ఎల్బీనగర్: నగరంలోని ఎల్బీనగర్ లో భారీ చోరీ జరిగింది. స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలోని నాగోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి వెంకటరెడ్డినగర్కు చెందిన మధుసూదన్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లో నిద్రిస్తున్నవారిపై మత్తుమందు చల్లారు. అనంతరం బీరువాలో ఉన్న 40 తులాల బంగారు నగలతో పాటు ఒకటిన్నర కిలోల వెండి సామగ్రిని తీసుకుని పరారయ్యారు. శనివారం ఉదయం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎల్బీనగర్లో భారీ దొంగతనం
Published Sat, Nov 21 2015 1:43 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement