని చరిత్రకారులు భావిస్తారు. ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లో వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులు బాగా ప్రాచర్యంలోకి వచ్చాయి. » పాశ్చాత్య ప్రపంచంలో పదిహేడో శతాబ్దం వరకు ప్రేమికులు చేతితో రూపొందించిన గ్రీటింగ్ కార్డులను ఇచ్చి పుచ్చుకునేవారు. అమెరికాలోని మసాచుసెట్స్కు చెందిన ఎస్తర్ ఏ హౌలాండ్ వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డుల చరిత్రనే మార్చేసింది. పంతొమ్మిదో శతాబ్దిలో ఆమె స్వయంగా రూపొందించిన డిజైన్లతో అందంగా ముద్రించిన వాలంటైన్స్ గ్రీటింగ్ కార్డులను అమ్మడం ప్రారంభించింది. ఆమె వ్యాపారం అనతి కాలంలోనే అమెరికా అంతటా విస్తరించింది. దీంతో ఎస్తర్ ‘మదర్ ఆఫ్ అమెరికన్ వాలంటైన్స్’గా ప్రఖ్యాతి పొందింది.» తాజా లెక్కల ప్రకారం వాలంటైన్స్ డే రోజున వివిధ దేశాల ప్రేమికులు ఇచ్చి పుచ్చుకునే గ్రీటింగ్ కార్డుల సంఖ్య 15 కోట్లకు పైగానే ఉంటుంది. వీటికి తోడు చాక్లెట్ గిఫ్ట్ బాక్సులు, గులాబీల పుష్పగుచ్ఛాలు, బంగారు ఉంగరాలు, ఇతరేతర కానుకల సంఖ్య లెక్కలకు కూడా అందదు. ఏది ఏమైనా, వాలంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పర్వదినం. -
27 ఏళ్ల తర్వాత దక్కిన విజయం..ఢిల్లీలో బీజేపీ సంబరాలు (ఫొటోలు)
-
27 ఏళ్ల తర్వాత బీజేపీ బ్లాక్ బస్టర్
-
మళ్లీ వెనకబడ్డ కేజీవాల్.. ఢిల్లీలో బీజేపీ సంబరాలు
-
ఢిల్లీలో వికసించిన కమలం
-
హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బాలీవుడ్ భామ నోరా ఫతేహీ బర్త్ డే పార్టీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
బాసరలో వసంత పంచమి వేడుకలు
-
వసంత పంచమి.. అక్షరాభ్యాసం
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే బాసర గోదావరి నదీతీరంలో భక్తులు కనిపించారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు కుటుంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. సాయంత్రం కలెక్టర్ అభిలాష అభినవ్ వసంత పంచమి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. -
న్యూయార్క్ లో నైటా ఆధ్వర్యంలో 76వ గణతంత్ర వేడుకలు
-
హీరోయిన్ శృతి హాసన్ బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
అంజనమ్మ బర్త్ డే వేడుక.. మెగాస్టార్ ఎమోషనల్ నోట్
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన మాతృమూర్తి అంజనమ్మకు (Anjana Devi) జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఉపాసన, రామ్ చరణ్, మెగాస్టార్ దగ్గరుండి అంజనమ్మతో కేక్ కట్ చేయించారు. దీనికి సంబంధించిన వీడియోతో పాటు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు చిరంజీవి.చిరు తన ఇన్స్టాలో రాస్తూ..'అమ్మా! ఈ ప్రత్యేకమైన రోజున మాటల్లో చెప్పలేనంతగా ప్రేమను అందుకున్నారు. మీరు ఊహించలేనంతగా గౌరవం అందించిన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాం. మా ప్రియమైన అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. మా కుటుంబానికి హృదయం లాంటి మీ స్వచ్ఛమైన, నిస్వార్థ ప్రేమకు కృతజ్ఞతలు. నీ పాదాలకి నమస్కరిస్తూ.. పుణ్యం చేసుకొన్న నీ సంతతి.' అంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు.కాగా.. అంతకుముందే ఉపాసన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేసింది. అంజనమ్మతో దిగిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నాయనమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ఇన్స్టా వేదికగా విషెస్ తెలిపింది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రావడంతో వాయిదా వేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
'ఆ బాధేంటో నాకు మాత్రమే తెలుసు'.. అత్తారింటికి దారేది నటుడు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్లో అత్తారింటికి దారేది చిత్రంతో అభిమానులను సంపాదించుకున్న నటుడు బోమన్ ఇరానీ. ఆ తర్వాత తెలుగులో బెంగాల్ టైగర్, అజ్ఞాతవాసి, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం హిందీ చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. బోమన్ ఇరానీ చివరిసారిగా షారూఖ్ ఖాన్ మూవీ డుంకీలో కనిపించారు. ప్రస్తుతం ది మెహతా బాయ్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 7న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.సినిమాల సంగతి పక్కనపెడితే.. తాజాగా బోమన్ ఇరానీ తన వివాహా వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. తన భార్య జెనోబియా ఇరానీతో కలిసి 40వ పెళ్లి రోజును ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బోమన్ ఇరానీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఫరా ఖాన్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపింది.బోమన్ ఇరానీ తన ఇన్స్టాలో రాస్తూ..'ఈ ప్రపంచం మొత్తం నిన్ను దేవదూత అని పిలిచినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే దీని వెనుక ఉన్న నిజమైన బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. మన 40 సంవత్సరాల బంధమే దీనికి నిదర్శనం. కానీ ఇప్పుడు ఆ దేవదూతనే నన్ను ఇంతలా తీర్చిదిద్దింది. అంతేకాదు మా కుటుంబాన్ని తీర్చిదిద్ది మాలో నవ్వులు పూయించి ముందుండి నడిపించింది. 40 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న నా పాత స్నేహితుడిని ఎప్పటికీ ప్రేమిస్తున్నా ఉంటా.' అంటూ లవ్ సింబల్ను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు ఈ జంటకు విషెస్ తెలిపారు.కాగా.. బోమన్ ఇరానీ టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్లో 3 ఇడియట్స్, మున్నాభాయ్ ఎంబీబీఎస్, ఖోస్లా కా ఘోస్లా లాంటి సూపర్ హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ది మెహతా బాయ్స్ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Boman Irani (@boman_irani) -
ఘనంగా ది వికర్ స్టోరీ వార్షికోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ జాతర సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టాక్సీవాలా బ్యూటీ 'ప్రియాంక జవాల్కర్' సంక్రాంతి వైబ్ (ఫోటోలు)
-
కిషన్రెడ్డి ఇంట్లో సంక్రాంతి సంబరాలు.. హాజరైన ప్రధాని
సాక్షి,న్యూఢిల్లీ:కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నివాసంలో సోమవారం(జనవరి13) సాయంత్రం సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధాని తొలుత తులసి చెట్టుకు పూజ చేశారు.అనంతరం గంగిరెద్దులకు అరటిపళ్ళు తినిపించి,నూతన వస్త్రాలు బహుకరించారు. భోగి రోజు కావడంతో భోగి మంట వేశారు. ఈ సంబరాలకు ప్రధాని మోదీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా,పలువురు కేంద్రమంత్రులు,బీజేపీ ఎంపీలు, బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు.అంతకుముందు సినీ నటుడు చిరంజీవి,ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నాగేశ్వరరావు,బ్యాడ్మింటన్ క్రీడాకారిని పీవీ సింధుతో కలిసి సంక్రాంతి వేడుకలకు ప్రధాని జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రముఖ గాయని సునీత గీతాలాపనతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. -
కూసుమంచి భోగి వేడుకల్లో పాల్గొన్న పొంగులేటి దంపతులు
-
రోజా ఇంట ఘనంగా భోగి పండుగ సంబరాలు
-
పల్లెల్లో భోగి పండగ సందడి
-
సాంస్కృతిక సోయగం.. శిల్పారామం..
గచ్చిబౌలి: పల్లె వాతావరణమైన శిల్పారామంలో హరినామస్మరణ, గంగి రెద్దుల విన్యాసాలు, నృత్యకారుల గవ్వల సవ్వడి సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచాయి. వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారులతో సంక్రాంతి శోభ సంతరించుకుంది. జానపద కళాకారులు.. రాజమండ్రికి చెందిన విభూతి బ్రదర్స్ బృందం హరిదాసులు, బుడబుక్కలు, జంగమ దేవర, సోది చేప్పే వేషధారణలతో ఆకట్టుకున్నారు. దాదాపు పది మంది కళాకారులు వివిధ అలంకరణలో సందర్శకులను ఆకట్టుకున్నారు. అంకిరెడ్డి పాలెం, వలిగొండకు చెందిన కళాకారులు గంగిరెద్దుల విన్యాలతో అబ్బురపరిచారు. సాయంత్రం ఆంపిథియోటర్లో కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. మంగళవారం సురభి కారులు ‘మాయ బజార్’ నాటకాన్ని ప్రదర్శిస్తారు. శేరిలింగంపల్లి సురభి కాలనీకి చెందిన దయానంద్ బృంధం, మరికొందరు కళాకారులు కూచిపూడి, భరత నాట్యాన్ని ప్రదర్శిస్తారు. -
తెలుగు ప్రజల జీవనశైలి..
తెలుగు ప్రజల జీవన శైలిలో ప్రత్యేక స్థానం పొందిన పండుగ సంక్రాంతి. ఇది ప్రకృతితో, పంటలతో, కుటుంబ బంధాలతో ముడిపడి ఉంది. సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. అలాంటి పండుగను ఒక వేడుకలా ప్రతి యేటా హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్హౌస్లో జరపడం ఆనవాయితీ. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సంక్రాంతి వేడుకలను నాగరత్నం నాయుడు ఇక్కడ జరుపుతున్నారు. ప్రకృతికి హానిచేయొద్దు.. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి.. అన్నారు. అందుకే వందల మైళ్లు ప్రయాణం చేసి సొంత ఊర్లకు వెళ్లి అక్కడి సంస్కృతిని పాడుచేయొద్దు. మన ఇంటిని కాపాడుకున్నట్లే.. మన సంస్కృతిని, వ్యవసాయాన్ని, చేతి వృత్తులను, పాడి పంటలను కాపాడుకోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సంబరాన్ని చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రకృతికి హానిచేయొద్దు. ఇటీవల కాలంలో జూదాలపై ఆసక్తి పెరుగుతోంది. వాటితో జీవితానుల పాడుచేసుకోవద్దు. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతే మనల్ని పది కాలాల పాటు జీవించేలా చేస్తుంది. – గొట్టిపాటి సత్యవాణిసంప్రదాయాలు మర్చిపోకుండా.. మూడేళ్ల నుంచి మా ఫామ్ హౌస్లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. అందుకే ఫామ్లో అన్ని రకాల పంటలూ పండిస్తాం. దీంతో పాటు యేటా నిర్వహించే సంక్రాంతి వేడుకలకు సాధారణ ఎంట్రీ ఫీజునే వసూలు చేస్తున్నాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం.. కాబట్టి.. ఆ ఖర్చులను పార్టిసిపెంట్స్ భరిస్తుంటారు. నేను కేవలం బియ్యం, కూరగాయలు అందిస్తుంటాను. మిగతా ఖర్చంతా ఔత్సాహికులైన యువకులు పెట్టుకుంటారు. ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్ల పోటీలు, టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు నిర్వహించి మన సంస్కృతి పట్ల ఇప్పటి యువతకు అవగాహన కల్పిండమే నా సంకల్పం. ఆ ప్రయత్నంలో నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందుతున్నా.. అందరికీ సంక్రాంతి ఒక ఎమోషన్ అవ్వాలనేదే నా ఆకాంక్ష. – నాగరత్నం నాయుడు,ప్రోగ్రెసివ్ ఆర్గానిక్ ఫార్మర్ఏడాది కష్టాన్ని దూరం చేసే వేడుక.. మాది మణికొండలోని కళాకృతి డాన్స్ ఇన్స్టిట్యూట్. మా పిల్లలు డీ షో వంటి పెద్ద షోస్లో పాల్గొన్నారు. నేను డాన్స్ కోరియో గ్రాఫర్ని. బంగారి బాలరాజు, ఉత్తర, అసలేం జరిగిందంటే వంటి చిత్రాల్లో, రాములమ్మ సీరియల్ల్ హీరోయిన్గా నటించాను. తమిళ్ చిత్రాల్లోనూ నటించా. మనది వ్యవసాయ కుటుంబం. ఏడాది పాటు సాగులో పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా ఈ పండుగ చేసుకుంటాం.. మన సంస్కృతిని మర్చిపోకూడదు. అందుకే ఇలాంటి వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. – కరొన్య కాథరిన్, సినిమా నటిఈ ఫామ్తో మంచి అనుబంధం ఉంది.. నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని. మాకు పెద్దపల్లిలో ఫార్మ్ ఉంది. ముప్పై ఎకరాల్లో హార్టీ కల్చర్ చేస్తున్నాను. ఈ ఫామ్ని మూడు నాలుగు సార్లు విజిట్ చేశాను. ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇక్కడకి చాలా మంది రైతులు వస్తుంటారు. ఈ ఫార్మ్ దాదాపు 25 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో మేము భాగా ఎంజాయ్ చేశాం. ఇక్కడికి నేనొక్కడినే వచ్చాను. నాకు ఈ ఫామ్తో మంచి అనుబంధం ఉంది. – చిట్టిబాబు, రిటైర్డ్ పోలీసు అధికారి -
ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల బరితెగింపు
-
ఏపీలో కనిపించని సంక్రాంతి సంబరాలు
-
కృష్ణుడి ఫ్యామిలీతో సంక్రాంతి సెలబ్రేషన్స్
-
విశాఖపట్నంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభా
-
సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ : నోరూరించేలా, ఈజీగా ఇలా ట్రై చేయండి!
సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే వేళ మకర సంక్రాంతిని సంబరంగా జరుపుకుంటాం. ఏడాదిలో తొలి పండుగ కూడా. మరి అలాంటి పండగకి ఘుమఘుమ లాడే పిండి వంటలు లేకపోతే ఎలా? కొత్త అల్లుళ్లు, అత్తారింటి నుంచి ఎంతో ఆశతో పుట్టింటికి వచ్చిన అమ్మాయిలతో సంక్రాంతి అంతా సరదా సరదాగా గడుస్తుంది. ఈ సంబరాల సంక్రాంతికోసం కొన్ని స్పెషల్ స్వీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్వీట్ పొంగల్, బూందీ లడ్డూని సులభంగా తయారుచేసే రెసిపీ గురించి తెలుసుకుందాం.సంక్రాంతి అనగానే ముందుగానే గుర్తొచ్చే స్వీట్ పొంగల్. కొత్త బియ్యం, నెయ్యి, బెల్లంతో పొంగల్ తయారు చేసిన బంధు మిత్రులకు పంచి పెడతారు.స్వీట్ పొంగల్స్వీట్ పొంగల్ తయారీకి కావాల్సిన పదార్థాలు : బియ్యం - ఒక కప్పు, పెసరపప్పు లేదా శనగపప్పు-అరకప్పు, పాలు - ఒక కప్పు, బెల్లం - అరకప్పు, కొబ్బరి తురుము - అరకప్పు, ఏలకులు - 4, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు కొద్దిగా, నెయ్యి-అరకప్పు.తయారీమొదటపెసరపప్పును నేతిలో దోరగా వేయించుకోవాలి. తర్వాత బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. కుక్కర్లో కడిగిన బియ్యం, వేయించిన పప్పు రెండింటినీ వేసుకోవాలి. అందులో సరిపడా నీరు పోసి మూతపెట్టాలి. మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్ మూత వచ్చేదాకా బెల్లాన్ని సన్నగా తరిగిఉంచుకోవాలి. యాలకుల పొడి చేసుకోవాలి. కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీడిపప్పు, ఎండు ద్రాక్షల్ని నేతిలో వేయించుకోవాలి. కుక్కర్ మూత వచ్చాక, ఉడికిన అన్నం, పప్పులో మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులో ఒక కప్పు పాలు, బెల్లం నీళ్లు పోసి బాగా కలపాలి. సన్నని మంటమీద ఉడకనివ్వాలి. ఇందులో తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపి మరో పది నిమిషాలు ఉడికిస్తే చాలు. తరువాత నేతిలో వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ స్వీట్ పొంగల్ రెడీ.బూందీ లడ్డు కావలసిన పదార్థాలు: శనగ పిండి - 1 కేజీ, నీరు - తగినంత. నూనె - వేయించడానికి సరిపడాపాకం కోసం: బెల్లం - 1కేజీ,కొద్దిగా నీళ్లు, యాలకుల పొడి - 1 టీస్పూన్, నిమ్మరసం - నాలుగు చుక్కలు, జీడిపప్పు ఎండు ద్రాక్ష, చిటికెడు పచ్చకర్పూరం తయారీ విధానం : ముందుగా శనగపిండిని జల్లించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నె తీసుకుని జల్లించిన శనగపిండి వేసుకుని నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా , మృదువుగా ఉండేలా జారుడుగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి.ఆ తర్వాత స్టౌ ఆన్ చేసి మూకుడు పెట్టి, సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక, బూందీ గరిటె సాయంతో ముందుగానే కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేయాలి. సన్నగా ముత్యాల్లా బూందీ నూనెలో పడుతుంది. పిండిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో బూందీ గరిటెలో వేయకూడదు. ఇలా చేస్తే పిండి ముద్దలు ముద్దలుగా పడుతుంది. కొద్దికొద్దిగా వేసుకుంటూ సన్న మంటమీద బూందీ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ మొత్తం బూందీనీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాకం తయారీఒక కడాయిలో బెల్లం,నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం కరిగి కాస్త పాకం వచ్చాక యాలకులు, పచ్చ కర్పూరం వేసి కలపాలి. తీగ పాక వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. నాలుగు చుక్కల నిమ్మరసం కలుపుకుంటే పాకం గట్టిపడకుండా ఉంటుంది. పాకం వచ్చాక జీడిపప్పులు,కిస్మిస్తోపాటు ముందుగా రెడీ చేసుకున్న వేడి వేడి బూందీలను పాకంలో వేసి బాగా కలపండి. కాస్త వేడి వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని మనకు కావాల్సిన సైజులో గుండ్రంగా ఉండలుగా చేసుకోవాలి. అంతే నోట్లో వేసుకుంటే కరిగిపోయే వెన్నలాంటి బూందీ లడ్డు రెడీ! -
Sankranti 2025 : పర్ఫెక్ట్ కొలతలతో, ఈజీగా అరిసెలు, కజ్జికాయలు
సంక్రాంతి వస్తోందంటే తెలుగు లోగిళ్లలో సంబరాలు మొదలవుతాయి. ఉపాధి కోసం దేశ విదేశాలకు తరలిపోయిన పిల్లలంతా రెక్కలు కట్టుకొని మరీ సొంత ఊరిలో వాలిపోతారు. పిండివంటలు, కొత్తబట్టలు, గొబ్బెమ్మలు.. ఇలా సంకురాత్రి సంబరాలతో పల్లెలన్నీ మురిసి పోతాయి. మరి అరిసెలు లేని సంక్రాంతిని అస్సలు ఊహించగలమా. అందులోనూ ఈ చల్లని వేళ, శ్రేష్టమైన నువ్వులద్దిన అరిసెలు తింటూ ఉంటే... పంటికింద నువ్వులు అలా తగులుతుంటే.. ఆహా అని మైమరిచిపోమూ. ఆరోగ్యం, ఆనందం రెండింటినీ అందించే అరిసెలు, అలాగే అందరికీ ఎంతో ఇష్టమైన, మరో ముఖ్యమైన స్వీట్ కజ్జికాయలను సులువుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి! నువ్వుల అరిశెలుకావలసినవి: బియ్యం – ఒక కిలో; బెల్లం పొడి – 800 గ్రా.; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి – కేజీతయారీబియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని జల్లించాలి. పిండి గాలికి పొడిబారకుండా ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. ఇప్పుడు పాకం సిద్ధం చేసుకోవాలి. మందపాటి పాత్రలో ఒక గ్లాసు నీరు పోసి బెల్లం పొడి వేసి పాకం వచ్చేదాకా తెడ్డుతో కలుపుతూ మరిగించాలి. పాకం వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి దించేసి బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా తెడ్డుతో కలపాలి. బాణలిలో నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పెద్ద నిమ్మకాయంత తీసుకుని గసాలు, నువ్వులలో అద్ది పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నెయ్యిలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నెయ్యి కారిపోయేటట్లు వత్తాలి. గమనిక: అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే ముదురు పాకం పట్టాలి. ఈ అరిశెలు పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. నువ్వుల కజ్జికాయలుకావలసినవి : మైదా లేదా గోధుమ పిండి – కేజి; నువ్వులు – కేజి; బెల్లం పొడి – 800 గ్రా.; ఏలకులు– 10 గ్రా. జీడిపప్పు– వందగ్రాములు; నూనె– కేజీ;ఇదీచదవండి : సోషల్ మీడియా DPDP నిబంధనలు : 18 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రుల సమ్మతి తప్పనిరితయారీ:పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత కాస్త పలుకుగా గ్రైండ్ చేయాలి. బెల్లం పొడి, యాలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి. గోధుమ పిండిని చిన్న గోళీలుగా చేసుకోవాలి. ఒక్కొక్క గోళీని ప్రెస్సర్తో పూరీలా వత్తుకుని దానిని సాంచా (కజ్జికాయ చేసే చెక్క మౌల్డ్) లో పరిచి ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచా మూత వేయాలి. సాంచాలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి. ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి. -
ధనిక యూట్యూబర్ 'మిస్టర్ బీస్ట్' ఎంగేజ్మెంట్.. అమ్మాయి ఎవరంటే? (ఫోటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు (ఫోటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో ఫ్యాషన్ ఐకాన్ 'నటాషా' ఫ్యామిలీ (ఫోటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్లో సచిన్ టెండుల్కర్, యువీ.. కూతురి కోసం ధోని అలా!(ఫొటోలు)
-
Christmas 2024: బిపాసా సెలబ్రేషన్స్,‘బుజ్జెమ్మ’ ఎంత బావుందో!
-
Christmas 2024 : బెస్ట్ నెయిల్ ఆర్ట్ డిజైన్స్..ఇదిగో ఇలా!
యేసుక్రీస్తు పుట్టుకే మానవాళికి గొప్ప శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ భక్తులు క్రీస్తు పుట్టుకను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు ఆయన కారణజన్ముడు. చారిత్రాత్మక పురుషుడు అని విశ్వసిస్తారు. ఈ సందర్భంగా బంధుమిత్ర సపరివారంగా సంబరాలు చేసుకుంటారు. పవిత్ర ఏసును కీర్తిస్తూ చర్చ్లలో ప్రార్థనలు చేస్తారు. క్రైస్తవ భక్తులకు క్రిస్మస్ వచ్చిందంటే ఆ సంబరమే వేరు. విద్యుద్దీప కాంతులతో గృహాలను అలంకరించు కుంటారు. ముఖ్యంగా క్రిస్మస్ ట్రీని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతారు. ఇంటిల్లిపాదీ కొత్త బట్టలు, రకరకాల పిండివంటలతో ఉత్సాహంగా గడుపుతారు. గృహిణులు, కన్నెపిల్లలు అందంగా ముస్తాబవుతారు. మరి పవిత్ర క్రిస్మస్ సందర్భంగా స్పెషల్ నెయిల్ పెయింట్ క్రియేటివ్గా ఎలా చేసుకోవాలో చూసేద్దేమా. మాసిమో (@రెయిన్మేకర్1973) ట్విటర్ ఖాతా షేర్ చేసిన వీడియో మీకోసం..Christmas nail art🎄 [📹 the_nail_mannn]pic.twitter.com/9ieWpRXlnn— Massimo (@Rainmaker1973) December 25, 2024 -
PV Sindhu Pre-wedding : పీవీ సింధు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మెల్బోర్న్లో ఘనంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు
వైయస్సార్ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో YSR కేడర్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగనన్నకు శుభాకాంక్షలు తెలిపారు.పార్టీ నాయకులు వై ఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్, శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి, కుంచె రమణారావు లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో ఎప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి సాధనలను గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కృషిని ప్రశంసించారు.ఆస్ట్రేలియా - టీం మెల్బోర్న్ సభ్యులు కృష్ణా రెడ్డి, భరత్, బ్రాహ్మ రెడ్డి, రామంజి, నాగార్జున.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. జగనన్న స్ఫూర్తి అందరికీ మార్గదర్శకంగా నిలవాలన్నారు. -
రాజోలులో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
కుప్పంలో వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
కర్నూలులో ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
అనంతపురంలో YS జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
వైఎస్ జగన్ బర్త్ డే వేడుకల్లో పోతిన మహేష్
-
కర్నూల్ లో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
జగన్ ఒక అరుదైన నేత: సజ్జల
గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో ఇన్నేళ్ల పాలనాకాలంలో పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసింది వైఎస్ జగన్ మోహన్రెడ్డినే అని వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇవాళ(డిసెంబర్ 21) పార్టీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేంద్ర కార్యాలయంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు.కేక్ కట్ చేసిన అనంతరం సజ్జల పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు.. జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రపంచంలోని కోట్లాధి మంచి అభిమానుల గుండె చప్పుడు వైఎస్ జగన్. గెలుపు ఓటములకు అతీతంగా ప్రజాసంక్షేమమే ఆయన లక్ష్యం. అయిదేళ్ళ పాలనలో ప్రజల జీవితాల్లో సమూల మార్పులకు నాంధి పలికారు. రాజకీయాల్లో వైయస్ జగన్ ప్రస్థానం ఒక చరిత్ర. ఇచ్చిన మాటకు కట్టుబడే ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడు. జగన్ రియల్ విజనరీ. నేతల్లోనే జగన్ అరుదు. పిల్లల భవిష్యత్తుకు బాటలు వేశారు. ప్రతీ ఒక్కరూ ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు. జగన్ పుట్టినరోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి విలువలు, నిబద్దతతో కూడిన నాయకుడుగా ఆయన తన ప్రస్థానం మొదలుపెట్టారు. కేవలం పదేళ్ళలో ఒక విజనరీగా, తాను ఏం అనుకుంటున్నాడో దానిని కార్యరూపంలోకి తీసుకురాగలిగిన ప్రజాప్రతినిధిగా, మంచి పరిపాలకుడు, జనరంజకుడుగా ఎదిగారు. వైయస్ జగన్ గారు తన ఆదర్శపాలనను దేశం అంతా గొప్పగా చెప్పుకునే స్థాయికి తీసుకువెళ్లారు. మాటకు కట్టుబడే నాయకుడుగా జనం ఆయనను మెచ్చారు. అందుకే అధికారంను కట్టబెట్టారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే విలువలకు వైయస్ జగన్ నిలువెత్తు నిదర్శనం. ఆయన నిలబెట్టుకోలేని హామీలు ఇవ్వడానికి ఏనాడు అంగీకరించలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పులను సగౌరవంగా స్వీకరించారు. గెలుపు ఓటములు కాదు, ప్రజలకు మనం ఏం చేశాము, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి ఎలా వ్యవహరించాము అనేదే ముఖ్యమని పార్టీకి దిశానిర్ధేశం చేసిన మార్గదర్శకుడు వైయస్ జగన్... పేదలకు ఉచిత బస్సు ప్రయాణాలు, గ్యాస్ సిలెండర్లు వంటి తాయిలాలు ఇవ్వడం కాదు, వారి జీవితాల్లో మంచి మార్పు రావాలి, తమ తలరాతను తామే రాసుకునే స్థాయిలో వారు నిలబడేందుకు ప్రభుత్వంగా మనం అండగా ఉండాలనే లక్ష్యంతో గత అయిదేళ్ళలో ఆయన పాలన సాగింది. భవిష్యత్తును ఆలోచించి ఆయన తన పాలనలో అనేక పథకాలను అమలు చేశారు. ఏదో విజన్ అంటూ హంగామా చేయడం కాదు, అయిదేళ్ళ పాలనలో గొప్ప పునాదులతో కూడిన విధానాలను అమలులోకి తీసుకువచ్చి, భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని తపించిన నేత వైయస్ జగన్. అటువంటి విజనరీ జన్మదినం సందర్భంగా ఆయన పరిపూర్ణ ఆయురారోగ్యాలతో, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడుగా ఎదగాలని కోట్లాది మంది అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన మంచిపనులు, దేశంలో ఎక్కడా లేని విధంగా తీసుకు వచ్చిన సంస్కరణల వల్ల తిరుగులేని మెజారిటీతో విజయాన్ని అదుకోవాల్సి ఉంటే, గత ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై చేసిన దాడి, చెప్పలేని అనేక కారణాల వల్ల అధికారానికి దూరమయ్యాము. కానీ ఆయన మాత్రం ప్రజల పక్షాన నిలబడాలని, నిరుత్సాహం నుంచి ప్రజల క్షేమమే ధ్యేయంగా అందరినీ ముందుకు నడిపిస్తున్న ధీశాలి అని సజ్జల అన్నారు.సజ్జలతో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక.. బర్త్ డే వేడుకల్లో తొలుత.. జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఆపై పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కోలాహలం నెలకొంది. పార్టీ జెండాలతో.. జగన్కు విషెస్ చెబుతూ పార్టీ నేతలు జోరుగా నృత్యాలు చేశారు. జగన్పై అభిమానంతో స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చినవాళ్లను సజ్జల అభినందించారు. -
కూకట్ పల్లిలో వైఎస్ జగన్ బర్త్ డే సెలెబ్రేషన్స్
-
ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు.. 520 కిలోల భారీ కేక్
-
Watch Live: తాడేపల్లిలో వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
-
మార్కాపురంలో ఘనంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
షారూఖ్ తనయుడితో ఆరాధ్య స్టేజ్ షో.. ఎంత క్యూట్గా ఉన్నారో! (ఫోటోలు)
-
వైఎస్ జగన్ ఫ్లెక్సీలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు
-
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలను ఓర్వలేక కూటమి
-
వ్యవ‘సాయ’ వర్సిటీ.. వజ్రోత్సవ శోభ
సాక్షి, హైదరాబాద్/ఏజీవర్సిటీ: వ్యవసాయంలో నిత్య పరిశోధనలు..వివిధ పంటలకు సంబంధించి కొత్త వంగడాల సృష్టి, సూక్ష్మనీటి సేద్యం, వ్యవసాయంలో యాంత్రీకరణ, పశువైద్య శాస్త్రం దిశగా పురోగమనం, వ్యవసాయ విద్య ద్వారా రైతులకు మేలు చేస్తూ, శాస్త్రవేత్తలను అందించడం.. ఇలా అనేక రకాలుగా వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోంది. యూనివర్సిటీ ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 20, 21 తేదీల్లో వజ్రోత్సవాలు జరగనున్నాయి. వ్యవసాయ కళాశాల నుంచి జయశంకర్ వర్సిటీ దాకా.. దేశ తొలిప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మార్గదర్శకంలో వ్యవసాయ విద్య ఆలోచనలకు తొలిబీజం పడింది. 1955 జనవరి 6న అప్పటి భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజేంద్రనగర్లో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. 1964 జూన్ 12న వ్యవసాయ కళాశాల ప్రారంభం కాగా, 1965 మార్చి 20న అప్పటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చేతుల మీదుగా వర్సిటీని రైతులకు అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా ప్రారంభమై..1996లో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీగా పేరు మార్చుకుంది. రాష్ట్ర విభజన తర్వాత 2014 సెపె్టంబర్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా అవతరించింది. » ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 11 కళాశాలలు, 12 వ్యవసాయ పాలిటెక్నిక్, మూడు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, 12 వ్యవసాయ పరిశోధన స్థానాలు, 8 కృషి విజ్ఞాన కేంద్రాలు , 9 ఏరువాక కేంద్రాలు కొనసాగుతున్నాయి. » అరవై ఏళ్ల వర్సిటీ ప్రస్థానంలో వ్యవసాయవిద్యలో సుమారు 32,300 మంది విద్యార్థులు డిగ్రీలు, 12,300 మంది పాలిటెక్నిక్ పట్టాలు సాధించారు. ఇంకా 9,500 మంది విద్యార్థులు వ్యవసాయశాస్త్రంలో పీజీ, 1500 మంది విద్యార్థులు పీహెచ్డీ పూర్తి చేశారు. నూతన వంగడాల సృష్టి.. పరిశోధనలు వరి, మొక్కజొన్నతోపాటు 50కిపైగా పంటల్లో దాదాపు 500 నూతన రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. 1968లో వర్సిటీ భాగస్వామ్యంతో అఖిల భారత వరి సమన్వయ పరిశోధన సంస్థ ద్వారా తొలిసారిగా వరిలో అధిక దిగుబడి ఇచ్చే ‘జయ’అనే సంకర జాతి తొలి వంగడాన్ని అందుబాటులోకి తెచ్చారు. నాటి నుంచి స్వర్ణ, బీపీటీ–5204, ఎంటీయూ–1010, ఎంటీయూ–1001, తెలంగాణ సోనా ఇలా వరి ఎన్నో రకాలను వర్సిటీ అభివృద్ధి చేసింది. ఈ ఏడాది అధిక దిగుబడి ఇచ్చే ఎక్స్ట్రా ఎర్లీ రకం కంపసాగర్ వరి 6251 (కేపీఎస్ 6251)ని విడుదల చేసింది. » దేశవ్యాప్తంగా వరిసాగులో ఈ వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు 25 శాతం దాకా ఉన్నాయి. 12 రాష్ట్రాలలో 12 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడి వరి వంగడాలే సాగవుతున్నాయి. » దేశవ్యాప్తంగా మొక్కజొన్న విస్తీర్ణంలో 10–12శాతం వరకూ ఇక్కడి సంకర రకాలే సాగవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధి చేసిన దాంట్లో హైబ్రిడ్ రకాలైన డీహెచ్ఎం–115, 117, 121 ఉన్నాయి. » వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో చేసిన 23 ఆవిష్కరణలకు పేటెంట్లు సైతం సొంతం చేసుకుంది. వజ్రోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తుమ్మల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రైతులకు సేవలందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వజ్రోత్సవాల ఏర్పాట్లలోగురువారం రాజేంద్రనగర్లోని యూనివర్సిటీ రైతుమేళా ఏర్పాటు చేసే స్పోర్ట్స్ కాంప్లెక్స్తోపాటు ఆడిటోరియంను తుమ్మల పరిశీలించారు. శుక్రవారం జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ, సీఎం రేవంత్రెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు. -
సెమీ క్రిస్మస్ వేడుకలు
-
ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు..తమన్ మ్యూజిక్ షో అదుర్స్ (ఫొటోలు)
-
సంక్రాంతి వస్తోంది! ఈ వేడుకల గురించి తెలుసా?
సంక్రాంతి పండుగ వస్తోందంటే గ్రామాలకు ప్రయాణం మొదలవుతుంది. సొంతూరికి వెళ్లే వాళ్ల ఆనందం అన్నింటికంటే మిన్న. అలాగే హైదరాబాద్వాసులు శిల్పారామంలో నిర్వహించే వేడుకలతో ఆనందిస్తారు. గాలిపటాలతో గాల్లో తేలినట్లు సంతోషిస్తారు. ఇది మన తెలుగు సంక్రాంతి. ఇక తమిళులు సంక్రాంతిని దేశానికే తలమానికం అన్నట్లు నిర్వహించుకుంటారు. కళారంగం ఉత్సాహంతో ఉరకలేస్తుంది. దేశంలో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్లంతా సొంత రాష్ట్రానికి వస్తారు. మైలాపోర్ వేడుకల్లో పాల్గొని సంతోషాన్ని మది నిండా నింపుకుని తిరిగి వెళ్తారు. మైలాపోర్ వేడుకలుతెలుగువాళ్లలాగే తమిళనాడుకి సంక్రాంతి పెద్ద పండుగ. సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి వేడుకల వాతావరణం నెలకొంటుంది. ఆ రాష్ట్ర రాజధాని చెన్నైలో ఏటా ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది. మైలాపోర్లో జరుగుతుంది కాబట్టి దీనికి మైలా΄ోర్ ఫెస్టివల్ అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. ఏటా సంక్రాంతి ముందు జరిగే ఈ వేడుక వచ్చే ఏడాది జనవరి తొమ్మిది నుంచి పన్నెండవ తేదీ వరకు జరుగుతాయి. గడచిన 72 ఏళ్లుగా జరుగుతున్న ఈ వేడుకల్లో 30కి పైగా కళలను ప్రదర్శిస్తారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మూడు వందలకు పైగా కళాకారులు పాల్గొంటారు. నాట్యప్రదర్శనలు, సంగీత కార్యక్రమాలు, సాము గారడీ నుంచి జానపద కళారూపాల ప్రదర్శనలతో నగరం కళకళలాడుతుంది. అన్నింటిలోకి ముగ్గుల పోటీ ప్రత్యేకం. ముగ్గును కోలామ్ అంటారు. ఇందులో మహిళలతోపాటుబాలికలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇంకా ఏమేమి ఉంటాయి?ప్రాచీన కపాలి ఆలయానికి హెరిటేజ్ వాక్, తె΄్పోత్సవం, మాడవీథుల్లో పర్యటనలు ఆహ్లాదకరంగా ఉంటాయి. సైక్లింగ్ టూర్లో టీనేజ్ నుంచి యువకులు ఉత్సాహంగా కనిపిస్తారు. బోట్ షికార్, ఫుడ్ వాక్, చిల్డ్రన్ టూర్... ఇలా థీమ్ ప్రకారం వేడుకలు సాగుతాయి. సంక్రాంతి సెలవుల్లో ఈ మైలాపోర్ ఫెస్టివల్ టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. -
పెళ్లి ఫోటోలు షేర్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ చిత్ర శుక్ల.. ఈమె ఎవరంటే? (ఫోటోలు)
-
ఓ వైపు సంబురాలు.. మరో వైపు నిరసనలు
-
జయరామ్ కుమారుడి ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడల్ని కూతురు అన్న నటుడు (ఫోటోలు)
-
ప్రభుయేసు ఆగమనం
విశ్వవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాస సమాజం యేసుప్రభువు వారి జన్మదినం జరుపుకొనేందుకు నాలుగువారాలు ముందస్తుగా ‘క్రిస్మస్’ వేడుకలు ప్రారంభిస్తున్నారు. దీనినే ‘అడ్వెంట్’ అంటారు. అనగా ఆగమనం/రాకడ/ఆహ్వానం పలుకుటకు ముందస్తుగా ఏర్పాట్లు ప్రారంభించి, డిసెంబరు 24 సాయంత్రంతో ముగిస్తారు.దేవకుమారుడైన యేసుక్రీస్తు ఆగమనానికి ముందస్తు క్రైస్తవ విశ్వాస సమాజం ప్రార్థనలోను, సంఘ సహవాసంతోను కలిసి దేవుని వాక్యానుసారంగా ప్రార్థించుటకు ‘దేవుని మందిరమైన’ సంఘంలో పాల్గొని ‘క్రిస్మస్’ డిసెంబరు 25న క్రీస్తు జన్మదినం కొరకు సిద్ధపడటమే ‘అడ్వంట్’. చీకటిరాత్రి తొలగి అరుణోదయ కాంతి రావటమే ప్రధానాంశం.క్రీ.పూ. 5వ శతాబ్ద కాలంలో ‘మాలకీ’ అనే దేవుని దూత చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు అనగా ప్రవాసులుగా భూమియంతట చెందినవారిని, నిస్సహాయక స్థితిలో ఉన్న వారిని భయభక్తులు కలిగి వుండాలని సందేశిమిచ్చాడు. కానీ వారిని భయభ్రాంతుల నిమిత్తం కాదన్నది వాక్యభావం, అందులో ప్రాముఖ్యంగా నియామ ఏకదినము, చిగురపుట్టను అన్న వచనాలు బలపరుస్తూ క్రీ.పూ 742–687 సంవత్సకాలంలో సింధూర వృక్షం నరకబడిన దానిమొద్దులోనుంచి పరిశుద్ధమైన చిగురు పుట్టునన్న వాక్యం దావీదు వంశావళిలో శాంతి, సమాధానాది ప్రదాతయైన యేసుప్రభువువారు జన్మించునని ముందస్తుగానే ప్రవచించారని వాక్యం స్పష్టీకరించుచున్నది. మలాకీ కాలం క్రీ.పూ. 5వ శతాబ్దం (మలాకీ 4 :1 –6; యెషయా 6 : 13).ఈ ముందస్తు క్రీస్తు ప్రభువువారి జన్మదిన సిద్ధపాటులో ప్రజలు లేక పెండ్లి విందుకు ఆహ్వానించినవారిలో కొందరు బుద్ధిమంతులు వుంటారని, మరికొందరు బుద్ధిహీనులుగా వుంటారని పెండ్లి కుమారుడు వచ్చేవరకు వేచి వున్న బుద్ధిమంతుల దీపము అనగా భక్తిపరులుగా వాక్యానుసారంగా ఎదురుచూస్తారని ఏల అనగా వారి దీపములలో అనగా భక్తిలో నూనెతో సిద్ధపడతారని, (‘నూనె’ భక్తికి సాదృశ్యం), బుద్ధిహీనులు దానికి బదులుగా విరుద్ధమైన సిద్ధపాటు పడతారని వారు బుద్ధిహీనులని యేసుప్రభువులవారు ఇశ్రాయేలీయుల ప్రజలతో ఉపమాన రీతిలో బోధించారని ఈ వాక్యం తెలియజేస్తున్న పరమార్థం (మత్తయి 5 :1–13).కనుక ముందస్తు ఆగమనం కొరకు ఎదురుచూసేవారు ఈ నాలుగువారాలు సంఘము నియమింపబడిన సమయంలో భక్తిపూర్వకంగా వాక్యానుసారమైన ప్రార్థన, సంఘ సహవాసంతో కలిసి ప్రార్థనలలో పాల్గొని పరిశుద్ధంగా అనగా ఆ ప్రార్థనల్లో 100 శాతం నిజాలు, ప్రభువు సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థనలు వుండేలా సిద్ధపడుదురు గాక.– కోట బిపిన్చంద్రపాల్ -
కాశీలో పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్న రాశీఖన్నా (ఫొటోలు)
-
ఉత్సాహంగా ఉత్కర్ష్.. మెరీడియన్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు (ఫోటోలు)
-
జుంబారే మొంబాసా!
కార్నివాల్ అంటే బ్రెజిల్లో జరిగే రియో కార్నివాల్ ఎక్కువమందికి గుర్తుకొస్తుంది. ఆఫ్రికా దేశమైన కెన్యాలో కూడా దాదాపుగా అదే స్థాయి కార్నివాల్ ఏటా జరుగుతుంది. కెన్యా తీర నగరమైన మొంబాసాలో ఏటా నవంబర్ నెలలో నెల పొడవునా కార్నివాల్ సందడిగా జరుగుతుంది. ఈ నెల్లాళ్లూ మొంబాసా నగరంలోని వీథులన్నీ రకరకాల ఊరేగింపులతో, సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలతో కోలాహలంగా కనిపిస్తాయి. తూర్పు ఆఫ్రికాలో జరిగే అతిపెద్ద సాంస్కృతిక వేడుక ఇది. తూర్పు ఆఫ్రికాలోని సాంస్కృతిక భిన్నత్వాన్ని ఏకతాటిపైకి తెచ్చే వేడుకగా సాగే ఈ కార్నివాల్లో ప్రతిరోజూ సంప్రదాయ వేషధారణలతో నృత్య సంగీతాలతో జరిగే ఊరేగింపులు ఉంటాయి. బహిరంగ వేదికల మీద నృత్య, సంగీత ప్రదర్శనలు ఉంటాయి. కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు జరుగుతాయి. తూర్పు ఆఫ్రికా సంప్రదాయ సంగీత రీతులైన ‘బెంగా’, ‘తారబ్’, సంప్రదాయ నృత్యరీతులైన ‘చకాచా’, ‘గిరియామా’ ప్రదర్శనలతో పాటు, స్థానిక మత్స్యకారులు చేసే వివిధ సంప్రదాయ నృత్య సంగీత ప్రదర్శనలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వాహిలి, మిజికెందా, తైటా తెగల ప్రజలు ఎక్కువగా ఈ ప్రదర్శనలు చేస్తారు. ఈ కార్నివాల్లో కొత్తతరం యువతీ యువకులు హిప్ హాప్, ఆఫ్రో ఫ్యూజన్ వంటి ఆధునిక సంగీత, నృత్య ప్రదర్శనలు చేస్తారు. మొంబాసా కార్నివాల్ స్థానిక చేతివృత్తుల వారికి ప్రధాన వేదికగా నిలుస్తుంది. హస్తకళా నైపుణ్యంతో వారు తయారు చేసిన సంప్రదాయ వస్తువుల అమ్మకాల కోసం ప్రధాన కూడళ్లలోను, ప్రత్యేక మైదానాల్లోను తాత్కాలికంగా దుకాణాలతో ప్రదర్శనశాలలు ఏర్పాటవుతాయి. దేశ విదేశాల నుంచి ఈ కార్నివాల్ను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇక్కడి చేతివృత్తుల వారు తయారు చేసిన వస్తువులను జ్ఞాపికలుగా కొనుగోలు చేసి తీసుకువెళుతుంటారు. ఈ ప్రదర్శనశాలలోనే ఆఫ్రికన్ సంప్రదాయ వంటకాలు, విదేశీ వంటకాలతో ఆహారశాలలు కూడా ఏర్పాటవుతాయి. కార్నివాల్ జరిగే నెల్లాళ్లూ విందు వినోదాలు, కళా ప్రదర్శనలు, రకరకాల పోటీలు, శిక్షణ శిబిరాలు, సాంస్కృతిక పరిరక్షణపై చర్చా కార్యక్రమాలు విరివిగా జరుగుతాయి. -
బన్నీ ముద్దుల కూతురు అల్లు అర్హ బర్త్ డే.. స్పెషల్ పిక్స్ (ఫోటోలు)
-
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ 15వ వార్షికోత్సవం నటి రమ్యకృష్ణ (ఫొటోలు)
-
వైభవంగా కార్తీక పౌర్ణమి..
-
హైదరాబాద్ : భక్తి శ్రద్ధలతో నగర కీర్తన శోభాయాత్ర (ఫొటోలు)
-
కనులపండువగా అమ్మవారి ఒడిబియ్యం మహోత్సవాలు
భివండీ: భివండీ పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దీపావళి పండుగ పురస్కరించుకొని శ్రీ భూసమేత వేంకటేశ్వర స్వామి అమ్మవారికి ఒడి బియ్యం మహోత్సవ కార్యక్రమాలు కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిరాన్ని విద్యుత్ దీపాలతో పాటు వివిధ రంగుల పూలతో వైభంగా ముస్తాబు చేశారు. పద్మశాలీయుల ఆడపడుచైన అమ్మవారికి ఒడి బియ్యం కార్యక్రమాలలో పద్మశాలీ మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలు దేవస్థాన ప్రధాన అర్చకుడు ప్రసాద్ స్వామి నేతృత్వంలో జరిగాయి. శనివారం ఉదయం స్వామి వారికి నిత్య పూజలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఒడి బియ్యం కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వేంకటేశ్వర స్వామి అమ్మవారిని శేషవాహనంపై మందిరం నుంచి ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపు పద్మనగర్ పురఃవీధులు మహాముని చౌక్, దత్తమందిర్, రామ్ మందిర్, గీతా మందిర్, బాజీ మార్కెట్, వరాలదేవి రోడ్ నుంచి తిరిగి రాత్రి 10 గంటల వరకు మందిరాన్ని చేరుకుంది. ఊరేగింపులో వందల సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వీధివీధిన స్వామి వారికి భక్తులు బ్రహ్మరథం పట్టారు. దర్శనం నిమిత్తం బారులు తీరి హారతులు, కానుకలు సమరి్పంచుకున్నారు. సిద్ధివినాయక్ భజన మండలి, గీతా భజన మండలి వారు ఆలకించిన అన్నమయ్య కీర్తనలతో భక్తులు మంత్రముగ్ధులయ్యారు. రాత్రి నిర్వహించిన అన్నదానంలో సుమారు ఐదు వందలకు పైగా భక్తులు పాల్గొన్నారని దేవస్థాన కమిటీ సభ్యుడు దావత్ కైలాస్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గౌడ లింగం, బైరి జనార్దన్, డాక్టర్ పాము మనోహర్, వడిగొప్పుల శంకర్ పంతులు, బాలె శ్రీనివాస్, అవధూత బలరామ్, భీమనాథిని శివప్రసాద్, బూర్ల మనోజ్తో పాటు వందల సంఖ్యలో పద్మశాలీ కులబాంధవులు భక్తులు పాల్గొని సేవలందించారు. ఇదీ చదవండి : వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు -
వైభవంగా దీపావళి లక్ష్మీపూజలు
సోలాపూర్: దేశవ్యాప్తంగా అందరూ అంగరంగ వైభవంగా జరుపుకునే దీపావళి పర్వ దినోత్సవాన్ని సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుపుకున్నారు. ఆవు లేగ దూడల ధూళి సంప్రదాయ కార్యక్రమంతో గోపూజలతో ప్రారంభమైన దీపావళి ధన త్రయోదశి, నరక త్రయోదశి తదుపరి దీపావళి పర్వదినానికి ఆకర్షణీయమైన లక్ష్మీ పూజలు శుక్రవారం రాత్రులతోపాటు శనివారం వేకువ జాము నుంచి తెల్లవారే వరకు వ్యాపారులు కోలాహలంగా జరుపుకున్నారు. వ్యాపారులు లక్ష్మీ పూజలను తమ తమ షాపులలో సాక్షాత్తు లక్ష్మీదేవిని హోటల్లో ప్రతిష్టించి సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి వ్యాపారాలు సజావుగా లాభాల బాటలో కొనసాగాలని అలాగే ఆరోగ్యం, అందరి శ్రేయస్సు కోసం ప్రారి్థస్తుంటారు. పూజా కార్యక్రమాలు పిదప బాణసంచా టపాకాయలు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. వీధి వీధిలో టపాకాయల మోత మోగింది. ఈ సందర్భంగా గత మూడు నాలుగు రోజులుగా పట్టణం, జిల్లా వ్యాపార కూడళ్లు పూజాసామగ్రి, అలంకరణ వస్తువుల విక్రయాలతో కిటకిటలాడాయి. ఇదీ చదవండి: అవి రెండే.. కానీ ఒకటయిపోతాయి! -
Diwali 2024: ఆర్సీబీ ‘క్వీన్’ అలా.. అందమైన అలంకరణతో స్మృతి ఇలా(ఫొటోలు)
-
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ దీపావళి వేడుకలు (ఫోటోలు)
-
రష్మిక దీపావళి సెలబ్రేషన్స్.. ఆ టాలీవుడ్ హీరో ఇంట్లోనే!
పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియావ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యుటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది. అల్లు అర్జున్ సరసన శ్రీవల్లిగా మెప్పించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీపావళి సందర్భంగా పుష్ప-2 పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.అయితే ఈ ముద్దుగుమ్మ దీపావళి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తాజాగా తన ఇన్స్టాలో పంచుకుంది. దీపాలు పళ్లెంలో పట్టుకుని సంప్రదాయ దుస్తుల్లో కనిపించింది. అంతే కాకుండా పిక్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అంటే దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరు డేటింగ్లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. చాలాసార్లు వీరిద్దరు జంటగా కనిపించారు. గతంలోనూ విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అలా ఎప్పుడెళ్లినా ఫోటోలతో నెటిజన్లకు దొరికిపోయింది. ఈ సారి కూడా దీపావళి పండుగను విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంది. అయితే ఈ జంట తమ రిలేషన్పై ఎక్కడా కూడా బయటికి చెప్పలేదు. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)