హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొత్తగా ఏడు క్రాస్ బోర్డర్ చెక్పోస్టులను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రాకపోకలు సాగించే సరకు రవాణా వాహనాల తనిఖీ చేసేందుకు ఈ చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు తెలంగాణ వాణిజ్యపన్నుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త చెక్పోస్టులు ఇవే..
రోడ్డు చెక్పోస్టు ప్రాంతం
1. ఎన్.హెచ్-7, హైదరాబాద్- కర్నూలు తుంగభద్ర బ్రిడ్జి దగ్గర, మహబూబ్నగర్ జిల్లా
2. దేవరకొండ- మాచర్ల నాగార్జున సాగర్ దగ్గర, నల్లగొండ జిల్లా
3. మిర్యాలగూడ- ఒంగోలు విష్ణుపురం దగ్గర, నల్గొండ జిల్లా
4. విజయవాడ- హైదరాబాద్ కోదాడ దగ్గర, నల్గొండ జిల్లా
5. ఖమ్మం- తిరువూరు మధిర దగ్గర, ఖమ్మం జిల్లా
6. ఖమ్మం- రాజమండ్రి అశ్వారావుపేట దగ్గర, ఖమ్మం జిల్లా
7. ఖమ్మం- మైలవరం పాల్వంచ దగ్గర, ఖమ్మం జిల్లా