
పొంగులేటికి ఘన స్వాగతం
కరీంనగర్: అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డికి తిమ్మాపూర్ మండలం నుస్తులా పూర్ వద్ద ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు నాయకులు, ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన నుస్తులాపూర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అలుగునూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత అలుగునూరు నుంచి కరీంనగర్ కళా భారతి వరకు భారీ ర్యాలీ తీశారు.