
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు బుధవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగ ఎల్లవేళలా అందరిలో స్ఫూర్తి నింపాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించేలా అమ్మవారు దీవించాలని ప్రార్థించారు.