చీఫ్ జస్టిస్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు | grand farewell of the High Court Chief justice | Sakshi
Sakshi News home page

చీఫ్ జస్టిస్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు

Published Sat, May 2 2015 3:49 AM | Last Updated on Fri, Aug 31 2018 9:06 PM

grand farewell of the High Court Chief  justice

హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తాకు హైకోర్టు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికింది. న్యాయమూర్తులందరూ దీని కోసం శుక్రవారం మధ్యాహ్నం మొదటి కోర్టు హాలులో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ సేన్ గుప్తా న్యాయవ్యవస్థకు చేసిన సేవలను ఇరు రాష్ట్రాల ఏజీలు కొనియాడారు. అనంతరం జస్టిస్ గుప్తా తన సుదీర్ఘ న్యాయ ప్రస్తానం గురించి మాట్లాడారు. తనకు సహకరించిన వారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత న్యాయవాదుల సమక్షంలో జరగాల్సిన వీడ్కోలు కార్యక్రమం జరగలేదు. జస్టిస్ గుప్తాకు వీడ్కోలు ఇచ్చే విషయంలో న్యాయవాదులు రెండు వర్గాలు విడిపోయి ఘర్షణకు దిగడంతో ఆ కార్యక్రమం రద్దు అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement