ponguleti srinivasa reddy
-
ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ల క్రమబధ్దీకరణ పథకానికి (ఎల్ఆర్ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. బుధవారం సచివాలయంలో ఎల్ఆర్ఎస్ అంశంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు ఉన్నతస్థాయిలో సమీక్షించారు. ఎల్ఆర్ఎస్ పథకం అమలును వేగవంతం చేయాలని నిర్ణయించారు. 2021లో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్నవారిలో.. 2020 ఆగస్టు 28కు ముందు నాటి అక్రమ లేఅవుట్లనే క్రమబధ్దీకరించనున్నారు. మార్చి 31వ తేదీలోపు పూర్తిగా ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించినవారికి 25శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే వ్యక్తిగతంగా ప్లాట్లు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోని వారికి, లేఅవుట్లలో పెద్ద సంఖ్యలో విక్రయం కాకుండా ఉన్న ప్లాట్ల క్రమబధ్దీకరణకు కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక లేఅవుట్లో 10శాతం ప్లాట్లు రిజిస్టరై.. 90శాతం ప్లాట్లు మిగిలిపోయినా ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్లాట్లు కొనుగోలు చేసి సేల్డీడ్ రిజి్రస్టేషన్ కలిగిన వారికి కూడా క్రమబధ్దీకరణ చాన్స్ ఇచ్చారు. ఈ కేటగిరీల వారికి కూడా మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే, ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పథకాన్ని రోజు వారీగా సమీక్షించాలని కూడా నిర్ణయానికి వచ్చారు. పేదల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రులు విజ్ఞప్తి చేశారు. నిషేధిత భూముల జాబితా పట్ల అప్రమత్తం ఎల్ఆర్ఎస్కు సంబంధించి నిషేధిత జాబితాలో ఉన్న భూముల విషయంలో జాగ్రత్త వహించాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడకుండా ఎల్ఆర్ఎస్ పథకాన్ని సులభతరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ కోసం జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్దనే చెల్లింపులు చేసి ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, దాన కిషోర్, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. రూ.20 వేల కోట్ల రాబడి అంచనా రాష్ట్రంలో 2021లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పథకానికి శ్రీకారం చుట్టింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. కానీ కోర్టు కేసుల కారణంగా ప్రభుత్వం ఈ పథకాన్ని నిలిపివేసింది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎల్ఆర్ఎస్పై దృష్టి పెట్టింది. అప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తగిన ఫీజు చెల్లించి ప్లాట్లను క్రమబధ్దీకరించుకొనేందుకు చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం అమల్లోకి రావడానికి ఆలస్యమైంది. తాజాగా బుధవారం మంత్రులు సమావేశమై ఎల్ఆర్ఎస్కు ఆమోదం తెలిపారు. మార్చి 31వ తేదీలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు సుమారు రూ.20 వేల కోట్లు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఇక వేగంగా దరఖాస్తుల పరిశీలన రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ కోసం వచ్చిన దరఖాస్తులు సుమారు 25.67 లక్షలు. ఇందులో 13,844 దరఖాస్తులకు సంబంధించి రూ.107.01 కోట్లు చెల్లింపు కూడా పూర్తయింది. మరో 9.21 లక్షల దరఖాస్తులను పరిశీలించి ఎల్ఆర్ఎస్కు ఆమోదయోగ్యమైనవిగా గుర్తించారు. ఫీజు చెల్లించాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇంకా ఆయా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలు, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, గ్రామ పంచాయతీల పరిధిలో వచ్చిన మిగతా సుమారు 16 లక్షల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఇకపై వేగవంగా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. -
పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: పంచాయతీ ఎన్నికలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 15 తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని పేర్కొన్నారు. ఆదివారం.. వైరా మండలంలో పర్యటించిన మంత్రి.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్కి మంత్రి ఫోన్లో సూచించారు.పంచాయతీ ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతోంది. ఆ దిశగా మార్పులు, చేర్పులతో కూడిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 2వరకు ఓటర్ల జాబితాను సిద్ధం చేసి 3న ప్రకటించాలని పేర్కొంది.4న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించి తుది జాబితాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లాల పంచాయతీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, వార్డుల వారీగా జాబితాలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్,కాంగ్రెస్కు ఎంపీ లక్ష్మణ్ ఛాలెంజ్ -
వికసిస్తా.. విరుచుకుపడతా!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్లో శుక్రవారం మంత్రి పొంగులేటి ఉన్నతాధికా రులపై వ్యక్తంచేసిన ఆగ్రహం, మందలించేందుకు వాడిన పదాలు కలెక్టర్ పమేలా సత్పతిని బాధించాయని.. ఆమె తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆమె తన ఇన్స్టాలో పెట్టిన భావోద్వేగ పోస్టు ఆమె లోలోపల కుమిలిపోతున్నారనడానికి నిదర్శనమని పలువురు ఉదహరిస్తున్నారు. కాగా.. కలెక్టర్ ఇన్స్టాలో పెట్టినపోస్టు శనివారం సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనలో మంత్రి శ్రీనివాస్రెడ్డి తీరును తప్పుపడుతూ సామాజిక ఉద్యమకారుడు బక్క జడ్సన్ జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. మంత్రి బహిరంగంగా కలెక్టర్ను అవమానకర రీతిలో మాట్లాడారంటూ పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం పలుఅభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ మినిస్టర్ ఖట్టర్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీ మహంతి ప్రొటోకాల్ పాటించలేదని, నామమాత్రంగా వ్యవహరించారని మంత్రులు చిన్నబుచ్చుకున్నారు. బీజేపీ నాయకులూ అదే అభిప్రాయం వ్యక్తంచేశారు. అదే సమయంలో తోపులాట జరిగి.. ఓ గన్మెన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై పదేపదే పడటంతో ఆయన ఆగ్రహించారు. ‘వాట్ దిస్ నాన్ సెన్స్, ఎక్కడ మీ ఏసీపీ, ఎక్కడ సీపీ? కామన్సెన్స్ లేదా? అని కలెక్టర్ ఎదుటే ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఏర్పాట్ల విషయంలో కలెక్టర్ ఎంత జాగ్రత్తగా ఉన్న మంత్రి అసంతృప్తి, ఆగ్రహం ఆమెను బాధించాయని పలువురు బీజేపీ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ‘నేను మహిళను.. సందర్భానికి తగినట్లుగా ఉంటాను. మండిపడగలను, వికసించగలను, విరుచుకుపడగలను, మంచులా గడ్డకట్టిపోగలను, అవసరమైతే కరగిపోగలను’’ అంటూ ఆంగ్లంలో పోస్ట్ చేశారని అంటున్నారు. అయితే, ఈ పోస్టు కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పలుమీడియాలోనూ వార్తగా వచ్చింది. తర్వాత ఆమె పెట్టినట్లుగా చెబుతున్న పోస్టు ఆమె ఇన్స్టాఖాతాలో కనిపించలేదు. ఈ విషయమై కలెక్టర్ పమేలా సత్పతిని సంప్రదించేందుకు ఫోన్ ద్వారా ‘సాక్షి’ ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. పోలీసుల వల్ల తనకు పదిమందిలో పరాభవం ఎదురైందని, ఆమె నొచ్చుకున్నారని పలువురు కలెక్టరేట్ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు.వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?అధికారులు ప్రొటోకాల్ పాటించాలికరీంనగర్ కార్పొరేషన్: జిల్లా అధికారులు ప్రొటోకాల్ పాటించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి హి తవు పలికారు. కేంద్ర పట్టణాభివృది్ధశాఖ మంత్రి ఖట్టర్ నగరంలో పర్యటిస్తే అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా ఉన్న తనకు ప్రొటోకాల్ వర్తింపజేయకపోవడం సరికాదన్నారు. శనివారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కూడా ఇబ్బంది పెట్టారన్నారు. మరోసారి ప్రొటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూసుకోవాలని సూచించారు. -
వాటిజ్ దిస్...వేర్ ఈజ్ సీపీ?
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ‘వాటిజ్ దిస్ నాన్సెన్స్...వేర్ ఈజ్ సీపీ...వేర్ ఈజ్ ఏసీపీ...కామన్సెన్స్ లేదు...ఇదేం పద్ధతి’ అంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కలెక్టర్ పమేలా సత్పతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హౌసింగ్బోర్డుకాలనీలో 24/7 నీటి సరఫరాను ప్రారంభిస్తున్న క్రమంలో గన్మెన్లు కొందరు పదేపదే పొంగులేటిని తోసివేయడంతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనలో ఏర్పాట్లపై ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదేం పద్ధతంటూ కలెక్టర్పై మండిపడ్డారు. సీపీ ఎక్కడా, ఏసీపీ ఎక్కడా అంటూ నిలదీశారు. అయితే వారెవరు అక్కడ లేకపోవడంతో ఆయన మరింత ఆగ్రహానికి గురయ్యారు. pic.twitter.com/nZwEHGf6Dj— Journalist Vijaya Reddy (@VijayaReddy_R) January 24, 2025 -
ఇందిరమ్మ ఇళ్ల నమూనా ఇంటిని ప్రారంభించిన మంత్రి
-
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అలాగే, రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నట్టు చెప్పుకొచ్చారు.ఖమ్మంలోని కూసుమంచిలో మంత్రి పొంగులేటి భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పొంగులేటి మాట్లాడుతూ..‘పేదవారి కల పది సంవత్సరాల్లో అలాగే నిలిచిపోయింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు. అనేక హామీలు ఇచ్చాము. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఆనాటి పెద్దలు కొల్లగొట్టారు. ఇందిరమ్మ ఇళ్ల మీద ప్రభుత్వం చిత్త శుద్దితో ఉంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇళ్లను ప్రభుత్వం ఇస్తుంది. డిసెంబర్ 13న మోడల్ హౌస్కి శంకుస్థాపన చేసుకుని సంక్రాంతి రోజున ప్రారంభించుకుంటున్నాం.అర్హులైన ప్రతీ పేదవారికి నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అనేక మంది అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళు పూర్తి చేసింది లక్ష లోపు ఇళ్లు మాత్రమే. పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. దళారుల పాత్ర ఉండదు.. ఇందిరమ్మ కమిటీ సమక్షంలోనే ఎంపిక జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంత కాలం పేదవారికి ఇళ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.రైతులకు రైతు భరోసా నిబంధనలు లేకుండా 12వేలు ఇస్తాం. పది సంవత్సరాల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తాం. నాలుగు కార్యక్రమాలు జనవరి 26 నుంచి అమలు చేయబోతున్నాం. మీ దీవెనలతో మళ్లీ ఇందిరమ్మ ప్రభుత్వం వస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
కూసుమంచిలో ‘ఇందిరమ్మ’ నమూనా ఇల్లు
కూసుమంచి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భా గంగా ప్రభుత్వం మొదటి మోడల్ హౌస్ను సిద్ధం చేసింది. ప్రభుత్వం త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనుండగా లబ్ధిదారులకు రూ.5 లక్షలు చెల్లిస్తామని ప్రకటించించిన విషయం తెలిసిందే. లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతీ మండల కేంద్రంలో ఒక నమూనా ఇంటిని నిర్మించాలని అధికా రులు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిద్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గతనెల 13న నమూ నా ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయగా కేవ లం 30 రోజుల్లో శనివారం సాయంత్రానికి పూర్తిచేశారు.ఈ ఇంటిని సోమవా రం మంత్రి పొంగులేటి ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోనే తొలి నమూ నా ఇల్లు కూసుమంచిలో అందుబాటులోకి రానుంది. కాగా, ఇదే నమూనాలో ఇంటిని నిర్మించుకోవాలనే నిబంధన ఏదీ లేకపోయినా.. రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తిచేయొచ్చని లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తారు.ఆకర్షణీయంగా నమూనా ఇల్లు..కూసుమంచిలో 400 చదరపు అడుగుల్లో హాల్, కిచెన్, అటాచ్డ్ బాత్రూంతో బెడ్ రూంను నిర్మించారు. ఇంటి లోప లి గదు లు, ముందు వరండాలో టైల్స్ వేశారు. అలాగే, డా బా మెట్ల కింద టాయిలెట్ను నిర్మించారు. ఇంట్లో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించి ఫ్యాన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇంటికి రంగులు, ఇతరత్రా వసతులను రూ.5 లక్షలతోనే పూర్తిచేసినట్లు కాంట్రాక్టర్ కంచర్ల జీవన్రెడ్డి తెలిపారు. -
మంత్రి పొంగులేటికి తప్పిన ప్రమాదం
తిరుమలాయపాలెం: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. హనుమకొండలో ఆదివారం జరిగిన అధికారిక సమీక్షలో పాల్గొన్న ఆయన, అక్కడి నుంచి ఖమ్మం బయలుదేరారు. రాత్రి 8–45 గంటల సమ యాన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో మంత్రి ప్రయాణిస్తున్న కారు ఎడమపక్క రెండు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.డ్రైవర్ చాకచక్యంగా వాహనాన్ని అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. ఆ సమయంలో కారులో పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. అనంతరం మంత్రి ఎస్కార్ట్ వాహనంలో ఖమ్మం క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. హనుమ కొండ నుంచి వస్తున్న క్రమంలో టైర్లు వేడెక్కి పేలిపోయి ఉంటాయని భావిస్తున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల ఫిర్యాదుల కోసం వెబ్సైట్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, సేవలను మరింత పారదర్శకంగా అందించడానికి ప్రత్యేక వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. ఫిర్యాదుల కోసం ఇంది రమ్మ ఇళ్ల గ్రీవెన్స్ మాడ్యూల్ను తెచ్చినట్లు రెవె న్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గురువారం సచివాల యంలోని తన కార్యాలయంలో ఈ గ్రీవెన్స్ మాడ్యూల్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఎదురైతే indirammaindlu.telangana.gov.in కు ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదులపై ఎప్పటి కప్పుడు చర్యలు తీసుకుని, వివరాలను ఫిర్యాదు దారు మొబైల్కు మెసేజ్ రూపంలో పంపిస్తామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన ఈనెల 8వ తేదీనాటికి 32 జిల్లాలలో 95% పూర్తికాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 88% పూర్తయిందన్నారు. త్వరలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి ఇళ్ల నిర్మాణం కార్యాచరణపై దృష్టి సారిస్తా మన్నారు. మొదటి విడతలో నివాస స్థలం ఉన్నవారికి, రెండో దశలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లను మంజూరు చేస్తామన్నారు, మొదటి విడతలో వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్జెండర్లు, అత్యంత ప్రాధా న్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. -
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
హనుమకొండ అర్బన్/నయీంనగర్: ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవారికి పార్టీతో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇల్లు ఇస్తా మని రెవెన్యూ, గృహ ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజలకు మంచి చేస్తే కూడా ఓర్వలేక ప్రతిపక్షాల నేతలు విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు. సోమవారం హనుమకొండ కుడా మైదానంలో వరంగల్ రీజియన్కు కేటాయించిన టీజీఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లతో కలిసి పొంగులేటి ప్రారంభించారు. అదేవిధంగా హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, గత ప్ర భుత్వం కుట్రపూరితంగా ఆర్టీసీని ప్రైవేట్పరం చేయాలని చూసిందని, కానీ ఇందిరమ్మ రాజ్యంలో పరిపుష్టం చేసి, కార్మికులకు భద్రత కల్పించామన్నారు. ధర ణిని ప్రక్షాళన చేసి కొత్త చట్టం తీసుకువచ్చామని, దీనిద్వారా తెలంగాణలో ఉన్న 2 కోట్ల 77లక్షల ఎకరాల ఆసాములకు పూర్తి భద్రత కలి్పస్తున్నామని పే ర్కొన్నారు. గత ప్రభుత్వం కనీసం లక్ష ఇళ్లు కూడా నిర్మించలేదని, తమ ప్ర భుత్వంలో మొదటి విడతగా 4.50 లక్షల ఇళ్లు ఇస్తున్నామన్నారు. మిగతా నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామన్నారు.అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లను కూడా పూర్తి చేసి పంపిణీ చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులు ఉంటే మండల కార్యాలయాల్లో ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ఆంబోతులను పంపుతున్నారని విమర్శించారు. కేసీఆర్కు గతంలో తొంటి ఇరుగుడు నిజమా అబద్ధమా తెలియదు.. కానీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి ఏమైందని ఆయన ప్రశ్నించారు. సాగు చేసే ప్రతీ భూమికి రైతు భరోసా ఇస్తామన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ‘కార్పొరేట్’ లుక్
సాక్షి, హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు మెరుగైన సేవలతోపాటు వారికి అవసరమైన వసతులు కల్పించడమే ధ్యేయంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్య కలాపాలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. ప్రజలు చెట్ల కింద నిరీక్షించే పరి స్థితిని నివారించేలా ప్రస్తుతమున్న సబ్ రిజిస్ట్రార్ కార్యా లయాలను పునర్వ్యవస్థీకరించడంతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్) నిధులతో అత్యాధునిక హంగులతో శాశ్వత భవనాలు నిర్మిస్తామన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి మంగళ వారం ఆయన రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో సమీక్ష నిర్వహించారు.తొలుత పటాన్చెరు, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, ఫోర్త్సిటీలో నిర్మాణంఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాల శాశ్వత భవనాల కోసం స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. దశలవారీగా ఈ నిర్మా ణాలు ఉంటాయని, తొలిదశలో పటాన్చెరు, సంగా రెడ్డి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, ఉప్పల్తోపాటు రంగారెడ్డి జిల్లా కందుకూరు సబ్రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఫోర్త్ సిటీ లో నిర్మి స్తామని చెప్పారు. గండిపేట, శేరిలింగంపల్లి, రంగా రెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాలను కలిపి గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ (తాలిమ్) కార్యాలయంలో సమీకృత సబ్రిజి స్ట్రార్ నమూనా కార్యాలయాన్ని నిర్మిస్తామని వివరించారు. ఈ నెలలో శంకు స్థాపనలు చేస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లాలోని బంజా రాహిల్స్, ఎస్ఆర్నగర్, గోల్కొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలను షేక్పేటలో నిర్మించాలని నిర్ణయించామన్నారు.వెయిటింగ్ హాల్, విశాల పార్కింగ్ సదుపాయాలతో..మొదటి దశలో నిర్మించే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కనీ సం 3 ఎకరాల్లో ఉంటాయని, 10–15 వేల చదరపు అడు గుల్లో కార్యాలయాల భవన నిర్మాణాలు చేపడతామని పొంగులేటి చెప్పారు. వెయిటింగ్ హాల్, తాగునీటి సదుపాయం, విశాల పార్కింగ్ వసతులుండేలా డిజైన్లు రూపొందించా లని అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల వల్ల పనితీరు మెరుగుపడుతుందని, పర్యవే క్షణ సులభతరం అవుతుందని.. దస్త్రాల పరిశీలిన వేగవంతం అవుతుందన్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీ తిని నిర్మూలించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడేలా తక్షణమే కార్యాచరణ రూపొందించాలని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ జ్యోతి బుద్ధప్రకాశ్ పాల్గొన్నారు. -
వ్యవసాయ కూలీలతో ముచ్చటించిన మంత్రి పొంగులేటి
-
ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై అధికారులతో మంత్రి పొంగులేటి భేటీ
-
ఈ-ఫార్ములా కేసు కేటీఆర్ మెడకు చుట్టుకునేనా?
తెలంగాణ మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)పై కేసు నమోదు కావడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఫార్ములా ఈరేసు నిర్వహణలో నిధులు దుర్వినియోగంపై పెట్టిన ఈ కేసు సమంజసమేనా? దీని ద్వారా కేటీఆర్ చిక్కుల్లో పడతారా? లేక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా? తెలంగాణలో ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ ఉదంతం తర్వాత కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేయడం హాట్ టాపిక్ అయింది. మంత్రి హోదాలో కేటీఆర్ నిధుల దుర్వినయోగానికి పాల్పడ్డారన్నది అభియోగం. ఆ మేరకు ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు పెట్టారు. ఇద్దరు సీనియర్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలపై కూడా కేసు నమోదైంది. కొన్ని నెలల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాంబు పేలబోతోందని ప్రకటిస్తే, రకరకాల ఊహాగానాలు సాగాయి. కేటీఆర్పై కేసు ఆ బాంబు అని అనుకోవాలిప్పుడు. అధికారం పోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం తర్వాత తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టు అవడం పార్టీని ఇబ్బంది పెట్టింది. ఇదే టైమ్లో కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణం వంటి వాటిపై రేవంత్ సర్కార్ విచారణ సంఘాలను వేసింది. వీటిలో కాళేశ్వరం విచారణ తీవ్రమైందనే చెప్పాలి. పలువురు ఐఎఎస్, ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే సాక్ష్యాలు చెప్పారు. కేబినెట్ తో సంబంధం లేకుండా, డిజైన్ల ఆమోదం లేకుండా గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు బారేజీలు నిర్మించారన్నది ఆరోపణ. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో కేసీఆర్ ప్రభుత్వానికి సమస్యలు ఆరంభం అయ్యాయి. రేవంత్ ముఖ్యమంత్రి కాగానే దానిపై విచారణకు ఆదేశించి ఒక రిటైర్డ్ జడ్జిని కూడా నియమించారు. ఈ విచారణ క్రమంలో కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కూడా విచారణకు హాజరవుతారా? లేదా? అన్న మీమాంస నెలకొంది. ఇవి ఇలా ఉండగా, తాజాగా అవుటర్ రింగ్ రోడ్డు టోల్ వసూలు కాంట్రాక్ట్ టెండర్ల వ్యవహారంపై కూడా రేవంత్ విచారణకు సిట్ ను నియమించారు.ఇప్పటికే ఫోన్ టాపింగ్ కేసులో కొందరు అధికారులు అరెస్టు అయ్యారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లను ఏదో కేసులో ఇబ్బంది పెడతారని అంతా ఊహించిందే. నిజంగా వాటిలో తప్పులు జరిగి ఉంటే వారు కేసులు ఎదుర్కోక తప్పదు. కానీ కావాలని వేధించేందుకు కేసులు పెడుతున్నారని, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇలాంటి కక్ష సాధింపులకు దిగుతోందని జనం భావిస్తే అది కాంగ్రెస్కు చేటు. ఇంతకుముందు లగచర్ల దాడి కేసులో కూడా కేటీఆర్ పేరును ఇరికించాలని ప్రభుత్వం చూసింది. కేసీఆర్ శాసనసభకు రాకపోయినా, కేటీఆర్, హరీష్ రావులు సభలో కాని, బయట కాని గట్టిగానే పోరాడుతున్నారు. వారిని వీక్ చేయడానికి సహజంగానే కాంగ్రెస్ ప్రయత్నాలు ఉంటాయని. ఇది సహజం. కేటీఆర్పై పెట్టిన కేసు డైవర్షన్ రాజకీయాలలో భాగమేనని బీఆర్ఎస్ విమర్శిస్తుండగా, ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోవాలా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఏసీబీ తనపై కేసు పెట్టగానే కేటీఆర్ మీడియా సమావేశం పెట్టి పలు విషయాలు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఒక కేసు వస్తే, అందులో తనదే బాధ్యత అని ఎవరూ ధైర్యంగా చెప్పడం జరగలేదు. కాని కేటీఆర్ పూర్తిగా బాధ్యత తీసుకుని కేవలం హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికి, పెట్టుబడులు ఆకర్షించడానికి చేసిన ప్రయత్నంలో ఈ ఫార్ములా రేస్ సంస్థకు డబ్బులు చెల్లించామని స్పష్టంగా తెలిపారు. ఈ డబ్బుల చెల్లింపులో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, కేబినెట్ ఆమోదం లేకుండా రూ.55 కోట్లు చెల్లించారని, అది కూడా ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా, విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లించారని రాష్ట్రానికి రూ. ఎనిమిది కోట్ల జరిమానా విధించిందని కాంగ్రెస్ చెబుతోంది. హైదరాబాద్ మెట్రో అభివృద్ది సంస్థ కు స్వతంత్రంగా నిధులు వినియోగించే స్వేచ్ఛ ఉంటుందని, అందులో ఇలాంటి క్రీడల ఏర్పాట్లకు నిధులు వెచ్చిండానికి ఆ సంస్థకు పవర్ ఉందని కేటీఆర్ చెబుతున్నారు. అసలు ఈ ఫార్ములా రేసింగ్ సంస్థకు మొత్తం డబ్బు చెల్లిస్తే అందులో అవినీతి ఏమి ఉంటుందని అంటున్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు. సభలో చర్చ జరగలేదు కాని, రేవంత్ మాత్రం దీని గురించి ప్రభుత్వ వాదనను వివరించారు. ఈ ఫార్ములా సంస్థ కో ఫౌండర్ ఒకసారి రేవంత్ ను కలిసివెళ్లిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. దీనికి రేవంత్ బదులు ఇస్తూ, ఆ సంస్థ వారే కేటీఆర్తో రహస్య అవగాహన ఉందని తనకు చెప్పారని, ఈ స్కామ్ రూ.55 కోట్లు కాదని, రూ.600 కోట్లు అని సంచలనాత్మకంగా వెల్లడించారు. కాగా తదుపరి వాయిదా మొత్తం చెల్లించనందుకు గాను ప్రభుత్వానికి ఈ ఫార్ములా సంస్థ నోటీసు ఇచ్చిందని కేటీఆర్ అంటున్నారు. అంతేకాక తమతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నందుకు గాను ఆర్బిట్రేషన్ నిమిత్తం సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వేని ఆ సంస్థ నియమించుకుందని చెప్పారు. హైదరాబాద్ ఈ ఫార్ములా రేస్ నిర్వహించడం ద్వారా ప్రపంచం దృష్టిని తెలంగాణ ఆకర్షించిందని, సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు రావడానికి, మరికొంతమంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి దోహద పడిందన్నది ఆయన వాదన. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ ఇమేజీని డామేజి చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. గతంలో చంద్రబాబు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఫార్ములా ఒన్ రేస్ నిర్వహించడానికి ప్రయత్నాలు జరిగాయి కాని సఫలం కాలేదని ఆయన గుర్తు చేశారు. కాని తాము తీసుకు వచ్చి దేశానికి, తెలంగాణకు గుర్తింపు తెచ్చామని, దీనికి సంతోషించవలసింది పోయి కేసు పెడతారా అని మండిపడ్డారు. ఈ మొత్తం విషయాన్ని పరిశీలించిన తర్వాత, కేటీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడిన సంగతులు విన్నాక కేటీఆర్ పెద్ద తప్పు చేయలేదేమో అనిపిస్తుంది. ఒకవేళ ఏదైనా తప్పు జరిగి ఉంటే అది ప్రొసీజరల్ లోపాలు కావచ్చు అన్న భావన కలుగుతుంది. మరి దీనికి గవర్నర్ అనుమతి కూడా ఉంది కదా అని ప్రభుత్వం చెప్పవచ్చు. గవర్నర్కు అన్ని వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించారని కేటీఆర్ ఆరోపణ. హెచ్ఎండీఏ నిధులు జాతీయ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉన్నాయి. కేటీఆర్ ఆదేశాల మేరకే మున్సిపల్ శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఆ నిధులను ఈ ఫార్ములా సంస్థకు పంపించే ఏర్పాట్లు చేశారు. దీనికి కేబినెట్ ఆమోదం తీసుకోకపోవడానికి కారణం అప్పట్లో ఎన్నికల హడావుడి, ఎన్నికల కోడ్ ఉండడమని చెబుతున్నారు. ఈ ఫార్ములా రేసింగ్ జరిగింది వాస్తవం, ఆ సంస్థకు డబ్బు చెల్లించింది నిజం. కాకపోతే ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదన్నది సందేహం. దానిపై బ్యాంకు అధికారులు కాని, ప్రభుత్వ అదికారులు కాని వివరణ ఇవ్వవలసి ఉంటుంది. అయినా కేటీఆర్ సంబంధిత ఫైల్ ను సీఎం ఆమోదానికి పంపి ఉంటే ఈ గొడవ ఉండేది కాదేమో! కాని ఆ రోజుల్లో ఆయన తిరుగులేని అధికారాన్ని ఎంజాయ్ చేసేవారు.మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఈ డబ్బు మంజూరు చేయించారు. కాని కథ మారింది. బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో ఇప్పుడు ఇది మెడకు చుట్టుకుంది. అయినా కేటీఆర్కు ఈ సందర్భంలో పెద్ద రోల్ ఉండకపోవచ్చు. విధాన పరమైన నిర్ణయం చేశారు.అలా చేయవచ్చా? లేదా? అన్నది ఒక కోణం. ఒకవేళ అది తప్పని తేలితే కేటీఆర్ కూడా ఇబ్బంది పడతారు. ఈ కేసు నమోదైన వెంటనే ఈడీ కూడా రంగంలో దిగడం కేటీఆర్కు కాస్త ఆందోళన కలిగించే అంశమే. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించి పది రోజులపాటు అరెస్టు కాకుండా రక్షణ పొందారు. ఏపీలో 201419 టరమ్ లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. దానిని తొలుత ఈడీ గుర్తించింది. తదుపరి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వంలో సిఐడి అన్ని ఆధారాలు సేకరించి ఆ స్కామ్ డబ్బు షెల్ కంపెనీలకు ఎలా వెళ్లింది.. చివరికి టిడిపి ఆఫీస్ ఖాతాలోకి కూడా చేరింది వివరిస్తూ కేసు పెట్టారు. ఆ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లవలసి వచ్చింది. అయినా చంద్రబాబు తాను తప్పు చేయలేదని వాదించారు. అంతేకాక ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియా ఈ విషయాలన్నిటిని పక్కనబెట్టి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ప్రచారం చేసింది. కేటీఆర్ కేసులో డబ్బు మనీ లాండరింగ్ అయినట్లు కనిపించడం లేదు. అయినా ఈడీ రంగంలోకి రావడం తో ఏమైనా అలాంటి నేరం జరిగిందా అన్న డౌటు వస్తుంది. ఈ కేసులో కేటీఆర్ అవినీతి చేశారని రుజువు చేయడం ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి. ఇంకో సంగతి కూడా చెప్పాలి. చంద్రబాబు 2004 కి ముందు ఆపధ్దర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్తో సంబంధం లేకుండా ఐఎమ్ జి భరత్ అనే సంస్థకు హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన సుమారు 800 ఎకరాల భూమిని స్టేడియంల నిర్మాణానికి కేటాయించడం వివాదం అయింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ ఆర్ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. అయినా ఆ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. అలాంటప్పుడు కేటీఆర్ ను ఈ కేసు ఇబ్బంది పెడుతుందా అన్నది డౌటు. ఒకవేళ హైకోర్టు స్టే తొలగిపోయి కేటీఆర్ను అరెస్టు చేసినా, కొద్ది రోజులపాటు జైలులో ఉండాల్సి రావచ్చు తప్ప పెద్దగా జరిగేదేమి ఉండకపోవచ్చు. ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ గట్టెక్కుతారా? లేదా అన్నది ఒక పాయింట్ అయితే రేవంత్ ప్రభుత్వం తనది పై చేయిగా రుజువు చేసుకుంటుందా? లేక సెల్ఫ్ గోల్ వేసుకుంటుందా అన్నది మరో అంశం. కేటీఆర్ తప్పు చేసినట్లు రుజువు చేసి శిక్షపడేలా చేయగలిగితే అప్పుడు కాంగ్రెస్ కు ఏదైనా ప్రయోజనం చేకూరవచ్చు. అంతవరకు కేటీఆర్కు, బీఆర్ఎస్కూ సానుభూతే రావచ్చన్నది ఎక్కువ మంది విశ్లేషణగా ఉందని చెప్పాలి. ఏది ఏమైనా ఈ కేసుల వివాదాలు ఎలా ఉన్నా, ఈ పరిణామాలు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీకి కొంత నష్టం చేస్తున్నాయన్నది వాస్తవం.కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
బీఆర్ఎస్కు పొంగులేటి వార్నింగ్.. కాంగ్రెస్ కార్యకర్తలు గాజులు తొడుక్కోలేదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండమైపోతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలెవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడీ చర్చ నడుస్తోంది. ఈరోజు సమావేశాల్లో రైతుభరోసాపై చర్చ నడిచింది. దీంతో, బీఆర్ఎస్పై మంత్రులు సంచలన ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ-కారు రేసు విషయంపై మంత్రి పొంగులేటి మాట్లాడారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్పై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూభారతి చట్టం బీఆర్ఎస్కు ఇష్టం లేదు. తెలంగాణ ప్రజలకు మంచి జరగడం బీఆర్ఎస్ నేతలకు నచ్చదు. కేటీఆర్ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. అల్లర్లు చేయాలని నియోజకవర్గానికి రూ.2కోట్లు పంపించారు. అల్లర్లు జరిగితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ గాజులు తొడుక్కుని కూర్చోలేదు. రాష్ట్రం అగ్నిగుండం అయితే చూస్తూ ఊరుకోం. -
అసెంబ్లీలో భూభారతిపై కొనసాగుతున్న చర్చ
-
సామాన్యుడి భూహక్కుల పరిరక్షణకే భూభారతి
భూభారతి చట్టాన్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్లోకి తెచ్చిన తర్వాత 2014కు ముందు సబ్ రిజ్రిస్టార్ల వద్ద ఉన్న రికార్డులను అప్డేట్ చేస్తాం. 2014కు ముందు ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉండి తర్వాత అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకొని పేదలకు పంచే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ధరణి లోపాలను పూర్తిగా సవరించి, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా చర్చించి కొత్త చట్టాన్ని రూపొందించాం..’’ సాక్షి, హైదరాబాద్: సామాన్యుల భూహక్కుల పరిరక్షణే ధ్యేయంగా ‘ఆర్వోఆర్ –భూభారతి’ చట్టాన్ని రూపొందించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 49 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం అద్భుతంగా పనిచేసిందని.. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏడేళ్ల పాటు కొనసాగిందని చెప్పారు. కానీ నాలుగు గోడల మధ్య అసంబద్ధంగా రూపొందించిన ‘ధరణి’తో కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా పరిస్థితి తయారైందని విమర్శించారు.లక్షల మందిని నానా తిప్పలు పెట్టిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతామన్న హామీని అమల్లోకి తెచ్చి... దాని స్థానంలో ప్రజల భూమి హక్కులను సంరక్షించే సరికొత్త భూభారతి చట్టాన్ని తెస్తున్నామని ప్రకటించారు. బుధవారం శాసనసభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూభారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించారు. వివరాలు పొంగులేటి మాటల్లోనే... ‘‘కొత్త చట్టంపై ఆగస్టు 2న ముసాయిదా ప్రవేశపెట్టాం. 40 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచి, చర్చావేదికలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, కవులు, మేధావులు, విశ్రాంత అధికారులు, సాధారణ ప్రజల సలహాలు, సూచనలు స్వీకరించి కొత్త చట్టాన్ని రూపొందించాం. మాజీ మంత్రి హరీశ్రావు వంటి వారు ఇచ్చిన సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం. 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను అధ్యయనం చేసి, ఉత్తమ విధానాలను కొత్త చట్టంలో పొందుపరిచాం. ధరణి తప్పులను భూభారతితో సరిదిద్దుతాం గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది మంది మానసిక క్షోభకు గురయ్యారు. రవి అనే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు నా వద్దకు వచ్చి.. 1,398 ఎకరాల భూములపై గిరిజనులు హక్కులు కోల్పోవాల్సి వచ్చిందని, ధరణిలో వాటిని అటవీ భూములుగా చూపారని వాపోయారు. వేలాది పుస్తకాలు చదివిన మేధావి తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి. మానవ సంబంధాలను సైతం ధరణి దెబ్బతీసింది.భూయజమానికి తెలియకుండానే భూమి చేతులు మారిపోయేలా చేసింది. గత చట్టంలోని తప్పులను అధ్యయనం చేసి భూ–భారతి ద్వారా సరిదిద్దేలా ఏర్పాట్లు చేశాం. ధరణి పోర్టల్ పార్టు–బీలో ఉన్న 18 లక్షల ఎకరాలకు పరిష్కారం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆబాదీ/గ్రామకంఠం సమస్యలకు తెరపడుతుంది. భవిష్యత్తులో భూవివాదాలకు తావు లేకుండా ప్రత్యేక సర్వే ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. రిజ్రిస్టేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. రిజ్రిస్టేషన్, ఆ వెంటనే మ్యుటేషన్ జరిగే వెసులుబాటు కలి్పంచటం ధరణిలో మెరుగైన అంశం. ఆ సమయంలో పొరపాట్లు జరిగితే కూడా సరిదిద్దే కొత్త ఏర్పాటుతో దాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం. ఆధార్ తరహాలో భూదార్.. ఆధార్ నంబర్ తరహాలో ‘భూదార్’ నంబర్ తీసుకొస్తాం. ప్రతి రైతుకు ఒక కోడ్ ఇస్తాం. గతంలో రెవెన్యూ గ్రామాల్లో ఒక ఏడాదిలో జరిగిన భూలావాదేవీలను పొందుపరిచేందుకు నిర్వహించే జమాబందీని బీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించింది. దానిని తిరిగి తీసుకొస్తున్నాం. రైతుల భూములకు సంబంధించిన ఫిర్యాదులపై అప్పీల్ చేసుకునేందుకు ప్రస్తుతం ఎలాంటి వ్యవస్థ లేదు. దీనికోసం గతంలో కొనసాగిన ల్యాండ్ ట్రిబ్యునల్స్ను పునరుద్ధరించనున్నాం. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణల నుంచి రక్షించేందుకు సీసీఎల్ఏ ద్వారా చర్యలు తీసుకోనున్నాం. గతంలో పట్టదారు పాస్బుక్లలో ఉన్న అనుభవదారులు, కాస్తుదారుల కాలం (నిలువు వరుస)ను పునరుద్ధరించాలని నిర్ణయించాం. అక్రమాలకు పాల్పడే అధికారులపై కఠిన చర్యలు ఆన్లైన్లో ధరణి తీసుకొచ్చిన తర్వాత భూములకు సంబంధించిన పాత రికార్డులు లేకుండా చేశారు. ఇకపై ఆన్లైన్తోపాటు మాన్యువల్ పహాణీలను నమోదుచేయాలని కొత్త చట్టంలో పొందుపరిచాం. ప్రభుత్వ భూములను ఉద్దేశపూర్వకంగానో, ప్రలోభాలకు లోనైగానీ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోనున్నాం. సులువుగా తెలుసుకునేలా భూముల వివరాలు గత ప్రభుత్వం ధరణిని 3 మాడ్యూల్స్తో ప్రారంభించి 33 మాడ్యూల్స్కు తీసుకొచ్చింది. తద్వారా పేద, చిన్నకారు రైతుల భూములు కనిపించని పరిస్థితి ఏర్పడింది. మేం భూభారతి ద్వారా 33 మాడ్యుల్స్ బదులు 6 మాడ్యుల్స్ తెస్తున్నాం. అలాగే గతంలో 32 కాలమ్స్ (నిలువు వరుసలు)లో ఉన్న పహాణీలను ఒకే కాలమ్లోకి తెచ్చారు. దీనిని భూభారతిలో 11 కాలమ్స్కు పెంచాం. ధరణి పోర్టల్లో సొంత భూమిని కూడా చూసుకునే వీలు లేకుండా దాచేవారు. భూభారతి ద్వారా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా సర్వే నంబర్ల ఆధారంగా భూమి వివరాలు తెలుసుకోవచ్చు..’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
హరీష్ రావు సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
-
అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంతలు తొక్కుతుందని ఎల్లోమీడియాలో కథనాలు
-
అమరావతి అంటే పెట్టుబడిదారులకు భయమవుతోంది
సాక్షి, హైదరాబాద్: అమరావతి అంటేనే పెట్టుబడిదారులు భయపడే పరిస్థితి వచ్చిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు వెళ్తాయేమోననే అభిప్రాయం ఉండేదని, ఇటీవల అమరావతిలో సంభవించిన వరదలతో ఆ భావన పోయిందన్నారు. పొంగులేటి సోమవారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం క్రమంగా పుంజుకుంటోందన్నారు. సెప్టెంబర్తో పోలిస్తే నవంబర్లో, నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో కొంత పురోగతి కనిపిస్తోందని, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా పెరుగుతోందని చెప్పారు. పెట్టుబడులు ఆంధ్రకు వెళ్లే అవకాశముందా అని విలేకరులు ప్రశ్నించగా... పెట్టుబడిదారులంతా తిరిగి హైదరాబాద్ బాట పడుతున్నారని, కొందరు బెంగళూరు వైపు చూస్తున్నారని చెప్పారు. ‘అమరావతిలో ఇటీవల వచ్చిన వరదలతో సీన్ మారిపోయింది. వాళ్లు ఎంత బూస్టప్ ఇవ్వాలనుకున్నా సాధ్యం కావడం లేదు. ఎలాంటి చర్యలు తీసుకున్నా వరదల నుంచి రక్షణ ఉండదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు’అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో హైడ్రా పట్ల భయం పోయిందని, మొదట్లో తప్పుడు ప్రచారం వల్ల కొంత వేరే అభిప్రాయం ఉన్నా.. ఇప్పుడు ప్రజలకు నిజం తెలిసిపోయిందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. సంక్రాంతికి రైతు భరోసా తప్పకుండా ఇస్తామని చెప్పిన పొంగులేటి.. రాష్ట్రంలో భూమిలేని నిరుపేదలకు రూ.12వేలను రెండు దఫాల్లో ఇస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి కలుగుతుందని, ఇందుకోసం విడతకు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.7 లక్షల కోట్లు అప్పు వాస్తవమని, ఈ విషయంలో చర్చ నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ గొడవ చేయాలని చూస్తోందన్నారు. కార్పొరేషన్ల ద్వారా తీసుకునే అప్పులు లెక్కలోకి రావా అని ప్రశ్నించారు. అసలు కార్పొరేషన్ల నుంచి ఒక్క రూపాయి అయినా ఆదాయం వచ్చే పరిస్థితి ఉందా అని వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, సినిమా వాళ్లు, జర్నలిస్టులు, ప్రజలందరూ తమకు సమానమేనని అన్నారు. శాసనసభలో ఎవరి పాత్ర వారు పోషించాల్సిందేనని, భట్టిపై ప్రివిలేజ్ తీర్మానం ఇవ్వడం బీఆర్ఎస్ హక్కు అని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని, ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో చర్చలో మాట్లాడాలని తనకు కూడా కోరికగా ఉందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో వ్యతిరేకత లేదని, ఆదానీ విషయంలో ఏఐసీసీ విధానమే తమ విధానమని స్పష్టంచేశారు. -
కేటీఆర్ ‘ఈ-కార్ రేస్’ కేసు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం(డిసెంబర్ 16) అసెంబ్లీ కమిటీహాల్లో కేబినెట్ భేటీ జరిగింది. సుదీర్ఘంగా రాత్రి 8.30 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు.కేబినెట్ సమావేశంలో కేటీఆర్ ఈ-కార్ రేసుపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ఈ కార్ రేసులో నిధుల అవకతవకలపై దర్యాప్తునకు గవర్నర్ న్యాయనిపుణులను సంప్రదించి అనుమతించారని పొంగులేటి తెలిపారు. కేటీఆర్ను అరెస్టు చేస్తారో లేదో తనకు తెలియదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.ఈ-కార్ రేసులో వచ్చిన పెట్టుబడుల లెక్క కూడా ఏసీబీ తేలుస్తుందని చెప్పారు. ఈ విషయంలో అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అరవింద్కుమార్పైనా విచారణ జరుగుతుందన్నారు. తాము కక్షపూరితంగా వ్యవహరించడం లేదన్నారు.కేబినెట్లో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు..భూమి లేని వారికి డిసెంబర్ 28న రూ.6వేల నగదు పంపిణీసంక్రాంతి తర్వాత కొత్త రేషన్కార్డుల జారీ కేటీఆర్పై కేసు విషయంలో ఏసీబీకి సీఎస్ ద్వారా లేఖసంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డు లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయంరైతు కూలీలకు రెండు దఫాలుగా 12 వేలు ఆర్దిక సహాయం చేసేందుకు కేబినెట్ నిర్ణయం.స్పోర్ట్ పాలసీకి కేబినెట్ ఆమోదం..పంచాయతీ రాజ్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం -
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సాక్షి స్ట్రెయిట్ టాక్
-
డిసెంబర్ 1 నుంచి NIC ధరణి బాధ్యతలు చూస్తోంది
-
సంక్రాంతికి గ్రామానికో రెవెన్యూ అధికారి: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి లోపు రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ అధికారులను నియమిస్తామని, తద్వారా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. తమ స్వలాభం కోసం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థలను గత ప్రభుత్వం రద్దు చేయడంతో గ్రామాల్లోని ప్రభుత్వ భూముల రక్షణ, రెవెన్యూ శాఖతో ప్రభుత్వానికి సమన్వయం విషయంలో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ధరణి పోర్టల్ను సరళీకృతం చేస్తామని, ఇప్పుడున్న 33 మాడ్యూల్స్ స్థానంలో 11–13 మాడ్యూల్స్ మాత్రమే ఉంచుతామని చెప్పారు. పహాణీల్లో ఇప్పటివరకు ఒక్కటే కాలమ్ ఉందని, ఇక నుంచి 12 లేదా 13 కాలమ్స్ పెడతామని, భూముల పుట్టు పూర్వోత్తరాలన్నింటినీ నమోదు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బుధవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..5 లక్షలకు పైగా ధరణి దరఖాస్తులకు పరిష్కారంఅధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన ప్రారంభించాం. ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్న 2.46 లక్షలు, ఈ ఏడాదిలో వచ్చిన 2.60 లక్షల దరఖాస్తులు కలిపి 5 లక్షలకు పైగా దరఖాస్తులను పరిష్కరించాం. ఇంకా 60–70 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ధరణి పునర్నిర్మాణ కమిటీని నియమించాం. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్) చట్టాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చట్టం ముసాయిదాను ప్రజల్లో చర్చకు పెట్టాం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దేశానికి రోల్ మోడల్గా ఉండేలా బిల్లు ప్రవేశపెడతాం. అటవీ, రెవెన్యూ, దేవాదాయ, వక్ఫ్ భూముల సరిహద్దు వివాదాలు వచ్చాయి. వీటిని సర్వే చేసి డీ మార్కింగ్ చేస్తాం. ఏ శాఖ భూములు ఆ శాఖకు ఇచ్చేస్తాం. పార్ట్–బీలో ఉన్న భూముల సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు తీసేసుకుంటాం. జీవో 59 కింద పెండింగ్లో ఉన్న సరైన దరఖాస్తులను త్వరలోనే పరిష్కరిస్తాం.వైఎస్ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్ల పథకంహైడ్రా కారణంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయని, రియల్ ఎస్టేట్ దెబ్బతిందన్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో 6–7 శాతం మేర రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగింది. మూసీ ప్రక్షాళన విషయానికొస్తే.. ప్రజలు నివసించే ప్రాంతాల జోలికి ఇప్పుడే వెళ్లబోం. ఇళ్లు తక్కువ ఉండి ప్రజలు లేనిచోట్ల ముందు అభివృద్ధి చేస్తాం. ఆ అభివృద్ధిని ప్రజలకు చూపించి వారిని ఒప్పించి మిగిలిన చోట్ల ముందుకెళతాం. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిధిలో 18.56 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు అందించారు. ఆ స్ఫూర్తితో ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని చేపట్టింది. మొదటి విడతలో 4.50 లక్షల ఇళ్లను కేటాయిస్తున్నాం. కనీసం 400 చ.అ.లకు తగ్గకుండా వంట గది, టాయిలెట్తో కూడి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఇది వచ్చే నాలుగేళ్లు కొనసాగుతుంది.కేంద్ర యాప్ తయారీలో ఆలస్యం వల్లే జాప్యంఇందిరమ్మ లబ్ధిదారుల వివరాల నమోదులో కేంద్రం రూపొందించిన యాప్ను వాడుతున్నాం. ఆ యాప్ సిద్ధమైతే తప్ప లబ్ధిదారుల వివరాల నమోదు సాధ్యం కాదు. ఆ యాప్ తయారీలో కేంద్ర జాప్యం వల్ల ఈ పథకం గ్రౌండ్ అవటంలో ఆలస్యం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించి 1.52 లక్షల ఇళ్లకు టెండర్లు పిలిచి 96 వేలే పూర్తి చేసింది. మిగతా వాటిని కూడా పూర్తి చేసి నిరుపేదలకిస్తాం. రూ.187 కోట్లతో డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం. బాంబు పేలడమంటే జైల్లో పెట్టడం కాదుఅధికారంలో ఉన్న పదేళ్లు బీఆర్ఎస్ అరాచకంగా, అక్రమంగా వ్యవహరించింది. ఇందుకు సంబంధించి 10–12 అంశాలపై సమాచారం తీసుకుంటున్నాం. బాంబులు పేలడమంటే ఎవరినో జైల్లో పెట్టడం కాదు. ఇందిరమ్మ రాజ్యంలో కక్ష సాధింపు చర్యలుండవు. ఉద్దేశ పూర్వకంగా ఏ వ్యక్తిని, కుటుంబాన్ని, పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఈ–రేస్, కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, విదేశాలకు నిధుల సరఫరా, ఫోన్ ట్యాపింగ్ లాంటి విషయాల్లో తప్పు చేసిన వారు తప్పించుకోలేరు. తప్పని తేలితే శిక్ష తప్పదు. నేనూ ఫోన్ ట్యాపింగ్ బాధితుడినే. బట్ట కాల్చి మీద వేయడమే బీఆర్ఎస్ పని. నా ఇంట్లో ఈడీకి దొరికిన డబ్బులు లెక్కపెట్టేందుకు వేలసంఖ్యలో కౌంటింగ్ మెషీన్లు తీసుకెళ్లారని చెప్పారు. ఈడీ అనే వ్యవస్థతో సంబంధముండే పార్టీతోనే కదా వారు అంటకాగింది. ఆ పార్టీని అడిగి నా ఇంట్లో ఎన్ని డబ్బులు దొరికాయో తెలుసుకోవచ్చు కదా. ఈ–రేస్ వ్యవహారం తెరపైకి రాగానే ఢిల్లీకి వెళ్లి ఎవరు ఎవరి కాళ్లు పట్టుకున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వంలోకి వచ్చాక నేను ఒక్క గజం భూమి కొనుగోలు చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే. మా పార్టీలోకి చేరికలు ఆగలేదు. కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ చాలా పెద్దగా ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ ఉండరు. ఆ పార్టీలో జబ్బలు చరుచుకుంటున్న వాళ్లు, 1, 2 స్థానాల కోసం పోటీలు పడుతున్న వాళ్లు కూడా ఉండరు. స్వేచ్ఛగా పని చేసుకుంటూ ఆనందంగా ఉన్నా..ఏడాది పాటు కీలక శాఖలకు మంత్రిగా పనిచేయడం సంతృప్తినిచ్చింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్రెడ్డి పెట్టిన పార్టీలో చేరి ఎంపీనయ్యా. ఐదేళ్లు ప్రజలకు సేవ చేశా. తర్వాతి ఐదేళ్లూ మాజీ సీఎం పుణ్యాన ప్రజలతో కలిసి అరణ్యవాసం చేశా. ఆ తర్వాత అదే ప్రజల దీవెనలు, ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యంలో సముచిత స్థానంలో ఉన్నా. ఎలాంటి కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నా. భవిష్యత్తులో ప్రజలకు మరింత మంచి చేసేందుకు నా వంతు ప్రయత్నిస్తా. -
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
హరీశ్రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్గఢ్తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పషతనిచ్చారు.ఈ సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు ప్లాన్ చేస్తోంది. ఆర్ఓఆర్ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించాలని చూస్తోంది. రైతు, కుల గణన సర్వేపై చర్చించే అవకాశం ఉంది.డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కార్ ఏడాది కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో మంత్రివర్గ విస్తరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వినిపిస్తోంది. మరోవైపు పంచాయతీ ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని, త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు వెళ్ళక ముందే ఆసరా పెన్షన్, రైతు భరోసా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. -
పింక్ చొక్కాలు కాజేసిన భూములను పేదలకు పంచుతాం: మంత్రి పొంగులేటి
సాక్షి,కరీంనగర్జిల్లా: ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. బుధవారం(నవంబర్ 20)వేములవాడలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా విజయోత్సవ సభలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు.‘నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేశాం.రాబోయే నాలుగు ఏళ్ళలో 20 లక్షల ఇళ్ళు నిర్మించి ఇస్తాం.ఇందిరమ్మ ఇళ్ళు నిరంతర ప్రక్రియ..ప్రతి పేదవాడికి పక్కా ఇళ్ళు ఉండాలనేదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ రెవెన్యూ చట్టం 2024 రాబోతోంది.ధరణి చట్టంతో పేదల భూములను పింక్ చొక్కాల వారు కాజేశారు.ఆ భూములను ప్రజా ప్రభుత్వం తీసుకుని పేదలకు పంచి పెడుతాం’అని పొంగులేటి తెలిపారు. -
సంక్షేమ పథకాల విస్తృతికే సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతపర్చేందుకే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టినట్టు రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం అన్ని రకాల అంశాలతో ఈ సర్వేను శాస్త్రీయంగా నిర్వ హిస్తోందని, ప్రజలు కూడా సహకరిస్తున్నారన్నారు. సోమవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 17వ తేదీనాటికి రాష్ట్రవ్యాప్తంగా 58.3% ఇళ్లను సర్వే చేశామని, నెలాఖరులోగా నూరుశాతం సర్వే పూర్తి చేస్తామన్నారు.ఇప్పటికే సర్వే చేసిన ఇళ్లకు సంబంధించి వివరాలను కంప్యూ టరీకరిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల స్థితి గతులు తెలుసుకొని ప్రస్తుతం అమలు చేస్తున్న పథ కాలను విస్తృతం చేయడంతోపాటు కొత్త పథకాల అమలు కోసం ఈ సర్వే ఎంతో ఉపయోగ పడుతుందని, ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా సర్వే ప్రక్రియను నిర్వ హిస్తోందన్నారు. తాజాగా చేప డుతున్న సర్వే దేశానికే రోల్ మోడల్గా నిలుస్తుందని మంత్రి వ్యాఖ్యానించారు.మంచి ఉద్దేశంతో చేపడుతున్న సర్వేను ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని, అధికారులకు వివరాలు ఇవ్వకుండా తప్పుదారి పట్టించేలా ప్రకటనలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పథకాల్లో కోతపడుతుందని, పలు రకాల బెనిఫిట్స్ ఆగిపోతాయంటూ ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గంగా మాట్లాడుతున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర సర్వే చేసిందని, కానీ ఆ సర్వేకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేయలేదన్నారు. ప్రజల ఆస్తులు తెలుసుకొని వాటిని కొల్లగొట్టేందుకు అప్పటి సర్వేను బీఆర్ఎస్ ప్రభుత్వం వినియోగించుకుందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం చేపట్టే సర్వే దేశానికే ఆదర్శంగా నిలిపేలా ఉంటుందని చెప్పారు. -
ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర జరుగుతోందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అధికారం కోల్పోయిన అక్కసుతో అమాయక రైతులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనేందుకు బీఆర్ఎస్ ప్రయతి్నస్తోందని ఆయన ధ్వజమెత్తారు. చిల్లర, అవకాశవాద, కుట్రపూరిత రాజకీయాలతో మనుగడ సాగించలేరనే విషయాన్ని బీఆర్ఎస్ గుర్తించాలని, పార్టీ ఉనికి కోసం అమాయక రైతులను బలిపెట్టొద్దని గురువారం ఒక ప్రకటనలో ఆ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేశారు. లగచర్ల ఘటనలో ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుందన్నారు. జిల్లా కలెక్టర్తోపాటు అధికారులపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని విమర్శించారు.కలెక్టర్పైనే హత్యకు భారీగా కుట్ర పన్నారని, రైతుల ముసుగులో కొంతమంది గులాబీ గూండాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని, దీనివెనుక ఎవరున్నారో కూడా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. రైతులు తమ సమస్యలు చెప్పుకోవడానికి, స్థానికుల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, కుట్రపూరిత చర్యలకు పాల్పడడం దురదృష్టకరమన్నారు. రైతులకు నష్టం కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొనే ముందుకు వెళుతుందని పేర్కొన్నారు. అధికారులపై దాడి జరిగినట్టుగానే భవిష్యత్లో రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.ప్రజలను కాపాడుకున్నట్టే, అధికారులను కాపాడుకోలేకపోతే పనిచేయడానికి ఎవరు ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్య చెప్పుకోవడానికి వచ్చిన ఖమ్మం మిర్చి రైతులకు బేడీలు వేశారని గుర్తు చేశారు. ఇసుక దందాలకు అడ్డువస్తున్నారని, సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని నేరెళ్లలో దళితులను ట్రాక్టర్తో తొక్కించి పోలీస్స్టేషన్లో థర్డ్ డిగ్రీ ప్రయోగించి హింసించారని గుర్తు చేశారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన హింసను భరించలేక 2021 జూన్ నెలలో వేములఘాట్ రైతు తూటుకూరి మల్లారెడ్డి, కూలి్చవేసిన తన ఇంటిలోని కట్టెలను పోగుచేసి, దానినే చితిగా మార్చుకొని ఆత్మార్పణ చేసుకున్నాడని పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం పెట్టిన బాధలను భరించలేక ఏకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కుటుంబాలు వీధిన పడ్డాయన్నారు. గడచిన 11 నెలలుగా ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నట్టు చెప్పారు. మహారాష్ట్రకు పొంగులేటిమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. గురువారం నాందేడ్ ప్రాంతంలో జరిగిన పలు సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనేందుకు వచి్చన రాహుల్గాం«దీకి నాందేడ్ విమానాశ్రయంలో మంత్రి ఉత్తమ్తో కలిసి స్వాగతం పలికారు. -
రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా చేయలేదు: మంత్రి పొంగులేటి
సాక్షి,హైదరాబాద్: ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ధరణి సమస్యలు ఎక్కువగా వచ్చాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ విషయమై పొంగులేటి బుధవారం(నవంబర్ 13) మీడియాతో మాట్లాడారు.‘భూములున్న వారిని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది.గ్రామ సభలో ఇంధిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.పైరవీలు అవసరం లేదు.కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.అసెంబ్లీలో కొత్త భూ చట్టం వివరాలు వెల్లడిస్తాం.ప్రతిపక్ష నేతల సలహాలు కూడా కొత్త చట్టం లో తీసుకుంటాం.ఇటీవల ధరణి బాధ్యతలు ఎన్ఐసికి ఇచ్చాం. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతు భరోసా కూడా ఇస్తాం’అని పొంగులేటి తెలిపారు.ఇదీ చదవండి: రేవంత్రెడ్డికి లిక్కర్ అమ్మకాలపై ప్రేమ ఎక్కువైంది: హరీశ్రావు -
తెలంగాణలో మళ్లీ బాంబ్ బ్లాస్ట్ పాలిటిక్స్
-
ఆటంబాంబు పేలబోతోంది..: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వర్ధన్నపేట/తొర్రూరు: తుప్పు బాంబు కాదు.. లక్ష్మీబాంబు కాదు.. రాజకీయ ఆటంబాంబు పేలబోతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా బీఆర్ఎస్ నేత (కేటీఆర్) తీరు ఉందన్నారు. తనను జైలుకు పంపిస్తారని.. జైలులో జిమ్ చేసి పాదయాత్ర చేస్తానని కేటీఆర్ చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో గురువారం వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంత్రి పొంగులేటి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఆయా చోట్ల మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఎవరినీ జైలుకు పంపించాలనే ఉద్దేశం ప్రభుత్వానిది కాదని, తప్పు చేస్తే ఉపేక్షించడం ఉండదన్నారు. తప్పు చేసిన వాళ్లపై ఆటంబాంబు పేలబోతోందని హెచ్చరించారు. రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ఆ బాంబులు ఇంకా తుస్సుమనలేదని చెప్పారు. కొద్దిరోజుల్లో తాను పేల్చిన బాంబు ఏంటో మీరే చూస్తారని స్పష్టం చేశారు. అరెస్టు చేయాలా.. జీవితకాలం జైలులో పెట్టాలా అనేది చట్టం చూసుకుంటుందన్నారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి సంపాదించారని, వారంతా ఫలితాలు అనుభవిస్తారని చెప్పారు. పేదల సొమ్ము విదేశాలకు పంపుకున్నారని, రూ.55 కోట్లు ఎవరి ద్వారా ఎవరికి పోయిందో, ఎవరి ఖాతాలో వేసుకున్నారో ప్రజల ముందు తమ ప్రభుత్వం పెట్టి చూపిస్తుందన్నారు. అవి చౌకబారు విమర్శలు ఈడీ దాడులు చేస్తోందని..అదాని కాళ్లు పట్టుకుంటున్నాడని తనపై కేటీఆర్ చవకబారు విమర్శలు చేస్తున్నాడని మంత్రి పొంగులేటి అన్నారు. తాను ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదని, గతంలో బీఆర్ఎస్లో చేరినప్పుడు మాత్రమే కేసీఆర్ కాళ్లకు నమస్కరించానని చెప్పారు. అది వయసుకు ఇచ్చిన గౌరవంతోనేనన్నారు. పదేళ్లు సామాన్యులను వంచించిన చరిత్ర బీఆర్ఎస్కే దక్కిందని, పేదల మద్దతు కూడగట్టేందుకు కేటీఆర్ పాదయాత్ర పేరిట డ్రామా చేస్తున్నాడన్నారు. పాదయాత్ర చేసినా.. మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు వారిని నమ్మబోరని తెలిపారు. వైఎస్సార్ తన హయాంలో 19 లక్షల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్లు కట్టించి పేదలకు అండగా నిలిచారని, అదే స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు కట్టించనుందన్నారు. ఆయా సమావేశాల్లో ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుంది: మంత్రి పొంగులేటి
సాక్షి, వరంగల్: నాటు బాంబు.. లక్ష్మిబాంబు కాదు.. త్వరలో ఆటమ్ బాంబ్ పేలబోతుందంటూ మరోసారి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వర్దన్నపేట సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదన్నారు. తప్పు చేయకపోతే ఉలికిపాటు ఎందుకు?. రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్లాయో బయటపడతాయటూ వ్యాఖ్యానించారు. గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తరుముకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.‘‘మీ ఆస్తులు పెంచుకోవడం కోసం పేదల సొమ్ము విదేశాలకు పంచిన వారిని చట్టం వదలదు. చట్టం తనపని తాను చేసుకుంటది.. పేదలను మరిచిపోయిన మీరు అధికార దాహంతో ఎలాంటి కుట్రలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తప్పకుండా దోషులుగా నిలబడాల్సిందే. కారుకూతలు కూస్తున్న నేతలు ఏ టైర్ కింద తలపెడతారు’’ అంటూ పొంగులేటి ధ్వజమెత్తారు.ఇదీ చదవండి: పొంగులేటి.. జైలుకెళ్లడానికి రెడీగా ఉండు: కేటీఆర్ -
మంత్రి పొంగులేటి జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలి: కేటీఆర్
-
ఏడాదిలోగా వరంగల్ ఎయిర్పోర్టు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక నేపథ్యం కలిగిన వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 విజన్తో మాస్టర్ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రానున్న 25 ఏళ్లలో పెరిగే జనాభా అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం రూపొందుతున్న మాస్టర్ప్లాన్ తు దిదశలో ఉందని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా విడుదల చేస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో వరంగల్, హనుమకొండ జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, ఆయా జిల్లా ల ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమా వేశం నిర్వహించారు. నగర మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, భద్రకాళి ఆలయ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మెగా టెక్స్టైల్ పార్క్, మామునూరు ఎయిర్పోర్ట్, ఎకో టూరిజం అంశాలపై చర్చించారు.పొంగులేటి మాట్లాడుతూ హైదరాబాద్ నగరానికి దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలన్న కృతనిశ్చయంతో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రింగ్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డును 3 దశల్లో చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ పనులను త్వరలో ప్రారంభించి, ఏడాదిలోపు ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువులో పూడిక తీసి, ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించాలని అన్నారు. వరంగల్ ప్రజల చిరకాల వాంఛ ఎయిర్ పోర్టు: మంత్రి కొండా సురేఖ వరంగల్ జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని మంత్రి కొండా సురేఖ తెలిపా రు. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ వరంగల్ విమానాశ్రయం నిర్మాణానికి అంగీకరించిందని చెప్పారు. సమావేశంలో ఎంపీ కడియం కావ్య, ఎ మ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డి, కె నాగరాజు, నాయిని రాజేందర్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సీఎం ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్రెడ్డి పాల్గొన్నారు. -
కేటీఆర్ చుట్టూ.. ‘ఫార్ములా–ఈ’ ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: ‘ఫార్ములా–ఈ’ కార్ల రేసింగ్ అంశంలో పురపాలక శాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావు చుట్టూ ఉచ్చుబిగిస్తున్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ–కార్ల రేస్ నిర్వహణ సంస్థ ఫార్ములా–ఈ ఆపరేషన్స్ (ఎఫ్ఈవో)కు కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లు చెల్లించారన్న అంశాన్ని ఆధారంగా చేసుకుని.. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా రాజకీయ బాంబులు పేలబోతున్నాయంటూ చేసిన కామెంట్లు.. తాజాగా అర్వింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు.. కేటీఆర్ బావమరిది జన్వాడ నివాసంలో దాడులు.. కేటీఆర్ లక్ష్యంగా ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చేసిన కామెంట్లు వంటి పరిణామాలన్నీ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్న దిశగా వస్తున్న సంకేతాలే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఫార్ములా–ఈ రేసుకు సంబంధించి ఏసీబీ విచారణ చేయాలంటూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్ లేఖ రాయగా.. ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలోని అధికారులు ఫార్ములా–ఈ రేసు అంశాన్ని తిరగదోడుతున్నారు. అందులో భాగంగానే అర్వింద్ కుమార్కు నోటీసులు జారీ చేశారు. ఈ విచారణలో ఆయన వెల్లడించే అంశాలే కీలకంగా మారనున్నాయి. రంగంలోకి ఈడీ? ఫార్ములా–ఈ రేసు అంశంలో విదేశీ సంస్థకు నిధులు బదిలీ అయిన నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏసీబీ కేసు రిజిస్టర్ చేసిన నేపథ్యంలో ఈడీ కూడా విచారణ చేపట్టవచ్చని భావిస్తున్నారు. ఫార్ములా–ఈ రేసులో ఏం జరిగింది? హైదరాబాద్లో నాలుగు సంవత్సరాలపాటు ఫార్ములా–ఈ రేసు నిర్వహణకు సంబంధించి ఎఫ్ఈవో, ఏస్ నెక్ట్స్జెన్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి పురపాలక శాఖ 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం మేరకు 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నిర్వహించిన మొదటి ఫార్ములా–ఈ కార్ల రేస్ (సెషన్–9)కు దేశవ్యాప్తంగా అభిమానులు వచ్చినా.. ప్రమోటర్ ఏస్ నెక్ట్స్జెన్ సంస్థ ఆశించిన మేరకు ఆదాయం సమకూరలేదు. దీనితో ప్రమోటర్ తప్పుకొన్నారు. 2024 ఫిబ్రవరి 10న నిర్వహించాల్సిన రెండో దఫా (సెషన్–10) ఈ–కార్ రేసు నుంచి హైదరాబాద్ పేరును ఎఫ్ఈవో తొలగించింది. కానీ అప్పటి మంత్రి కేటీఆర్ ఫార్ములా–ఈ నిర్వహణ హైదరాబాద్కు తలమానికంగా ఉంటుందని.. 2024 ఫిబ్రవరిలో కూడా హైదరాబాద్లోనే కార్ రేస్ను నిర్వహించాలని కోరారు. ప్రమోటర్ నిర్వహించే బాధ్యతలను నోడల్ ఏజెన్సీగా హెచ్ఎండీఏ చూసుకుంటుందని ఎఫ్ఈవోకు స్పష్టం చేశారు. ఈ మేరకు రెండో దఫా ఈ కార్ రేస్ కోసం 2023 అక్టోబర్లో ఎఫ్ఈవోతో పురపాలక సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. రేస్ నిర్వహణకోసం రూ.100 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం హెచ్ఎండీఏ రూ.55 కోట్లను ఎఫ్ఈవోకు చెల్లించింది. ఉల్లంఘన అంటూ రేసు రద్దు చేసి.. డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా–ఈ రేసుపై ఆరా తీసింది. పురపాలక శాఖ ఒప్పందంలోని అంశాలను ఉల్లంఘించిందంటూ ఎఫ్ఈవో సెషన్–10ను రద్దు చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ఆర్థికశాఖ అనుమతి లేకుండా రూ.55 కోట్లను విదేశీ సంస్థకు హెచ్ఎండీఏ ద్వారా చెల్లింపులు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో అర్వింద్కుమార్ను పురపాలక శాఖ నుంచి బదిలీ చేసింది. నిధుల చెల్లింపుల్లో జరిగిన ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలంటూ ఆయనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మెమో జారీ చేశారు. ఆ మెమోకు అర్వింద్కుమార్ వివరణ ఇస్తూ.. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, అప్పటి మంత్రి కేటీఆర్ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే చెల్లింపులు చేశామని పేర్కొన్నట్టు తెలిసింది. తర్వాత ప్రభుత్వం అనుమతినిస్తుందని చెప్పడంతోనే ఎఫ్ఈవోకు నిధులు విడుదల చేసినట్టుగా వివరణ ఇచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు ప్రారంభించిన ఏసీబీ.. పురపాలక శాఖ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. -
పక్షం రోజుల్లో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకానికి లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ఈ నెల ఐదు, ఆరు తేదీల్లో ప్రారంభించి పక్షం రోజుల్లో పూర్తి చేస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రత్యేక యాప్ ద్వారా జరుగుతుందని, ఎంపికలో రాజకీయ జోక్యం ఏమాత్రం ఉండదని చెప్పారు. నిరుపేదలకు సొంతింటి వసతి కల్పించడం లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని పేర్కొన్నారు. శనివారం సాయంత్రం సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే మంజూరు చేస్తాం. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇళ్లకు ప్రత్యేక డిజైన్ అంటూ ఉండదు. లబ్ధిదారులకు ఉన్న జాగా ఆధారంగా వారే కావాల్సిన ఆకృతిలో నిర్మించుకోవచ్చు. అయితే వంటగది, మరుగుదొడ్డి కచ్చితంగా ఉండేలా చూడాలి.దశలవారీగా సొమ్ము విడుదలఇందిరమ్మ ఇళ్లకు పునాదులు నిర్మించుకున్నాక రూ.లక్ష, గోడల నిర్మాణం తర్వాత రూ.లక్షన్నర, పైకప్పునకు రూ.లక్షన్నర చొప్పున చెల్లిస్తాం. ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మిగతా మొత్తం అందజేస్తాం. ఈ సొమ్మును బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా జమ చేస్తాం. తొలిదశలో కేవలం సొంత జాగా ఉన్నవారికే ఇళ్లను మంజూరు చేస్తాం. తదుపరి విడతలో భూమిలేని నిరుపేదలకు స్థలం ఇచ్చి నిధులు అందజేస్తాం. నియోజకవర్గానికి 3,500కు తగ్గకుండా ఇళ్లను మొదటి విడతలో మంజూరు చేస్తున్నాం. నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లను నిర్మించేలా చూస్తాం. ఈ ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసం 16 శాఖల నుంచి సిబ్బందిని సమీకరిస్తున్నాం.నిధులను సమీకరించుకుంటాం..తొలిదశ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20వేల కోట్ల వరకు ఖర్చవుతాయి. బడ్జెట్లో ప్రభుత్వం రూ.7,740 కోట్లను కేటాయించింది. కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వం చేపట్టి వదిలేసిన ఇళ్లను కూడా పూర్తి చేస్తాం. అవసరమైన నిధులను వివిధ మార్గాల్లో సమీకరించుకుంటాం. కొత్తగా ఏర్పడే ఇందిరమ్మ కాలనీల్లో ప్రభుత్వమే మౌలిక వసతులు కల్పిస్తుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెడతాం..గత ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తేవటంలో విఫలమైంది. మేం ఆ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర నిబంధనలు అనుసరించటంతోపాటు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ పెద్దల ఫొటోలు పెట్టాలంటే కూడా పెడతాం. మాకు భేషజాలు లేవు. సర్పంచుల పదవీకాలం పూర్తయినందున ప్రస్తుతం ఇందిరమ్మ కమిటీల్లో వారి ప్రాతినిధ్యం లేదు. తదుపరి దశ నాటికి వారు ఉండేలా అవసరమైతే జనవరి నాటికే సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తాం..’’అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.ఈ టర్మ్ అంతా రేవంతే సీఎంసీఎం రేవంత్రెడ్డిని మారుస్తారంటూ కొందరు పనిగట్టు కుని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం టర్మ్ పూర్తయ్యేందుకు ఇంకా నాలుగేళ్ల ఒక నెల సమయం ఉందని, అప్పటి వరకు రేవంతే సీఎంగా ఉంటారని చెప్పారు. తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతో విపక్షాలు లేనిపోని ప్రకటనలు చేస్తున్నాయని విమర్శించారు. ఒకట్రెండు రోజులు అటూఇటూ అయినా.. తాను చెప్పినట్టు రాజకీ య బాంబులు పేలటం తథ్యమని పేర్కొన్నారు. -
రెండు మూడ్రోజుల్లో ఆ బాంబు పేలుతుంది: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం మాట్లాడాలి.. ఏదో ఒకటి మాట్లాడకపోతే ప్రతిపక్షం ఎలా అవుతుంది? అంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సెటైరికల్గా కౌంటర్ ఇచ్చారు. ‘‘నేను పేల్చిన బాంబు ఇంకా తుస్సు కాలేదు.. రెండు మూడు రోజుల్లో ఆ బాంబు ఏంటో మీరే చూస్తారు. వచ్చే నాలుగేండ్ల ఒక నెల సీఎంగా రేవంత్రెడ్డినే ఉంటారు.’’ అని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలోనే గ్రామ సర్పంచ్లు అందుబాటులోకి వస్తారు. సంక్రాంతి లోపు సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి అన్నారు.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా గ్రీన్ చానెల్లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ జరుగుతుంది. లబ్ధిదారుని ఖాతాలోకి నేరుగా నిధుల జమ చేస్తాం. ప్రారంభంలో లక్ష ఇస్తారు. ఫిల్లర్స్ 1.25 లక్షలు, స్లాబ్ 1.75 లక్షలు ఇళ్లు పూర్తి అయ్యాక 1లక్ష ఇస్తారు. ఇందిరమ్మ ఇళ్లు లబ్ధి కోసం రేషన్ కార్డు తప్పనిసరి కాదు. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ గురించి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో మాట్లాడా. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందుతుందనే సంకేతాలు ఇప్పటి వరకు ఉంది.’’ అని పొంగులేటి చెప్పారు.‘‘కేంద్రం నుంచి నిధులు వస్తే మంచిది.. లేకపోతే నేను ఇండ్లను కట్టిస్తాను. ప్రారంభానికి కేంద్ర మంత్రులను పిలుస్తాం.. నేన, సీఎం వెళ్లి కేంద్ర మంత్రిని ఆహ్వానిస్తాం. వచ్చే నాలుగేళ్లు 20 లక్షలు ఇండ్లను టార్గెట్ పెట్టుకున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.ఇదీ చదవండి: మా దగ్గర ‘బీఆర్ఎస్’ జాతకాలు.. అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు -
జన్వాడ మందు పార్టీ సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి: ఎంపీ రఘునందన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ బీఆర్ఎస్ను నమ్మరు అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు విమర్శలు చేశారు. అలాగే, దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు అంటూ ఎద్దేవా చేశారు.బీజేపీ ఎంపీ రఘునందన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఉందని అంటున్నారు. ఆయన తప్పుకుంటే వద్దు అనే వాళ్లు ఎవరూ లేరు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్కు ప్రజలను కలిసే సమయం దొరకలేదు. ఇప్పుడు పాదయాత్ర ఎందుకు?. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఎవరూ పట్టించుకోరు. కేసీఆర్ పది నెలలుగా ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఏమైనా నష్టం జరిగిందా?. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసం మాత్రమే. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారు.కేటీఆర్కు ఎవరి మీదా నమ్మకం లేదు. చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా నమ్మకం లేదు. జన్వాడ ఫామ్హౌస్ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ను బయటపెట్టాలి. అప్పుడే అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలుస్తుంది. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా?. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ మంత్రి పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు మాత్రం పేలలేదు’ అంటూ సెటైర్లు వేశారు. -
పొంగులేటికి రఘునందన్ స్ట్రాంగ్ కౌంటర్
-
మంత్రి పొంగులేటి ఫ్యాన్ అదిరిపోయే గిఫ్ట్
-
పొంగులేటి బాంబుల కామెంట్స్.. జగదీష్రెడ్డి కౌంటర్
సాక్షి,హైదరాబాద్:మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ బాంబుల కామెంట్స్పై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి జగదీష్రెడ్డి స్పందించారు. ఈ విషయమై జగదీష్రెడ్డి తెలంగాణభవన్లో మంగళవారం(అక్టోబర్ 29) మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘కాంగ్రెస్ బాంబులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ సర్కార్ దోపిడీ బాంబులను అడ్డుకుంటాం. మా హాయాంలో తప్పు జరిగితే విచారణ జరుపుకోవచ్చు.కాంగ్రెస్ నేతల చిల్లర బెదిరింపులకు భయపడేది లేదు. మంత్రులు చిల్లర మాటలు బంద్ చేసి పాలనపై దృష్టి పెట్టాలి. బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. పాలన చేతకాకనే రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్కు తెర తీశారు. ప్రజాస్వామికవాదిగా చెప్పుకునే పెద్దమనిషి ఇప్పుడు ఎక్కడున్నారు? పెద్దమనిషి కాంగ్రెస్ సోషల్ మీడియాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. పోలీసులే రోడ్డు ఎక్కటం చరిత్రలో ఇది మెదటిసారి.సీఎం సెక్యూరిటీ నుంచి స్పెషల్ పోలీసులను తప్పించటం అన్యాయం. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఆంధ్రకు వెళ్ళి తలదాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.పండుగల సమయంలో 144సెక్షన్లు పెట్టడం దుర్మార్గం. లోఓల్టేజీ కరెంట్తో ఇళ్ళల్లో వస్తువులు కాలిపోతున్నాయి. కమీషన్ రాదన్న కారణంగానే విద్యుత్ శాఖను ప్రభుత్వం గాలికొదిలేసింది. కాంగ్రెస్ నేతలు జేబులు నింపుకోవడానికి రాష్ట్ర ఖజానాను దెబ్బతీస్తున్నారు. కరోనా కాలంలో కూడా తెలంగాణ ఆదాయం తగ్గలేదు.ఇప్పుడెందుకు తగ్గింది? పేదలకు చెందాల్సిన ఆదాయం మంత్రులు,కాంగ్రెస్ నేతలు తింటున్నారు. తెలంగాణను చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది కేసీఆర్. రైతులకు కూడా 24గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. కాంగ్రెస్ అంటే ఏంటో ప్రజలు,రైతాంగానికి అర్థమైంది. దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలి. పత్తిని కొనుగోలు చేయాలి.నాణ్యత లేని గుజరాత్ పత్తికి ఎక్కువ ధర ఇస్తున్నారు’అని జగదీష్రెడ్డి మండిపడ్డారు. ఇదీ చదవండి: సమస్యలు కొనితెచ్చుకుంటున్న తెలంగాణ సీఎం -
కులగణనకు ఇంటింటి సర్వే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేను నవంబర్ 4 లేదా 5న ప్రారంభించి 30లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. సర్వేకు సంబంధించిన ప్రశ్నావళి, విధివిధానాలను ఆమోదించింది. రాష్ట్రంలో కులగణన నిర్వహించాలని ఫిబ్రవరి 17న శాసనసభలో తీర్మానం చేయడంతోపాటు ఇప్పటికే జీవో 18 ప్రభుత్వం జారీ చేయగా సీఎం రేవంత్ సోమ వారం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్లతో సమావేశమై సర్వేపై దిశానిర్దేశం చేయనున్నారు. శనివారం సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా, మండల స్థాయిలోని 80 వేల మంది అధికారులు, సిబ్బందికి కులగణనపై శిక్షణ అందించనున్నట్లు పొన్నం తెలిపారు. ఒక్కో ఎన్యూమరేటర్కు 150 ఇళ్లను కేటాయించి సర్వే పూర్తి చేయడానికి 3, 4 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. 15–20 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తికానుందని... ఇప్పటికే షెడ్యూల్ను సిద్ధం చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వం ఒక్క రోజులో కుటుంబ సర్వే నిర్వహించి వివరాలను బయటపెట్టలేదని.. కానీ తాము సర్వే ముగిశాక సమాచారాన్ని, ప్రయోజనాలను ప్రజా బాహుళ్యంలో ఉంచి పారదర్శకంగా వ్యవహరిస్తామని పొన్నం తెలిపారు. సర్వేలో సరైన సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రతి గ్రామంలో గ్రామసభ పెట్టి కులమతాలు, పారీ్టలకు అతీతంగా పేదల్లో బహు పేదలను ఎంపిక చేయాలని నిర్ణయించామన్నారు. దీపావళి మర్నాడు లేదా ఆ తర్వాతి రోజున సీఎంతోపాటు మంత్రులం స్వయంగా మొగ్గు వేసి నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. ఉద్యోగులకు ఒక డీఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు పెండింగ్ డీఏలను చెల్లించాల్సి ఉండగా దీపావళి కానుకగా 2022 జనవరి నుంచి రావాల్సిన ఒక డీఏను మంజూరు చేశామని పొంగులేటి చెప్పారు. ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే జీవో 317 కింద గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంతాలకు బదిలీ అయిన ఉద్యోగులను స్పౌజ్, ఆరోగ్య, పరస్పర కేటగిరీల కింద తక్షణమే సొంత ప్రాంతాలకు బదిలీలు నిర్వహించాలని నిర్ణయించామని వివరించారు. జీవో 317 కింద దూర ప్రాంతాలకు వెళ్లిన ఇతర ఉద్యోగుల సమస్యతోపాటు ఉద్యోగ నియామకాలకు జీవో 46తో ఉన్న ఇబ్బందుల పరిష్కారానికి చట్ట రీత్యా, కోర్టుల రీత్యా చిక్కులున్న నేపథ్యంలో తదుపరి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి కేంద్రం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించామని పొంగులేటి తెలిపారు. ఉద్యోగులకు ఒక డీఏ చెల్లిస్తే ప్రభుత్వంపై రూ. 3 వేల కోట్ల భారం పడనుందని.. అందుకు ప్రతి నెలా రూ. 230 కోట్లు అదనంగా కావాలని పొన్నం తెలిపారు. నాలుగు కేటగిరీలుగా మిల్లర్ల విభజన.. రాష్ట్రంలో మిల్లర్లను నాలుగు విభాగాల కింద విభజిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఎలాంటి ఆరోపణలు లేని మిల్లర్లకు ప్రథమ కేటగిరీ, ప్రభుత్వ నోటిసులకు స్పందించి చెల్లింపులు చేసిన వారిని రెండో కేటటిరీ, నోటిసులిచ్చినా చెల్లింపులు చేయక రికవరీకి గురైన వారిని మూడో కేటగిరీగా విభజించి వారి నుంచి బ్యాంకు గ్యారెంటీలు తీసుకున్న తర్వాత ధాన్యం సేకరణలో అనుమతించాలని, ఇంకా డిఫాల్టర్లుగా మిగిలిపోయిన వారిని అనుమతించరాదని నిర్ణయించామన్నారు. మిల్లర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి పొరుగు రాష్ట్రాల్లో అవలంభిస్తున్న ఉత్తమ విధానాలను పరిశీలించి ఆమోదించామని చెప్పారు. రూ. 24,269 కోట్లతో మెట్రో రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టును కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కింద నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. నాగోల్–శంషాబాద్, రాయదుర్గ్–కోకాపేట, ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట, మియాపూర్–పటాన్చెరు, ఎల్బీనగర్–హయత్నగర్ కారిడార్లలో 76.4 కి.మీ. కొత్త మెట్రో రైల్వే లైన్ను రూ. 24,269 కోట్ల అంచనాలతో ఏర్పాటు చేయడానికి రూపొందించిన డీపీఆర్ను కేంద్రానికి పంపేందుకు మంత్రివర్గం ఆమోదించింది. పీపీపీ విధానంలో రోడ్ల అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ, ఆర్ అండ్ బీ పరిధిలో 16–17 వేల కి.మీ. కొత్త రోడ్ల నిర్మాణం/పునరుద్ధరణ పనుల విషయంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి తప్పనిసరిగా బీటీ రోడ్డు, ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు, ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్కు 4 లేన్ల రోడ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలను ఆమోదించింది. ప్రతి ఉమ్మడి జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని పీపీపీ విధానంలో వచ్చే 4 ఏళ్ల పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకు రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 28 వేల కోట్ల వ్యయం కానుందని ప్రాథమికంగా అంచనా వేసింది. మరికొన్ని నిర్ణయాలు.. ⇒ ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణానికి గోషామహల్ స్టేడియం స్థలాన్ని అప్పగించడంతోపాటు ములుగులోని గిరిజన వర్సిటీకి 211 ఎకరాల భూమిని, స్పోర్ట్స్ వర్సిటీకి గచ్చిబౌలి స్టేడియాన్ని అప్పగించాలనే ప్రతిపాదనలకు ఆమోదం. ⇒ మధిర, వికారాబాద్, హుజూర్నగర్లో స్కిల్స్ వర్సిటీకి అనుబంధంగా కొత్త ఐటీఐల మంజూరు. ⇒ కొత్తగా ఏర్పడిన 8 కోర్టులు, రెండు వైద్య కళాశాలలకు సిబ్బంది మంజూరు. ⇒ కేంద్ర ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా కడెం ప్రాజెక్టులో పూడికతీతకు ఆమోదం. అన్ని ప్రాజెక్టుల్లో 23 శాతం పూడికతో నిండి ఉన్నాయని, భవిష్యత్తులో వాటిలోని పూడిక తొలగిస్తామని పొంగులేటి తెలిపారు. సినీనటుడు బాలకృష్ణకు స్టూడియో నిర్మాణానికి ఎలాంటి స్థలం కేటాయించలేదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీపావళికి ముందే పొలిటికల్ బాంబుల పేలుళ్లు రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు ఒకట్రెండు రోజుల్లో పేలబోతున్నాయని దక్షిణ కోరియా పర్యటన సందర్భంగా తాను చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి స్పందించారు. దీపావళి టపాసుల కంటే ముందే ఇవి పేలుతాయని స్పష్టం చేశారు. కాగా, దక్షిణ కొరియాలో అమలైన నదుల పునరుజ్జీవ ప్రాజెక్టు గురించిన వివరాలను మంత్రులు పొంగులేటి, పొన్నం తమ సహచరులకు వివరించినట్లు సమాచారం. అయితే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రభుత్వం తీసుకోనున్న చర్యలపై ప్రత్యేకంగా మరో సమావేశం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కేబినెట్లో వ్యక్తమైనట్లు తెలియవచ్చింది. -
రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి: మంత్రి పొంగులేటి
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి): ‘‘రాష్ట్రంలో ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నేతలు ఉంటారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతోపాటు ఎనిమిది నుంచి 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి ప్రజల ముందు ఉంచబోతున్నాం’’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన బుధ వారం సియోల్లో మీడియాతో మాట్లాడారు. ‘‘తప్పు చేసినవాళ్లు ఎంత పెద్దవాళ్లు అయినా వదలం.. అది విదేశీ కంపెనీయా? వారిని ఎలా ట్రేసవుట్ చేయాలి? వారి వెనుక ఉన్న తొత్తులు ఎవరు? వారి మధ్య జరిగిన లావాదేవీలేమిటి?.. ఇలా అన్నింటినీ నిగ్గుతేల్చి మా ప్రభుత్వం ప్రజల ముందు పెట్టనుంది. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయికాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అక్రమాలు అంటూ ఆరోపణలు చేయ డమే తప్ప, ఇప్పటివరకు ఎలాంటి రుజువులు చూపలేకపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవు తోందని మీడియా ప్రతినిధులు పేర్కొనగా.. మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మేం సియోల్ నుంచి హైదరాబాద్కు వెళ్లిన తర్వాత రోజు తెల్లారో,మరోనాడో ఒకటో, రెండో బాంబులు పేలబోతున్నాయి. దాంట్లో ప్రధాన నాయకులే ఉంటారు. ఈ ధరణికి సంబంధించి, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఇతరత్రా ఏవైతే ఎనిమిదో, పదో అంశాలు ఉన్నాయో.. తొందరపడో, ఉత్త పుణ్యానికో, అన్యాయంగానో వారిపై వేయాలన్నది కాదు. ఆధారాలతో సహా నిరూపిస్తాం. కాళేశ్వరంపై కమిషన్ వేశాం. త్వరలో దాని నివేదిక వస్తుంది. ధరణికి సంబంధించిన సమాచారం కూడా వస్తోంది. ఆల్రెడీ రెండు ట్రాక్లో ఉన్నాయి. ఆధారాలతో సహా ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాయి’’ అని తెలిపారు.కొత్త కాన్సెప్ట్లో ధరణి..రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఒకే కాలమ్లో పేరు ఉంటే రైతుకు భూమి ఉన్నట్లు లేదంటే భూమి లేనట్లు అయిపోయిందని మంత్రి పొంగులేటి చెప్పారు. అదే ఇప్పుడు తాము 12 నుంచి 14 కాలాలు తీసుకొచ్చి.. ఆ భూమి స్వభావం, గతంలో ఎవరి దగ్గర ఉంది వంటి వివరాలన్నీ నమోదు చేస్తామని తెలిపారు. ‘‘భవిష్యత్తులో డాక్యుమెంట్లో ఎలాంటి అపార్థాలు లేకుండా ఉండేలా కాలాలు ఉంటాయి. ధరణి పేరు కూడా మార్చబోతున్నాం. కొత్త కాన్సెప్ట్లో భూమి ఉన్న ప్రతి ఆసామికి పూర్తిగా క్లియర్ టైటిల్తో డాక్యుమెంట్ ఉండబోతోంది. ధరణిలో మొత్తం 35 మాడ్యూల్స్ ఉన్నాయి. ఏదైనా భూసమస్యపై దరఖాస్తు చేయాల్సి వచ్చినప్పుడు.. తెలిసో, తెలియకో ఒక మాడ్యూల్ బదులు మరో మాడ్యూల్లో దరఖాస్తు చేస్తే.. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా రిజెక్ట్ అవుతుంది. మేం 35 మాడ్యూల్స్కు బదులు సింగిల్ డిజిట్లో మాడ్యూల్స్తో కొత్త కాన్సెప్ట్ను తీసుకురాబోతున్నాం..’’ అని పొంగులేటి తెలిపారు. విదేశీ సంస్థ చేతుల్లో నుంచి భూరికార్డుల నిర్వహణను తప్పించి.. భారత ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి ఇచ్చామని చెప్పారు. 2024 రెవెన్యూ యాక్ట్ను ప్రజలకు అనుకూలంగా ఉండేలా తీసుకొచ్చామని.. అభద్రతతో ఉన్న లక్షల మంది రైతులు, భూములున్న ఆసాములకు భరోసాను కల్పించబోతున్నామని పేర్కొన్నారు. -
‘హాన్’ను ఎలా పునరుద్ధరించారు?
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుద్ధరణపై అధ్యయనానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని సియోల్ వెళ్లిన అధికారుల బృందం రెండో రోజైన మంగళవారం అక్కడ విస్తృతంగా పర్యటించింది. తొలుత హాన్ నదిని సందర్శించి నది పునరుద్ధరణ పనులను పరిశీలించింది. ఒక ప్పుడు మురికి కాలువలా ఉన్న నదికి జీవం పోసిన విధానాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం అక్కడి అధికారులను అడిగి తెలుసుకు న్నారు.సియోల్లో నీటి సరఫరా, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థకు ఈ నది ఎలా కీలకంగా మారిందో అక్కడి అధికారులు వారికి వివరించారు. అనంతరం మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాత వస్త్ర తయారీ సంస్థ యంగ్వన్ కార్పొరేషన్ చైర్మన్, సీఈవో ‘కీ హాక్ సంగ్’తో సమావేశమైంది. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో వస్త్ర తయారీ పరిశ్ర మలు ఏర్పాటు చేసేందుకు ఇటీవల ముందు కొచ్చిన ఆయన.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రులకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటైన ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీ, స్కిల్స్ యూనివర్సిటీ గురించి పొంగులేటి, పొన్నం ఆయనకు వివరించారు. ఆ తర్వాత సియోల్ లోని సియోనామ్ వాటర్ రిసోర్స్ రికవరీ ప్లాంట్ను అధికారుల బృందం సందర్శించింది. నీటి శుద్ధీక రణ ఎలా జరుగుతోందో పరిశీలించింది. సియోల్లోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వ్యర్థ జలాలను ఈ కేంద్రాలు శుభ్రపరుస్తాయి. రోజుకు 16.3 లక్షల లీటర్ల మురుగునీటితోపాటు 4 వేల కిలోలీటర్ల వ్యర్థాలను శుద్ధి చేస్తాయి. ఈ సామ ర్థ్య ం ప్రపంచంలోనే 9వ అతిపెద్ద ప్లాంటుగా గుర్తింపు పొందింది. ఇదే కేంద్రంలో హాన్ నది నీటి స్వచ్ఛతను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు.ప్రతిపక్షాలు సహకరించాలిమూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు అమలయ్యేందుకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సియోల్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధిలో మూసీని భాగం చేయాలని తమ ప్రభు త్వం భావిస్తోందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి కష్టం రానివ్వబోమని.. పునరావాసంతోపాటు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పొన్నం హామీ ఇచ్చారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి తలపెట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదరాబాద్ మరో సియోల్ నగరంగా రూపాంతరం చెందుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
‘చియోంగ్చియాన్’పై అధ్యయనం
(సియోల్ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి డోకూరి వెంకటేశ్వర్రెడ్డి): ‘మూసీ’ ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణ కొరియాలోని సియోల్లో నదులను అభివృద్ధి చేసిన తీరుపై రాష్ట్ర మంత్రులు, అధికారుల బృందం అధ్యయనం ప్రారంభించింది. అక్కడి హాన్, చియోంగ్చియాన్ నదుల పునరుజ్జీవం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టింది. హాన్, చియోంగ్చియాన్ నదుల పునరుజ్జీవం కోసం చేపట్టిన ప్రాజెక్టుల వివరాలు, పాటించిన పద్ధతులు, విధానాలను క్షుణ్ణంగా తెలుసుకుని.. అదే తరహాలో రాష్ట్రంలో మూసీ నదికి ప్రాణం పోయాలని భావిస్తోంది. ఈ మేరకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ల నేతృత్వంలోని రాష్ట్ర బృందం.. సోమవారం సియోల్లోని పలు ప్రాంతాల్లో పర్యటించింది. మంత్రులు తొలుత చియోంగ్చియాన్ నది వెంట కలియదిరుగుతూ.. పునరుద్ధరణ ప్రాజెక్టు వివరాలను అక్కడి అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం చెత్తను రీసైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ‘మాపో రిసోర్స్ రికవరీ ప్లాంట్’ను సందర్శించారు. ఐదు రోజుల దక్షిణకొరియా పర్యటనకు వెళ్లిన ఈ బృందంలో మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్తోపాటు ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, కాలె యాదయ్య, మల్రెడ్డి రంగారెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. రోజూ వెయ్యి టన్నులు రీసైక్లింగ్ మాపో రిసోర్స్ రికవరీ ప్లాంటులో రోజుకు వెయ్యి టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తున్నారు. ‘వేస్ట్ టు ఎనర్జీ’ సాంకేతికత వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని రాష్ట్ర బృందానికి సియోల్ నగరపాలక సంస్థ అధికారులు వివరించారు. పర్యవరణంపై ప్రభావం పడకుండా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని తెలిపారు. మరో పదేళ్లలో భూఉపరితలం నుంచి ఈ ప్లాంటును తొలగించి, భూగర్భంలో అతిపెద్ద ప్లాంట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. సియోల్ నగరానికి పశి్చమాన ఉన్న ఈ ప్లాంట్ను 2005లో ప్రారంభించారు. ఇందులో ఏటా 2 లక్షల టన్నుల వ్యర్థాలను వినియోగిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇలాంటి మరో నాలుగు ప్లాంట్లను కూడా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. మూసీ అభివృద్ధి కోసం.. సియోల్లో నదులకు పునరుజ్జీవం కల్పించినట్టే మూసీ నదిని కూడా ప్రక్షాళన చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. సియోల్లోని చియోంగ్చియాన్ నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. హన్ పరీవాహక ప్రాంతాలను రాష్ట్ర బృందంతో కలిసి పరిశీలించానని తెలిపారు. అక్కడ ఒకప్పుడు తీవ్ర కాలుష్యంతో జీవించలేని పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు నూతన కళను సంతరించుకుందని చెప్పారు. నది పరీవాహక ప్రాంతాలు టూరిస్టు హబ్గా మారాయని.. వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తున్నాయని తెలిపారు. మూసీ నిర్వాసితులకు అభివృద్ధి ఫలాలను అందిస్తామన్నారు. -
నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: రాబోయే నాలుగేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ కలెక్టరేట్లో గోషామహల్ నియోజవర్గానికి చెందిన లబ్ధి దారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. కులాలు, మతా లు, ప్రాంతాలు, పార్టీల వంటి తేడా లేకుండా అర్హులైన పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఎలాంటి భేష జాలకు పోకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావల సిన వాటాలు, నిధులు అడిగి తీసుకుంటామన్నా రు. గత ప్రభుత్వం పేదవాడి గురించి ఆలోచన చేయలేదని విమర్శించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ప్రతిపక్షాలు కాళ్లలో కట్టెలు పెడుతూ అడ్డుకోవాలని ప్రయత్నించినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆపేది లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయ లేనిది, తమ ప్రభుత్వం 10 నెలల్లో చేసి చూపిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఓర్వలేకపోతోంది..మూసీ పరీవాహక ప్రాంత వాసులకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం వారికి ఇండ్లు, ఉద్యోగం, ఉపాధి, కల్పిస్తుంటే బీ ఆర్ఎస్ ఓర్చుకోలేకపోతోందని మంత్రి పొంగులేని విమర్శించారు. ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్నట్లు గా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు తమ జీవిత కాల మంతా అదే మురికికుప్పలో బతకాలని బీఆర్ఎస్ కోరుకుంటోందా? అని మంత్రి ప్రశ్నించారు. హైద రాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా ఇబ్బంది పెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.మూసీ పునరుజ్జీవంపై అనేక అభాండాలు వేస్తున్నా రని, అక్కడున్న పేదవారిని అక్కడే వదిలేస్తారా అని ప్రశ్నించారు. మూసీ రివర్ఫ్రంట్ ఏర్పాటు చేసింది మీరు కాదా? అని నిలదీశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజా సింగ్, శ్రీ గణేశ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, రహమత్ బేగ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’ సేవల్లో తేడా కనపడాలి: పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. మీరు బాగా పనిచేస్తే ప్రజలకు మేలు జరగడమే కాదు.. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. సామాన్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. గతానికి, ప్రస్తుతానికి తేడా కనపడాలి’అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 272 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి ఆదివారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో ముఖా ముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా రాష్ట్ర ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల నుంచి విముక్తి కలిగించేలా దేశానికే రోల్మోడల్గా ఉండే కొత్త రెవెన్యూ చట్టాన్ని త్వరలో తీసుకొస్తామని తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొనేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు. వ్యవస్థలో ఒకరిద్దరి తప్పుల కారణంగా అందరికీ చెడ్డపేరు వస్తోందని, అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తగా పనిచేయాలని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు వేసే ప్రతి అడుగు రెవెన్యూ వ్యవస్థకు వన్నె తెచ్చేలా ఉండాలన్నారు. రెవెన్యూ సేవల్లో అంతరాయాన్ని నివారించేలా నల్లగొండ జిల్లా తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లా యాచారం మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టామని.. ఈ క్రమంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించే ప్రక్రియ తుదిదశకు చేరుకుందని వివరించారు. కొత్త చట్టం వచ్చేలోగానే ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. 3 నెలలకోసారి లీగల్ సమావేశాలు.. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రెవెన్యూ యంత్రాంగం రాజీపడవద్దని మంత్రి పొంగులేటి సూచించారు. భూముల పరిరక్షణ కోసం మూడు నెలలకోసారి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో లీగల్ టీంలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రెవెన్యూ మంత్రిగా ఎవరున్నా భూముల రికార్డులను టాంపరింగ్ చేసేందుకు వీల్లేకుండా రెవెన్యూ రికార్డుల డిజిటైజేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన చేపడతామని తెలిపారు. రెవెన్యూ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోయినా పట్టించుకోని గత ప్రభుత్వం.. అప్పు చేసి మరీ ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కొత్తది కట్టిందని విమర్శించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు ఉన్నా కొత్తవి నిర్మించిందని.. తానైతే అలాంటి పనులు చేయబోనని పొంగులేటి స్పష్టం చేశారు. అందరికీ శిక్షణ తప్పనిసరి.. రెవెన్యూ శాఖలో ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికి కూడా శిక్షణ తప్పనిసరి చేస్తామని.. ఇందుకోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల జాబ్ చార్ట్ నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి జాబ్ చార్ట్ రూపొందిస్తామన్నారు. ఆర్థికేతర అంశాలకు తక్షణమే పరిష్కారం రెవెన్యూ ఉద్యోగుల సమస్యల్లో ఆర్థికేతర అంశాలను తక్షణమే పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. 33 జిల్లాల్లో సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఏర్పాటు చేస్తామని, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల కేడర్ స్ట్రెంగ్త్ పెంచుతామని, 17 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను పూర్వ జిల్లాలకు పంపడంపై దసరాలోపే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, తెలంగాణ స్టేట్ సివిల్ సర్వీసెస్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కె. చంద్రమోహన్, ప్రధాన కార్యదర్శి డి. శ్రీనివాస్రెడ్డి, కోశాధికారి భాస్కరరావు, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వి. లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ, ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పేద, ధనిక తేడా లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ పేద, ధనిక అనే తేడా లేకుండా డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు అందిస్తామని రెవెన్యూ, గృహని ర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీని వాస్రెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికీ ఆరోగ్య ప్రొఫైల్ రూపొందించి యునిక్ నంబర్తో స్మార్ట్ కార్డ్ ఇవ్వడమే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉద్దేశమని చెప్పారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ప్రతి నియోజకవర్గం నుంచి రెండేసి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న కుటుంబాల వివరాల నమోదులో పొరపాట్లకు తావివ్వరాదని.. ఈ విష యంలో కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పలు వురు ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం సచి వాలయం నుంచి మంత్రి పొంగులేటి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫ్యా మిలీ డిజిటల్ కార్డులతోపాటు పట్టణాభివృద్ధి సంస్థలు, ఎల్ఆర్ఎస్, డబుల్ బెడ్రూం ఇళ్లు, ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలపై సమీక్షించారు.యుద్ధప్రాతిపదికన ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం..భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిష్కారం కోసం లక్షలాది మంది ప్రజలు నాలుగేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారని, అందువల్ల యుద్ధప్రాతి పది కన ఈ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్ట ర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఈ ప్రక్రియ ముందుకు సాగ ట్లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పట్టణా భివృద్ధి సంస్థల పరిధి పెంపుతోపాటు కొత్త యూడీఏల ఏర్పాటు ప్రతిపాదనలను తక్షణమే పంపాలన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు కోసం కమిటీలుగత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూం ఇళ్లను అరకొరగా నిర్మించారని మంత్రి పొంగులేటి విమర్శించారు. అయితే ఇప్పటికే పూర్తయిన ఇళ్ల కేటాయింపు కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి దసరాలోగా అప్పగించాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, జిల్లా కలెక్టర్ కన్వీనర్గా కొందరు సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసినందున ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రాధాన్యత ఇచ్చి మరమ్మతులు చేపట్టాలన్నారు.సన్న, దొడ్డు ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలుఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 35 సన్న రకాల ధాన్యానికి క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. ఈసారి ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 7,144 కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. సన్న, దొడ్డు రకాల ధాన్యానికి వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేయాల ని ఆదేశించారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం వస్తుందన్న అంచనాతో ఏర్పాట్లు చేయా లని.. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు సమస్యలు తలెత్తకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. -
మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు, వ్యాపార సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలు సోదా లు జరిపాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారుల ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం 5:30 గంటల నుంచి జూబ్లీహిల్స్లోని మంత్రి పొంగులేటి ఇంటితో పాటు కుటుంబసభ్యులు, బంధువుల ఇళ్లు, పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయాల్లోనూ సోదాలు కొనసాగాయి. ఏకకాలంలో మొత్తం 15 ఈడీ అధికారుల బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.విదేశాల నుంచి ఖరీదైన వాచీల కొనుగోలుకు సంబంధించిన ఆరోపణలపై ఈ ఏడాది మార్చి 28న చెన్నై కస్టమ్స్ అధికారులు హర్షరెడ్డికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్, డీఆర్ఐ కేసుల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు, కేంద్ర బలగాల రక్షణలో సోదాలు కొనసాగాయి. పొంగులేటి కుమారుడు హర్షరెడ్డికి సంబంధించిన రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. రాఘవ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సహా పొంగులేటి కుటుంబ సభ్యులకు చెందిన సంస్థల ఆర్ధికలావాదేవీలపైన ఆరా తీసినట్టు సమాచారం. కేసు వివరాలివీ..: హాంగ్కాంగ్లో నివాసముండే మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ ఈ ఏడాది ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చాడు. అతని వద్ద కస్టమ్స్ అధికారులు విదేశాలకు చెందిన రెండు లగ్జరీ వాచ్లు స్వాధీనం చేసుకున్నారు. మహ్మద్ ఫహెర్దీన్ ముబీన్ను కస్టమ్స్ అధికారులు విచారించగా, మధ్యవర్తి నవీన్కుమార్ పేరు వెల్లడించాడు. ఈ క్రమంలో నవీన్కుమార్ ద్వారా పొంగులేటి కుమారుడు హర్షరెడ్డి ముబీన్ నుంచి దాదాపు రూ.7 కోట్లు విలువ చేసే ఏడు లగ్జరీ వాచ్లను కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై సమాధానం ఇవ్వాలని కస్టమ్స్ అధికారులు గతంలో నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. దీంతోమనీలాండరింగ్ కోణంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులను ఖండించిన మంత్రి సీతక్క ఈడీ దాడులను మంత్రి సీతక్క ఖండించారు. ‘ప్రతిపక్ష ప్రభుత్వాలున్న చోట బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తోంది. ఈడీ, సీబీఐలను పచ్చిగా దురి్వనియోగం చేస్తోంది. తమకు అనుకూలంగా రాజ్యాంగ విరుద్ధంగా దర్యాప్తు సంస్థలను వాడుకుంటోంది’ అని సీతక్క ఒక ప్రకటనలో మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులకు సోదాలకు కారణం బీజేపీ కుట్రలేనని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. -
పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు
-
మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన 16 బృందాలు.. ఏకకాలంలో 16 చోట్ల తనిఖీలు చేపట్టాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొంగులేటి నివాసం, ఆయన వ్యాపార సంస్థల కార్యాలయాల్లో ఈడీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. ఆయన అనుచరులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసుల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి. కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో నేపథ్యంతోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రైడ్స్కు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. -
అమృత్ టెండర్లలో అక్రమాలపై కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అమృత్ టెండర్లలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ దగ్గరికైనా వెళ్దామని అన్నారు. అమృత్ టెండర్లలో తప్పు జరిగిందని తేలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొంగులేటి సవాల్ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ‘ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరదాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పు జరగలేదని అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్ చేస్తే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) దగ్గరికి పోదాం. ఒకవేళ మీరు రాకపోయినా వచ్చే వారంలో సీవీసీకి ఆధారాలు సమర్పిస్తా. సీఎం రేవంత్రెడ్డికి, మంత్రికి ఒకటే చెప్తున్నా.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలి..’ అని కేటీఆర్ అన్నారు. సోదరుడు, బావమరిది ఆ స్థాయికి ఎలా ఎదిగారో సీఎం చెప్పాలి ‘సీఎంను పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరికాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. సొంత బావమరిది కంపెనీకి లాభం చేకూరిస్తే బంధువని అనడమేంటి?. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి. ఢిల్లీకి కప్పం కట్టేందుకే అవినీతి కేవలం రూ.2 కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే సీఎం సోదరుడు జగదీశ్రెడ్డి రూ.వెయ్యి కోట్లుం, బావమరిది సూదిని సృజన్రెడ్డి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారనే విషయాన్ని రేవంత్రెడ్డి చెప్పాలి. పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎట్టిపోతల కాంట్రాక్టుల గురించి త్వరలో మాట్లాడతా. ప్రజల తరఫున మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వం ఈ భారీ అవినీతికి తెగబడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన అంశంలో కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ మొదలు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు..’అని కేటీఆర్ విమర్శించారు. సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నారు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.. ‘దసరా బోనస్ కాదు బోగస్’అని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు పంచుతున్నట్లు గొప్పలు చెప్పుకుని కేవలం 16.9% మాత్రమే ఇచ్చారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది., పండుగ వేళ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ప్రతి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం జరుగుతుంది. సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లు. ఇందులో కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,551 కోట్లు పంచాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.7 లక్షల చొప్పున అందాలి. కానీ కేవలం రూ.796 కోట్లను మాత్రమే కార్మికులకు పంచుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సింగరేణి లాభాల్లో వాటాపై కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఒక్కో కార్మికుడికి అత్యధికంగా 32 శాతం వాటా ఇచ్చామని చెప్పారు. -
కేటీఆర్కు మంత్రి పొంగులేటి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సవాల్ విసిరారు.కేటీఆర్ చెప్పినట్లు అమృత్ స్కీమ్ కింద టెండర్లు అయినట్లు నిరూపిస్తే తాను మంత్రిగా రాజీనామా చేస్తానని ఛాలెంజ్ చేశారు.సీఎం రేవంత్రెడ్డిపై కేటీఆర్ చేసిన ఆరోపణలను నిరూపించాలన్నారు. ఈ విషయమై శనివారం(సెప్టెంబర్21) పొంగులేటి మీడియాతో మాట్లాడారు.ఆరోపణలను నిరూపించకపోతే కేటీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.రూ.3వేల6వందల కోట్లు కాస్తా రూ.8888 కోట్లు ఎలా అయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అమృత్ టెండర్లను గత ప్రభుత్వమే వాళ్లు దిగిపోయే సమయంలో 3 ప్యాకేజీల కింద ఇచ్చారని చెప్పారు.ఇదీ చదవండి.. సీఎం రేవంత్ ప్రమేయంతోనే అమృత్ టెండర్లలో అవినీతి: కేటీఆర్ -
కొత్త రేషన్కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.సోమవారం(సెప్టెంబర్16) జలసౌధలో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు.‘పదేళ్లలో నామమాత్రంగా రేషన్ కార్డులిచ్చారు. ఖరీఫ్ నుంచిన వడ్లకు క్విటాలుకు 500 అదనంగా ఇవ్వబోతున్నాం జనవరి నుంచిన్ కార్డు దారులకు సన్న బియ్యం ఇస్తాం. పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో 49476 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. అవి కూడా బై ఎలక్షన్ ఉన్న నియోజక వర్గాల్లో మాత్రమే ఇచ్చారు. పద్ధతి ప్రకారం ఎక్కడా ఇవ్వలేదు. మా ప్రభుత్వ హయాంలో అర్హులైన అందరికి రేషన్కార్డులిస్తాం’అని తెలిపారు. ఇదీ చదవండి.. నిమజ్జనానికి అంతా రెడీ.. జీహెచ్ఎంసీ మేయర్ -
వరద బాధితులను ఆదుకుంటాం
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి: గతనెల 31 నుంచి ఈనెల 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో రూ. 10,300 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా లోని కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో శనివారం మంత్రి పర్యటించారు. పాలేరు ఎడమ కాల్వ గండి మరమ్మతులను త్వరగా పూర్తిచేసి రైతులకు సాగునీరు అందించాల ని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, గంటల వ్యవధిలో 37 నుంచి 38 సెం.మీ. మేర వర్షం కురవడంతో అన్ని విభాగాల్లో నష్టం ఎదురైందని చెప్పారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా, సీఎం వినతితో కేంద్ర బృందాలు పర్యటించాయని తెలిపారు.కేంద్ర ప్రభుత్వానికి వరద సాయం కోసం విన్నవించడమే కాక ప్రజలను ఆదుకునే దిశగా రాష్ట్రప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి సాయం అందినా, అందకున్నా వరద బాధితులను ఆదుకుంటామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం త్వరలో అందిస్తామని, పూర్తిగా ఇళ్లు నష్టపోయిన ప్రజలకు నెలాఖరులోగా ఇందిరమ్మ పథకం ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఎనిమిది పోలీసు బెటాలియన్ల నుంచి 100 మంది సిబ్బందిని ఎంపిక చేసి వరద సహాయక చర్యలపై శిక్షణ ఇప్పించి కావాల్సిన పరికరాలు సమకూరుస్తామని తెలిపారు. వచ్చేవారం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులను సీఎం రేవంత్రెడ్డి నేతృత్వాన కలిసి విపత్తు సాయం కోసం ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడించారు. -
వరద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ. 16,500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు ఇటీవలి వర్షాలకు ప్రభావితం అయ్యాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలకు సాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల ప్రభావంపై సోమవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్లతోపాటు మున్సిపల్, వ్యవసాయం, పంచాయతీరాజ్, విద్యుత్, విద్య, రహదారులు, భవనాలు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఇందులో పాల్గొన్నారు. సమీక్షలో వరద నష్టాన్ని అంచనా వేయడంతోపాటు దాన్ని పూడ్చుకునేందుకు ఎన్ని నిధులు కావాలన్న దానిపై చర్చించారు. వరదలు, నష్టంపై కేంద్రానికి పంపాల్సిన నివేదికలో పొందుపర్చాల్సిన అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులకు పలు సూచనలు చేశారు. వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని ఆదేశించారు. బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. మానవతా దృక్పథంతో సాయం పెంపు సమీక్షలో అధికారులు మాట్లాడుతూ.. వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో ఆరుగురు, కొత్తగూడెంలో ఐదుగురు, ములుగులో నలుగురు, కామారెడ్డి, వనపర్తిలలో ముగ్గురి చొప్పున చనిపోయారని మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయంతోపాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో పూర్తిగా, పాక్షికంగా కూలిపోయిన ఇళ్లను గుర్తించి.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. వరదలతో ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.16,500 చొప్పున సాయం అందించాలని.. ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నేరుగా బాధితుల ఖాతాల్లోనే జమ చేయాలని ఆదేశించారు. తొలుత రూ.10 వేల ఆర్థిక సాయం అనుకున్నప్పటికీ.. మానవతా దృక్పథంతో దాన్ని రూ.16,500కు పెంచామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరద ముంపునకు గురైన పంట భూములకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇక మైనింగ్ వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో వేయడం వల్ల వరద వెళ్లక సూర్యాపేట, పాలేరులకు భారీగా నష్టం జరిగిందని అధికారులు సమీక్షలో మంత్రికి వివరించారు. దీంతో ఆ నష్టాన్ని మైనింగ్ ఏజెన్సీల నుంచే వసూలు చేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సూచించారు. శాశ్వత మరమ్మతులు చేపట్టండి సమీక్షలో భాగంగా అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయని, దాదాపు 2 లక్షల మంది ప్రభావితమయ్యారని వివరించారు. 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 13,494 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. వర్షాలు, వరదలతో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లు వేల కిలోమీటర్ల పొడవునా దెబ్బతిన్నాయని అధికారులు వివరించగా.. వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రోడ్లను పునరుద్ధరించాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. శాశ్వత మరమ్మతులకు అవసరమైన కార్యాచరణను రెండు రోజుల్లో తయారు చేయాలని సూచించారు. పెద్ద, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా చేపట్టాలన్నారు. అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీలు ఏ మేరకు దెబ్బతిన్నాయనే వివరాలను సేకరించాలని సూచించారు. ఇక వర్షాలు, వరదల కారణంగా ఇండ్లలోకి నీరు చేరి.. ఇంటి పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్, రేషన్కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచిపోయాయని, కొన్నిచోట్ల కొట్టుకుపోయాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి... డాక్యుమెంట్లు పోయిన బాధితులు స్థానిక పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని, వీలైనంత త్వరగా వారికి డూప్లికేట్ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
TG: వరద బాధితులకు ప్రభుత్వ సాయం.. డబ్బు, ఇల్లు ఇంకా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముంపు ప్రాంతాల వరద బాధితులకు నష్టపరిహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వరదల్లో నష్టపోయిన ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్టు తాజాగా ప్రకటించింది. అలాగే, తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తామని రైతులకు రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది.కాగా.. భారీ వర్షాలు, వరదలపై సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ‘చివరి బాధితుడి వరకు సహాయం అందిస్తాం. భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగింది. కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ప్రతీ కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం అందజేస్తాం. మృతుల కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు రూ.5 లక్షల సహాయం చేస్తాం. వరద ముప్పునకు గురైన ప్రతీ ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం ఇస్తాం. వరదల కారణంగా తడిచిన ప్రతీ గింజను కొనుగోలు చేస్తాం. యుద్ధ ప్రతిపాదికన తాత్కాలికంగా రహదారుల మరమత్తులు చేపడతాం. డాక్యుమెంట్స్ కొట్టుకుపోయాయని ఆందోళన చెందకండి. ప్రతీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. -
త్వరలోనే కొత్త ఆర్వోఆర్
సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టం ముసాయిదాపై ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. ఈ అభిప్రాయ సేకరణలో మేధావులు, రిటైర్డ్ రెవె న్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రైతుల నుంచి సామా న్యుల వరకు అందరూ తమ సల హాలు, సూచనలను ప్రభు త్వానికి ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అందుబా టులోకి తెస్తామని, ఇందుకు అవసరమైన కసరత్తును త్వరి తగతిన పూర్తి చేస్తామని శనివారం ఒక ప్రకటనలో ఆయన వివరించారు. రాష్ట్రంలో భూమి సమస్యలకు శాశ్వత పరి ష్కారమే లక్ష్యంగా, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు. ’’తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూ సమస్యలు పరిష్కారమవుతాయని అనుకుంటే గత పాలకుల తొందరపాటు నిర్ణయాలతో కొత్త సమస్యలు ఉత్పన్న మయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్వోఆర్ చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు, భూముల యజమానులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తప్పుల తడకగా సేకరించిన వివరాలతో నిర్వహించిన ధరణి పోర్టల్కు 30 లక్షల మంది రైతులు బాధితులుగా మారారు. అటువంటి పరిస్థితులను పునరావృతం కానివ్వం. తాము రూపొందించిన ఆర్వోఆర్ ముసాయిదా చట్టంపై విస్తృత స్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపాం. జిల్లా స్థాయిలో వర్క్షాప్లు నిర్వహించాం. ఆ వర్క్షాప్లలో వచ్చిన సూచనలను కలెక్టర్లు నివేదిక రూపంలో పంపుతారు. ప్రజల నుంచి ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా, ఈమెయిల్ రూపంలో వచ్చిన సూచనలను కూడా వాటితో క్రోడీకరిస్తాం. అమలు చేసే అధికారులకు అవగాహన ఉండేలా, రైతులకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహిత చట్టాన్ని తీసుకురాబోతున్నాం. గత ప్రభుత్వ హయాంలో అత్యంత రహస్యంగా ఉంచిన ధరణి పోర్టల్ను మా ప్రభుత్వం ఒక పబ్లిక్ డాక్యుమెంట్గా ప్రజలందరికీ అందుబాటులో ఉంచబోతోంది.’ అని ఆ ప్రకటనలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. -
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతికి తావివ్వొద్దని, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజల నుంచి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లకుండా పనిచేయాలని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే బకాయిల విడుదల ఇటీవల బదిలీలు జరిగిన విషయం గుర్తుచేస్తూ.. సబ్ రిజిస్ట్రార్ల నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులందరూ వీలైనంత త్వరగా కొత్త స్థానాల్లో సర్దుబాటు కావాలని పొంగులేటి చెప్పారు. బాగా పని చేసిన వారికి పదోన్నతులు కల్పిస్తామని, బదిలీల్లో ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఉద్యోగులు నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. వచ్చే ఐదేళ్లలోగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నామని, దశల వారీగా నిర్మాణాలు చేపట్టి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ప్రస్తుతమున్న భవనాలకు అద్దెలు, విద్యుత్, వాటర్ చార్జీలు, వాహనాల అద్దె లాంటి బకాయిలను త్వరలోనే విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయండి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ల విషయంలో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. భూముల విలువల సవరణ ప్రక్రియ విషయంలో థర్డ్ పార్టీ నివేదిక వచ్చిన తర్వాత త్వరలోనే మరోసారి సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఐజీ బుద్ధ ప్రకాశ్జ్యోతి శాఖ పనితీరు గురించి మంత్రికి వివరించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వార్షిక నివేదికను మంత్రి పొంగులేటి విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త టేపుతో నా ఇంటికి రండి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు నా ఇల్లు హిమాయత్సాగర్ బఫర్ జోన్లో లేదు. నా మీద బురద జల్లాలని, నన్ను బూచిగా చూపి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి వద్దకు ఎంత మందైనా, ఎప్పుడైనా వెళ్లవచ్చు.. కొలుచుకోవచ్చు. బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నా కూల్చుకోవచ్చు. దిస్ ఈజ్ మై చాలెంజ్. పొంగులేటి చాలెంజ్. ప్రధాన ప్రతిపక్షానికి సవాల్ చేస్తున్నా.. కొలిచిన తర్వాత మీ తల ఎక్కడ పెట్టుకుంటారో మీరే నిర్ణయించుకోండి..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం గాం«దీభవన్లో ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డిలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. బురద జల్లే ప్రయత్నమే.. ‘అవాకులు, చెవాకులు, అసందర్భ వాదనలతో పాటు మాజీ మంత్రులకు సంబంధించిన వ్యవస్థలు నామీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయి. నేను ఒకటే చాలెంజ్ విసురుతున్నా. మున్సిపల్, ఇరిగేషన్ శాఖలకు చెందిన మాజీ మంత్రులు, వారికి డబ్బాలు కొట్టే సంస్థలు, వ్యవస్థలు, కొత్త టేపు కొనుక్కుని వెళ్లండి. నేను కూడా రాను. మా అధికారులొస్తారు. డేట్ ఎప్పుడో చెప్పండి. ఎన్ని ప్రొక్లెయినర్లు కావాలంటే అన్ని పెట్టుకుని అధికారులు రెడీగా ఉంటారు నా ఇల్లు ఎఫ్టీఎల్లో ఉన్నా, బఫర్జోన్లో ఉన్నా, ఒక్క ఇటుక పెళ్ల ఉన్నా వెంటనే పడగొట్టండి. నా ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే ఇల్లు మొత్తం పడగొట్టండి. ఈ వేదిక మీద నుంచి హైడ్రా అధికారి రంగనాథ్ను కూడా ఆదేశిస్తున్నా..’ అని మంత్రి అన్నారు. మళ్లీ చెబుతున్నా..మీకా చాన్స్ ఇవ్వను ‘బీఆర్ఎస్ నేతల్లాగా నేను ఒకటికి వంద అబద్ధాలు చెప్పను. వాస్తవానికి నేనుండే ఇల్లు నా పేరు మీద లేదు. నా కొడుకు పేరు మీద ఉంది. అయినా ఆ ఇల్లు నాది కాదని చెప్పను. లీజుకు తీసుకున్నానని మీలాగా సొల్లు కబుర్లు చెప్పను. నేను అందరు అన్నట్టు దాంట్లో దూకు.. దీంట్లో దూకు అనను. ఇది పొంగులేటి చాలెంజ్. గతంలో ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల గురించి చెప్పా. మళ్లీ ఈరోజు చెపుతున్నా. ఈ రోజు కాదు.. ఏ రోజైనా, నీతో, నీ బావతో, ఆయన మామతో చెప్పించుకునే చాన్స్ ఈ పొంగులేటి ఎప్పుడూ ఇవ్వడు. ఇవ్వబోడు. ప్రతిపక్షానికి దమ్ముంటే నా సవాల్ను స్వీకరించాలి.’ అని పొంగులేటి అన్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం ‘గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు సీట్లు రాలేదనే అక్కసుతో రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నాం. ఇంకా రూ.12,300 కోట్ల మాఫీ చేయాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతల్లా మేము శనగలు తిని చేతులు దులుపుకునే రకం కాదు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తాం. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు కటాఫ్ తేదీ పెట్టి ఆ తేదీలోపు ఎక్కువగా ఉన్న డబ్బులు కడితే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తాం..’ అని మంత్రి తెలిపారు.2020 ఆర్వోఆర్ చట్టాన్ని మార్చి రైతులకు ఇబ్బంది లేకుండా వీలున్నంత త్వరలో కొత్త చట్టాన్ని తెస్తామన్నారు. ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి వచి్చన సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. అప్పుడెప్పుడో వచ్చి చీలి్చచెండాడతానని చెప్పిన కేసీఆర్ మళ్లీ 6–9 నెలలు కనపడడంటూ ఎద్దేవా చేశారు. మహిళా జర్నలిస్టులపై తమకు గౌరవం ఉందని, వారిపై దాడి జరిగి ఉంటే బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పొంగులేటి చెప్పారు. -
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి Vs కేటీఆర్
-
ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణమాఫీ అమలు చేశాం..
-
కాంగ్రెస్ను విమర్శించే అర్హత బీఆర్ఎస్కు లేదు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: లక్ష రుణమాఫీ చేసేందుకు బీఆర్ఎస్కు ఐదేళ్లు పట్టిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి. ఐదేళ్లైనా లక్ష రుణమాఫీ చేయని బీఆర్ఎస్కు కాంగ్రెస్ను విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు రుణమాఫీ చేశామని తెలిపారు.ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ ధనిక రాష్ట్రం అని అన్నారు కానీ.. ఖజానా మొత్తం ఖాళీగా ఉందని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో అప్పు చూసి షాక్ అయ్యామని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గించి రైతును రాజును చేసే పనిలో పడ్డామని చెప్పారు తమది రైతు ప్రభుత్వమని పేర్కొన్నారు. రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న మాజీ మంత్రుల మాటలను ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు.‘ఎన్ని ఇబ్బందులున్నా రుణమాఫీ చేశాం. మిగతా ఖర్చులు తగ్గించుకుని రైతులకు మేలుచేశాం. రూ. 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు పైన ఉన్న మొత్తంచెల్లిస్తే రుణమాఫీ అవుతుంది. బీఆర్ఎస్లా మేం రూ. వేల కోట్లు దోచుకోలేదు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని ముందే చెప్పాంకేటీఆర్ ఆరోపణలకు కౌంటర్రేవంత్పైకేసు పెట్టినప్పుడు ఎఫ్ఐఆర్లో కేటీఆర్ ఇల్లు అని పెట్టారు. ఇప్పుడా ఇల్లు నాది కాదు అని కేటీఆర్ అంటున్నారు. నాపై అవాకులు చెవాకులు పేలుతున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే బఫర్ జోన్లో పాంహౌజ్ కట్టుకున్నారు. మీలాగా మీరు ఉండే ఇల్లు నాది కాదు అని చెప్పనునా ఇళ్ళు బఫర్ జోన్లో ఉన్నా.. ఎఫ్టీఎల్లో ఉన్నా మొత్తం పడగొట్టండి. కేటీఆర్ చౌకబారు విమర్శలు మానుకోండి.. కేటీఆర్ విమర్శలకు కట్టుబడి ఉండాలి. కొత్త టేప్ తెచ్చుకుని కొలవండి. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కూల్చాలని హైడ్రా అధికారులను ఆదేశిస్తున్నా’ అని తెలిపారు. -
అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్/ ఖమ్మం సహకారనగర్: రాష్ట్రంలో విస్తతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మరో ఐదురోజులు ఈ వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదు ర్కొనేందుకు జిల్లా యంత్రాంగాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం ఆయన భారీ వర్షాలు, నూతన ఆర్వోఆర్ ముసాయిదా చట్టం, ఎల్ఆర్ఎస్, ధరణి దరఖాస్తుల పరి ష్కారంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ఖమ్మం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లో వర్ష పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జీహెచ్ఎంసీ, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రానున్న ఐదు రోజుల వర్షాలను దృష్టిలో ఉంచుకొని స్థానిక పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అధికారం కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. ప్రతి కలెక్టరేట్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సామాన్యుల నుంచి మేధావుల వరకురాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని భావిస్తోన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2024 చట్టంపై విస్తృతస్థాయిలో ప్రజాభి ప్రాయ సేకరణ చేపట్టాలని మంత్రి పొంగులేటి కలెక్టర్లకు సూచించారు. అందులో భాగంగా ఈనెల 23, 24 తేదీల్లో ఆర్వోఆర్ ముసాయిదా చట్టంపై జిల్లాస్థాయి వర్క్షాప్లు నిర్వహించాలన్నారు. సామాన్యుల నుంచి మేధావుల వరకు అందరికీ అర్థమయ్యేలా చట్టం రూపొందించే క్రమంలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.పది రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించండిధరణి పోర్టల్ కింద పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను పది రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా తిరస్కరించిన దరఖాస్తులకు సరైన కారణాలను తెలియజేయాల్సిందేనని స్పష్టం చేశారు. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ధరణి దరఖాస్తులు ఎక్కువగా పెండింగ్లో ఉన్నా యని, ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ను ఆదేశించారు. క్షేత్రస్థాయి తనిఖీల కోసం స్పెషల్ టీమ్లతోపాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసుకోవాలని, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను పర్యవేక్షణ అధికారిగా నియమించాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. -
సీఎం కుర్చీపై పొంగులేటి కన్ను: బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కర్ణాటకలో డీకేశివకుమార్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలంగాణలో కీలక పాత్ర పోషిస్తున్నాడని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. ‘పొంగులేటి ఇక్కడ డీకే శివకుమార్ పాత్ర పోషిస్తున్నాడు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకేదో పదవి ఆశిస్తున్నాడనిపిస్తోంది.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కన్ను సీఎం పదవిపై పడింది. సీఎంను కాదని కొడంగల్ అబివృద్ధి కాంట్రాక్టు పొంగులేటికి వచ్చింది. భట్టి ఉపముఖ్యమంత్రిగా సెకండ్ ప్లేస్లో లేరు. అమెరికా పర్యటనలో రేవంత్ తీసుకొచ్చిన వేల కోట్లు ఎప్పుడు వస్తాయి? ఎంత మందికి ఉద్యోగాలు వస్తాయి? సీఎం కుటుంబ సభ్యుల్లో ఎవరెంత పెట్టుబడి పెడుతున్నారు. వీటన్నింటిపై స్పష్టత ఇవ్వాలి. మంత్రిగా ఉన్న వ్యక్తి కంపెనీకి ప్రభుత్వ కాంట్రాక్టు రావడం చరిత్రలో లేదు. ఎస్కేలేషన్, ప్రైస్ హైక్ మీద మాకు అనుమానం ఉంది. తన వెంట కొంత మంది ఎంఎల్ఏలు ఉన్నారని భయపడి పొంగులేటి కి కాంట్రాక్టు ఇచ్చారా? సీఎం సమాధానం చెప్పాలి. కొంత మంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని పొంగులేటి సీఎంను బ్లాక్మెయిల్ చేస్తున్నారు’అని మహేశ్వర్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. -
ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిన 45 రోజుల్లోగా కొత్త రెవెన్యూ చట్టం
త్వరలో జీవో 59 దరఖాస్తుల పరిష్కారంజీవో 59 కింద అక్రమంగా భూములను క్రమ బద్ధీకరించుకున్నారు. నానక్రాంగూడలో రూ.3 వేల కోట్ల ఖరీదైన 32 ఎకరాలను రెగ్యులరైజ్ చేసుకున్నారు. మేం రాగానే వాటిని వెనక్కు తీసుకున్నాం. అర్హులకు న్యాయం జరిగేలా త్వరలో జీవో 59 దరఖాస్తులను పరిష్కరిస్తాం.సాక్షి, హైదరాబాద్: రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)–2020 స్థానంలో త్వరలో కొత్త చట్టాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. వీలైతే అసెంబ్లీలో పెట్టి లేదంటే ఆర్డినెన్స్ రూపంలో తీసుకురానున్నట్టు స్పష్టం చేశారు. ఇప్పటికే రూపొందించిన ముసా యిదా చట్టంపై ప్రజల నుంచి సలహాలు, సూచ నలు వస్తున్నాయన్నారు. సూచనలు తీసుకునే గడువును ఈనెల 23నుంచి మరో వారం పొడిగి స్తామని చెప్పారు. గడువు ముగిసిన 45 రోజుల్లో గా కొత్త చట్టం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కొత్త ఆర్వోఆర్ చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్న నేపథ్యంలో పలు రెవె న్యూ సంబంధిత అంశాలపై ఆయన శనివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్త చట్టం, ధరణి పోర్టల్లో తెస్తున్న మార్పులు, సాదా బైనామాలు, అసైన్డ్ భూములకు హక్కుల కల్పన, భూముల విలువల సవరణ, జీవో 59 దరఖా స్తులు వంటి అంశాలపై పొంగులేటి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..ధరణితో ప్రజలు కుదేలు: గత ప్రభుత్వం భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పి రాష్ట్రంలోని 1.50 కోట్ల ఎకరాల భూమి డేటాను విదేశీ కంపెనీకి అప్పగించినందుకే మేం ధరణి పోర్టల్ను తప్పుపడుతున్నాం. ఇది రైతుల మెడలో పెద్ద గుదిబండ. ఈ పోర్టల్ కారణంగా ప్రజలు కుదేలయ్యారు.. తీవ్ర నష్టం జరిగింది. ఇద్దరు వ్యక్తులు నాలుగు గోడల మధ్య కూర్చుని తెచ్చిన చట్టం ఇది. ప్రజలు తమ భూమి తమకు రావాలని దేవుళ్లకు దండం పెట్టారో లేదో తెలియదు కానీ, దొరకు, కలెక్టర్లకు మాత్రం పొర్లు దండాలు పెట్టాల్సి వచ్చింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ధరణి హరించింది. తినీతినక కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని అమ్ముకునే హక్కును కాలరాసింది. పుట్టలో పాముల్లా అక్రమాలుమేం అధికారంలోకి వచ్చాక పరిశీలిస్తే పుట్టలో పాముల్లాగా ధరణిలో వందలాది అక్రమాలు బయటకు వస్తున్నాయి. రెండు నిమిషాల్లో రిజిస్ట్రేషన్, మూడు నిమిషాల్లో మ్యుటేషన్ అని చెప్పి భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు ఆస్కారం కల్పించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు నిషేధిత జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్లు చేసుకుని తాళాలు వేసుకున్నారు. వాళ్లేం చేశారో కలెక్టర్లకు కూడా తెలియదు. హెడ్ ఆఫీస్, విదేశీ కంపెనీకి మాత్రమే తెలుసు. మేం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అన్ని వివరాలు ప్రజా బాహుళ్యంలో పెట్టించాం లొసుగులు సవరించేందుకే చట్టం ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్నామంటే.. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడం కాదు. ఆత్రుతగా తప్పులు చేయడం కాదు. పేరు మార్చడం వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. మన నిర్ణయాలతో తరతరాలు ముందుకెళ్లాలి. అందుకే భేషజాలకు పోకుండా ధరణి పోర్టల్ను మాత్రమే కాదు. చట్టంలోని లొసుగులను సవరించాలనే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే కొత్త చట్టం తెస్తున్నాం. ఆర్వోఆర్ చట్టం–2020 కారణంగానే సమస్యలన్నీ వచ్చాయి.80–85 వేల దరఖాస్తులే పెండింగ్లో..మేం అధికారంలోకి వచ్చాక ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించాం. అప్పటికే 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ప్రతిరోజూ 3–5 వేల కొత్త దరఖాస్తులు వస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్ పెట్టి 1.28 లక్షల దరఖాస్తులు పరిష్కరించాం. అంతేకాదు రోజూ పరిష్కరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు పోర్టల్లో 80–85 వేల దరఖాస్తులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. రైతుల దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు గల కారణాలను కూడా నమోదు చేయిస్తున్నాం. అభిప్రాయ సేకరణకు జిల్లా స్థాయిలో సదస్సులుకొత్త చట్టం ముసాయిదాపై చెట్టుకింద కూర్చునే సామాన్య రైతు నుంచి దొర వారు ఇచ్చే సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. జిల్లా స్థాయిలో సదస్సులు నిర్వహించి అభిప్రాయ సేకరణ జరుపుతాం. దేశంలోనే రోల్మోడల్ చట్టంగా రూపొందిస్తాం. దీని ద్వారా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందుతాయి. పోర్టల్లోని దరఖాస్తు పద్ధతిని మార్చేస్తాం. ఇప్పటివరకు ఉన్న 33 మాడ్యూళ్ల స్థానంలో ఒకటే మాడ్యూల్ తెస్తాం. రైతుల ఏ సమస్యపై అయినా ఈ మాడ్యూల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పాత పహాణీలో 35 కాలమ్లు ఉండేవి. 100 ఏళ్ల చరిత్ర ఉండేది. ఇప్పుడు ఒక్కటే కాలమ్ ఉంది. దీని స్థానంలో 14–16 కాలమ్లతో కొత్త పహాణీ అందుబాటులోకి తెస్తాం. సీసీఎల్ఏ స్థాయిలో కూడా ధరణి దరఖాస్తుల పరిష్కారానికి కటాఫ్ డేట్ నిర్ణయిస్తున్నాం. సీసీఎల్ఏకు వచ్చిన దరఖాస్తులు వారం రోజుల్లోగా పరిష్కారం కావాలని ఆదేశిస్తా. ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా?దొరగారు చెపితే వినలేదని 23 వేల మందిని అర్ధరాత్రి వేరే శాఖకు బదిలీ చేశారు. వీఆర్వో, వీఆర్ఏల వ్యవస్థను లేకుండా చేయడం ద్వారా గ్రామ స్థాయిలో రెవెన్యూకు సాక్ష్యాలు లేకుండా చేశారు. మేం రాష్ట్రంలోని 10,945 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు కాపలాదారులను నియమించాలన్న కృతనిశ్చయంతో ఉన్నాం. ఇంట్లోకి ఎలుక వచ్చిందని ఇంటిని తగులబెట్టుకోలేం కదా? పేదోళ్ల భూములు వారికే పంచుతాంపేదలకు ఇందిరమ్మ పంచిన భూములు లాగేసుకున్నారు. అలాంటి భూములు గుర్తించాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటినీ తిరిగి పేదలకు పంచుతాం. పేదోడి భూమి ధనికుల చేతికి వెళ్లనివ్వం. ఆ కోణంలోనే అసైన్డ్ భూములపై అమ్మకపు హక్కు కల్పిస్తాం. కొత్త చట్టం ఏర్పాటు కాగానే మళ్లీ సాదాబైనామాల దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న 9 లక్షల దరఖాస్తులకు తోడు కొత్తగా వచ్చే వాటిని ఏకకాలంలో శాశ్వతంగా పరిష్కరిస్తాం. గత ప్రభుత్వం భూముల విలువల సవరణలో శాస్త్రీయత పాటించలేదు. మేం అధికారులు, థర్డ్ పార్టీ నుంచి వివరాలు సేకరించాం. రెండింటినీ క్రోడీకరించి త్వరలోనే న్ణియం తీసుకుంటాం. పార్టీ ఆస్తులు ఏం చేయాలా అని దొర ఆలోచిస్తున్నాడు‘బీజేపీలో బీఆర్ఎస్ విలీనం 100 శాతం ఖాయం. అయితే బీఆర్ఎస్ పేరిట ఉన్న ఆస్తులు, డబ్బులు ఏం చేయాలనేదానిపై దొర ఆలోచిస్తున్నాడు. పార్టీని విలీనం చేయకుండా కవితకు బెయిల్ రాదు. మేం కేంద్రంలో అధికారంలో లేము కనుక ఆ కేసులు తప్పించడం మాతో కాదు. అందుకే ఆయన కాంగ్రెస్ జోలికి రాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరికకు బ్రేక్ మాత్రమే పడింది. ప్రతి దానికీ ఆషాఢాలు, శ్రావణాలు ఉంటాయి కదా! జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిచ్చేందుకు కట్టుబడి ఉన్నాం. నెలాఖరులోనే జేఎన్జే సొసైటీకి భూమిని సీఎం చేతుల మీదుగా అప్పగిస్తాం. ఈ సొసైటీలో లేని మిగిలిన వారికి ఎలా ఇవ్వాలన్న దానిపైనా ఆలోచిస్తున్నాం. ఇతర సొసైటీల సభ్యత్వాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటాం. -
‘ధరణి’ని ప్రక్షాళన చేస్తాం
నేలకొండపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచి మండలాల్లో పర్యటించారు. సీసీ రోడ్లు, పల్లె దవాఖానా ప్రారంభించి బీపీ పరీక్ష చేయించుకున్నారు. సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. విద్య, వైద్య రంగాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకు రూ.10 లక్షల విలువైన వైద్యం ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి రైతు పక్షపాత ప్రభుత్వంగా మారిందన్నారు. త్వరలో రూ.22 వేల కోట్లతో 4.50 లక్షల ఇళ్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, నీటిపారుదల సంçస్థ చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, మువ్వా విజయ్బాబు, డీఎంహెచ్ఓ మాలతి, ఆర్డీఓ గణేష్ తదితరులు ఉన్నారు. -
3 నెలల్లో ఎల్ఆర్ఎస్ పూర్తి కావాలి
సాక్షి, హైదరాబాద్/ భూపాలపల్లి/ సాక్షిప్రతినిధి, ఖమ్మం: లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను వేగవంతం చేయాలని.. మూడు నెలల వ్యవధిలో పూర్తి చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ఎలాంటి అక్రమాలకు తావు ఇవ్వొద్దని, నిబంధనల ప్రకారం మాత్రమే క్రమబద్దీకరణ జరగాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి అక్కడి కలెక్టరేట్ నుంచి మున్సిపల్, రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధనశాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రత్యేక బృందాలతో ప్రక్రియ ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంలో దళారుల ప్రమేయం లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ‘‘పెండింగ్లో ఉన్న 25.70 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రజలు నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం జిల్లాల్లో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకోవాలి. సిబ్బంది కొరత ఉన్నచోట ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలి. ప్రతిపాదనలు పంపితే రెవెన్యూ శాఖ నుంచి కూడా సర్దుబాటు చేస్తాం. రెవెన్యూ, సాగునీరు, మున్సిపల్ అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేయాలి. ఎల్ఆర్ఎస్ ప్రక్రియపై ప్రజల సందేహాలను నివృత్తి చేసేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో హెల్ప్డెసు్కలు ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రక్రియలో పాలుపంచుకునే అధికారులు, సిబ్బందికి తక్షణమే శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ విధివిధానాలకు అనుగుణంగా అవసరమైన కా ర్యాచరణ చేపట్టాలి..’’అని మంత్రి ఆదేశించారు. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో అత్యంత విలువైన భూములున్న నేపథ్యంలో ఆయా జిల్లాల్లో క్రమబద్దీకరణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పొంగులేటి సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగొద్దు: డిప్యూటీ సీఎం భట్టి ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దరఖాస్తుల స్క్రూటినీ సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ భూమికి నష్టం కలగవద్దని.. నీటి వనరులు, కాలువలు, చెరువుల ఆక్రమణలకు పాల్పడకుండా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. -
Telangana: రేపు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం జాబ్ క్యాలెండర్ ప్రకటించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలెండర్ను కేబినేట్ ఆమోదించిందని పేర్కొన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ..‘కేరళలో వయనాడ్లో జరిగిన విషాదంపై తెలంగాణ కేబినేట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేయడంతోపాటు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు ముందుకు వచ్చింది. రేషన్ కార్డుల జారీతో పాటు రాష్ట్ర ప్రజలందరి హెల్త్ ప్రొఫైల్తో హెల్త్ కార్డులను జారీ చేయాలని కేబినెట్ చర్చించింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసేందుకు రెవెన్యూ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, సివిల్ సప్లయిస్ మంత్రితో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. త్వరలోనే అర్హులైన పేదలందరికి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తాం.క్రీడాకారులు ఈషా సింగ్, నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు హైదరాబాద్లో 600 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిఖత్ జరీన్కు, సిరాజ్కు గ్రూప్ -1 స్థాయి ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇటీవల విధి నిర్వహణలో మరణించిన ఇంటెలిజెన్స్ డీజీ రాజీవ్ రతన్ కుమారుడు హరి రతన్కు మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ తీర్మానించింది. ఇటీవల విధి నిర్వహణలో చనిపోయిన అడిషనల్ డీజీ మురళి కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుందిగౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కుడి, ఎడమ కాల్వలు పూర్తి చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాదాపు రెండు వేల ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు అవసరమయ్యే నిధులతో సవరణ అంచనాలను రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల రాష్ట్ర గవర్నర్ ప్రభుత్వానికి తిరిగి పంపించిన ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించి కేబినేట్ చర్చించింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ పేర్లను మరోసారి గవర్నర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయం తీసుకుంది.నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తగిన చర్యలు చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. రెండో విడతగా చెల్లించాల్సిన బకాయిల చెల్లింపులకు ఆమోదం తెలిపింది. అవసరమైతే ఇథనాల్, విద్యుత్తు ఉత్పత్తికి అక్కడి ఫ్యాక్టరీల్లో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని చర్చించింది. ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆ బాధ్యతలు అప్పగించింది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి నీటిని శామీర్పేట చెరువు నింపి, అక్కడి నుంచి హైదరాబాద్లో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు తరలించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తం 15 టీఎంసీలను తరలించి, అందులో 10 టీఎంసీలతో చెరువులు నింపి, మిగతా నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు -
వరదలపై అప్రమత్తంగా ఉండండి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి నదికి వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. సోమవా రం మంత్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పర్య టించారు. గోదావరి తీరంలో కరకట్టలను పరిశీలించి, జిల్లా అధికారులతో సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని.. వరద తగ్గేవరకు కూనవరం– భద్రాచలం– దుమ్ముగూడెం రోడ్ల మీదుగా రాకపోకలను నిలిపేయాలని సూచించారు. భద్రాచలంలోకి చేరే వరద నీటిని నదిలోకి ఎత్తిపోసేలా మోటార్లు సిద్ధం చేయాలన్నారు. అనంతరం బూర్గంపాడు మండలంలో పొలాలను పరిశీలించారు. ‘పెద్దవాగు’పై అధికారుల వైఫల్యం అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గండ్లు పడటానికి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని పొంగులేటి పేర్కొన్నారు. పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారీ వరద వస్తుంటే అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని.. ప్రాజెక్టులోని నీటిని ఖాళీ చేయించలేదని మండిపడ్డారు. అధికారులకు నోటీసులు ఇచ్చామని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం గత పదేళ్లుగా తగినంత శ్రద్ధ పెట్టలేదని విమర్శించారు.ప్రాజెక్టు విషయంలో తప్పు జరిగిన విషయాన్ని అంగీకరిస్తున్నామన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకుని తిరిగి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయతి్నస్తారని తెలిపారు. ఆలోగా ఫీడర్ చానల్ లేదా రింగ్బండ్ నిర్మించి ఆయకట్టు రైతులకు నీరు అందించేందుకు ప్రయతి్నస్తామన్నారు. ప్రాజెక్టు గండ్లు, వరదలతో నష్టపోయిన వారిని మంత్రి పరామర్శించారు. ప్రభుత్వంతోపాటు తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తామని ప్రకటించారు. వరద కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి రెండు నెలల్లో ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ముగ్గురు ఇంజనీర్లపై చర్యలకు సిఫారసు సాక్షి, హైదరాబాద్: గోదావరి నదిపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఏకైక ఉమ్మడి ప్రాజెక్టు ‘పెద్దవాగు’. 16 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా 1981లో దీనిని నిర్మించారు. 40,500 క్యూసెక్కుల వరదను విడుదల చేసేలా స్పిల్వేను డిజైన్ చేశారు. కానీ 1989లో 70 వేల క్యూసెక్కుల వరద రావడంతో స్పిల్వేకు ఎడమవైపు 200 మీటర్ల వరకు కట్టకు గండిపడింది. ఇప్పుడు 75వేల క్యూసెక్కుల వరద రావడంతో మళ్లీ గండ్లు పడ్డాయి.దీనికి నిర్వహణ లోపమే కారణమని.. ఎగువ నుంచి భారీ వరద రానుందని సమాచారమున్నా ఇంజనీర్లు సకాలంలో గేట్లు ఎత్తలేదని.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ముందస్తు హెచ్చరికలేవీ జారీ చేయకుండా నీటిని విడుదల చేశారని అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు నిర్వహణలో విఫలమైన డీఈఈ, ఏఈఈ, ఏఈలపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రాజెక్టుకు గండ్లు పడటంతో 16 గ్రామాలు నీట మునిగాయి. రూ.100 కోట్ల మేర నష్టం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. -
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
రైతు భరోసాపై మంత్రుల క్లారిటీ
సాక్షి,వనపర్తి: రైతులకు తాము ఇచ్చిన హమీలు అన్ని నెరవేర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని రెవెన్యూ,సమాచార మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ప్రజాధనం సద్వినియోగం చేయాలనే రైతు భరోసాపై అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. శుక్రవారం(జులై12) వనపర్తిలో రైతు భరోసాపై అభిప్రాయ సేకరణ కోసం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కూడిన సబ్కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ ‘కొందరు నాయకులు, ప్రతిపక్షాలు రైతుభరోసాపై రైతులను రెచ్చగొట్టాలని చూస్తున్నాయి. దీన్ని తిప్పి కొట్టాలి. ప్రతిపక్షాలు కూడా మంచి సూచనలు చేస్తే బేషజాలు లేకుండా వాటిని స్వీకరిస్తాం. రైతుభరోసా స్కీమ్పై ఎలాంటి అపోహలు వద్దని, ప్రజాభిప్రాయాలను అసెంబ్లీలో చర్చించి స్కీమ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.రైతు బంధు పేరుతో రూ.25 వేల కోట్లు దుర్వినియోగం: తుమ్మల నాగేశ్వరరావురైతులు, మేధావుల అభిప్రాయం మేరకే రైతుభరోసా అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే సాగుకు పనికిరాని భూములకు రూ. 25 వేల కోట్ల రైతుబంధు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేశారన్నారు. సీఎం మనసులో రైతుల పంటలకు బీమా ఇచ్చే ఆలోచన ఉందన్నారు. మద్దతుధర అందించి రైతులకు మేలు చేయాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. -
కాంగ్రెస్ ఓపెన్ మైండ్ తో ఉంది..
-
ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని, కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అచ్చోసిన ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ రంకెలు ఆగిపోగానే వలసలు ముగించేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుందనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దు. 2018 ఎన్నికల్లో కేసీఆర్కు 88 సీట్లు ఇస్తే తృప్తి పడలేదు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే ఐదుగురిని ఉంచాడు. అప్పుడు అక్కడ ఉండి అదంతా చూసిన ఎమ్మెల్యేలే ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని అనలేదు. కానీ మేం గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కేసీఆర్ ప్రారంభించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈయన ముందుండి నడిపించాలని చూశాడు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను చుట్టూ కూర్చోబెట్టుకుని కేబినెట్లో నువ్వు మంత్రి, నువ్వు మంత్రి అని చెప్పాడు. అలా మంత్రుల లిస్టు రాసుకున్న వారిని ఏమనాలి?’ అని పొంగులేటి ప్రశ్నించారు. అసలు ప్రభుత్వాన్ని కూల్చడం అన్న పదమే అప్రజాస్వామికమని, ఇప్పుడు వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రెండుమూడు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తాం. ఇప్పటికే రూ.9వేల కోట్లు వ్యవసాయశాఖకు బదిలీ చేశాం. మిగిలిన నిధులు కూడా సమీకరించి రుణమాఫీ చేసి తీరుతాం. – రైతు భరోసాపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వెళతాం.కౌలు రైతులను కాపాడుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. – సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరణి పోర్టల్ను సంస్కరిస్తాం ఒకే మాడ్యూల్లో దరఖాస్తు చేసుకుంటే అది ఎలా పరిష్కరించాలో అధికారులు నిర్ణయించాలి. వీలున్నంత త్వరలోనే ధరణి పెండింగ్ దరఖాస్తులను జీరో చేస్తాం. అలాగని అడ్డగోలుగా ధరణి దరఖాస్తులను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటాం. – ఈ ఏడునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. అయినా అన్ని విషయాలను ప్రజల ముందు పెట్టలేకపోయాం. మేం అధికారంలోకి వచ్చాకే హెదరాబాద్లో కమర్షియల్ లీజ్ బాగా పెరిగింది. ఎలాంటి సమస్యా రాకుండా టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం చేసిన రూ. 6.82లక్షల కోట్ల అప్పుకుగాను షెడ్యూల్కు మించి అప్పులు కడుతున్నాం. ఇలాంటివన్నీ చెప్పుకోవాలి. – రాష్ట్రంలో చాలామంది అర్హులకు పింఛన్లు, రేషన్కార్డులు రావాల్సి ఉంది. కొన్ని బోగస్ కార్డులు కూడా ఉన్నాయి. ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ కోసం కార్డులు రాయించుకుంటున్నారు. అందుకే రేషన్కార్డుకు, ఆరోగ్యానికి లింకు తీసేయాలని, రేషన్కార్డును, హెల్త్కార్డును వేర్వేరుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. – 2021–22 ఆర్థిక సంవత్సరంలో భూముల విలువలు రెండుసార్లు సవరించారు. అప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. ఇప్పుడు మేం శాస్త్రీయంగా చేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భూముల విలువల సవరణ ఆగస్టు1 నుంచా ఆగస్టు 15 నుంచా అన్నది ఇప్పుడే చెప్పలేం. – జీఓ 59 దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్లను మేం కావాలని ఆపడం లేదు. పేదలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఆ రెండు అంశాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నాం. అవి మళ్లీ జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టేస్తాం. ధరణి అంశం పూర్తికాగానే జీఓ 59, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేస్తాం. ఇప్పటికే జీఓ 59 కింద చిన్న చిన్న స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలిచ్చాం. – కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న బడ్జెట్ పెడుతుంది. అందులో రాష్ట్ర కేటాయింపులు చూసుకొని ఆ తర్వాత 1,2 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా పెడతాం. జూలై 31లోపే రెగ్యులర్ బడ్జెట్కు ఆమోదం లభిస్తుంది. – కేసీఆర్ అంటే నాకేం కోపం లేదు. ఆయన అంటే నాకు లవ్వు ఎక్కువ. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా? తన అనుభవాన్ని రంగరించి పాలన గురించి ఎప్పుడు సూచనలిస్తారా అని ఎదురుచూస్తున్నా. కానీ ఆయన రావడం లేదు. – తుదిదశలో నిర్మాణాలు ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి నిరుపేద లబ్ధిదారులను గుర్తించి కేటాయిస్తాం. అతి తక్కువ మొత్తం ఖర్చు చేస్తే గృహప్రవేశాలకు సిద్ధమయ్యే స్థాయిలో ఉన్న ఇళ్లను తొలుత ఎంపిక చేస్తాం. – అమ్ముడు కాకుండా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లకు కొత్తగా ధరలు నిర్ణయించి ప్రజలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. – స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్లు చేయించుకోలేని వారి డబ్బులు నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. ఇలా రూ.32 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. వాటిని 2,3 రోజుల్లో విడుదల చేస్తాం. సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక హంగులతో సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తాం. ప్రతి గ్రామంలో సమగ్ర రెవెన్యూ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కచి్చతంగా ఇస్తాం. జేఎన్జే సొసైటీ అంశాన్ని 2,3 రోజుల్లోనే పరిష్కరిస్తాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విలేకరులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. -
రూ. 8 వేల కోట్లు ఖర్చు చేసినా గత ప్రభుత్వం నీరివ్వలేదు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా తలపెట్టిన రాజీవ్సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయితే, ఈ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పక్కన పెట్టి సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిందని.. అయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో మంగళవారం పర్యటించిన ఆయన తిప్పారెడ్డిగూడెం, దమ్మాయిగూడెం, బీరోలు, పోచారంలో సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అలాగే దమ్మాయిగూడెం నుంచి పోచారం వరకు నిర్మాణం జరుగుతున్న కాలువ, సొరంగం పనులపై నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్షించారు. అనంతరం కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండగా, ఇప్పటికే మొదటి లిఫ్ట్ ట్రయల్రన్ పూర్తిచేసి రెండో లిఫ్ట్ ట్రయల్ రన్కు సిద్ధమవుతున్నామని తెలిపారు.మొదటి విడత ఆగస్ట్ 15న..సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని మొదటి విడతగా ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయిస్తామని పొంగులేటి తెలిపారు. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుపై ఎక్కడా నీటి నిల్వకు రిజర్వా యర్లు కట్టలేదని, దీంతో 10 టీఎంసీల నుంచి 12 టీఎంసీలు నిల్వ చేసేలా రిజర్వాయర్ నిర్మించాలని తమ ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. కాగా, వరంగల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మంత్రి వెంట డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామ చంద్ర నాయక్, నీటిపారుదల శాఖ సీఈ విద్యాసాగర్ తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్: టైమ్స్ హోమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (ఫొటోలు)
-
పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్
-
బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘ఇండియన్ టెలికం యాక్ట్పై కేంద్రానికి పూర్తి అధికారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా స్వీకరించొచ్చు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ కేసును ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? ఆ పార్టీ నేతలు అవగాహన రాహిత్యంతో ప్రత్యక్షంగా కాంగ్రెస్పై అడ్డగోలు ఆరోపణలు చేస్తూ..పరోక్షంగా బీఆర్ఎస్కు సహకరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న వారు ఎంతటి పెద్దమనుషులైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విషయంలో చట్టం తనపని తాను చేసుకుని పోతోంది’అని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులు స్పష్టం చేశారు. తుక్కుగూడలో ఈ నెల 6న కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన జనజాతర మహాసభ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు వారి మాటల్లోనే...బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించింది. మా ఫోన్లు కూడా ట్యాప్ చేసింది. వీటిని అడ్డం పెట్టుకొని అక్రమ వసూళ్లకు పాల్పడింది. ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్నవారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపడం ఖాయం. ప్రాజెక్టులు, విద్యుత్ కొనుగోళ్లు పేరుతో తిన్న కమీషన్లు కక్కిస్తాం. ధరణి ఫోర్టల్ను అడ్డుపెట్టుకొని వారు కొల్లగొట్టిన ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్, వక్ఫ్, సీలింగ్ భూములను వెనక్కి తీసుకుంటాం. ఆర్థిక దోపిడికి పాల్పడిన వారికి జైలుకు పంపిస్తాం. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో.. మీరు మా తాట తీయడం కాదు.. ప్రజలే మీ తాట తీస్తారు అని హెచ్చరించారు. కర్రుకాల్చి వాత పెట్టినా సిగ్గురాలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది..కరువొచ్చిందని బీఆర్ఎస్ నేతలు పదేపదే ప్రచారం చేస్తున్నారు. కరువుకు కాంగ్రెస్కు సంబంధం ఏమిటీ? కాంగ్రెస్ డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి నేటి వరకు వర్షపు చినుకు కురవలేదు. వర్షాకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఈ ఏడాది 56 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని సెపె్టంబర్ 5న త్రిసభ్య కమిటీ ప్రకటించింది. ఉన్న నీటి నిల్వలను జాగ్రత్తగా వాడుకోవాలని కేఆర్ఎంబీ కమిటీ ముందే హెచ్చరించింది. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ పాలనలో కరువొస్తే...కాంగ్రెస్కు అంటగట్టే ప్రయత్నం చేస్తుంది. ప్రజలు తెలివైనవారు. ఎవరు ఏమిటో వారికి తెలుసు. ఇప్పటికే ఒకసారి కర్రుకాల్చి వాతపెట్టారు. అయినా సిగ్గురాలే. మళ్లీ వారికి వాతపెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనజాతరకు భారీగా తరలిరావాలి అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇదే తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించింది. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఇదే స్ఫూర్తితో ఇదే వేదికపై నుంచి ఈ నెల 6న కాంగ్రెస్ జాతీయ గ్యారంటీలను ప్రకటించనుంది. ఏఐసీసీ ముఖ్యనేతలు రాహుల్గాందీ, ప్రియాంకగాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానుండటంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు లక్షల మందికి తగ్గకుండా సభకు తరలించాలని నిర్ణయించింది. సభలో మహిళలకు పెద్దపీట వేయబోతున్నాం. వారికి ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తున్నాం. సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం’అని మంత్రులు వివరించారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ సీనియర్ నేత దేప భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.