lb nagar
-
హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో వ్యక్తి దారుణహత్య
-
Hyderabad: కారుతో ఢీ కొట్టి.. గొడ్డళ్లతో నరికి
నాగోలు: పాత కక్షల నేపథ్యంలో కొందరు వ్యక్తులు బైక్పై వెళ్తున్న ఓ యువకుడిని కారుతో ఢీ కొట్టి అతడు కింద పడిన తర్వాత గొడ్డళ్లు, వేట కొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన బోడ్డు మహేష్(31) పాత నేరస్తుడు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై కేసులు నమోదై ఉన్నాయి. గతంలో అదే ప్రాంతంలో ఉన్న పగిళ్ల పురుషోత్తం మహేష్కు స్నేహితుడు. రెండేళ్ల క్రితం హయత్నగర్లో పెళ్లి ఊరేగింపులో జరిగిన గొడవలో మహేష్ పురుషోత్తంపై బీరు బాటిల్తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురుషోత్తం హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే స్నేహితులు వారి మధ్య రాజీ కుదిర్చేందుకు ఒప్పించారు. రాజీ పడేందుకు మహేష్ గత డిసెంబర్ 20న హయత్నగర్ కోర్టుకు రావాల్సి ఉంది. అయితే అతను కోర్టు హాజరుకాకుండా తాను సూర్యాపేటలో ఉన్నానంటూ కోర్టు కానిస్టేబుల్కు చెప్పి పురుషోత్తంను హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. అదే రోజు కొత్తపేట– నాగోలు రోడ్డులో అమరావతి వైన్స్ వద్ద పురుషోత్తం ఉన్నట్లు సమాచారం అందడంతో మహేష్ తన స్నేహితులైన బెల్లి భరత్, దాసరి సురేందర్తో కలిసి అతడిపై వేట కొడవలితో దాడికి ప్రయత్నించగా అతను తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో పురుషోత్తం స్నేహితులైన గడ్డమోయిన రాము, పాశం నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. పురుషోత్తం ఫిర్యాదు మేరకు చైతన్యపురి పోలీసులు దాడికి పాల్పడిన మహేష్, బెల్లి భరత్, దాసరి సురేందర్, సుమన్, గౌతమ్కుమార్, పరుశురాంలను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఇటీవలే మహేష్ అతని స్నేహితులు జైలు నుండి బయటికి వచ్చారు. అయితే మహే‹Ùపై కక్ష పెంచుకున్న పురుషోత్తం అతని స్నేహితులు అతడిని హత్య చేయాలని పథకం వేశారు. మాటు వేసి..దాడి చేసి.. శనివారం రాత్రి మహేష్ తన స్నేహితుడితో కలిసి బైక్పై ఎల్బీనగర్ శివగంగ కాలనీ నుంచి ఇంటికి వస్తుండగా అప్పటికే అక్కడ మాటు వేసి నిందితులు కారుతో మహేష్ బైక్ను ఢీ కొట్టారు. కింద పడిన అతను పారిపోయేందుకు ప్రయత్నించగా వారు తమ వెంట తెచ్చుకున్న గొడ్డళ్ల, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయారు. మహేష్ వెంట ఉన్న స్నేహితుడు వారి బారి నుంచి తప్పించుకుని ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ను కామినేని హాస్పిటల్కు తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మహేష్ తలపై నిందితులు గొడ్డలితో నరకడంతో గొడ్డలి తలలోనే ఇరుక్కు పోయింది. పోలీసులు మృతదేహాన్ని ఆదివారం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్కుమార్, ఏసీపీ కృష్ణయ్య, ఇన్స్పెక్టర్ వినోద్కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. పోలీసుల అదుపులో నిందితులు... మహేష్ ను హత్య చేసిన నిందితులు పురుషోత్తం, భరత్నగర్కు చెందిన సందీప్, నాగార్జున, రాములను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం. వీరితో పాటు ఈ హత్యలో ఎంత మంది ఉన్నారని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హనీమూన్ వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్, సాక్షి: మహిళా కార్పొరేటర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. సోమవారం డీసీపీ ఆఫీస్ వద్ద ఆయన మాట్లాడుతూ.. కార్పొరేటర్లపై అభ్యంతకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయగా.. ఫిర్యాదు అందడంతో ఎల్బీ నగర్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ప్రొటోకాల్ రగడతో మొదలైన వివాదం.. చిలికి చిలికి గాలి వానగా మారింది. ఎమ్మెల్యే కొన్ని పనులకు శంకుస్థాపన చేయగా.. అవే పనులకు బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం మళ్లీ శంకుస్థాపన చేశారు. దీంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే చేశాక మళ్లీ ఎలా శంకుస్థాపన చేస్తారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈలోపు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేశారు. అయితే.. కాసేపటికే మరో చోటులో శంకుస్థాపనలు పనులు జరగ్గా.. ఈసారి బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి అబ్దుల్లాపూర్మెట్ పీఎస్కు తరలించారు. విషయం తెలిసిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. పీఎస్కు చేరుకుని వాళ్లను విడిపించారు. అరెస్ట్ సమయంలో కార్యకర్తలకు గాయాలు అయ్యాయని తెలుసుకుని పోలీసుల తీరుపై మండిపడ్డారు. వాళ్లను సరాసరి డీసీపీకి ఆఫీస్కు తీసుకెళ్లి ఉన్నతాధికారులకు జరిగింది వివరించారు. ఆపై బయటకు వచ్చి మాట్లాడిన ఆయన.. ఈ దాడుల వెనుక కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ప్రమేయం ఉందని, కార్పొరేటర్ల మధ్య హనీమూన్ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో.. హస్తినాపురం కార్పొరేటర్ సుజాత పేరును కూడా ప్రస్తావించారు. దీంతో.. వివాదం రాజుకుంది. సుధీర్ రెడ్డి వ్యాఖ్యలపై సుజాత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకానొక తరుణంలో ఆమె తీవ్ర వ్యాఖ్యలే చేశారు. మరోవైపు..సుజాత నాయక్కు మద్ధతుగా పలువురు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయనపై ఫిర్యాదు అందడంతో.. Cr. No. 254/2025 U/s Sec. 3(2)(va), 3(1)(r)(w)(ii) SC/ST POA Act, 1989 & Sec. 79 BNS సెక్షన్ల కింద సుధీర్ రెడ్డిపై కేసు ఫైల్ అయ్యింది. -
ఎల్బీనగర్ లోని ఓ సెల్లార్ తవ్వకాల్లో అపశృతి
-
HYD: సెల్లార్లో ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో విషాదకర ఘటన నెలకొంది. ఓ సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలిపడిపోయిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. ఒక్కరికి తీవ్ర గాయాలయ్యాయి.వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ భవనానికి సంబంధించి సెల్లార్ తవ్వుతున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుండి మట్టిదిబ్బలు కూలిపడిపోయాయి. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుతున్న వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. అనంతరం, ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, మృతులను బీహార్కు చెందిన వారికిగా గుర్తించారు. -
పండగ పూట ప్రయాణికులకు పాట్లు
-
హైదరాబాద్ : ఎల్ బి నగర్ ఆక్సిజన్ పార్క్ (ఫొటోలు)
-
నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్, సాక్షి: నాగోల్లోని ఓ ప్రముఖ హోటల్లో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. కిన్నెర గ్రాండ్ హోటల్లో నాలుగో అంతస్తు నుంచి లిఫ్ట్ ఒక్కసారిగా కిందపడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఎంత మంది ఉన్నారన్నది తెలియరాలేదు. అయితే ఎనిమిది మందికి తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడ్డ వాళ్లను ఎల్బీ నగర్ కామినేని ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. బాధితులు హోటల్లో జరిగిన ఎంగేజ్మెంట్ పంక్షన్కి వచ్చినట్లు తెలుస్తోంది. -
ఎల్బీ నగర్ విషాదంలో షాకింగ్ ట్విస్ట్..!
-
HYD: హైదరాబాద్లో పలుచోట్ల వర్షం
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఇక, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్ ఈరోజు ఉదయం దిల్సుఖ్నగర్, చైతన్యపురి, సరూర్నగర్, కర్మాన్ఘాట్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్ నగర్, చార్మినార్, కోఠి పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఇక, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కౌడిపల్లి మండలం జాబితాండలో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి సంగీత చనిపోయింది. pic.twitter.com/GaPhmhUzwC — kutharamp OG (@nanisumanth29) March 19, 2024 ఇక, ఈదురు గాలల వర్షం కారణంగా పలుచోట్ల రైతులకు తీవ్ర నష్ట వాటిల్లింది. గాలుల కారణంగా మామిడి పూత, కాయలు రాలిపోయాయి. అలాగే, వరి పంట, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగింది. -
రాంగ్ రూట్ లో కారు బీభత్సం.. ఎక్సైజ్ సీఐ మృతి..
-
Hyd: సీఐ ప్రాణాల్ని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
హైదరాబాద్, సాక్షి: నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ నిండు ప్రాణం తీసింది. మరో వ్యక్తిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడేలా చేసింది. ఎల్బీ నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ సీఐ మృతి చెందగా.. ఎస్సై ఒకరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందారు. కార్ యూటర్న్ చేస్తు రాంగ్ రూట్ లో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న ఒకరు మృతి చెందగా. మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తిని చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సీఐ సాధిక్ అలీగా గుర్తించారు. అలాగే.. గాయపడిన వ్యక్తిని నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కాజా వల్లి మోహినుదిన్గా గుర్తించారు. వీళ్లిద్దరూ మలక్పేటలోని క్వార్టర్స్లో ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం ఎల్బీనగర్లో ఓ ఫంక్షన్ను వెళ్లి వస్తుండగా.. ఈ ఘోరం జరిగింది. కారుపై ‘డేంజర్’ ఛలాన్లు ఇదిలా ఉంటే.. ఘటన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కారు వినుషాశెట్టి అనే పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. అంతేకాదు.. కారుపై ఓవర్ స్పీడ్, డేంజర్ డ్రైవింగ్ ఛలాన్లు ఉండడం గమనార్హం. -
ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం
-
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ కొరడా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు అప్రమత్తమయ్యారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ చింతలకుంట వద్ద అధికారుల తనిఖీలు నిర్వహించారు. నిబంధనకు విరుద్ధంగా తిరుగుతున్న 15 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. బస్సుల్లో కనీసం ఫైర్ సేఫ్టీ కూడా పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలు పాటించడం లేదు. నిబంధనలను పాటించకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. సంక్రాంతికి భారీగా సొంతూళ్లకు జనాలు వెళ్తున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ కొనసాగుతున్నారు. పంతంగి టోల్ ఫ్లాజా వద్ద హైదరాబాద్- విజయవాడ వైపు పది టోల్ బూత్లను జీఎంఆర్ ఓపెన్ చేసింది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్ల పహాడ్ వద్ద రద్దీ కొనసాగుతోంది. కొర్లపహాడ్ వద్ద ఎనిమిది టోల్ బూత్లను సిబ్బంది తెరిచారు. -
LB Nagar:మెడికల్ షాపులపై ఎస్ఓటీ పోలీసుల దాడులు
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ జోన్లోని మెడికల్ షాప్లపై ఎస్ఓటీ పోలీసులు, నార్కో టిక్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. మెడికల్ షాప్లలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పలు మెడికల్ షాప్లపై దాడులు నిర్వహించి నిషేధిత ఆల్ ఫ్రాక్స్ డ్రగ్స్ (NDPS), ఇంజెక్షన్లు, మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. పది మంది మెడికల్ షాప్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం అల్కాపూరిలో దాడులు కొనసాగుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఏఎస్ఐ మృతి
హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీనగర్ షీ టీమ్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాజేందర్రెడ్డి (51) హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈ నెల 11న విధులు ముగించుకొని ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వైపు వెళ్తుండగా నాగోలు ప్లైఓవర్పై బైక్ స్కిడ్ అయి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నాగోలులోని సుప్రజా హాస్పిటల్ తరలించారు. వారం రోజుల పాటు చికిత్స పొందినా ఫలితం లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి బంజారాహిల్స్లోని సిటీ న్యూరో హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రాజేందర్రెడ్డి చనిపోయాడు. పలువురు పోలీసు అధికారులు అతడి మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. ఆదివారం నాగోలు శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. రాజేందర్రెడ్డి అంత్యక్రియల కోసం షీ టీమ్ డీసీపీ 70 వేలు నగదు, ఇతర పోలీసులు సిబ్బంది 70 వేలు అతడి కుటుంబ సభ్యులకు అందజేశారు. -
హైదరాబాద్లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం
నాగోలు: ఎల్బీనగర్లోని చింతల్కుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందున్న కారుతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డుపై ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకీ నందన్ అనే వ్యక్తి తన బీఎండబ్లూ కారులో దిల్సుఖ్నగర్ నుంచి హయత్నగర్ వైపు వెళ్తున్నాడు. ఎల్బీనగర్ చింతల్కుంట వద్ద పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యాగనార్ కారు ఢీకొట్టాడు. అక్కడే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని.. రోడ్డు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేష్ (50)తో పాటు నగరానికి చెందిన పవన్కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతమ్లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పవన్కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతంరెడ్డిలకు గాయాలయ్యాయి. సమాచారం తెలియగానే ఎల్బీనగర్ పోలీస్లు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై ఓవర్ స్పీడ్కు సంబంధించి ఇప్పటికే చాలా చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కూతుర్ని చూసేందుకు వచ్చి.. చింతలకుంటలో ఉన్న కూతుర్ని చూసేందుకు మల్లేష్ నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చి బస్సు దిగాడు. సరస్వతీనగర్లోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా..ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మల్లేష్ కుమారుడు వినయ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసులతో మధుయాష్కీ వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ మరోసారి రాజకీయం హీటెక్కింది. ఎన్నికల వేళ ఐటీ దాడులు, పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసి దాడులు చేయడం హాట్ టాపిక్గా మారింది. ఇక, తాజాగా మంగళవారం అర్ధరాత్రి కాంగ్రెస్ ఎల్బీ నగర్ అభ్యర్థి మధు యాష్కీ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. హయత్నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కీ నివాసంలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి సోదాలు చేశారు. మధుయాష్కీ నివాసంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్బంగా మధుయాష్కీ ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉంచి డబ్బులు పంచుతున్నాడని ఫిర్యాదు రావడంతో తనిఖీ చేసేందుకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో, పోలీసులు, ఆయన మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మధుయాష్కీ మద్దతుదారులు పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడితోనే పోలీసులు సోదాల పేరుతో ఇంట్లోకి ప్రవేశించారని అన్నారు. పోలీసులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీ ఎలా నిర్వహిస్తారని మధుయాస్కీ వారిని ప్రశ్నించారు. అర్ధరాత్రి సోదాల పేరుతో పోలీసులు తన కుటుంబ సభ్యులను, కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామన్న భయంతోనే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపారని ఆరోపించారు. కాగా, పోలీసుల సోదాలపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. విచారణ పేరుతో మధుయాష్కీ కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సోదాలపై పోలీసులు స్పందించారు. డయల్ 100కి డబ్బు పంపిణీపై ఫిర్యాదు అందడంతో విచారణకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. చివరకు ఆయన ఇంట్లో ఎలాంటి నగదు లభించకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. దీంతో, ఎల్బీ నగర్లో అర్ధరాత్రి హైడ్రామా క్రియేట్ అయ్యింది. ఇది కూడా చదవండి: ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం -
మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు: సుధీర్ రెడ్డి
-
5 అంత వీజీ కాదు!
రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే. ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్ (6.69 లక్షలు), ఎల్బీనగర్ (5.66 లక్షలు), రాజేంద్రనగర్ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి. ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. శేరిలింగంపల్లి టాప్ రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్ఎస్ అభ్యర్థి శంకర్గౌడ్పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్ఎస్ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ బీసీ నేతలదే.. ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. ఎల్బీనగర్లో ఖాతా తెరవని బీఆర్ఎస్ ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్వీ కృష్ణప్రసాద్పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్గౌడ్పై టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ అభ్యర్థి రామ్మోహన్పై కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్ఎస్లో చేరారు. బీసీలకే రాజేంద్రనగర్ మద్దతు ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్గౌడ్ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్గౌడ్.. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ప్రకాశ్గౌడ్.. టీడీపీ అభ్యర్థి గణేశ్పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్ కేబినెట్లో బాధ్యతలు చేపట్టారు. ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్ఎస్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. -గౌటే దేవేందర్ -
మనిషి అవసరం లేకుండానే.. 24 గంటలూ ‘చాయ్’! మొదటి ‘టీ’ ఏటీఏం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మొదటిసారిగా ‘మనుషుల అవసరం లేకుండానే కృత్రిమ మేధస్సు (ఏఐ–ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో పనిచేసే’ టీ–ఏటీఏంను ఎల్బీనగర్ ఎల్పీటీ మార్కెట్ వేదికగా ప్రారంభించారు. నగరానికి చెందిన జెమ్ ఓపెన్క్యూబ్ సంస్థ ఆధ్వర్యంలో వెండింగ్ టెక్నాలజీలో నూతన ఒరవడితో రూపొందించిన ఈ టీ–ఏటీఏంను శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి టీఎస్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ వేద రజిని హాజరై, వినూత్నంగా తయారు చేసిన ఈ సాంకేతికతను అభినందించారు. ఈ సందర్భంగా జెమ్ ఓపెన్క్యూబ్ సీఈఓ పి.వినోద్ కుమార్ మాట్లాడుతూ, నగరంలోని ప్రతి మూలలో డబ్ల్యూటీసీ మెషీన్లను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి కోసం కేవలం లక్షా 67 వేల రూపాయలకే లభ్యమయ్యే కాఫీ, లెమన్ టీ, బాదం పాలు, బిస్కెట్లతో సహా మంచి నీటి బాటిల్లను అందించే ‘డిజిటల్ చాయ్’ లేదా ‘చాయ్ ఏటీఎం’ గా పిలువబడే ఈ యంత్రాన్ని మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. జెమ్ ఓపెన్క్యూబ్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేష్ యాదవ్, ప్రకాష్ వేలుపుల, త్రిలోచన్ దువా, తారక రంగ రెడ్డి, వెకంట్రామిరెడ్డి, శ్యామ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
సుధీర్ రెడ్డిపై పోస్టర్ల కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
Hyderabad Metro: మూత్ర విసర్జన కోసం మరో ప్లాట్ఫాంకు..
ఖమ్మంలీగల్: నిత్యం వేల నుంచి లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్ మెట్రోకు ఊహించని జరిమానా పడింది. ఓ ప్రయాణికుడ్ని ఇబ్బంది పెడుతూ.. అతని మెట్రోకార్డు నుంచి 10రూ. కట్ చేసినందుకు ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే.. నాలుగేళ్ల కిందటి నాటి ఈ ఘటనలో తీర్పు తాజాగా వెల్లడైంది. ఖమ్మంకు చెందిన న్యాయవాది వెల్లంపల్లి నరేంద్రస్వరూప్ 2019 జనవరి 10న హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఎల్బీ.నగర్ మెట్రో రైల్వేస్టేషన్లోకి ప్రవేశించాక తూర్పు వైపు దారిలో టాయిలెట్లు లేక మరోవైపు వెళ్లాడు. ఈక్రమంలో మెట్రో అధికారులు జారీ చేసిన కార్డు మరోసారి స్వైప్ చేయాల్సి వచ్చింది. ఆపై పాత మార్గానికి వచ్చేందుకు ఇంకో సారి స్వైప్ చేశాడు. ఈమేరకు కార్డు నుంచి రూ.10 మినహాయించుకుంది హైదరాబాద్ మెట్రో. అయితే, తాను రైలు ఎక్కాల్సిన మార్గంలో టాయిలెట్లు లేక వెళ్లినందున అదనంగా డబ్బులు తీసుకున్నారని, రోజు వేలాది మందికి ఇలాగే జరుగుతోందని నరేంద్ర ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసును పరిశీలించి వసూలు చేసిన రూ.10 తిరిగి ఇచ్చేయడమే కాకుండా.. అసౌకర్యానికి రూ.5వేలు, కోర్టు ఖర్చుల నిమిత్తం మరో రూ.5వేలు చెల్లించాలని వినియోగదారుల కమిషన్ చైర్మన్ వి.లలిత, సభ్యురాలు ఎ.మాధవీలత బుధవారం తీర్పు ఇచ్చారు. సదరు పరిహారాన్ని 45 రోజుల్లోగా బాధితుడికి అందించాలని హైదరాబాద్ మెట్రోను ఆదేశించారు. ఇలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు కనిపించేలా డిస్ప్లే బోర్డులు పెట్టాలని హైదరాబాద్ మెట్రోకు సూచించింది ఖమ్మం వినియోగదారుల కమిషన్. -
ఎల్బీనగర్ ప్రేమోన్మాది శివకుమార్కి నేరచరిత్ర!
సాక్షి, రంగారెడ్డి: ఎల్బీనగర్ ప్రేమోన్మాది ఘాతుకం వ్యవహారంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. నిందితుడు శివకుమార్ను అదుపులోకి తీసుకొని లోతుగా విచారిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడికి సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శివకుమార్ స్వస్థలం రంగారెడ్డిలోని నేరెళ్ల చెరువు. కొంతకాలంగా సైకోలా ప్రవర్తిస్తూ.. ఆఖరికి సంఘవి, ఆమె సోదరుడిపై ఘాతుకానికి దిగాడు. అయితే.. అతనిలో ఉన్మాద ప్రవర్తన ఈనాటిదే కాదు. గతంలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో అతడు గతంలో తల్లి, తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం కన్న తండ్రిని సుత్తెతో తలపై మోదీ హతమార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ప్రియురాలిపై దాడి, ఆమె తమ్ముడి హత్యతో ఘటనలతో శివకుమార్ వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. దీంతో తండ్రి హత్యకు సంబంధించిన వివరాలతోపాటు నిందితుడి నేర చరిత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో ఆదివారం ప్రేమించిన యువతి దూరంపెట్టిందని ఓ యువకుడి ఘాతుకానికి పాల్పడిన ఉదంతం విదతమే. ప్రియురాలిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాకుండా ఆమె తమ్ముడిని దారుణంగా హతమార్చాడు. నిందితుడిని సీరియల్స్లో నటుడిగా పనిచేస్తున్న ఫరూఖ్నగర్ మండలం, నేరేళ్లచెరువుకు చెందిన శివకుమార్గా గుర్తించారు. అతడికి స్థానికులు దేహశుద్ధిచేసి పోలీసులకు అప్పగించారు. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలానికి చెందిన సురేందర్గౌడ్, ఇందిరకు ఓ కూతురు, కొడుకులు పృథ్వీ (చింటూ) (23), రోహిత్ సంతానం. వారిలో యువతి, పృథ్వీ రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. పృథ్వీ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉండగా యువతి రామంతాపూర్లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతోంది. షాద్నగర్ ప్రాంతంలోని షారుక్నగర్ మండలం నేరళ్ల చెరువుకు చెందిన శివకుమార్ (26) యువతికి పదవ తరగతి నుంచి క్లాస్మెట్. ఇద్దరూ అప్పటి నుంచి ప్రేమలో ఉన్నారు. హోమియోపతి కోర్సు చదువుతున్న యువతిని తరుచూ కలిసేందుకు వీలుగా శివకుమార్ రామంతాపూర్లోనే నివాసం ఉంటూ ఆరి్టస్ట్గా పనిచేస్తున్నాడు. మనస్పర్థలతో దూరం పెట్టిన యువతి.. సదరు యువతి, శివకుమార్ మధ్య ఇటీవల చిన్నపాటి గొడవలు చోటుచేసుకోవడంతో ఆమె అతన్ని దూరంపెట్టింది. అతనితో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్ను సైతం బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ విషయమై ఆమెతో మాట్లాడేందుకు శివకుమార్ ప్రయ్నత్నిస్తున్నా కుదరలేదు. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ ఆదివారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై యువతి రూమ్ వద్దకు కత్తితో వచ్చాడు. తనను మోసం చేశావంటూ కేకలు వేస్తూ లోపలకు చొరబడి యువతిపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న పృథ్వీ శివకుమార్ను అడ్డుకొనే ప్రయత్నం చేయగా అతనిపై కత్తితో దాడి చేశాడు. కత్తిపోటు బలంగా దిగడంతో పృథ్వీకి తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో అతను ఇంటి నుంచి బయటకు కొంత దూరం నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోయాడు. మరోవైపు శివకుమార్ యువతిని గదిలో బంధించి లోపల నుంచి గడియ పెట్టాడు. నిందితుడిని పట్టుకున్న మహిళలు... గదిలోంచి పెద్దగా కేకలు వినపడటం, పృథ్వీ నెత్తురోడుతూ బయటకు వచ్చి పడిపోవడంతో ఇరుగుపొరుగు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకొని కర్రలతో గది తలుపు పగలగొట్టి లోపలకు ప్రవేశించారు. శివకుమార్ను చితకబాది పోలీసులకు అప్పచెప్పారు. రోడ్డుపై పడిపోయిన పృథ్వీతోపాటు స్వల్పంగా గాయపడిన యువతిని స్థానికులు చికిత్స నిమిత్తం కామినేని హాస్పిటల్కు... అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పృథ్వీ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఏసీపీ జానకిరెడ్డి, లింగోజిగూడ కార్పొరేటర్ దరల్లి రాజశేఖర్రెడ్డి, ఇతర నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్వగ్రామంలో విషాదఛాయలు మూడు రోజుల క్రితమే రాఖీ పండుగ నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చిన సంఘవి, పృథ్వీ శనివారం తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆదివారం దాడి ఘటన విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పెళ్లి చేసుకోవాలని సంఘవిపై ఒత్తిడి చేయడంతో వారి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం ఎల్బీ నగర్లో ఉంటున్న సంఘవి ఇంటికి వెళ్లి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన తమ్ముడు పృథ్వీపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఎల్బీనగర్లో దారుణం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రేమోన్మాది ఇంట్లో ఉన్న అక్కాతమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తమ్ముడి మృతిచెందగా.. అక్కకు తీవ్రగాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని స్థానికులు ఓ గదిలో బంధించారు. వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని ఆర్టీసీ కాలనీలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో శివకుమార్ అనే వ్యక్తి.. సంఘవి, పృథ్వీపై కత్తితో దాడి చేశాడు. సంఘవి, శివకుమార్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సంఘవితో ఆదివారం మాట్లాడటానికి శివకుమార్ ఎల్బీనగర్కు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలని సంఘవిపై శివ ఒత్తిడి తెచ్చాడు. దీంతో, వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంతలో ఆవేశానికి లోనైన శివకుమార్.. సంఘవిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఇంట్లోనే పృధ్వీపై కూడా శివకుమార్ చేయడంతో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను చూసిన స్థానికులు శివకుమార్ను గదిలో బంధించి.. సంఘవి, పృథ్వీలను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పృథ్వీ మృతిచెందగా.. సంఘవికి చికిత్స అందిస్తున్నారు. అక్కాతమ్ముళ్లు ఇద్దరూ ఎల్బీనగర్లో ఉంటూ చదువుకుంటున్నారు. సంఘవి హోమియోపతి చదువుతోంది, పృథ్వీ బీటెక్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నిందితుడి శివని అదుపులోకి తీసుకున్నారు. శివకుమార్ను రామాంతపూర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇది కూడా చదవండి: సరదాగా ఈతకెళ్లి.. కానరాని లోకాలకు.. -
ఎంపీ సోయం బాపూరావు క్షమాపణలు చెప్పాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: లంబాడాల రిజర్వేషన్లపై మాట్లాడుతున్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు. బాపూరావు సోయి లేకుండా మాట్లాడుతున్నారని, రాజ్యాంగం కల్పించిన హక్కును పార్లమెంట్ సభ్యుడైన ఆయన ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. ‘రిజర్వేషన్లపై సోయం మాట్లాడటం ఆయన వ్యక్తిగతం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టత ఇచ్చారు. అసలు బాపూరావు వర్గం ప్రాబల్యం రెండు జిల్లాల్లోనే ఉందన్న విషయం గుర్తుంచుకోవాలి. తెలంగాణలో లంబాడాలు 90 నియోజకవర్గాలను ప్రభావితం చేయగలరు’అని పేర్కొన్నారు. ఎల్బీనగర్ గిరిజన మహిళ అంశంపై శనివారం ఢిల్లీలో తెలంగాణకు చెందిన గిరిజన సంఘాల ప్రతినిధులతో కలిసి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓం బిర్లా విచారం వ్యక్తం చేశారని తెలిపారు. తెలంగాణలో శాంతి భద్రతలు లేవని, అగ్రవర్ణాలకు ఒక న్యాయం, బడుగులకు ఒకరకమైన న్యాయం దక్కుతోందని రవీంద్ర నాయక్ ఆరోపించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోని మహిళలపై గిరిజన మహిళపై జరిగిన విధంగా అత్యాచారాలు జరిగితే నష్టపరిహారం తీసుకొని వదిలేస్తారా? అని ప్రశ్నించారు. గిరిజనుల మాన, ప్రాణాలకు కేసీఆర్ ప్రభుత్వం వెలకట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గిరిజన మహిళ లక్షి్మకి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగబోదని రవీంద్ర నాయక్ తేల్చిచెప్పారు. -
రెండుసార్లు ఎంపీ.. కానీ ఈసారి విముఖత..!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ తన తదుపరి రాజకీయ రంగస్థలంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ శాసనసభ స్థానాన్ని ఎంచుకున్నారు. ఎల్బీనగర్ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏడాదిన్నర కాలం నుంచే మధుయాష్కీ ఎల్బీనగర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ పార్టీ శ్రేణుల్లో చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ఆయన సన్నిహితులు సైతం ఈ విషయాన్ని పలుసార్లు ప్రస్తావించారు. ఈ కారణంగానే యాష్కీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ నిజామాబాద్ జిల్లా వైపు చూడడం లేదంటూ జిల్లా నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే ఆరోపణలు గుప్పించారు. పార్టీ నాయకత్వం నాలుగు సార్లు ఎంపీ టిక్కెట్టు ఇవ్వగా రెండుసార్లు గెలిచిన యాష్కీ, జిల్లా విషయమై ఏమీ పట్టనట్లు వ్యవహరించడం పట్ల ఇక్కడి నాయకులు, కార్యకర్తలు వివిధ సమావేశాల్లోనే విమర్శలు చేయడం గమనార్హం. మధుయాష్కీ ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ ‘సాక్షి’ పత్రికలో 2022 ఏప్రిల్ 3వ తేదీనే కథనం ప్రచురితమైంది. కష్టకాలంలో వదిలేసి వెళ్తే ఎలా.. బీసీలకు ప్రాధాన్యత కోరుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం సైతం తగిన సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది. ఇలాంటి సమయంలో రెండుసార్లు ఎంపీగా, జాతీయ నాయకుడిగా రాహుల్గాంధీ వద్ద గుర్తింపు తెచ్చుకున్న మధుయాష్కీ ఈ విధంగా తరలివెళ్లడ మే మిటని నాయకు లు, కార్యకర్తలు అంటున్నారు. ఈ ఆలోచనతోనే ముందునుంచే నిజామాబాద్ జిల్లాకు పూర్తిగా దూరమయ్యారంటూ పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఆర్ఐగా వచ్చిన యాష్కీని జిల్లా నుంచి వరుసగా రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించినప్పటికీ జిల్లా ప్రజలు, పార్టీ కార్యకర్తలతో అంతగా మమేకం కాకపోవడంతో తరువాత వరుసగా రెండు సార్లు గెలిచే అవకాశాలను దూరం చేసుకున్నారంటున్నారు. అధిష్టానం ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే, కష్టకాలంలో జిల్లా పార్టీ కార్యకలాపాల విషయంలో ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించారని, తా జాగా ఆర్మూర్ నుంచి బీసీ నాయకుడిగా పోటీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఎల్బీనగర్ వెళ్లడమేమిటని కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. జిల్లాలో సభ్యత్వ కార్యక్రమంతో పాటు మీ నాక్షీ నటరాజన్ పాదయాత్రకు సైతం యాష్కీ దూ రంగా ఉన్నారని పార్టీ నాయకులు అసహనంగా ఉ న్నారు. కీలకమైన నిజాం షుగర్స్, పసుపు బోర్డు అంశాలపై చేసిన పోరాటాల్లో యాష్కీ తనకేమీ ప ట్టనట్లు ఉండడంతోనే గత ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా మలచుకో లేని దుస్థితి నెలకొందని కార్యకర్తలు చెబుతున్నా రు. గతంలో మాజీ విప్ ఈరవత్రి అనిల్కుమార్ యాష్కీపై బహిరంగ సభలో తీవ్ర విమర్శలు చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చే యగా జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు ముక్తకంఠంతో మద్దతు తెలపడం గమనార్హం. ఆర్మూర్లో పోటీ అవసరమైనప్పటికీ.. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని పార్టీ అధినాయకత్వం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లు బీసీలకు ఇవ్వాలని పార్టీలో డిమాండ్ ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్లు బీసీలకు కేటాయించే అవకాశాలున్నట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. కాగా ఇప్పటివరకు ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు సరైన నాయకత్వం లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలు సక్రమంగా జరగకపోగా, అసలు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనే చర్చ జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన, ఇప్పటివరకు నాలుగు సార్లు ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలుపొందిన మధుయాష్కీ ఇటువైపు ఆలోచన చేయకపోవడమేమిటని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఎస్టీ మహిళపై థర్డ్ డిగ్రీనా?
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్స్టేషన్లో ఓ ఎస్టీ మహిళపై పోలీసులు అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, రాచకొండ పోలీస్ కమిషనర్, డీసీపీ, ఏసీపీ, ఎల్బీ నగర్ ఎస్హెచ్వోకు నోటీసులు జారీ చేసింది. ఘటన జరిగిన ఆగస్టు 15వ తేదీ నాటి స్టేషన్ సీసీ ఫుటేజీని కూడా అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్లో లక్ష్మి అనే ఎస్టీ మహిళపై పోలీసులు థర్డ్డిగ్రీ ప్రయోగించిన ఉదంతంపట్ల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా తీవ్రంగా స్పందించి విచారణ కోసం సీజేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను హైకోర్టు సుమోటో పిల్గా విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. దర్యాప్తు నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
Hyderabad : ఎల్బీనగర్లో కుప్పకూలిన ఫ్లైఓవర్ (ఫొటోలు)
-
ఎల్బీనగర్ ఫైఓవర్ ప్రమాదం.. గాయపడిన వారిని పరామర్శించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి యోగక్షేమలు తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, చికిత్సకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుందని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. సంబంధిత వార్త: HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం జరిగిన ఘటన దురదృష్టకరమన్న కేటీఆర్, ఈ ప్రమాదం పట్ల పురపాలక శాఖ పూర్తిస్థాయి విచారణ చేపడుతుందని తెలిపారు. ప్రమాదానికి కారణమైన అంశాలపైన జీహెచ్ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆధ్వర్యంలో ముగ్గురితో కూడిన కమిటీకి అదనంగా జేఎన్టీయూ యూనివర్సిటీ ఆధ్వర్యంలో విచారణ చేయించి, ప్రమాద కారణాలను తెలుసుకుంటామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వలన ప్రమాదం జరిగితే కఠిన చర్యలు సైతం తీసుకుంటామన్నారు. మంత్రి కేటీఆర్ వెంట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పురపాలక శాఖ అరవింద్ కుమార్, ఇతర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు. చదవండి: సర్పంచ్ నవ్య కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రాజయ్య యవ్వారం.. -
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో కూలిపోయిన ఫ్లైఓవర్
-
HYD: కుప్పకూలిన ఫ్లైఓవర్.. నలుగురి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎల్బీనగర్ వద్ద సాగర్ రింగ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ మంగళవారం అర్ధరాత్రి కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది గాయపడగా వారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక, ప్రమాదంలో గాయపడిన వారిని యూపీ, బీహార్ వాసులుగా గుర్తించారు. అయితే ఫ్లైఓవర్ అర్ధరాత్రి కూలిపోవడంతో పెను ప్రమాదం తప్పిదని అధికారులు తెలిపారు. పగలు సమయంలో ప్రమాదం జరిగి ఉంటే తీవ్ర ప్రమాదంగా మారి ఉండేది. ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. బైరామల్గూడ ఫ్లైఓవర్ వద్దకు ఎన్డీఆర్ఎఫ్ బృందం చేరుకుంది. ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్ అధికారులు పోలీసులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. కాగా, ఫ్లైఓవర్ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇది కూడా చదవండి: నెలాఖరున బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం -
ఎల్బీనగర్ లో భారీ అగ్నిప్రమాదం
-
భారీ అగ్ని ప్రమాదం.. స్తంభించిన ట్రాఫిక్
హైదరాబాద్లోని వనస్థలిపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గోదాంలో మంటలు చెలరేగాయి. ఫర్నీచర్ గోదాంతో పాటు పక్కనే ఉన్న బట్టల దుకాణంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థిలికి చేరుకుని నాలుగు ఫైరింజన్లతో మంటలార్పేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియరాలేదు. -
LB Nagar: కారు డోర్ తగిలి రెండేళ్ల పాప మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం రెండేళ్ల పాప జీవితాన్ని బలి తీసుకుంది. చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం మన్సురాబాద్ నుంచి ఎల్బీ నగర్ రూట్లో.. కారు డ్రైవర్ రోడ్డులో కారు ఆపాడు. ఓ వ్యక్తి దిగి వెళ్లిపోగా.. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి హఠాత్తుగా కారు డోర్ తీశాడు. ఆ సమయంలో పక్క నుంచి వెళ్తున్న బైకు కారుడోర్కు తగిలింది. దీంతో ఆ బైక్పై ఉన్న కుటుంబ సభ్యులు కిందపడిపోయారు. రెండేళ్ల వయసున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతి చెందిన చిన్నారిని ధనలక్ష్మి(2)గా గుర్తించారు పోలీసులు. చిన్నారి తల్లి శశిరేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె భర్త గాయాలతో బయటపడినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.] కేసు నమోదు ఎల్బీనగర్లో చిన్నారి మృతి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును సీజ్ చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద స్థలంలో ఇప్పటికీ రోడ్డుపైనే వాహనాలు నిలిచిపోయాయి. అయినా ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదు. -
హైదరాబాద్ ఎల్బీనగర్ లో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. 50పైగా కార్లు దగ్ధం!
హైదరాబాద్: ఎల్బీనగర్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని అది దావానంలా వ్యాపించింది. పక్కనే ఉన్న పాత కార్ల గ్యారేజ్ను మంటలు చుట్టుముట్టాయి. పాత కార్ల గ్యారేజ్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో 50పైగా కార్లు దగ్ధమైనట్లు తెలుస్తోంది. మరొకవైపు టింబర్ డిపో పక్కన ఉన్న మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్లకు మంటలు వ్యాపించాయి. దాంతో స్థానికులు భయభ్రాంతులకు గురౌవుతున్నారు. దట్టమైన పొగతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చుట్టుపక్కల వారి ఇళ్లను ఖాళీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. చదవండి: రాజేష్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు -
హైదరాబాద్లో ఈదురు గాలులతో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలో బుధవారం పలు చోట్ల వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, సరూర్ నగర్, ఘట్ కేసర్, ఫిర్జాదిగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అయితే ఈ ప్రభావం నగరం అంతటా ఉండకపోవచ్చునని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో ఇప్పటికే చాలా చోట్ల భానుడు ఉగ్ర రూపం చూపిస్తుండగా.. కొన్ని చోట్ల మాత్రమే వరుణుడు ప్రభావం చూపించాడు. చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు భారీ వర్షంతో వాతావరణం చల్లబడింది. మరికొన్ని చోట్ల కేవలం ఈదురు గాలులకే పరిమితం కావొచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతోంది. Rain at LBNAGAR pic.twitter.com/A0f2sUhszS — M.shanthibhushan (@msbhushan1) May 10, 2023 #HyderabadRains : Clouds are moving towards Southern parts of #GHMC charminar area to Shamshabad area#Hyderabad #WeatherUpdate pic.twitter.com/IKC3a3LGQF — Anusha Puppala (@anusha_puppala) May 10, 2023 #Thunder Showers with lightening in southern parts of #GHMC Area, #LBnagar, #Uppal, #Charminar area. #HyderabadRains pic.twitter.com/xoMMwo8tTR — Iqbal Hussain⭐ اقبال حسین (@iqbalbroadcast) May 10, 2023 -
అపార్ట్ మెంట్ వాసులపైకి కుక్కలను వదులుతున్న సీఐ నాగేంద్ర
-
ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో
వనస్థలిపురం (హైదరాబాద్): ‘తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. అధికారంలోకి వచ్చిన వెంటనే మెట్రోరైల్ సేవలను ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు విస్తరిస్తాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోను అనుసంధానిస్తాం. అంతేకాదు ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు మెట్రోరైల్ను నిర్మిస్తాం’ అని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు ప్రకటించారు. ఎల్బీనగర్ చౌరస్తా నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో నిర్మించిన భారీ ఫ్లైఓవర్ను శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్ (ఎస్ఆర్డీపీ)లో భాగంగా రూ.658 కోట్లతో 12 ప్రాజెక్టులు చేపడితే.. ఇప్పటివరకు తొమ్మిది ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నామని కేటీఆర్ చెప్పారు. బైరామల్గూడలో పెండింగ్లో ఉన్న మూడు ప్రాజెక్టులను కూడా సెపె్టంబర్లోపు పూర్తి చేస్తామని.. ఆ తర్వాతే ఎన్నికలకు వెళతామని పేర్కొన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటాలంటే కనీసం పది పదిహేను నిమిషాలు పట్టేదని.. ఇప్పుడా సమస్య తీరిందని చెప్పారు. పేదలకు పట్టాలిస్తాం.. హైదరాబాద్లో ఏడాదిన్నర కాలంలో వెయ్యి పడకల సామర్థ్యంతో టిమ్స్ ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక 118 జీవో కింద దరఖాస్తు చేసుకున్నవారికి ఈ నెలాఖరులోగా పట్టాలు పంపిణీ చేస్తామని.. ఈ జీవో పరిధిలోకి రాని కాలనీలను కూడా త్వరలో దీని పరిధిలోకి తీసుకొస్తామని చెప్పారు. జీవోలు 58, 59 కింద ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 1.28 లక్షల మందికి నివాస పట్టాలు ఇచ్చామని.. మిగతా పేదలకు కూడా పట్టాలిచ్చే బాధ్యత తమదేనని ప్రకటించారు. ఎస్ఆర్డీపీ, ఎస్ఎన్డీపీల కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఎల్బీనగర్ బీఆర్ఎస్లో భగ్గుమన్న విభేదాలు ఒకవైపు ఫ్లైఓవర్ను ప్రారంభించి, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తున్న సమయంలోనే.. మరోవైపు పార్టీ లో అంతర్గత వర్గపోరు బయటపడింది. బీఆర్ఎస్కు చెందిన చంపాపేట మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వర్గీయులు రమణారెడ్డిపై దాడికి యత్నించగా ఆయన, ఆయన వర్గీయులు పరుగులు తీశారు. చివరికి పోలీసులు కల్పించుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ కార్యక్రమం అనంతరం గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి ఓటమిపాలైన ముద్దగోని రామ్మోహన్గౌడ్, రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. దేవిరెడ్డి సుదీర్రెడ్డి కాంగ్రెస్లో గెలిచి, బీఆర్ఎస్లో చేరాక.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి దిగజారిందని ఆరోపించారు. పా ర్టీ లోని అసలైన ఉద్యమకారులు, సీనియర్లపై ఎమ్మెల్యే పెయిడ్ ఆరి్టస్టులు, గూండాలతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఎల్బీనగర్ జంక్షన్కు శ్రీకాంతాచారి పేరు ఎల్బీనగర్ జంక్షన్కు తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి పేరు పెడతామని.. ఫ్లైఓవర్కు మాల్ మైసమ్మ పేరు పెడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లే కాకుండా ప్రజారవాణా బాగా మెరుగుపడాల్సి ఉందన్నారు. -
ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ ప్రారంభం...డ్రోన్ విజువల్స్
-
నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. ఏ2గా హరిహరకృష్ణ ప్రియురాలు
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు హరిహర కృష్ణ ప్రియురాలు, స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య అనంతరం హరిహరకృష్ణకు ప్రియురాలు డబ్బులు పంపించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రియురాలు నిహారికారెడ్డిని ఏ2గా, స్నేహితుడు హసన్ను ఏ3గా పోలీసులు చేర్చారు. గత నెల 17న జరిగిన నవీన్ హత్య కేసు వివరాలను ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. ‘‘నవీన్ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం. నవీన్ హత్య గురించి నిహారికకు తెలిసినా పోలీసులకు చెప్పలేదు. హసన్కు కూడా హత్య విషయం తెలుసు. నిహారికతో పాటు హసన్ను రిమాండ్కు తరలించాం’’ అని డీసీపీ వెల్లడించారు. ‘‘హత్య జరిగిన తర్వాత హరిహరకు నిహారిక రూ.1500 ట్రాన్స్ఫర్ చేసింది. నవీన్ను హత్య చేసిన తర్వాత ఘటనాస్థలికి హరిహర, నిహారిక, హసన్ ముగ్గురు వెళ్లారు. నిహారిక ఫోన్ డేటాను డిలీట్ చేసి, ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడింది. నవీన్ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది’’ అని డీసీపీ సాయిశ్రీ పేర్కొన్నారు. చదవండి: నవీన్ను ఎలా చంపావ్? హత్య కేసు సీన్ రీ కన్స్ట్రక్షన్ -
మామిడి చెట్టు తెచ్చిన తంటా!.. మేడ మీద ఆకులు పడుతున్నాయని
సాక్షి, హైదరాబాద్: ‘పచ్చని చెట్లు ప్రగతి మెట్లు’ అని నేర్పించాల్సిన టీచర్ బుద్దే వక్రంగా మారింది. ఇంటి మేడ మీద ఆకులు పడుతున్నాయని, చెట్టు వేర్లు గోడ లోపలికి చొచ్చుకుపోతున్నాయని లేనిపోని తగాదాతో తంటాలు తెచ్చుకుంది ఓ రిటైర్డ్ మహిళా టీచర్. చెట్టును కొట్టేయాలని ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది. న్యాయస్థానం ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చెట్టును తొలగించారు. దీంతో మొదలైన గొడవ.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే వరకు వచ్చింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న కేసు వివరాలు ఇలా ఉన్నాయి. రిటైర్డ్ ఉపాధ్యాయురాలు మల్లికాంబ (పేరు మార్చాం) ఎల్బీనగర్లోని ఫతుల్లగూడలో నివాసం ఉంటుంది. ఆమె ఇంటి వెనక ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారి ఇంట్లో ఉన్న మామిడి చెట్టు కొమ్మలు, ఆకులు వృద్ధురాలి భవనం మేడ మీద పడుతున్నాయని ప్రతి రోజు అద్దెవాసులతో గొడవ పడేది. దీంతో వారు పలుమార్లు కొమ్మలను కొట్టేశారు. అయినా ఓర్వలేక చెట్టు వేర్లు గోడల్లోపలికి వెళుతున్నాయని మళ్లీ గొడవ పెట్టుకుంది. కిరాయిదారులు వినకపోవడంతో చెట్టును తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోపోవడంతో ఈసారి ఏకంగా హైకోర్టును ఆశ్రయించింది. చెట్టుతో తన ఇంటికి నష్టం వాటిళ్లుతోందని, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడంలేదని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం తగిన చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించింది. చేసేదిలేక సంబంధిత అధికారులు మామిడి చెట్టును కొట్టేశారు. ఇటీవల అద్దె వసూలు చేసేందుకు ఇంటికి వచ్చిన యజమాని మామిడి చెట్టు కొట్టేసి ఉండటాన్ని గుర్తించి అద్దెవాసులను ప్రశ్నించాడు. వారు అసలు విషయం చెప్పడంతో మల్లికాంబ, ఇంటి యజమాని, అద్దెదారులకు మధ్య గొడవ జరిగింది. అది కాస్తా పోలీసు స్టేషన్కు చేరడంతో.. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన రిటైర్డ్ టీచర్ వాళ్ల మోహం మీదే తలుపులు వేసి లోపలికి వెళ్లిపోయింది. దీంతో ఇరుగుపొరుగును విచారించిన అధికారులకు ఆమె వైఖరి తెలుసుకుని అవాక్కయ్యారు. కాలనీలోని ప్రతి ఒక్కరితోనూ ఆమెకు తగువులాటేనని, ప్రతి చిన్న విషయానికి దూర్భాషలాడుతుందని చెప్పారు. అద్దెదారుల ఫిర్యాదు మేరకు మలికాంబపై ఎస్సీఎస్టీ కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమె వయసును దృష్టిలో ఉంచుకుని అరెస్టు చేయకుండా 41–ఏ నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఎస్సీఎస్టీ కేసులో చార్జిషీటు దాఖలు చేయాలంటే బాధితులు, నిందితులు ఇరువర్గాల కుల ధ్రువీకరణ పత్రం అనివార్యం. దీంతో పోలీసుల సూచన మేరకు ఉప్పల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు ఆమె ఇంటికి వెళ్లగా.. మీరెవరు, ఎందుకు వచ్చారు. వారిపై విరుచుకుపడింది. దీంతో విస్తుపోయిన అధికారులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఎవరెవరో మా ఇంటికి వస్తున్నారని, వేధిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్లోనూ వాగ్వాదానికి దిగడం కొసమెరుపు. -
పొలిటికల్ కారిడార్: ఎల్బీ నగర్లో అన్ని సమస్యలే
-
కామినేని ఆస్పత్రిలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మృతిచెందిన వ్యకికి చికిత్సను అందించి ఠాగూర్ సినిమాలోని సీన్ను తలపించేలా ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్ వ్యవహరించిందని మృతుని కుటుంబసభ్యులు గురువారం రాత్రి హాస్పిటల్ ఎదుట ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్ ఘన్పూర్కు చెందిన మునుగెల శివకృష్ణ(35) సూర్యాపేటలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో లోన్ రికవరీగా ఉద్యోగం చేస్తూ భార్య ఉమా పిల్లలు అక్షత, కన్నయ్యలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. శివకృష్ణకు గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు సూర్యాపేట నుంచి నార్కట్పల్లిలోని కామినేని ఆస్పత్రికి ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషయమంగా ఉందని ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్కు తరలించాలని సూచించారు. వెంటనే అదేరోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో శివకృష్ణను ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్స్కు తీసుకొచ్చారు. పరీక్షించిన ఎల్బీనగర్ కామినేని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. గుండె నాళాలు మూసుకుపోయాయని మూడు స్టట్స్ వేయాలని వైద్యులు చేప్పడంతో వేయమని చెప్పామన్నారు. శివకృష్ణకు ఇన్సూరెన్స్ కార్డు ఉన్నా ఇంకా అప్రూవల్ రాలేదని డబ్బులు చెల్లించాలని పేర్కొనడంతో డబ్బులు చెల్లించారు. రోగి పరిస్థితి విషమంగా ఉందని కిడ్నీలు చెడిపోయాయని, డయాలసిస్ చేస్తున్నామని వైద్యులు తెలిపారన్నారు. డబ్బులు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు ఒత్తిడి చేయడంతో రూ. 7లక్షలు చెల్లించామని ఇంకా డబ్బులు చెల్లించలేమని, రోగిని నిమ్స్కు తీసుకెళ్లామని బంధువుల పేర్కొనగా... రెండు రోజులుగా రోగిని బంధువులకు చూపించకుండా, రోగి పరిస్థితి కుటుంబసభ్యులకు తెలుపకుండా గుట్టుగా ఉంచారని ఆరోపించారు. గురువారం ఉదయం నుంచి రోగి బంధువులు, కుటుంబ సభ్యులు షిఫ్ట్ చేస్తామని మరింత ఒత్తిడి చేశారు. రాత్రి సమయంలో రోగి బంధువులు, కుటుంబ సభ్యులకు తెలుపకుండా దొంగచాటుగా రోగిని అంబులెన్స్లో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా బంధువులు, కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకుని ఆస్పత్రి వర్గాలను నిలదీశారు. అంతేకాకుండా ఆస్పత్రి ఎదుట ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. మృతి చెందిన వ్యక్తికి వెంటిలేటర్ ఏర్పాటు చేసి చికిత్సను అందించారని కేవలం ఇన్సూరెన్స్ను క్లయిమ్ చేసుకునేందుకు మృతిచెందిన వ్యక్తికి చికిత్సను అందించారని ఆరోపణలు చేస్తూ ఆందోళన చేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. కామినేని హాస్పిటల్స్ సూపరింటెండెంట్ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో రాలేదు. -
ఎల్బీ నగర్లో హీరో సిద్దు, హీరోయిన్లు అనుపమ, శ్రీలీల సందడి!
వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభం లింగోజిగూడ: దక్షిణ భారత్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటి ప్రాజెక్ట్ ఎల్బీనగర్లో ప్రారంభమైంది. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద వాసవి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీని ఆదివారం ప్రారంభించారు. శ్రీముఖి యాంకర్గా వ్యవహరించిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ సినీ నటులు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల పాల్గొని సందడి చేశారు. వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్కుమార్, డైరెక్టర్లతో కలసి సినీ నటులు ఆనంద నిలయం లోగో, ఎలివేషన్, బ్రోచర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీలలు మాట్లాడుతూ వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్కుమార్ మాట్లాడుతూ ఆనంద నిలయంలో ప్రజల కోసం ఎన్నో సకల సౌకర్యాలు కల్పించనున్నామని అన్నారు. 29.3 ఎకరాలలో 11టవర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 3576 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. వీటితో పాటు పిల్లకోసం ఆట స్థలం, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికె ట్ గ్రౌండ్, జిమ్ వంటి సౌకర్యాలు ఉంటయన్నారు. దక్షిణ భారత్లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయిన ఆనంద నిలయంలో అతి తక్కువ ధరకే ప్రజలకు ఫ్లాట్లను అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, టూరిజం డవపల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, సంస్థ డైరెక్టర్లు ఎర్రం వైష్ణవి, ఎర్రం వనిత, దివ్య, సౌమ్య, రాజేశ్, అభిషేక్ చంద్రత తదితరులు పాల్గొన్నారు. -
ఎల్బీనగర్లో డ్రగ్స్ కలకలం
-
ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..
సాక్షి, మైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పలువురికి అవార్డులను అందజేయడంతో పాటు క్రైస్తవులతో కలిసి సీఎం కేసీఆర్ డిన్నర్ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు వాణీదేవి, రాజేశ్వర్రావు, నగర మేయర్ విజయలక్ష్మి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజుసాగర్, నగర సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. పూల ఆంథోనికి మంత్రి కొప్పుల ఆహ్వానం.. రాంగోపాల్పేట్: క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్, కార్డినల్ పూల ఆంథోనిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. మంగళవారం ఎస్పీ రోడ్లోని బిషప్ హౌజ్లో ఆయనను మంత్రి కలిశారు. -
ఎల్బీ నగర్ లో ‘ముక్తిఘాట్’.. ఒకేచోట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ శ్మశానాలు
-
హైదరాబాద్ మెట్రో.. కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో మెట్రో సేవలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. బిజీ రూట్గా పేరున్న ఎల్బీ నగర్ మార్గంలో హయత్ నగర్ వరకు రూట్ను పొడగింపు ఉంటుందని ప్రకటించారు. మంగళవారం నాగోల్-ఫిర్జాదిగూడ లింక్ రోడ్డు ప్రారంభ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హయత్ నగర్ వరకు మెట్రో పొడగింపు ఉండనుందని తెలిపారు. అంతేకాదు.. నాగోల్-ఎల్బీ నగర్ మెట్రో లైన్ను అనుసంధానం చేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల తర్వాత రెండో ఫేజ్ పూర్తి చేసి తీరతామని మంత్రి కేటీఆర్ హమీ ఇచ్చారు. -
అయ్యప్ప కాలనీలో ఇకపై వరద రాదు
-
ఎల్బీనగర్ అసెంబ్లీ సీటు కోసం బీజేపీలో పోటా పోటీ ..
-
Hyderabad: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం చూస్తే. నగర శివారు డిపోల నుంచి నిత్యం సుమారు 150 బస్సుల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల ఓటర్లను నగర శివార్లలోని మన్నెగూడకు తరలించేందుకు ఏర్పాటు చేయడంతో.. శివారు వాసులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పలు రూట్లలో రాకపోకలు సాగించేందుకు బస్సులు అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. శివారు డిపోల నుంచి ప్రతి మండలానికి నిత్యం 20– 30 బస్సులను తరలిస్తున్నట్లు తెలిసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఖరీదైనదిగా మునుగోడు ఉపఎన్నిక మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శివార్లలోని మన్నెగూడలోని కన్వెన్షన్ సెంటర్లకు తరలించి పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం ఊపందుకుంది. కులాల వారీగా తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. బస్సులు లేక శివారు వాసుల అవస్థలు గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలుండగా.. శివారు ప్రాంతాల్లో ఉన్న బండ్లగూడ, హయత్నగర్–1, 2, ఇబ్రహీంపట్నం, మిధాని, ఫరూఖ్నగర్ తదితర డిపోలకు చెందిన 150 బస్సులు నిత్యం మునుగోడు ఓటర్లను సామాజికవర్గాల వారీగా ఆతీ్మయ సమ్మేళనం పేరిట మన్నెగూడకు తరలించేందుకు వినియోగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు చెల్లించి ఈ బస్సులను తరలిస్తున్నట్లు ఆయా పారీ్టల నేతలు చెబుతున్నారు. నగరంలో అరకొరగా ఉన్న ఆర్టీసీ బస్సులను మునుగోడుకు తరలించడంతో నగరంలోని 1050 ఆర్టీసీ రూట్లుండగా.. వీటిలో 250 రూట్లలో నిత్యం 1500 ట్రిప్పులకు కోత పడుతోంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వేలాది మంది సెవన్సీటర్ ఆటోలు,క్యాబ్లు ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. శివారు ఆర్టీసీ డిపోల నుంచి ఓఆర్ఆర్ పరిధిలోని 190 గ్రామాలకు రాకపోకలు సాగించే బస్సులే అధికంగా ఉన్నాయి. ఉన్నపళంగా ఈ బస్సులు మునుగోడు బాట పట్టడంతో ఆయా గ్రామాల వాసులు ఉదయం, రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు. కాగా బస్సుల తరలింపు వ్యవహారంపై ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ ఆర్ఎంను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా...ఆయన అందుబాటులోకి రాలేదు. -
నాగోల్ ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. నాగోల్ ఫ్లైఓవర్ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) కింద రూ. 143 కోట్లతో 990 మీటర్ల పొడవునా ఈ ఫ్లైఓవర్ను నిర్మించారు. దీంతో నాగోల్ పరిసర ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నామన్నారు. నగర విస్తరణకు తగ్గ విధంగా మౌలిక వసతుల కల్పన కోసం ప్లాన్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. లేదంటే బెంగళూరు తరహాలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎఎస్సార్డీపీ కార్యక్రమాన్ని తీసుకుమని.. రూ. 8వేల52 కోట్లతో 47 ప్రాజెక్టులు చేపట్టినట్లు వెల్లడించారు. ఉప్పల్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోనే 16 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. రెండవ దశలో 12 ప్రాజెక్టులను చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం 32 ప్రాజెక్టులు పూర్తికగా 16 ఫ్లై ఓవర్లు ఉన్నాయన్నారు. ‘హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి గతంలో చాలా ట్రాఫిక్ కష్టాలు ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. ఎల్బీనగర్ నియోజకవర్గలో 700 కోట్లకు పైగా ఖర్చు చేసి 9 ప్రాజెక్టులు పూర్తి చేశాం. రాబోయే నాలుగైదు నెలల్లో ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం. ఎల్బీనగర్ ప్రాంతంలో 600 కోట్లు ఖర్చు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశాం. భవిష్యత్తు తరాలకు మెరుగైన వసతులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులతో పాటు దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. రాజకీయాలు ఎన్నికల అప్పుడు చేద్దాం. ఇప్పుడు అభివృద్ధి పై ఫోకస్ చేద్దాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. As the #NagoleFlyover is all set for inauguration by @TSMAUDOnline Minister Sri @KTRTRS today, here's a quick recap of all Road over Bridges (RoBs) & Road under Bridges (RuBs) that #Telangana Govt. has built in #Hyderabad in last 8 years.#SRDP #HappeningHyderabad@TelanganaCMO pic.twitter.com/KyIH67gybQ — Telangana Digital Media Wing (@DigitalMediaTS) October 26, 2022 తీరనున్న ట్రాఫిక్ కష్ట్రాలు రెండు వైపుల ప్రయాణించేలా ఉన్న ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ సర్వాంగ సుందరంగా తీర్చదిద్దింది. ఒక్కోవైపు మూడు లేన్లతో ఉన్న ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ వైపు నుంచి సికింద్రాబాద్ వైపు రాకపోకలు సాగించేవారికి సాఫీ ప్రయాణం సాధ్యం కావడంతోపాటు నాగోల్ చౌరస్తా వద్ద, బండ్లగూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సమస్యలు 75 శాతం పరిష్కారం కానున్నాయి.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, ఎల్బీనగర్ల మీదుగా ఉప్పల్ వరకు వచ్చేవారు ఈ ఫ్లైఓవర్తో సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. ఇది 16వ ఫ్లైఓవర్.. ఎస్సార్డీపీ ద్వారా పూర్తయిన పనుల్లో ఇది 16వ ఫ్లైఓవర్. ఇప్పటికే 15 ఫ్లైఓవర్లతోపాటు 5 అండర్పాస్లు, 7 ఆర్ఓబీ/ఆర్యూబీలు, దుర్గంచెరువు కేబుల్బ్రిడ్జి, పంజగుట్ట స్టీల్బ్రిడ్జి అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్లలో రూ. 448 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటికే కొన్ని పూర్తయి వినియోగంలోకి వచ్చాయి. సులభ ప్రయాణం.. 2015 సర్వే మేరకు నాగోలు జంక్షన్ వద్ద రద్దీ సమయంలో గంటకు 7,535 వాహనాలు(పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. 2034 నాటికి ఈ సంఖ్య 12,648కి చేరుకోనుందని జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం చీఫ్ ఇంజినీర్ ఎం.దేవానంద్ తెలిపారు. సిగ్నళ్లు లేని సాఫీ ప్రయాణం వల్ల వాహనదారులకు ఎంతో సమయం, ఇంధనం ఆదా కావడంతోపాటు వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. మంగళవారం ఎస్సార్డీపీ అధికారులు కె. రమేష్ బాబు, రోహిణి, జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డీసీ మారుతీ దివాకర్, ఏఎంహెచ్ఓ శ్రీనివాస్, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి, ఎల్బీనగర్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటేశ్వర్లు నాగోలు ప్లైఓవర్ను పరిశీలించారు. -
నాగోల్ ఫ్లై ఓవర్ రెడీ.. ఇక రయ్ రయ్ (ఫోటోలు)
-
ఎల్బీ నగర్లో ఏం జరుగుతోంది?.. మునుగోడు ఎన్నికకు సంబంధమేంటీ?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరుగుతోందా? ఎల్బీ నగర్కు మునుగోడుకు సంబంధం ఏంటి? మునుగోడులో ఎవరు గెలిచేది ఎల్బీ నగర్ నిర్దేశించబోతోందా? మునుగోడు వెళ్లాల్సిన మూడు పార్టీల ముఖ్య నేతలంతా ఎల్బీనగర్లోనే ఎందుకు మకాం వేశారు? హైదరాబాద్ శివార్లపై దృష్టి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేకెత్తిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు చావో రేవో అన్నట్లుగా ప్రయత్నిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా పోకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. అంది వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేవు రాజకీయ పార్టీలు. అందుకే మునుగోడు ఓటర్లు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నారో గాలిస్తున్నారు. వెతికి పట్టుకుంటున్నారు. ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆశలు రేకెత్తిస్తున్నారు. తాయిలాలు ఎరగా వేస్తున్నారు. నియోజకవర్గానికి చెందిన వేలాది మంది ఓటర్లు ఉపాధి కోసం హైదరాబాద్ నగర శివార్లలోని పలు ప్రాంతాలకు వలస వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోనే ఉంటూ ప్రయివేటు ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఉంటున్నవారి అడ్రస్, ఫోన్ నెంబర్లు మునుగోడులోని వారి బంధు, మిత్రుల నుంచి సేకరించి వారితో భేటీలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. 25వేల మంది@ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో మునుగోడు ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. దాదాపు 25 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా మునుగోడు ఓటర్లే. దీనిపై పక్కా సమాచారం సేకరించిన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ నేతలు వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు మందు, విందు ఏర్పాటు చేసి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారట. నాగార్జున సాగర్ రోడ్లో ఇబ్రహీం పట్టణం సహారా ఎస్టేట్స్ నుంచి ఎల్బీ నగర్ వరకు ఉన్న కాలనీల్లో మూడు పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని టాక్. ఎవరికి వారు తమ పార్టీకే ఓటేసేవిధంగా వారితో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఓటర్ల కోసం ముంబైలో గాలింపు పార్టీల ప్రచారం చూస్తున్న స్థానికులు ఎన్నిక జరుగుతోంది.. మునుగోడు లోనా ఎల్బీనగర్ లోనా అని చర్చించుకుంటున్నారట. ఇటువంటి పరిస్థితి ఒక ఎల్బీనగర్ కు మాత్రమే పరిమితం కాలేదు. ఉపాధి వెతుక్కుంటూ ముంబాయి వెళ్లినటువంటి వలస కూలీల వద్దకు కూడా ఒక పార్టీ కీలక నేత వెళ్లి నవంబర్ మూడున ఓటు వేసేందుకు రావలసిందిగా కోరారట. అందుకు అవసరమైన ఖర్చు కూడా తామే భరిస్తామని.. ఏదైనా కోరితే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చి వచ్చారట. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. చదవండి: Munugode Bypoll: జరిగే మేలు ఎవరికి?.. చీలే ఓట్లెవరివి.. -
లాడ్జీలో వ్యభిచారం.. ఇద్దరు మహిళలతో సహా ఆరుగురు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: లాడ్జీలో వ్యభిచారం చేయిస్తున్న లాడ్జీ యజమానితో పాటు ఐదుగురిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ ఎదురుగా కర్నాటి రామారావు అనే వ్యక్తి శ్రీ వెంకటేశ్వర లాడ్జీని నిర్వహిస్తున్నాడు. రిసెప్షనిస్ట్గా యడ్డ సహదేవ్ పని చేస్తున్నాడు. సెక్స్ వర్కర్లను నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం రాత్రి వెంకటేశ్వర లాడ్జీపై దాడి చేసి తనిఖీలు చేపట్టారు. విటులు దేవరాజు, మాణిక్ స్వరూప్, కర్నూల్ ప్రాంతాన్ని చెందిన ఒక మహిళ, నల్గొండ జిల్లా డిండికి చెందిన మరో మహిళ పట్టుబడ్డారు. లాడ్జీ నిర్వాహకులు కర్నాటి రామారావు, సహదేవ్ను కూడా అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించారు. -
మైనర్పై లైంగిక దాడి, జైలుకెళ్లి వచ్చాక పెళ్లి.. భార్యపై అనుమానంతో
సాక్షి, హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యపై భర్త దాడి చేయడంతో త్రీవంగా గాయపడిన ఆమె మృతి చెందింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... నందనవనంలో ఉండే సబా ఫాతీమా(22) మైనర్గా ఉన్నపుడు బైరామల్గూడలోని అల్లాఫ్ నగర్లో ఉంటూ కూలీ పని చేసే పాతనేరస్తుడు దాసరి సురేందర్ (30) ఆమెపై అత్యాచారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మీర్పేట పోలీసులు అతడిపై ఫోక్సో తదితర కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బాధితురాలినే సురేందర్ కులాంతర వివాహం చేసుకున్నాడు. సురేందర్ తల్లి యాదమ్మ, భార్య సబా ఫాతీమాతో కలిసి అల్లాఫ్నగర్లో ఉంటున్నాడు. వీరికి 9 నెలల పాప ఉంది. 2021 డిసెంబర్లో బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం కేసులో మళ్లీ అరెస్టయి జైలుకు వెళ్లాడు. జైలు నుంచి వచ్చినప్పటి నుంచీ రోజూ తాగి ఇంటికి వచ్చేవాడు. కూతురు పుట్టడంతో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తూ కొట్టేవాడు. ఇదే క్రమంలో బుధవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది. సురేందర్ భార్యపై చేయి చేసుకోవడం కింద పడి తీవ్ర రక్తస్రావమైంది. ఫాతీమా మెట్లపై నుంచి కిందపడి గాయపడిందని ఆమె తల్లిదండ్రులకు సురేందర్ సమాచారం ఇచ్చాడు. స్థానికులు వెంటనే ఫాతీమాను చికిత్స నిమిత్తం వనస్ధలిపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయిందని చెప్పారు. మృతురాలి తల్లి షబానా బేగం తన కుతురును అల్లుడు సురేందర్, ఆమె తల్లి యాదమ్మ కలిసి హత్య చేశారని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. చదవండి: నీ కుమారుడి కంటే దారణంగా చంపుతాం.. సిద్ధూ తండ్రికి బెదిరింపులు -
హైదరాబాద్లో ఫేక్ డాక్టర్ భాగోతం గుట్టురట్టు
-
ఎల్బీ నగర్ ఘటన: చిన్నారి వర్షితది ఆత్మహత్యే
నాగోలు: అనేక ప్రశ్నలు.. ఎన్నో అనుమానాల బాలిక వర్షిత మృతి కేసును పోలీసులు ఛేదించారు. మంగళవారం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్రెడ్డి తెలిపారు. బాలిక మృతి పట్ల వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు ఆయన చెప్పారు. బాలికను తీసుకువచ్చిన ఆటో డ్రైవర్ దుర్గేష్ను విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఏసీపీ కథనం ప్రకారం వివరాలు.. మన్సురాబాద్లోని మధురానగర్లో కాలనీ రోడ్డు నంబర్– 5లో ఉంటున్న సత్యనారాణరెడ్డి, ప్రభావతి దంపతుల కూతురు వర్షిత. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన బాలిక చిప్స్ కొనుకుంటానంటూ దుకాణానికి వెళ్లింది. మన్సూరాబాద్ చౌరస్తాకు వచ్చి ఆటో ఎక్కింది. అక్కడ నుండి ఎల్బీనగర్ చౌరస్తా మీదగా చంద్రపూరి కాలనీ రోడ్డునెం. 2/బీ కు వెళ్లి ఆటో అతని రూ. 50 ఇచ్చి అక్కడ దిగింది. ఆటోలో వెళ్లే క్రమంలో తన తండ్రికి ఫోన్ చేయాలని డ్రైవర్కు నంబర్ చెప్పింది. ఫోన్ బిజీగా రావడంతో ఆటో డ్రైవర్ వర్షితను అపార్ట్మెంట్ వద్ద దించేశాడు. అక్కడ ఉన్న వాచ్మన్ వెంకటమ్మ వర్షిత బిల్డింగ్పైకి వెళ్తుండగా.. ఎవరు కావాలని అడిగింది. మా నాన్న కోసం వచ్చానంటూ చెప్పి బిల్డింగ్పైకి వెళ్లింది. వాచ్మన్ తన కుమారుడైన రాజున బిల్డిండ్పైకి పంపగా ఎవరూ కనిపించలేదు.. ఇంతలోనే వర్షిత నాలుగో అంతస్తుపై నుంచి కిందకు దూకింది. తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. చిన్నారి కావాలనే నాలుగో అంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. బాలిక వర్షితపై లైంగిక దాడి జరిగిందా? అనే కోణంలో వైద్య పరీక్షలు చేయగా.. అలాంటిదేమీ లేదని వెల్లడైందన్నారు. చదువులో ముందుండే వర్షిత.. అందరితోనూ కలుపుగోలుగా మసలుకునేదని కాలనీవాసులు కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబంలో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో సున్నిత మనస్కురాలైన వర్షిత కొంత ప్రభావితమై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని సమాచారం. (చదవండి: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!) -
హైదరాబాద్ ఎల్బీనగర్ లో చిన్నారి అనుమానాస్పద మృతి
-
HYD: మిస్టరీగా చిన్నారి మృతి.. ఆటోడ్రైవర్ ఫోన్ కాల్ కీలకం!
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లో బాలిక మృతి కేసులో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్డింగ్పై నుంచి కిందపడి ఎనిమిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. మధురానగర్లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత(9) కిరాణా షాపునకు వెళ్తున్నానంటూ తల్లికి చెప్పి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఆటోలో చంద్రపురి కాలనీలోని ఓ బిల్డింగ్ వద్దకు వచ్చింది. ఈ క్రమంలో ఆటో డ్రైవర్ ఫోన్ నుండి గుర్తుతెలియని వ్యక్తికి ఫోన్ చేసింది. అనంతరం,ఐదు నిమిషాల సమయంలో వర్షిత.. బిల్డింగ్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. కాగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇక, చిన్నారి అసలు.. బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్లింది? ఎవరికి కాల్ చేసింది? ఎలా పడిపోయింది? పాప మృతిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు.. వర్షితది హాత్యా? లేక ప్రమాదమా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. భవనంలో ఉన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: ప్లైఓవర్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య -
అయ్యో పాపం.. వర్షిత
నాగోలు: అనుమానాస్పద స్థితిలో ఓ చిన్నారి అపార్టుమెంట్లోని నాలుగో అంతస్తుపై నుంచి కింద పడి అసువులు బాసిన ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వనిపాకల గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి, ప్రభావతి దంపతులు. మన్సూరాబాద్లోని మధురానగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రభావతి ప్రైవేట్ టీచర్. సత్యనారాయణ రెడ్డి స్వగ్రామంలో వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రెండో కూతురు వర్షిత (12) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన తర్వాత చిప్స్ కొనుక్కుంటానని తల్లి వద్ద రూ.20 తీసుకుని బయటకు వెళ్లింది. మన్సూరాబద్ చౌరస్తాకు వచ్చి ఆటో డ్రైవర్కు రూ.50 ఇచ్చి ఎల్బీనగర్లోని చంద్రపురి కాలనీలోని రోడ్డు నంబర్–2లో ఉన్న ఓ అపార్టుమెంట్ వద్దకు వచ్చిది. అపార్టుమెంట్ పైకి వెళ్తుండగా అక్కడి వాచ్మన్ ఎవరు కావాలని అడగటంతో ‘మా నాన్న ఇక్కడే ఉన్నాడు’ అంటూ నాలుగో అంతస్తుపైకి వెళ్లింది. అప్పటికే అనుమానం వచ్చిన వాచ్మన్ చిన్నారి వెనుక అతని కొడుకును లిఫ్ట్లో పంపించాడు. పైకి వెళ్లి వెతికినా వర్షిత జాడ కనపించలేదు. కొద్ది సేపటి తర్వాత బాలిక కింద పడిన శబ్దం రావడంతో అక్కడికి వెళ్లి చూడగా చిన్నారి తీవ్ర గాయాలతో కనిపించింది. వెంటనే స్థానికులు ఆమెను ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి కన్నుమూసింది. ఎల్బీనగర్ పోలీసులకు అపార్టుమెంట్ వాచ్మన్ సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను వారు పరిశీలించారు. చిన్నారి అక్కడికి ఎందుకు వచ్చింది? అపార్టుమెంట్లో ఎవరు ఉన్నారు? నాలుగో అంతస్తుపై నుంచి తానే దూకిందా? వేరే ఎవరైనా బాలికను కిందకు తోశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: డీఎస్పీ హత్య.. నిందితుడ్ని గంటల్లోనే పట్టుకున్న పోలీసులు.. ఎన్కౌంటర్లో బుల్లెట్ గాయం) -
వ్యభిచార గృహంపై దాడి: ఇద్దరి అరెస్టు
సాక్షి, హైదరాబాద్(నాగోలు): వ్యభిచార గృహంపై ఎల్బీనగర్ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు బండ్లగూడ కృషినగర్లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా టైలరింగ్ చేస్తోంది. ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసంపై దాడి చేయగా వ్యభిచారం చేస్తూ అనూష, కొత్తపేటకు చెందిన గురుజాల అనిల్కుమార్ పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. చదవండి: (వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్ కాల్స్.. వాటిని రికార్డ్స్ చేసి!) -
LB Nagar: కామినేని ఫ్లైఓవర్ల కింద పార్కు
సాక్షి, హైదరాబాద్: నడక మార్గాలు, ఫౌంటెన్లు, శిల్పాలు, కూర్చునే బెంచీలు, పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక స్థలాలు, కెఫ్టేరియా.. ఇలా వివిధ సదుపాయాలతో ఆక్సిజన్ను అందించే పచ్చని మొక్కలతో ప్రత్యేక పార్కు త్వరలో నగర ప్రజలకు కనువిందు చేయనుంది. ఇన్ని సదుపాయాలు కలిగిన పార్కు బహిరంగ ప్రదేశంలో కాకుండా రెండు ఫ్లైఓవర్ల కింద ఏర్పాటవుతుండటమే విశేషం. ఇప్పటికే షేక్పేట, బహదూర్పురా ఫ్లైఓవర్ల కింద సైతం పచ్చదనం ఉన్నప్పటికీ దాదాపు రెండెకరాల విస్తీర్ణంలో ఇన్ని సదుపాయాలతో కూడిన అతిపెద్ద ఉద్యానవనం ఇదే కానుంది. ఎల్బీనగర్ జోన్లోని కామినేని ఫ్లైఓవర్ల కింద ఇది అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సివిల్ ఇంజినీరింగ్ పనులు జరుగుతున్న ఈ ప్రాంతంలో యాంఫీథియేటర్ సైతం రానున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (క్లిక్: ఎంఎంటీఎస్ ప్రయాణికులకు గుడ్న్యూస్) దాదాపు కోటి రూపాయల వ్యయమవుతున్న ఈ పార్కుకు ఆక్సిజన్ పార్కుగా నామకరణం చేయనున్నారు. పరిసరాల్లో నివసించే ప్రజలకే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ మార్గంలో ప్రయాణించే వారికి సైతం పచ్చదనంతో కనువిందు చేయడంతోపాటు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించనుంది. ఖాళీ ప్రదేశాలను ప్రయోజనకరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా జీహెచ్ఎంసీ జీవవైవిధ్య విభాగం(యూబీడీ) డిజైన్ చేసిన ఈ ఆలోచన.. ఫ్లైఓవర్ల కింద పూర్తిస్థాయి పార్కు రాష్ట్రంలో ఇదే ప్రథమం. (క్లిక్: ఆర్టీసీకి ఆర్డరిస్తే మీ ఇంటికే బంగినపల్లి) -
అలా చేస్తే కిషన్రెడ్డిని హైదరాబాద్ నడిబొడ్డున సత్కరిస్తాం: మంత్రి కేటీఆర్
సాక్షి, ఎల్బీనగర్/నాగోలు: నగరంలో నలువైపులా ఒకే తీరు అభివృద్ధి చేస్తున్నామని, ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.672 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించినట్లు, రూ.103 కోట్ల వ్యయంతో నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. నాగోలు బండ్లగూడ చెరువు వద్ద నాలా అభివృద్ధి పనులకు, ఎల్బీనగర్ చౌరస్తాలో అండర్పాస్ (కుడివైపు), బైరామల్గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్ను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీలు యెగ్గె మల్లేశం, బి.దయానంద్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గతంలో వర్షాలు, వరదలతో ఎల్బీనగర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ కింద రూ.103 కోట్ల వ్యయంతో వరద ముంపును శాశ్వతంగా నివారించేందుకు నాలా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో రూ.2,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా నగర అభ్యున్నతికి కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టూరిజం శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, ఎస్సీ రవీందర్ రాజు, కార్పొరేటర్లు చింతల అరుణ, కొప్పుల నర్సింహారెడ్డి, దర్పల్లి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. చదవండి: హైదరాబాద్: కీలక నిర్ణయం.. ఎక్కడపడితే అక్కడ.. ‘ఫొటోలు’ తీయరిక! ఫ్లై ఓవర్ను ప్రారంభిస్తున్న మంత్రులు కేటీఆర్, సబిత, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, మేయర్ విజయలక్ష్మి 10 వేల కోట్లు తీసుకురావాలి: కేటీఆర్ స్థానికంగా గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు కూడా హైదరాబాద్ అభివృద్ధిలో పోటీ పడాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద ముంపు శాశ్వత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 వేల కోట్లు తీసుకురావాలని కోరారు. వరదల వేళ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ ఇవ్వలేదన్నారు. కిషన్రెడ్డి నిధులు తెస్తే హైదరాబాద్ నడిబొడ్డున ఆయనకు పౌర సన్మానం చేస్తామన్నారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఢీకొట్టిన లారీ
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగోల్ క్రాస్ రోడ్డు వద్ద వేగంగా వెళ్తున్న ఓ లారీ.. వినయ్ రెడ్డి (24) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్ను ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడు అల్కాపురి నుంచి పటేల్ నగర్కి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ను పట్టుకుంటామని తెలిపారు. -
ఇక వారికి ట్రాఫిక్ చిక్కులు లేనట్లే.. ఫిబ్రవరిలోనే అందుబాటులోకి
సాక్షి, హైదరాబాద్: ఎస్సార్డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన మరో అండర్పాస్ వచ్చే ఫిబ్రవరిలో అందుబాటులోకి రానుంది. ఎల్బీనగర్ జంక్షన్ వద్ద కుడివైపు అండర్పాస్ పనులు దాదాపు పూర్తయ్యాయి. తుది మెరుగులుదిద్ది, ఫిబ్రవరిలో వినియోగంలోకి తేనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఎడమవైపు అండర్పాస్ వినియోగంలో ఉండటం తెలిసిందే. ఈ అండర్పాస్ కూడా అందుబాటులోకి వస్తే ఇటు సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు వెళ్లే వారికి, విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిథానీల మీదుగా ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్ ప్రాంతాల వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణం సాధ్యం కానుంది. అండర్పాస్ వివరాలు.. ► పొడవు: 490 మీటర్లు ► వెడల్పు: 12. 87 మీటర్లు ► మూడు లేన్లు.. ఒకవైపు ప్రయాణం ► అంచనా వ్యయం : రూ.14.87 కోట్లు ఫిబ్రవరిలో అందుబాటులోకి.. తుకారాంగేట్ ఆర్యూబీ సైతం.. ఎల్బీనగర్ అండర్పాస్తో పాటు తుకారాం గేట్ రైల్వే అండర్పాస్ పనులు కూడా పూర్తి కావచ్చాయని, అది కూడా ఫిబ్రవరిలో ప్రారంభించనున్నట్లు జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: Hyderabad: రాయదుర్గంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య -
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గురువారం ఉదయమే వాతావారణం చల్లబడింది. దీంతో ఎల్బీనగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్ నగర్. కర్మన్ ఘాట్, రాజేంద్రనగర్, హైదర్గూడ, నాగోల్, మీర్పేట్, అత్తాపూర్, నార్సింగి మణికొండ, పుప్పాలగూడ ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, కోఠి, గోషామహల్, చాదర్ఘాట్, అంబర్పేట్, హిమాయత్నగర్, రామంతపూర్, చే నంబర్, గోల్నాక, ఉప్పల్, సైదాబాద్, మలక్పేట్, చాదర్ఘాట్, దిల్షుఖ్నగర్లో భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. -
మెట్రో స్టేషన్లో ‘ఆధార్’ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పలు మెట్రో స్టేషన్లలో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతానికి మూసారాంబాగ్ మెట్రోస్టేషన్లో ప్రయోగాత్మకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఈ కేంద్రానికి సిటీజన్ల నుంచి వచ్చే ఆదరణను బట్టి మరిన్ని స్టేషన్లలో ఆధార్, మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నాయి. త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు నగరంలో త్వరలో మరో 27 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటి వరకు 256 బస్తీ దవాఖానాలు ఏర్పాటు కాగా, త్వరలో మరో 27 ఏర్పాటు చేసేందుకు ఆయా బస్తీల్లోని కమ్యూనిటీహాళ్లు, వార్డు కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. డివిజన్కు రెండు వంతున జీహెచ్ఎంసీలోని 150 డివిజన్లలో 300 బస్తీ దవాఖానాలు, అవసరాన్ని బట్టి మరో యాభై అదనంగా ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫుట్పాత్పై ఆక్రమణల తొలగింపు ఖైరతాబాద్ రాజ్దూత్ చౌరస్తాలో ఫుట్పాత్పై ఏర్పాటు చేసుకున్న వివిధ ఆక్రమణలను జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం తొలగించారు. చౌరస్తాలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఫుట్పాత్ ఆక్రమణల నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మరుతున్నందున జీహెచ్ఎంసీ సర్కిల్–17 ఉప కమిషనర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఆక్రమణలను తొలగించారు. చౌరస్తాలోని హోటల్ యజ్ఞేష్ విరాట్ హోటల్ ముందు ఉన్న ఆక్రమణలతో పాటు రోడ్డు మీదకు ఏర్పాటు చేసిన షాపులను, బండీలను తొలగించారు. జేసీబీ ఇతర వాహనాలతో మూడు గంటలపాటు తొలగింపు కార్యక్రమం జరిగింది. చౌరస్తాలో మరో వైపు ట్రాన్స్ఫార్మర్ను అనుకొని ఏర్పాటు చేసిన నిర్మాణాలను సైతం అధికారులు తొలగించారు. (చదవండి: ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది) ఎల్బీనగర్లో భారీగా పెరిగిన ఓటర్లు! ఎల్బీనగర్లో ఓటర్ల సంఖ్య 5,57,081కి చేరింది. పురుష ఓటర్లు 2,91,749 కాగా.. మహిళా ఓటర్లు 2,65,229 మంది, ట్రాన్స్జెండర్స్ 103 మంది ఉన్నట్టు 2022లో విడుదల చేసిన తుది జాబితాలో పేర్కొన్నారు.గ్రేటర్ పరిధిలో ఎల్బీనగర్ 3వ స్థానంలో ఉంది. గతంలో ఎల్బీనగర్ ఓటర్లు 5,24,577మంది ఉండగా, ఇందులో పురుషులు 2,74.830 కాగా.. మహిళలు 2,49,653 మంది ఇతరులు 94లు ఉన్నారు. గతంలో కంటే సుమారు 32,504 మంది కొత్తగా యువ ఓటర్లు పెరిగినట్టు తెలుస్తోంది. గతంలో పురుష ఓటర్లు 274830మంది ఉండా ప్రస్తుతం 2,91,749 మంది ఉన్నారు. కొత్తగా 16,919 మంది, మహిళా ఓటర్లు గతంలో 2.49653 మంది ఉండగా, ప్రస్తుతం 265229 మంది ఉన్నారు. కొత్తగా 15,576 మంది ఓటర్లు పెరిగారు. ఇక ఇతరులు గతంలో 94 ఉంటే... ప్రస్తుతం 103కి చేరగా కొత్తగా 9మంది పెరిగారు. మొత్తానికి 2022లో ప్రకటించిన తుది జాబితాలో భారీగా ఓటర్లు పెరిగారు. (చదవండి: నుమాయిష్కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’) -
హైదరాబాద్లో అర్ధరాత్రి గ్యాంగ్ వార్.. ఒకరు మృతి
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లో శనివారం అర్థరాత్రి గ్యాంగ్ వార్ కలకలం సృష్టించింది. గంజాయి, మద్యం మత్తులో ఇరువర్గాలవారు పరస్పరం దాడులు చేసుకున్నారు. హాకీస్టిక్, రాడ్లు కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడటంతో నరసింహారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. నరసింహారెడ్డి మృతికి కారణమైన యువకుల నివాసంపై అతని బంధువులు దాడికి దిగారు. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ ఛీ పార్టీ ఆఫీస్లో ఇదేం పని.. బీజేపీ నేతల వీడియో వైరల్ -
హైదరాబాద్లో విషాదం: రేకులపై పడిన చెప్పును తీసుకోబోయి..
సాక్షి, హైదరాబాద్: ఇంటి పైకప్పు రేకులపై పడిన చెప్పును తీసుకోబోయిన ఓ యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన గురువారం హయత్నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భాగ్యలతలోని శాంతినగర్లో నివసించే రిచ్పాల్ కొడుకు రాహుల్ (18) జ్యువెలరీ షాపులో పని చేస్తున్నాడు. గురువారం ఉదయం రాహుల్ చెప్పు తన ఇంటి మొదటి అంతస్తులోని రేకుల షెడ్డుపై పడింది. అల్యూమినియం రాడ్డుతో దానిని తీసేందుకు యత్నించగా అది పొరపాటున పక్కనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్కు గురైన రాహల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడ్ని వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. ఆరు నెలలుగా ప్రేమ.. శారీరకంగా లొంగదీసుకొని.. -
ఎల్బీనగర్లో ఉన్మాది ఘాతుకం..
-
కాదన్నందుకు కత్తి కట్టాడు
నాగోలు: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందనే కారణంగా కక్ష కట్టిన ప్రేమోన్మాది ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తితో ఏకంగా 18 సార్లు పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిందితుడిని ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ సమీపంలోని తిమ్మారెడ్డిపల్లికి చెందిన బస్వరాజు (23) నగరంలోని రాందేవ్గూడలో ఉన్న సన్సిటీలో ఉంటూ సెంట్రింగ్ పని చేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకాల్ గ్రామానికి చెందిన యువతి (20) గతేడాది లాక్డౌన్ నుంచి హస్తినాపురం సెంట్రల్లోని తన పిన్ని వద్ద ఉంటోంది. ఈమె ఇంటర్ పూర్తి చేసింది. బస్వరాజు అమ్మమ్మది కూడా చంద్రకాల్ కావడంతో ఇతడు తరచూ అక్కడికి వెళ్తుం డేవాడు. దూరపు బంధువైన ఆ యువతితో ఇతడికి పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్ల కింద ఆమె ఇంటికి వెళ్లిన బస్వరాజు.. తమ ప్రేమ విషయం చెప్పాడు. అయితే డిగ్రీ చదివినప్పటికీ సెంట్రింగ్ పని చేస్తున్న బస్వరాజుకు ఆమెను ఇచ్చి వివాహం చేయడానికి కుటుంబీకులు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా, ఆమెకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం కావడంతో మూడు నెలల కింద నిశ్చితార్థం జరిగింది. ఈమెకు తరచుగా ఫోన్లు చేస్తున్న బస్వరాజ్ పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండేవాడు. దీంతో అతడి ఫోన్ నంబర్ను బ్లాక్ చేసింది. అయినా వేరే నంబర్ల నుంచి కాల్స్ చేస్తూ వేధింపులకు గురి చేస్తుండేవాడు. ఆమె బయటకు వెళ్లినప్పుడు వచ్చి కలుస్తుండేవాడు. ఆ సందర్భంలోనూ పెళ్లి ప్రస్తావన తెచ్చేవాడు. అయితే తన కుటుంబీకులకు ఇష్టం లేకపోవడంతో పెళ్లి చేసుకోలేనంటూ ఆమె స్పష్టం చేసింది. 18 కత్తిపోట్లు.. బుధవారం తన ఇంట్లో ఉండే కత్తిని తీసుకుని బస్వరాజు హస్తినాపురం వచ్చాడు. మధ్యాహ్నం 3:35 గంటల సమయంలో శిరీష ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఇంటి తలుపులు కొట్టడంతో శిరీష వచ్చి తీసింది. ఆమెను ఇంటి నుంచి బయటకు లాగి వాగ్వాదానికి దిగాడు. విచక్షణ కోల్పోయిన అతగాడు తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె ఇంటి ముందే, నడిరోడ్డుపై దాడికి దిగాడు. తనను ఏమీ చేయొద్దని శిరీష ప్రాధేయపడినా, కాళ్లు పట్టుకున్నా బస్వరాజ్ కనికరించలేదు. కత్తితో విచక్షణారహితంగా చేతికి దొరికిన చోట పొడిచాడు. శిరీష చేతులు, వీపు, ఛాతీ, తొడ, కడుపు భాగాల్లో మొత్తం 18 కత్తిపోట్లు గాయాలయ్యాయి. దాదాపు 5 నిమిషాల పాటు పొడిచాడని తెలుస్తోంది. రక్తపు మడుగులో ఉన్న శిరీష అరుపులు విని బయటకు వచ్చిన పైఅంతస్తులో ఉండే వారు బస్వరాజ్ను పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయాడు. అనంతరం ఫోన్ ద్వారా ఉషశ్రీకి సమాచారం ఇచ్చారు. వెంటనే శిరీషను హస్తినాపురంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
మమత బదిలీ.. మరునాడే నిలిపివేత!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)లోని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత బదిలీని మున్సిపల్ పరిపాలన శాఖ ఒక్కరోజులోనే నిలిపివేసింది. ఆమెను ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్గా బదిలీ చేస్తూ ప్రభుత్వకార్యదర్శి సి.సుదర్శన్రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెతోపాటు మరో నలుగురు జీహెచ్ఎంసీ పరిధిలోని జోనల్/అదనపు కమిషనర్లను కూడా బదిలీ చేశారు. అయితే విధుల్లో చేరకముందే బుధవారం సాయంత్రానికల్లా మమత బదిలీని నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. కూకట్పల్లి జోనల్ కమిషనర్గా బదిలీ అయిన జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ పంకజను తాజాగా ఎల్.బి.నగర్కు మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న స్పెషల్, సెలక్షన్ గ్రేడ్, అదనపు డైరెక్టర్, అదనపు కమిషనర్ స్థాయి అధికారులను బదిలీ చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని నగర శివారు జోన్ల కమిషనర్లను తొలుత బదిలీ చేసింది. శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ రవికిరణ్ను ఖైరతాబాద్కు, ప్రధాన కార్యాలయంలో ఉన్న అదనపు కమిషనర్, ఐఏఎస్ అధికారి ప్రియాంకను శేరిలింగంపల్లికి బదిలీ చేశారు. ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఉపేందర్ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్గా బదిలీచేశారు. త్వరలోనే మరిన్ని బదిలీలు రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లు, ఏ గ్రేడ్ మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్ల పనితీరు ఆధారంగా త్వరలో బదిలీల ప్రక్రియ సాగనుందని సమాచారం. స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్లతో సత్సంబంధాలు కొనసాగించనివారిపై కూడా బదిలీ వేటు పడే అవకాశముందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీతోపాటు శివార్లలో కొత్తగా ఏర్పాటైన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు కూడా స్థానభ్రంశం చెందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన అధికారులు ఆమోదం కోసం సర్కారుకు ఫైల్ పంపించినట్లు సమాచారం. -
ఎస్ఐ కోచింగ్ సెంటర్లో పరిచయం.. వంచించి, అబార్షన్ ట్యాబ్లెట్లు వేసి..
సాక్షి, నాగోలు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడిన పోలీస్ కానిస్టేబుల్ను ఎల్బీనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా గడివేడు మండలానికి చెందిన దాసరి రాములు(29) సైబరాబాద్లో కానిస్టేబుల్. రంగారెడ్డి జిల్లా నార్సింగి జాహిర్నగర్లో నివాసం ఉంటున్నాడు. 2017లో ఓ యువతి ఎస్ఐ కోచింగ్ కోసం హైదరాబాద్కు వచ్చింది. అదే సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న రాములు యువతితో స్నేహం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. చదవండి: సైబర్ కేఫ్లో ఇద్దరు బాలికలపై గ్యాంగ్ రేప్ ఇనిస్టిట్యూట్కు వెళ్లిన ఆమెకు మయమాటలు చెప్పి స్నేహితుడి గదికి తీసుకెళ్లి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గర్భిణి అని తెలియగానే గర్భస్రావం ట్యాబ్లెట్లు ఇచ్చాడు. 2020లో రాములు కానిస్టేబుల్గా ఎంపికై అక్టోబర్లో శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సైబరాబాద్ కమిషనరేట్లో కానిస్టేబుల్గా విధుల్లో చేరాడు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని, నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని రాములును సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చదవండి: పెళ్లయ్యి ఏడాది కాకముందే.. అబార్షన్ చేయించుకుందని! -
6 రోజులవుతున్నా ఇంకా దొరకని అంతయ్య ఆచూకీ
-
వామ్మో! ఇదేం వాన.. గ్రేటర్లో కుండపోత రికార్డు ఇప్పుడే
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో గ్రేటర్ సిటీని కుండపోత వాన ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఆకాశానికి చిల్లు పడిందన్న చందంగా 20 సెంటీమీటర్లకు పైగా కుంభవృష్టి కురిసింది. నాలాలు ఉగ్రరూపం దాల్చాయి. పలు చెరువులు పూర్తి స్థాయిలో నిండి వరదనీరు పొంగిపొర్లి సమీప బస్తీలు, కాలనీలను ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వందలాది బస్తీల్లో ఇళ్లలోకి చేరిన వరద నీటిని తొలగించేందుకు పలు బస్తీల వాసులు రాత్రంతా జాగారం చేశారు. ఈ సీజన్లో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు నమోదైన అతి భారీ వర్షం ఇదేనని బేగంపేట్లోని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడం, ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో పాటు క్యుములోనింబస్, స్ట్రాటస్ మేఘాల ప్రభావంతో నగరంలో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. వరద నీటిలో ఉప్పల్ స్వరూపానగర్ పలు మండలాల్లో సాధారణం కంటే అత్యధికం.. జీహెచ్ఎంసీ పరిధితో పాటు పొరుగునే ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలో పలు మండలాల్లో జూన్ ఒకటి నుంచి జూలై 15 వరకు సాధారణం కంటే 70 నుంచి 90 శాతానికి పైగా అధిక వర్షపాతం నమోదవడం విశేషం. అత్యధికంగా తిరుమలగిరిలో 106 శాతం, ముషీరాబాద్లో 131 శాతం, కాప్రాలో ఏకంగా 153 శాతం, ఉప్పల్లో 173 శాతం, సరూర్నగర్లో 148 శాతం అధిక వర్షపాతం నమోదవడం గమనార్హం. గ్రేటర్లో కుండపోత రికార్డు ఇప్పుడే.. గ్రేటర్ పరిధిలో జూలై నెలలో అధిక వర్షపాతం నమోదవడం పరిపాటే. ఇక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నగరంలో 24 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన రికార్డులు గతంలో ఉన్నాయి. కానీ నగర వాతావరణ శాఖ రికార్డులను పరిశీలిస్తే జూలై నెలలో అధిక వర్షపాతం నమోదైంది మాత్రం.. జూలై 15, 2021 కావడం విశేషం. పలు చోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనప్పటికీ.. సరాసరిన నగరంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు జూలై మాసంలో 1989 జూలై 24న మాత్రమే నగరంలో 14.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా పాత రికార్డులు బద్దలయ్యాయి. బాలాపూర్లో జలమయమైన ఆర్సీఐ రోడ్డు నగరాన్ని వణికించిన భారీ వర్షం బుధవారం రాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు భీతిల్లాయి. రాత్రి 8 గంటల నుంచి వేకువజాము వరకు ఏకధాటిగా కురిసిన కుండపోతతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. గత ఏడాది వరదల్ని గుర్తు తెచ్చుకుని వణికిపోయారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తెల్లారే లోపల ఏం జరగనుందోనని ఆందోళన చెందారు. గ్రేటర్ పరిధిలోని వంద కాలనీలకు పైగా ప్రజలు వాన భయంతో సరిగా నిద్రపోలేదు. మలక్పేట నియోజకవర్గంలోని ఎర్రగుంట, మీర్పేట, జిల్లెలగూడ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో అంజయ్యనగర్ పూర్తిగా నీట మునిగింది. అయిదడుగుల మేర నీరు ఇంకా నిలిచే ఉంది. పద్మా కాలనీ, అచ్చయ్యనగర్, శ్రీరాంనగర్ బస్తీ తదితర ప్రాంతాల్లోనూ భారీగా నీటి నిల్వలు చేరాయి. బిక్కుబిక్కుమంటూ గడిపిన కాలనీలు ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పద్మావతి కాలనీ, రాఘవేంద్ర కాలనీ, పీవీఆర్ కాలనీ, అయ్యప్పకాలనీ, సాగర్ ఎన్క్లేవ్, రెడ్డి కాలనీ, కోదండరామ కాలనీ, అయ్యప్పనగర్, మల్లికార్జున నగర్ తదితర కాలనీల్లో నీట మునిగాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని శివసాయినగర్, మధురానగర్ కాలనీ, న్యూభవానీనగర్, ఇందిరానగర్, రాఘవేంద్రకాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లోని ఎన్ఎండీసీ కాలనీ, సరస్వతీనగర్ తదితర కాలనీలు నీట మునిగాయి. సనత్నగర్ నియోజకవర్గంలోని నాలా పరీవాహక ప్రాంతాల్లోని బ్రాహ్మణవాడి, అల్లంతోట బావి, తదితర ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని చింతలబస్తీ, మక్తా, ఇందిరానగర్లతోపాటు సోమాజిగూడ, ఫిల్మ్నగర్ ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపించింది. నదీం కాలనీలో దాదాపు ఇరవై ఇళ్లలో వరద నీరు చేరింది. ఆనంద్బాగ్లో నీట మునిగిన కాలనీ తెగిపడిన కరెంట్ వైర్లు, ట్రిప్ అయిన ఫీడర్లు సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలితో కూడిన భారీ వర్షానికి నగరంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్ల చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి వైర్లు తెగి పోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల ఇన్సులేటర్లు, ఏబీ స్విచ్లు, జంపర్లు, సీటీ/పీటీలో సాంకేతిక సమస్యలు తలెత్తి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు గ్రేటర్లో 500పైగా ఫీడర్లు ట్రిప్పయ్యాయి. కొన్నిచోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్ను పునరుద్ధరించగా.. మరికొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి సామగ్రితో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్తున్న హయత్నగర్ పద్మావతి కాలనీవాసులు విద్యుత్కు అంతరాయం దిల్సుఖ్నగర్, సరూర్నగర్, హయత్ నగర్, హస్తినాపురం, వందనపురి కాలనీ, సాగర్ఎన్క్లేవ్, రాఘవేంద్రనగర్, రెడ్డికాలనీ, కోదండరామ్కాలనీ, నాగోల్లోని అయ్యప్పనగర్, ఉప్పల్ స్వరూప్నగర్, మీర్పేట్ సాయినగర్ కాలనీ, మిథులానగర్ కాలనీ, జల్పల్లి, ఉస్మాన్నగర్, ఎర్రగుంట, జిల్లెలగూడ, అడిక్మెట్ డివిజన్లోని అంజయ్యనగర్, ముషీరాబాద్లోని పద్మాకాలనీ, అచ్చయ్య కాలనీ, శ్రీరాంనగర్బస్తీ, నాచారం ఎర్రకుంట, క్రి్రస్టియన్ కాలనీ, హరిహరపురం కాలనీలకు వరద పోటెత్తడంతో ఆయా ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అటు ఇంటి చుట్టూ నీరు.. ఇటు కరెంట్ కోత.. కొన్ని చోట్ల రెండు మూడు గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తే.. మరికొన్ని చోట్ల గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా కరెంట్ సరఫరా కాలేదు. అసలే ఇంటి చుట్లు మోకాల్లోతు మురుగునీరు...ఆపై ఇంట్లో కరెంట్ కూడా లేక ప్యాన్లు పనిచేయక పోవడంతో దోమలు విజృంభించాయి. విని యోగదారుల కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఫలితంగా కొంత మంది ఇళ్లకు తాళాలు వేసుకుని బంధువుల ఇళ్లకు చేరుకోగా...మరికొంత మంది చీక ట్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో వినియోగదారులు క్షేత్రస్థాయి విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేస్తే నంబర్లు స్విచ్ ఆఫ్ చేసి ఉంచడంతో వారు కొంత అసహనానికి గురయ్యారు. విధిలేని పరిస్థితుల్లో 1912 కాల్సెంటర్కు ఫోన్ చేస్తే.. రోజంతా లైన్లు బిజీగా ఉన్నట్లు సమాధానమే వచ్చింది. ఆన్లైన్లో ఫిర్యాదులు చేసినా.. అధికారులు స్పందించలేదు. అంతే.. వానొస్తే చింతే.. సాక్షి, సిటీబ్యూరో: ఈ చిత్రం మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని దీనదయాళ్నగర్ నాలా పనులకు సంబంధించినది. ఈ నాలాలో పడి గత సంవత్సరం సెపె్టంబర్లో సుమేధ (12) అనే బాలిక మరణించింది. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రెండు మీటర్లలోపు ఓపెన్ నాలాలకు క్యాపింగ్ చేస్తామన్నారు. ఎక్కువ వెడల్పు నాలాలకూ అవసరమైన చర్యలు చేపడతామన్నారు. వర్షాకాలం రాకముందే మే మాసాంతానికి పనులు పూర్తి కావాల్సి ఉండగా, ప్రారంభమే కాలేదు. గత ఏడాది దుర్ఘటనను కొందరు గుర్తు చేయడంతో.. ఇటీవలే హడావుడిగా ప్రారంభించారు. పైకప్పులను పరుస్తున్నారు. ఈ నాలాకు సంబంధించి దీనదయాళ్నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గరి నుంచి సంతోషిమాత గుడి వరకు 720 మీటర్ల మేర పనులకు బాక్స్ డ్రైనేజీ సహా రూ.2.40 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టారు. పై ఫొటోల్లో కనిపిస్తున్నవే జరుగుతున్న పనులు. వర్షాలు దంచికొడుతున్నాయి. సీజన్ ముగిసేంత దాకా పనులయ్యే అవకాశం లేదు. ఇదే సర్కిల్ పరిధిలోని కాకతీయనగర్ నుంచి దీనదయాళ్నగర్ కమ్యూనిటీ హాల్ వరకు రూ. 45 లక్షలతో పనుల్ని కూడా ఇటీవలే చేపట్టారు. పరిసరాల్లోని రేణుకానగర్– కాకతీయనగర్ వరకు రూ. 1.40 కోట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు.బండమైసమ్మ గుడి నుంచి దీనదయాళ్నగర్ వరకు 400 మీటర్ల మేర రూ. 19 లక్షల విలువైన పనులు మాత్రం పూర్తిచేశారు. బండ చెరువు నుంచి అనంత సరస్వతి కమాన్ వర కు రూ.66 లక్షల అంచనా పనుల టెండర్లు కూడా పూర్తికాలేదు.ఇదీ నాలాల పనులకు సంబంధించి ఉదాహరణ. అన్ని సర్కిళ్లలో అన్ని నాలాల పనులు కూడా దాదాపుగా ఇలాగే కుంటుతున్నాయి. చెరువుల పనులను పరిశీలిస్తే.. గత సంవత్సరమే దిల్సుఖ్నగర్ తపోవన్ కాలనీ రోడ్నెంబర్ 6 నుంచి సరూర్నగర్ చెరువులోకి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో స్కూటీతో ఉన్న ఒకరిని కాపాడబోయి ఓ వ్యక్తి మరణించిన ఘటన నగర ప్రజలింకా మరిచిపోలేదు. చెరువు వరద ముంపు సమస్య కంటే సుందర పనులకు ప్రాధాన్యం ఇచి్చన అధికారులు మట్టి కట్ట వేయడంతో చెరువులోకి నీరు పోకుండా కాలనీల్లో కాలనీల్లో నీరు నిలిచిపోయింది. కర్మన్ఘాట్, సరూర్నగర్ ప్రధాన రహదారి నుంచి చెరువు ఔట్ లెట్లో కలిపే తపోవన్ కాలనీలో పనులను చేయకుండా సగంలో ఆపేశారు. పరిసర కొన్ని కాలనీల నుంచి జనప్రియ కాలనీ వరకు నాలా పనులు పూర్తి చేసినప్పటికీ, అక్కడి నుంచి సరూర్నగర్, కర్మన్ఘాట్ ప్రధాన రహదారి వరకు సుమారు 400 మీటర్ల పనులు ఇప్పటికీ ప్రారంభానికే నోచుకోలేదు. వీటితో పాటు పలు కాలనీల్లో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కాలేదు. దీంతో నీరు చెరువులోకి వెళ్లకుండా నీళ్లలో కాలనీల దృశ్యాలు పునరావృతమవుతున్నాయి. -
ఎల్బీనగర్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం
-
ఎల్బీనగర్లో వ్యాపారి కిడ్నాప్ కలకలం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్లో కిడ్నాప్ కలకలం రేపింది. ఎల్బీనగర్లో ఉన్న కైఫ్ ట్రేడర్స్ ఉడ్ యజమాని అరిఫ్ అక్బర్ను నలుగురు దుండగులు అర్ధరాత్రి కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ అనంతరం మరో కారులో వచ్చిన కొంతమంది షాప్లోకి చొరబడి రూ.50 లక్షల విలువైన ఉడ్ను ఎత్తుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి..కేసు నమోదు చేసుకున్నారు. 6 ప్రత్యేక బృందాలతో దుండగుల కోసం గాలిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే కిడ్నాప్కి కారణమని పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
కేర్టేకర్ హల్చల్.. గట్టిగా కేకలేస్తూ, నగ్నంగా తిరుగుతూ
సాక్షి, నాగోలు: ఇంట్లో ఉన్న వృద్ధుడికి సేవ చేసేందుకు కేర్ టేకర్ను నియమించుకుంటే గంజాయి మత్తులో ఇంటి యజమానిపై దాడి చేశాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ నాగార్జున కాలనీలో ఉండే దామోదర్రావు, గిరిధర్ల తండ్రి రంగారావు (96). ఆయనకు సేవలందించడానికి సోదరులు కుత్బుల్లాపూర్ హరికృష్ణ హోమ్ కేర్ అండ్ సరీ్వసెస్ నిర్వాహకుడు వెంకటరమణకు సంప్రదించారు. అతడు కుత్బుల్లాపూర్ రాజీవ్గృహకల్పకు చెందిన సూర్యపవన్ను వారి ఇంటికి పంపాడు. సోదరిలిద్దరూ కుటుంబంతో పై అంతస్తులో ఉంటున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్న వారి తండ్రి రంగారావుకు సూర్యపవన్ సేవలు అందిస్తున్నారు. ఈనెల 27వ తేదీన సాయంత్రం సూర్యపవన్ గట్టిగా కేకలేస్తూ నగ్నంగా తిరుగుతుండగా సోదరిలిద్దరూ కిందకు వచ్చారు. ఎందుకు అలా చేస్తున్నావని వారు ప్రశ్నించగా అతడు వారిపై దాడి చేయడంతో పాటు పిచ్చిపిచ్చిగా సమాధానమిచ్చాడు. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూర్యపవన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వారికి అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. అతడి వద్ద పోలీసులు గంజాయి ప్యాకెట్, చిన్న మద్యం బాటిల్ స్వాదీనం చేసుకున్నారు. అతడు గంజాయి సేవించడంతో అలా ప్రవర్తంచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మంగళవారం ఉదయం అతడు పోలీస్స్టేషన్లోనూ కేకలేస్తూ హల్చల్ చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన్నట్లు సమాచారం. దామోదర్రావు ఇచ్చిన ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: 3 వైన్స్లు.. 30 ‘బెల్ట్’లు: లాభాల కోసం ‘చీప్’ ట్రిక్స్.. -
Photo Feature: జనులారా! జర సోచో..
కరోనా కష్టకాలంలోనూ చాలా మంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తుంటే ఫ్రంట్లైన్ వారియర్స్ మాత్రం పండగలు పబ్బాలు లేకుండా అహోరాత్రులు విధుల నిర్వహణలో నిమగ్నమవుతున్నారు. విధుల నిర్వహణే పండగలా భావిస్తున్నారు. మరోవైపు కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు రైలు మార్గాల ద్వారా ప్రాణవాయువును ఆగమేఘాల మీద తరలిస్తున్నాయి. కరోనా జాగ్రత్తలను పాటించేందుకు కొంత మంది వినూత్న పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇదిలావుంటే నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పడుతున్న కష్టాలు గుండెలను పిండేస్తున్నాయి. -
విషాదం: ఆరు నెలల క్రితం తండ్రి, ఇప్పుడు కొడుకు..
సాక్షి, నాగోలు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేçసుకుంది. ఎల్బీనగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్ వాస్తుకాలనీకి చెందిన కీత నితేష్సాయి(26) మృత్తి రీత్యా వ్యాపారి. బుధవారం రాత్రి వనస్థలిపురంలో ఉన్న స్నేహితుడిని కలసి బుల్లెట్పై వాస్తుకాలనీలో ఉన్న తన ఇంటి రాత్రి 11:45గంటలకు సమయంలో వస్తున్నాడు. మార్గ మధ్యలో ఓంకార్నగర్ యూటర్న్ వద్ద మరో ద్విచక్ర వాహనం వచ్చి ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన నితేష్సాయిని చికిత్స నిమిత్తం హస్తినాపురంలోని నవీన ఆస్పత్రికి తరలించారు. రాత్రి ఒంటి గంట సమయంలో చికిత్స పొందుతూ నితేష్సాయి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి పెద్దనాన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణలు దక్కేవి... హెల్మెంట్ లేక పోవడంతో కింద పడిన నితేష్సాయి తలకు తీవ్ర గాయలు కావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. హెల్మెంట్ ధరించి ఉంటే నితేష్సాయి ప్రాణాలతో బయట పడేవారని పేర్కొన్నారు. ఆరు నెలల క్రితమే తండ్రి మృతి.. నితేష్సాయి తండ్రి మధుసూదన్ ఆరు నెలల క్రితం నాగోలు జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంతలోనే కుమారుడు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
ఎల్బీనగర్ వ్యభిచారం గుట్టురట్టు
సాక్షి, నాగోలు: ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న సాయిదుర్గా లాడ్జ్లో విదేశాలతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ టీమ్, ఎల్బీనగర్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న సాయిదుర్గా లాడ్జ్ యజమాని దేశినేని వెంకటేశ్వరరావు (52)ను అరెస్టు చేశారు. లాడ్జ్కు నెలకు రూ.75 వేల చొప్పున అద్దె కడుతూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతడితో పాటు వెస్ట్బెంగాల్కు చెందిన సాకిజాన్ కాటన్ అలియాస్ దీపిక అలియాస్ రేష్మ (30), పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న మండ్ల అవినాష్ (32), మీర్పేటకు చెందిన గుగులోతు సుజాత (27)లను అరెస్టు చేశారు. అదే విధంగా విటులు కుమావత్ పంచారాం (38), సిర్ర మనీష్ (25), ఆవులదొడ్డి మధు (30) మధ్యప్రదేశ్కు చెందిన వికాస్ కుమార్సాకేత్ (22)లను అదుపులోకి తీసుకున్నారు. మరో నిర్వాహకుడు రవి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. లాడ్జ్లో పట్టుబడిన నలుగురు యువతలను రెస్క్యూహోంకు తరలించారు. బంగ్లాదేశ్తో పాటు దేశంలోని పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తెలింది. -
సూర్యుడి కంటే ముందే సుధీరన్న..
సాక్షి, ఎల్బీనగర్: మార్నింగ్ వాక్ పాదచారిగా పేరుగాంచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి హయత్నగర్లో శనివారం చేసిన పాదయాత్రతో 34 ఏళ్లు పూర్తయ్యాయి. కార్పొరేటర్గా ఉన్న సమయంలో చేసిన మార్నింగ్ వాక్కు మంచి ఆదరణ రావడంతో మొదటిసారిగా హుడా చైర్మన్గా, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో మార్నింగ్ వాక్ చేసి ప్రజల మన్ననలను పొందారు ఆయన. ఆదే స్ఫూర్తితో పదవిలో ఉన్నా లేకున్నా సమస్యల కోసం నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేసేవారు. ఇలా 34 సంవత్సరాల పాటు మార్నింగ్వాక్ చేసిన ఘనత సుధీర్రెడ్డికే దక్కింది. ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు 1987 జనవరి 23న అప్పట్లో అక్బర్బాగ్ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న సమయంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడి కంటే ముందే సుధీరన్న అనే కార్యక్రమం ద్వారా తొలిసారిగా ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు మార్నింగ్ వాక్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సమస్యలు సైతం సత్వరమే పరిష్కారమయ్యేవి. ఇలా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 100కుపైగా కాలనీల్లో మార్నింగ్ వాక్ చేసిన ఘనత ఆయనది. తొలుత మంచినీటి కోసం చేసిన మార్నింగ్ వాక్ ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, కాల్వలు, చెరువుల సుందరీకరణ తదితర అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. మార్నింగ్ వాక్కు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
దేశంలోనే మొట్టమొదటి ఏసీ బస్బే @Hyd
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ నిర్మాణం ఎల్బీనగర్లో రూపుదిద్దుకోనుంది. దీనికోసం హెచ్ఎండీఏ రూ.9 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. మొదటి దశలో 10 బస్బేల నిర్మాణం చేపట్టి.. అనంతరం మరో 14 బస్బేలను నిర్మించేందుకు నిర్ణయించింది. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ఆధునిక హంగులతో నిర్మించేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తొలుత రూ.18 కోట్లతో అంచనా వేసినా.. హరిణ వనస్థలిపురం వద్ద కేంద్ర అటవీశాఖ అనుమతులు అవసరం కావడంతో విస్తరణకు ఆటంకం ఏర్పడింది. దీంతో అంచనాలు తగ్గించి మొదటి దశ పనులకు రూ.9 కోట్లు హెచ్చిస్తున్నారు. ఈ బస్ టెర్మినల్కు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత్చారి బస్ టెర్మినల్గా పేరుపెట్టనున్నారు. (చదవండి: హైదరాబాద్ నలుదిక్కులా ఐటీ పరిశ్రమ విస్తరణ) 680 మీటర్ల మేర విస్తరణ.. ఎల్బీనగర్ మార్గం మీదుగా ఏపీతో పాటు తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం, నల్లగొండ, సూర్యాపేటకు నిత్యం సుమారు 20 వేల నుంచి 25 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వీరికి మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో సుమారు 680 మీటర్ల వరకు అధునాతన బస్బేలను నిర్మించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అధికారులతో ప్రణాళికలు సిద్ధం చేయించారు. రోజువారీగా ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు 500– 600 వరకు వెళ్తుంటాయి. రద్దీకనుగుణంగా బస్సు స్టాండ్లు లేకపోవడంతో ఇక్కడి చౌరస్తాలో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ సమస్య సైతం వేధిస్తోంది. దీంతో ఇక్కడి బస్సుస్టాండ్ను తొలగించి ఆటోనగర్ సమీపంలోని క్రీడా వద్ద బస్ టెర్మినల్ నిర్మించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు అంచనా ఇలా.... ఏసీ బస్బేల నిర్మాణానికి రూ.9 కోట్ల అంచనా. ఇందులో 10 బస్బేలకు రూ.4.50 కోట్లు. మరో రూ.4.5 కోట్లు సోలార్ ప్లాంట్, డ్రైనేజీ, ప్రయాణికుల వసతులకు ఖర్చు పెట్టనున్నారు. బస్బే నర్మాణంతో ఇక్కడి నుంచి ఒకేసారి వంద బస్సులు ఇలా వచ్చి అలా వెళ్తాయి. దీంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తొలగనున్నాయి. సౌకర్యాలు ఇలా.. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ఒక మార్గం, సిటీ ప్రయాణికులకు మరో మార్గం ఉంటుంది. ఏసీ, నాన్ఏసీ నిరీక్షణ గదులు ఉంటాయి. కరోనా నిబంధనలు పాటిస్తూ ఏసీ గదుల్లో ప్రయాణికులు 21 మంది, నాన్ ఏసీ ప్రాంగణాల్లో 48 మంది కూర్చునే ఏర్పాటు. నిరంతర విద్యుత్ కోసం 490 కిలోవాట్స్ సౌరవిద్యుత్ ప్లాంట్, నిరంతరం వైఫై, నీటిశుద్ధి కేంద్రం, పార్కింగ్ వసతులు. ఏటీఎం కేంద్రాలు, ఫుడ్ కోర్టులు, బుక్ షాపు, ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానున్నాయి. బస్ టెర్మినల్ పనులు వచ్చే జనవరిలో ప్రారంభించి ఏప్రిల్లో పూర్తి చేస్తారు. మే మొదటి వారంలో అందుబాటులోకి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నా డ్రీమ్ ప్రాజెక్టు.. బస్ టెర్మినల్ నా డ్రీమ్. ప్రాజెక్టు రూపకల్పనకు నేనే స్వయంగా డిజైన్లు, అంచనాలు చేశా. దేశంలోనే మొదటి ఏసీ బస్బే ఎల్బీనగర్లో నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నాను. – దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే -
ఇది మున్సిపల్ ఎలక్షనా? నేషనల్ ఎలక్షనా?
-
ఆన్లైన్ గేమ్.. అప్పులు తీర్చలేక యువకుడు బలి
-
ఆన్లైన్ గేమ్.. మరో యువకుడు బలి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్కు మరో యువకుడు బలి అయ్యాడు. ఎల్బీనగర్కు చెందిన జగదీశ్ ఆన్లైన్ గేమ్ ఆడి లక్షలాది రూపాయలు నష్టపోయాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక బలవంతంగా శుక్రవారం తనువు చలించాడు. కాగా.. కొద్ది రోజుల క్రితమే జగదీశ్ చేసిన రూ.16 లక్షల అప్పును తండ్రి తీర్చాడు. అయినా అప్పులు మొత్తం తీరకపోవడంతో మళ్లీ ఆన్లైన్ గేమ్ ఆడాడు. దీంతో జగదీశ్ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయి.. ఏమీ చేయలేని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకొని సూసైడ్కు పాల్పడ్డాడు. ఈ వీడియోలో తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (కన్నీరు పెట్టించిన దారుణం.. నేటికి ఏడాది) -
టీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్స్ వీరే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఎంఐఎంతో మరోసారి జట్టుకట్టిన గులాబీ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయించి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైన నేపథ్యంలో ప్రచార పర్వంలో దూసుకుపోయేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో రేపటి నుంచి మంత్రి కేటీఆర్ రోడ్షోలు నిర్వహించనున్నారు. రేపు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్లో, ఎల్లుండి మహేశ్వరం, ఎల్బీనగర్లో ప్రచారం చేయనున్నారు. (చదవండి: గ్రేటర్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!) అదే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 28న ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. ఇందులో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్స్గా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, మొహమూద్ అలీ, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్ పాల్గొననున్నారు. (చదవండి: గ్రేటర్ ఎన్నికలు: పరిశీలకులుగా ఐదుగురు ఐపీఎస్లు) -
ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా..
-
మరో మహిళను మింగేసిన నాలా
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరంలో నాలాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఏమాత్రం ఆజాగ్రత్తగా ఉన్నా.. తెరుచుకుని ఉన్న నాలా మనుషులను మిగేస్తోంది. తాజాగా హైదరాబాద్లో అధికారులు నిర్లక్ష్యం మరో మహిళను బలితీసుంది. ఉదయం నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు నాలాలో పడిన సరోజ శవమై తేలారు. స్థానికులు అందించిన సమాచారం ప్రకారం.. సరూర్ నగర్ చెరువు కింద ఉన్న శారదా నగర్ కి చెందిన సరోజ తెల్లవారుజామున ఉదయం ఆరుగంటల సమయంలో ఇంటి నుంచి వాకింగ్కు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు నాలాలో పడి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ను, పోలీసులను, జీహెచ్ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఆలస్యం కావడంతో ఆమె మృతి చెందారు. చైతన్యపురిలోని హనుమాన్నగర్ నాలలో మృతదేహం లభ్యంమైంది. మృతదేహాన్ని వెలికితీసిన సిబ్బంది పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల హైదరాబాద్ నగరంలో భారీగా వర్షాలు కురవడంతో నాలాలు ప్రమాదకరంగా మారిన విషయం తెలిసిందే. ఇక తాజా ఘటన నేపథ్యంలో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు వరుసగా సంభవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కూతుర్ని చూపించలేదని తండ్రి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: పుట్టిన కూతురిని తనకు చూపించకపోవడంతో మనస్తాపం చెంది తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీఆర్ నగర్ నివాసి నక్కా అర్జున్(24) కారు డ్రైవర్. దిల్సుఖ్నగర్కు చెందిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరి మధ్య కొద్ది రోజుల క్రితం మనస్పర్థలు ఏర్పడ్డాయి. అర్జున్ భార్యకు 9 రోజుల క్రితం పాప పుట్టింది. కూతుర్ని చూసేందుకు అర్జున్ వెళ్తే భార్య చూపించలేదు. దీంతో మనస్తాపం చెందిన అర్జున్ శుక్రవారం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మూడేళ్ల కొడుకును చంపి, తల్లి ఆత్మహత్య
-
మూడేళ్ల కొడుకును చంపి, తల్లి ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్: ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలోని శాతవాహన నగర్లో విషాదం నెలకొంది. ఓ వివాహిత మూడేళ్ల కుమారుడిని చంపి తానూ ప్రాణాలు తీసుకుంది. సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. గుళ్లం మమతా అనే మహిళ ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుమారుడు రియాన్ష్ కుడిచేతిని కత్తితో కోయడంతో తీవ్ర రక్తస్రావమై బాలుడు మృతి చెందాడు. అనంతరం తాము ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి మమత దూకేసింది. తీవ్ర గాయాలతో ఆమె ఘటనా స్థలంలోనే మరణించింది. కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మమత సొంతూరు యాదాద్రి జిల్లా వలిగొండ మండలం వర్కట్ పల్లికిగా తెలిసింది. కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసుల అనుమానిస్తున్నారు. (చిన్నారులపై పిడుగు) -
ఆదిత్య బిల్డర్స్ కోటారెడ్డిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఆదిత్య బిల్డర్స్తో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్ హోమ్స్ ఎల్ఎల్పీ జాయింట్ వెంచర్లో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా మోసపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా విల్లాలు విక్రయిస్తుస్తున్న ఆదిత్య అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. (నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్రెడ్డి) ఈ మేరకు పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే నందగిరి హిల్స్లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్ సంస్థతో 2014లో డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని సుబ్బారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం) యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్ నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని ధనాపూర్ జనప్రియ కాలనీలో ఉన్న ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్లో పనిచేసే యువతిని హత్య చేసి పారిపోయిన మరో ఉద్యోగిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు వివాహం అయ్యింది. అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మూడు నెలల క్రితమే స్థానికంగా ఈ ఉద్యోగంలో చేశాడు. ఓ రోజు వెంకటేశ్వరావు మద్యం సేవించి వచ్చి యువతితో కలసి గదిలో వంటచేశాడు. యువతి ఒక్కతే ఉండటంతో ఆమెను లోబరుచుకోవాలని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు తన గురించి బయట చెబుతుందోమోననే భయంతో ఆమెపై దాడి చేసి నోరు గట్టిగా మూసి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకుని పారిపోతుండగా సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్రెడ్డి నిందితుడిని గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తాను చేసిన నిర్వాకాన్ని ఆ యువతి ఎవరితోనైనా చెబుతుందేమోననే భయంతో మద్యం మత్తులో హత్య చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడని సమాచారం. (ఎల్బీ నగర్లో యువతి దారుణ హత్య) -
ఎల్బీనగర్లో డేంజర్ బెల్స్
ఎల్బీనగర్: ఎల్బీనగర్, సరూర్నగర్. హయత్నగర్ సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గత 16 రోజులుగా ఆయా సర్కిళ్ల పరిదిలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే పలువరు ఈ వ్యాధి భారిన పడుతుంటడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారిన పడిన వారు సైతం నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రుల బాట పడుతుండగా, మరికొందరు ఇంటివద్దే ఉంటూ తమకు తెలిసిన వైద్య విధానాలను అవలంబిస్తున్నారు. ఇప్పటికే ఎల్బినగర్ డివిజన్ పరిధిలో 578 మంది వైరస్ బారిన పడ్డారు. వీరిలో కొందరు గుట్టుచప్పుడు హౌస్ క్వారంటైన్లో ఉండగా మరికొందరు గాంధి, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఒక్కరోజే చంపాపేట, హయత్నగర్, వనస్థలిపురం, బీఎన్రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్, సరూర్నగర్, ఎల్బినగర్ తదితర ప్రాంతాల్లో 48 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దినసరి కూలీలు, వ్యాపారస్తులు, ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అనుమానితులను హోమ్ క్వారంటైన్లో ఉంచి వైద్యుల పర్యవేక్షిస్తున్నారు. కాగా వైరస్ బారిన పడిన వారిలో కొందరు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నందునే కరోనా విజృంభిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు çస్పందించి హౌమ్ క్వారంటైన్లో ఉన్న వారు కోవిడ్ నిభంధనలు పాటించేలా చర్యలు తీసుకోవటంతో పాటు కరోనా నిర్దారణ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. మల్కాజిగిరి సర్కిల్లో 9 పాజిటివ్ కేసులు : ఇద్దరి మృతి మల్కాజిగిరి/నేరెడ్మెట్: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో తొమ్మిది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది.సైనిక్పురి, ఆర్.కె.పురం ఆఫీసర్స్ కాలనీ,ఏపీఐఐసీ కాలనీ మౌలాలి, మీర్జాలగూడ, ఆర్.కె.పురం,యాప్రాల్, జి.కె. ప్రశాంతినిలయం, మౌలాలి మజిద్, గ్రీన్ గోల్డ్ అపార్ట్మెంట్ ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది కరోనా బారినపడినట్లు డీసీ దశరథ్ తెలిపారు. లాలాగూడ రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాళ్లబస్తీకి చెందిన రైల్వే ఉద్యోగి(42), గాంధీలో చికిత్స పొందుతూ నేరెడ్మెట్ చంద్రగిరి కాలనీకి చెందిన వృద్ధుడు(66) ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. కాప్రాలో మరో 6 కేసులు నమోదు కాప్రా: సర్కిల్ పరిధిలో ఆదివారం మరో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మల్లాపూర్ డివిజన్ భవానీనగర్లో ఓ వ్యక్తి(60), మల్లాపూర్లో మహిళ(53), నాచారం డివిజన్ స్నేహపురి కాలనీలో యువతి(24), చర్లపల్లి డివిజన్ కుషాయిగూడలో మహిళ(36), ఏఎస్రావునగర్ డివిజన్ భవానీనగర్లో వ్యక్తి(48), మీర్పేట్–హెచ్బీ కాలనీ డివిజన్ స్వప్నా ఎన్క్లేవ్లో వ్యక్తి(37) కరోనా బారిన పడినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కాప్రా సర్కిల్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు 256కు చేరగా, వైరస్తో ఆరుగురు మృతి చెందారు. కరోనా మహమ్మారిని జయించి 112 మంది డిశ్చార్జి కాగా, 138 యాక్టివ్ కేసులున్నట్లు వారు వివరించారు. ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో.. ఉప్పల్: ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో ఆదివారం 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలుకానగర్ డివిజన్ పరిధిలో మూడు, హబ్సిగూడ డివిజన్ పరిధిలో 8, రామంతాపూర్ డివిజన్ పరిధిలో 3, ఉప్పల్ డివిజన్ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు. ఫీవర్లో 163 మందికి కోవిడ్ పరీక్షలు నల్లకుంట: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఆదివారం 163 మంది కోవిడ్ అనుమానితులకు ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 31 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
ఎల్బీ నగర్లో కరోనా విజృంభణ
ఎల్బీనగర్: ఎల్బీనగర్లోని మూడు, నాలుగు, అయిదు సర్కిళ్ల పరిధిలో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఎటువంటి కరోనా లక్షణాలు లేకుండానే వైరస్ విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధుల బారిన పడిన వారు సైతం తమకు కరోనా వచ్చిందేమోనని వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరికొందరు ఇంటివద్దే తమకు తెలిసిన వైద్య పద్ధతులు అవలంభిస్తున్నారు. ఇప్పటికే ఎల్బీనగర్ జోన్ పరిధిలో 459 మంది వైరస్ బారిన పడి మంచానికే పరిమితమై హౌస్ క్వారంటైన్లో ఉండగా... మరికొందరు గాంధీ, ఇతర ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఒక్క శుక్రవారం రోజే చంపాపేట, హయత్నగర్, వనస్థలీపురం, బీఎన్రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్, సరూర్నగర్, ఎల్బినగర్ వంటి పలు ప్రాంతాలలో 69 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పాజిటివ్ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి వైరస్ వ్యాప్తి నిరోధానికి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. అనుమానితులను హౌస్ క్వారంటైన్లో ఉంచి వైద్యుల పర్యవేక్షణలో పరిశీలన చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నిర్దారణ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని స్థానికులు కోరుతున్నారు. కాప్రా సర్కిల్లో 8 కొత్త కేసులు కాప్రా: సర్కిల్ పరిధిలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగా మరో 8 పాజిటివ్ కేసులు నమోదు కాగా వైరస్తో మరో వ్యక్తి మృతి చెందాడు. కొత్త నమోదైన కేసుల్లో కాప్రా డివిజన్ సాకేత్లో 47 ఏళ్ల వ్యక్తి, ఏఎస్రావునగర్ డివిజన్ పరిమళనగర్లో 46 ఏళ్ల వ్యక్తి, భవానీనగర్లో 39 ఏళ్ల వ్యక్తి, మీర్పేట్–హెచ్బీకాలనీ డివిజన్ ఏపీహెచ్బీ కాలనీలో 37 ఏళ్ల వ్యక్తి, మల్లాపూర్లో ఇద్దరికి, నాచారంలో ఓ మహిళతో పాటు మరో వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు సర్కిల్ పరిధిలో 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మృతుల సంఖ్య 6కు చేరింది. కరోనాను జయించి 112 మంది డిశ్చార్జ్ కాగా, 106 యాక్టివ్ కేసులున్నాయి. మరో వైపు జమ్మిగడ్డ ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 77 ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 23 మందికి కరోనా పాజిటివ్గా తేలిందని వైద్యాధికారి స్వప్నారెడ్డి తెలిపారు ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో... ఉప్పల్: ఉప్పల్ పీహెచ్సీ పరిధిలో శుక్రవారం 44 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. బోడుప్పల్లో 8 మందికి.. బోడుప్పల్: బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం 8 మందికి కరోనా పాజిటివ్ రాగా.. ఒకరు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. హేమానగర్కు చెందిన ఓ వృద్ధుడు (75) చికిత్స పొందుతూ చనిపోయాడు. బోడుప్పల్, చిలుకానగర్, శ్రీసాయినగర్, సుభాష్నగర్, సూరజ్నగర్ కాలనీ, వీరారెడ్డినగర్, చెంగిచర్ల కమలానగర్లో ఒక్కొక్కరికి పాజిటివ్ రావడంతో వారిని హోం క్వారంటైన్లో ఉంచి వైద్య సేవలందిస్తున్నారు. మేడ్చల్లో 32కి చేరిన కేసులు మేడ్చల్: మేడ్చల్ కమ్యూనిటీ ఆసుపత్రిలో శుక్రవారం 101 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా... 22 మందికి పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్యురాలు మంజుల తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి మందులు ఇచ్చి హోంక్వారంటైన్లో ఉండాలని సూచించామన్నారు. దీంతో మేడ్చల్లో కేసుల సంఖ్య 32కి చేరింది. కాగా, పరీక్షలు తిరిగి సోమవారం నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. కొండాపూర్ ఏరియా ఆసుప్రతిలో... గచ్చిబౌలి: కొండాపూర్ ఏరియా ఆస్పత్రిలో కరోనా పరీక్షలు కొనసాగుతున్నాయి. శుక్రవారం 189 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 31 మందికి పాజిటివ్, 158 మందికి నెగెటివ్ వచ్చిందని ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరథ్ తెలిపారు. ‘ఫీవర్’లో 438 మందికి పరీక్షలు నల్లకుంట: నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో శుక్రవారం 438 మంది అనుమానితులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 38 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. బాలాపూర్లో 23 మందికి... మీర్పేట: బాలాపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో గురువారం 77 మందికి కోవిడ్–19 పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ ఉమాదేవి తెలిపారు. వీరిలో 23 మందికి పాజిటివ్గా తేలడంతో వారిని హోం క్వారంటైన్ చేసినట్టు చెప్పారు. -
ఎల్బీనగర్ అండర్పాస్.. ఈజీ జర్నీ..
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లోని ఈస్ట్జోన్లో సాగర్రింగ్ రోడ్, ఎల్బీనగర్ జంక్షన్, కామినేని జంక్షన్, ఉప్పల్ జంక్షన్లు అత్యంత రద్దీ ప్రాంతాలు. విజయవాడ, నాగార్జునసాగర్, శంషాబాద్ విమానాశ్రయం వైపుల నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు రావాలన్నా..తిరిగి వెళ్లాలన్నా ట్రాఫిక్ రద్దీతో ప్రయాణం నరకప్రాయం. ఈ సమస్యల పరిష్కారానికి ఎస్సార్డీపీ ఫేజ్ వన్ ప్యాకేజీ–2లో భాగంగా వివిధ జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు, లూప్ల వంటి వివిధ పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం 14 పనుల్లో గురువారం ప్రారంభమైన రెండింటితో సహా ఇప్పటికి ఐదు పనులు పూర్తయ్యాయి. దీంతో ట్రాఫిక్కు కొంత మేరఉపశమనం లభించింది. మిగతావన్నీ పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్, నాగోల్, దిల్సుక్నగర్ల నుంచి నుంచి నల్లగొండ, విజయవాడల వైపు, అలాగే నాగార్జునసాగర్, శంషాబాద్ వైపు వెళ్లేవారికి.. ఆప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి సిగ్నల్ జంజాటాల్లేని ప్రయాణం సాధ్యం కానుంది. పూర్తయి వినియోగంలోకి వచ్చినవి ♦ ఎల్బీనగర్ ఎడమవైపు ఫ్లై ఓవర్, కామినేని వద్ద రెండు ఫ్లై ఓవర్లు, ఎల్బీనగర్ వద్ద ఎడమవైపు అండర్పాస్, చింతల్కుంట వద్ద అండర్పాస్ పూర్తి కావాల్సినవి.. ♦ ఎల్బీనగర్ కుడివైపు ఫ్లై ఓవర్ ♦ ఎల్బీనగర్ వద్ద కుడివైపు అండర్పాస్ ♦ బైరామల్ గూడ వద్ద ఫస్ట్ లెవెల్లో కుడి, ఎడమ ఫ్లై ఓవర్లు ♦ బైరామల్ గూడ వద్ద సెకెండ్ లెవెల్లో ఫ్లై ఓవర్ ♦ బైరామల్ గూడ వద్ద కుడి, ఎడమవైపుల లూప్లు ♦ కామినేని అండర్పాస్ నాగోల్ జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్ ట్రాఫిక్ రద్దీ ఇలా.. ఈస్ట్జోన్లోని ఆయా జంక్షన్ల వద్ద భవిష్యత్లో ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ నిపుణులు అంచనా వేశారు. ఆమేరకు.. 2034 నాటికి రద్దీ సమయాల్లో గంటకు ఉండే ట్రాఫిక్ పీసీయూ.. పూర్తయిన, పూర్తి కావాల్సిన పనుల అన్నింటి అంచనా వ్యయం :రూ. 448 కోట్లు -
శరవేగంగా హైదరాబాద్ అభివృద్ధి
ఎల్బీనగర్/మన్సూరాబాద్: ప్రపంచ దేశాల నగరాలతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ) పనుల్లో భాగంగా హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని జంక్షన్లో రూ.43 కోట్ల తో నిర్మించిన 940 మీటర్ల ఫ్లైఓవర్, రింగ్ రోడ్డులో రూ.14.73 కోట్లతో నిర్మించిన 519 మీటర్ల అండర్ పాస్ను నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిలతో కలసి గురువారం ప్రారంభించారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న విధానాలతో ప్రపంచ దేశాల్లోని పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పిస్తుండటంతో పెట్టుబడులు పెరిగాయన్నారు. పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు అనుగణంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో సిగ్నల్స్ రహిత ట్రాఫిక్ ఏర్పాటులో భాగంగానే ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టామ న్నారు. ఎల్బీనగర్లోని 12 ప్రాంతాల్లో రూ.448 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. మరో వారంలో ఎల్బీనగర్ రింగ్రోడ్డులోని రెండో అండర్పాస్ పనులను ప్రారంభిస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, ఎమ్మెల్సీ యెగ్గె్గ మల్లేశం, జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థిని ఆత్మహత్య కలకలం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఎల్బీనగర్ పరిధిలోని సాగర్రింగ్ రోడ్ గల అలేఖ్య టవర్స్లో నివాసముంటున్న సాహితీ అనే వైద్య విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అపార్ట్మెంట్లోని 14వ అంతస్తు నుంచి మంగళవారం మధ్యాహ్నం దూకి ఆత్మహత్య చేసుకుంది. బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుంచి దూకినట్లు స్థానికులు చెబుతున్నారు. రఘురాం పద్మ దంపతులకు కుమార్తె అయిన సాహితీ ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (బీడీఎస్) నాలుగో సంవత్సరం చదువుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. కూతురు మృతిపై తల్లీదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
రూపాయి ఎర వేసి... ఖాతా ఖాళీ చేసి!
ఓ ప్రైవేటు సంస్థను నడుపుతున్న కె.పవిత్ర బ్యాంకు ఖాతాలో ఈ నెల 21న అపరిచిత వ్యక్తి ఖాతా నుంచి రూ.1 జమ అయ్యింది. మరుక్షణమే ఆ అపరిచిత వ్యక్తి తిరిగి రూ.1 రివర్స్ చేసుకున్నాడు. ఇలా నాలుగుసార్లు వేసి.. తీసిన తర్వాత ఒక్కసారిగా రూ.7,900 డ్రా చేశాడు. మళ్లీ అదే పనిగా మరో రూ.1,100ను నాలుగు దఫాలుగా విత్డ్రా చేశాడు. అయితే ఖాతాదారుకు మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు. అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ కాల్, మెసేజ్ ఏదీ లేదు. ఏదో అవసరం మీద తన ఖాతాలో నగదును పరిశీలిస్తే.. ఈ విత్డ్రా పర్వం వెలుగు చూసింది. వెంటనే ఎల్బీ నగర్లోని సైబర్ క్రైమ్ విభాగంలో, తర్వాత బ్యాంకులో ఫిర్యాదు చేయగా... తమ పొరపాటు కాదని బ్యాంకర్లు చేతులెత్తేయడం గమనార్హం. తన ప్రమేయం లేకుండా, కనీసం తన పొరపాటు లేకుండా నగదు పోవడంతో ఆమె బ్యాంకు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలు మితిమీరిపోతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతున్న తరుణంలో నేరగాళ్లు ఇదే పరిజ్ఞానంతో నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడమంటే అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ ద్వారా ఏటీఎం వివరాలు అడగడమో, లేక ఎస్ఎంఎస్లు పంపమనడమో, ఏదో లింక్ పంపి క్లిక్ చేయమనడమో జరిగేది. అలా అవతలి వ్యక్తులు వివరాలు తీసుకున్న తర్వాత ఖాతాలో నగదు స్వాహా చేయడం విన్నాం. కానీ ఎలాంటి ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్ లేకుండా ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. తాజాగా సైబర్ క్రైమ్ విభాగానికి ఇలాంటి కేసులు అధికంగా వస్తున్నాయి. గత వారం సంగారెడ్డిలోని ఓ టీచరు ఖాతా నుంచి ఏకంగా 20వేలు ఇలా మాయమయ్యాయి. ఇన్సూరెన్స్తో కవరేజీ... బ్యాంకు ఖాతాలో నగదుపోతే వెంటనే బ్యాంకర్కు ఫిర్యాదు చేయాలి. వారి సూచనల ఆధారంగా.. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఏటీఎం కార్డుకు ఇన్సూరెన్స్ ఉంటే పొగొట్టుకున్న మొత్తం తిరిగి పొందే వీలుంటుంది. అయితే ఈ ప్రక్రియ అంత సులువేం కాదు. ఫిర్యాదు అనంతరం కార్డుదారు డాటాను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఖాతాదారు పొరపాటు లేదని గ్రహిస్తేనే ఇన్సూరెన్స్ వస్తుంది. ఖాతాదారు తన వివరాలను అపరిచిత వ్యక్తులతో పంచుకుంటే లేదా నగదు పొగొట్టుకోవడంలో తన ప్రమేయం ఉంటే ఇన్సూరెన్స్ వర్తించదని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 21న కె. పవిత్ర ఖాతాలో రూ.9వేలు స్వాహా కావడంపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రమేయం లేకుండా నగదు విత్డ్రా చేయడంపై ఆమె బ్యాంకర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. అప్రమత్తత లేకుంటే అంతే బ్యాంకు ఖాతాలో నగదు తస్కరించడం అంత సులువైన విషయం కాదు. ఖాతా వివరాలు తెలిసి ఉండటంతోనే ఇది సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు లేదా ఏటీఎం కార్డు నంబర్తో పాటు సీవీవీ నంబర్లు తెలిస్తే చాలు మన ఖాతాలో నిల్వలు కొట్టేయొచ్చు. ఏటీఎంలో నగదు డ్రా చేసిన తర్వాత వచ్చే స్లిప్పు ఆధారంగా కూడా తస్కరించవచ్చు. బ్యాంకు ఖాతా, ఏటీఎం వివరాలు ఇతరులకు ఇవ్వొద్దనే దానిపై ఖాతాదారుల్లో కొంత అవగాహన పెరిగింది. ఈక్రమంలో సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నాలజీ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రతి ఖాతాదారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏటీ ఎంలలో నగదు విత్డ్రా, ఇతర షాపింగ్ మాల్స్ లేదా దుకాణాల్లో సరుకులు కొనుగోలు చేశాక డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా జరిగే లావాదేవీలు పూర్తయ్యే వరకు వేచి చూడాలని, లేకుంటే ఖాతా నిర్వహణ సై బర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంద ని బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ పాతూరి వెంకటేశ్ గౌడ్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
కరోనా : మొన్న తండ్రి.. నిన్న కొడుకు
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రెండు రోజుల వ్యవధిలో ఆ కుటుంబంలో తండ్రీ కొడుకులిద్దరు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళ్తే...మలక్పేట గంజ్లో నూనె వ్యాపారం చేసే వ్యక్తి అస్వస్థతకు గురై వనస్థలిపురంలోని ఓ ఆసుపత్రిలో ఇటీవల చికిత్స పొందగా అతని ద్వారా వనస్థలిపురం ఏ–క్వార్టర్స్లో నివాసం ఉండే తండ్రి (76), తమ్ముడు (45), ఇతర కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వచి్చన సంగతి తెలిసిందే. కాగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తండ్రి మృతిచెందగా, శుక్రవారం కుమారుడు (గంజ్ వ్యాపారి తమ్ముడు) కూడా మృతి చెందాడు. వీరి కుంటుంబానికి చెందిన మరో నలుగురు ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక గంజ్ వ్యాపారి ఇప్పటికే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతని భార్య, కుమారునికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడం, అలాగే బీఎన్రెడ్డినగర్ ఎస్కేడీనగర్లో నివాసం ఉండే మరో కుటుబంలోని ఇద్దరికి పాజిటివ్ రావడంతో మూడు కుటుంబాలకు చెందిన బంధువులు అందరు గాంధీ ఆసుపత్రిలోనే ఉన్నారు. దీంతో మృతుల అంత్యక్రియల ను మున్సిపల్ అధికారులే నిర్వహించాల్సి వస్తోంది. (పాక్, రష్యాల్లో కరోనా విజృంభణ) వనస్థలిపురంలో అధికారుల పర్యటన... వనస్థలిపురం ఏ–క్వార్టర్స్లో ఒకే ఇంటిలో ఇద్దరు కరోనాతో మృతి చెందడం, అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు గాంధీ ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో శనివారం వనస్థలిపురంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రదీప్కుమార్, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితర అధికారులు పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కంటైన్మెంట్ జోన్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ఎల్బీనగర్ జోన్లో మరో నాలుగు కేసులు... హయత్నగర్ సర్కిల్ బీఎన్రెడ్డినగర్ ఎస్కేడీ నగర్లో కొత్తగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు, లింగోజిగూడ డివిజన్ భాగ్యనగర్ కాలనీలో నివసించే యువకునికి కరోనా పాజిటివ్ వచి్చంది. సరూర్నగర్లో డయాలసిస్ ఉన్నవ్యక్తి మరో కేసు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఎల్బీనగర్లో 16 కేసులు నమోదయ్యాయి. ఎల్బీనగర్ సర్కిల్–3లో 2, సర్కిల్–4లో 9, సర్కిల్–5లో 5 కేసులు నమోదు అయినట్లు అధికారులు పేర్కొన్నారు. -
హైదరాబాద్లో డీమార్ట్ సీజ్
సాక్షి, హైదరాబాద్ : కరోనా విజృంభిస్తున్న వేళ నిబంధనలు పాటించని ఎల్బీ నగర్ డీమార్ట్కు జీహెచ్ఎంసీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు షాకిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన భౌతిక దూరం నిబంధనలను యాజమాన్యం పాటించకపోవడంతో.. అధికారులు సూపర్ మార్కెట్ను సీజ్ చేశారు. మంగళవారం ఎల్బీ నగర్ ప్రాంతంలోని డీమార్ట్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున వినియోగదారులు కనిపించారు. అయితే వినియోగదారలు సూపర్ మార్కెట్లో భౌతిక దూరం పాటించేలా యాజమాన్యం కనీస చర్యలు తీసుకోకపోవడంతో అదికారులు సదరు డీమార్ట్ను సీజ్ చేసి నోటీసులు అంటించారు. డీమార్ట్లో కనీసం కస్టమర్ల కోసం శానిటైజర్స్ కూడా యాజమాన్యం ఏర్పాటు చేయనట్టుగా తెలుస్తోంది. కాగా, కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుడటంతో.. పలు షరతులతో సూపర్ మార్కెట్స్కు నిత్యావసరాల విక్రయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరకుల విక్రయానికి కొన్ని గంటలే అనుమతులిచ్చారు. అయితే ఈ సమయంలో భౌతిక దూరంతోపాటు.. ఇతర కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని సూపర్ మార్కెట్స్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. -
అతి తక్కువ ధరలకే కూరగాయాల విక్రయం
-
హైదరాబాద్లో ఫ్లై ఓవర్ పై నుంచి దూకి..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఎల్బీ నగర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న ఫ్లై ఓవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.మృతున్ని రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లికి చెందిన నరేందర్గౌడ్గా గుర్తించారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులతో విరక్తి చెందిన నరేందర్.. ఫ్లై ఓవర్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నరేందర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.(విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..) -
మద్యం మత్తులో కూతురును చంపిన తండ్రి
-
మద్యం మత్తులో కూతుర్నే కడతేర్చాడు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ కసాయి తండ్రి కూతుర్ని చంపేశాడు. ఈ ఘటన సోమవారం ఉదయం జరిగింది. కూతురు యామినీ (5)ని హతమార్చిన దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, మంధని: పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి -అడవిశ్రీరాంపూర్ సమీపంలో ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కింద పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే... మంథని నుండి ముత్తారం మండలంలోని పలు గ్రామాల విద్యార్థులను దర్యాపూర్ మోడల్ స్కూల్కు తీసుకువెళ్లే ఈ ప్రమాదం జరిగింది. సింగిల్ రోడ్డు కావడంతో డ్రైవర్ అజాగ్రత్త వల్ల బస్సు రోడ్ కిందికి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది విద్యార్థులతోపాటు పది మంది ప్రయాణికులు మొత్తం 70 మంది ఉన్నారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోవడంతో పలువురికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో ప్రమాదం తప్పినప్పటికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎల్బీనగర్లో కారు బీభత్సం.. ఎల్బీనగర్ సమీపంలో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు...రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అనంతరం పల్టీలు కొడుతూ డివైడర్ను ఢీకొంది. గాయపడ్డ వెంకటమ్మ, సత్తమ్మలను చికిత్స నిమిత్తం ఓజోన్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. -
షైన్ ఆసుపత్రి సిబ్బంది రిమాండ్కు తరలింపు
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లోని షైన్ హాస్పిటల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం ఘటనలో ఎండీ సునీల్కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ఆయనతో పాటు సిబ్బందిని కోర్టులో హాజరు పరిచి అక్కడి నుంచి రిమాండ్కు తరలించారు. విచారణలో భాగంగా పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన నాల్గవ అంతస్తుకు అనుమతి లేదని, అగ్ని మాపక శాఖ నుంచి ఎన్వోసీ సర్టిఫికెట్ను కూడా తీసుకోలేదని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పరిశీలించినట్లు పోలీసులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఫ్రిజ్ వద్ద పేలుడు జరిగి ఆ మంటలు మొత్తం నాలుగో అంతస్తుకు వ్యాపించినట్లు సీసీ టీవి ఫుటేజీల్లో రికార్డైంది. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్ బయటకు వెళ్లడం, సిబ్బంది ఎవరు లేకపోవడంతో చిన్నారులు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఎండీ సునీల్తో పాటు మరో నలుగురి సిబ్బందిపై కేసును నమోదు చేశారు. -
షైన్ ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో.. మంటల్లో చిక్కుకుని గాయపడ్డ ఇద్దరు చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ రవిందర్ నాయక్, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ తనిఖీలు చేపట్టి.. ఆస్పత్రి సెల్లార్తో సహా నాలుగు అంతస్థులని క్షుణ్ణంగా పరిశీలించారు. షైన్ హాస్పిటల్లో జరిగిన ప్రమాదంపై విచారణను వేగవంతం చేసేందుకు ఇప్పటికే క్లూస్ టీంను రంగంలోకి దించారు. ఎన్ఫోర్స్మెంట్ టీం అధికారులు ఇప్పటికే హాస్పిటల్కు నోటీసులు జారీ చేశారు. షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న డాక్టర్ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రి ప్రమాదంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ.. ప్రభుత్వ నిబంధనలకు ప్రకారం సరైన మౌలిక సదుపాయాలు ఉన్నాయా అనే అంశాలను నివేదిక రూపంలో పొందుపర్చనుంది. అనంతరం ప్రభుత్వానికి తన రిపోర్ట్ను ఇవ్వనుంది. ఘటనతో అప్రమత్తమైన అధికారులు.. జంటనగరాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రమాద ఘటన తరువాత గతేడాదితో ఆస్పత్రి పర్మిషన్ ముగిసిందని, ఆస్పత్రిలో ప్రమాదం జరిగినపుడు తక్షణమే పాటించాల్సిన నియంత్రణ వ్యవస్థే లేదని మానవ హక్కుల కమిషన్కు బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. భవనం అక్రమ కట్టడమని, అధికారుల నిర్లక్షం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పిటిషన్ దాఖలు చేశారు. ఒక చిన్నారి మృతికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకొని బాధితులకు వెంటనే న్యాయం చెయ్యాలనివారు కోరారు. -
చిన్నారుల ప్రాణాలతో చెలగాటం
సాక్షి, హైదరాబాద్/నాగోలు: షైన్ (ఎల్బీనగర్) ఆస్పత్రి యాజ మాన్య నిర్లక్ష్యం చికిత్స పొందుతున్న చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం తెల్లవారు జామున (2.45 గంటలకు) ఆస్పత్రి భవనం నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నిమోనియాతో బాధపడుతూ ఇంక్యుబేటర్పై చికిత్స పొందుతున్న మూడు నెలల శిశువు మృతి చెందగా, మంటల్లో చిక్కుకుని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంటలకు తోడు దట్టమైన పొగలతో ఊపిరాడక చిన్నారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తు తం ఇద్దరి శిశువుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మరో 42 మందిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్ ఎదురుగా డాక్టర్ వి. సునీల్కుమార్రెడ్డి, డాక్టర్ సునీల్ పవార్ గత ఆరేళ్ల నుంచి షైన్ చిల్డ్రన్ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు. సునీల్కుమార్రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నాడు. 2014లో రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ నుంచి 20 పడకలకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం జనరల్ వార్డులో 50 పడకలు ఏర్పాటు చేశారు. నెలలు నిండక ముందు తక్కువ బరువుతో జన్మించిన శిశువులతో పాటు, నిమోనియా, కామెర్లు ఇతర సమస్యలతో బాధపడుతున్న శిశువులను ఐసీయూలోని ఇంక్యుబేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఐసీయూలో మంటలు.. సోమవారం తెల్లవారుజామున 2.45 గంటలకు ఐసీయూలో ఒక్కసారిగా మం టలు ఎగిసిపడ్డాయి. అక్కడే ఉన్న ఇంక్యుబేటర్లు షార్ట్సర్క్యూట్కు గురై వాటి లైట్లు పేలిపోయాయి. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా దూపాడ గ్రామానికి చెందిన డి.నరేష్, మానసల కుమారుడు (3 నెలలు) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అలాగే నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన గిరి, మమతల కుమారుడు అవినాష్ (2 నెలలు)కి చాతి, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. చిన్నారిని ఉప్పల్లోని శ్రీధ ఆస్పత్రికి తరలించారు. చంపాపేటకు చెందిన ముత్యాలు, సరితల 36 రోజుల శిశువును బంజారాహిల్స్లోని ఏవీఎస్ అంకుర ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉంది. నల్లగొండ జిల్లా ఉరుమడ్లకు చెందిన నాగరాజు, సుగుణల 13 నెలల శిశువును ఎల్బీ నగర్లోని దిశ ఆస్పత్రికి, అబ్దుల్లాపూర్మెట్కు చెందిన మరో శిశువును మలక్పేటలోని సేఫ్ ఆస్పత్రికి తరలించారు. ఓ చిన్నారిని మరో ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి... అగ్ని ప్రమాదంతో ఐసీయూ సహా సాధారణ వార్డుల్లోనూ దట్టమైన పొగ అలముకోవడంతో పిల్లలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పిల్లలకు సాయంగా వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు, నర్సులు, ఇతర సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పిల్లల ఏడుపులు, సిబ్బంది ఉరుకులు పరుగులతో ఆస్పత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రధాన రహదారి వైపుగా ఉన్న అద్దాలను ధ్వంసం చేసి నిచ్చెన సాయంతో పిల్లలను సురక్షితంగా కిందికి దించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో 42 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వీరందరినీ ఒకే ఆస్పత్రికి తరలిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన యాజమాన్యం పలు ఆస్పత్రులకు తరలించింది. మృతి చెందిన, ఆందోనకరంగా ఉన్న ఇద్దరు పిల్లల మినహా మిగతా చిన్నారులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన సమయంలో పిల్లల వైద్య ఖర్చలన్నీ తామే భరిస్తామని చెప్పిన షైన్ యాజమాన్యం ఆ తర్వాత వారిని గాలికొదిలేయడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మూడు రోజుల క్రితమే ప్రమాదం... మూడు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఐసీయూలో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనిపై రోగుల బంధువులు ఆస్పత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు. నిర్వహకులు మాత్రం తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారు. పక్కా మరమ్మతులు చేసింటే ఈ పరిస్థితి ఉండేది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అనుమతి ఎలా ఇచ్చారు.. 200 గజాల స్థలంలో సెల్లార్ సహా జీ+3 అంతస్థుల్లో ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. పార్కింగ్, సెట్బ్యాక్ లేకుండా నిర్మించిన ఈ భవనానికి జీహెచ్ఎంసీ ఎలాంటి అనుమతులివ్వలేదు. ఏదైనా విపత్తులు సంభవిస్తే బయటికి వచ్చేందుకు సరైన దారి కూడా లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలను ఆర్పేందుకు ఆస్పత్రిలో ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవు. పార్కింగ్ కూడా లేని ఈ భవనానికి రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పెషాలిటీ హాస్పిటల్, డయాగ్నోస్టిక్స్ నిర్వహణకు అనుమతి ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. సామర్థ్యానికి మించి పడకలు ఏర్పాటు చేసినా పట్టించుకున్న నాథుడే లేడు. పార్కింగ్, ఇతర సమస్యలపై స్థానికులు జీహెచ్ఎంసీలో ఫిర్యాదు చేసినా పట్టించుకున్న వారే లేరు. ఎండీపై కేసు నమోదు... ప్రమాద ఘటన తరువాత పోలీసులు ఆసుపత్రికి తాళాలు వేశారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్రావు, మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. షైన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ సునీల్రెడ్డిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు. -
న్యుమోనియాతో వస్తే.. ప్రాణాలు పోయాయి
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో సోమవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో అంతస్తులోని ఐసీయూలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఓ చిన్నారి మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం గాయపడ్డ చిన్నారులను పలు ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించామని జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ డైరెక్టర్ విశ్వజిత్ తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారని వెల్లడించారు. ఆసుపత్రి యాజమాన్యం ఎటువంటి అగ్ని మాపక అనుమతులు తీసుకోలేదని తమ విచారణలో తేలినట్టు విశ్వజిత్ చెప్పారు. (చదవండి : షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు) నగరంలోని అన్ని ఆసుపత్రులకు అగ్నిమాపక అనుమతుల విషయంపై నోటీసులు జారీ చేస్తామని అన్నారు. అగ్ని మాపక అనుమతులు లేని ఆసుపత్రులపై దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అగ్ని మాపక అనుమతుల విషయంపై విచారిస్తామని అన్నారు. ఇప్పటికే అగ్నిమాపక అనుమతులు లేని బార్లు, పబ్బులు, స్కూళ్లకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. కాగా, అగ్ని ప్రమాదం నేపథ్యంలో 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, షైన్ ఆస్పత్రిని సీజ్ చేశారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే డాక్టర్ సునీల్ కుమార్ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. వైద్యుడు సునీల్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. (చదవండి : షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం) గతంలో కూడా ఇలాగే జరిగింది.. చికిత్స కోసం వస్తే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని షైన్ హాస్పిటల్లో చనిపోయిన బాలుడి తండ్రి నరేష్ కన్నీరుమున్నీరయ్యాడు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘న్యుమోనియాతో బాధపడుతున్న నా కుమారున్ని ఈ నెల 17న షైన్ ఆస్పత్రిలో జాయిన్ చేయించాను. యాదాద్రి జిల్లా నుంచి వైద్యం కోసం ఇక్కడికి వచ్చాం. గతంలో కూడా ఇదే హాస్పిటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. మళ్లీ నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే మా బాబు చనిపోయాడు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగి ఇన్ని గంటలు కావొస్తున్నా ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదు’అని నరేష్ వాపోయారు. -
షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై కేసు నమోదు
-
షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రి సీజ్
సాక్షి, హైదరాబాద్ : అగ్నిప్రమాదం నేపథ్యంలో ఎల్బీనగర్లోని షైన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం తెల్లవారుజామున నాలుగో అంతస్తులోని ఐసీయూలో అగ్నిప్రమాదంతో ఓ చిన్నారి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ చిన్నారుల్లో ముగ్గురిని ఉప్పల్ శ్రద్ధ ఆస్పత్రికి తరలించినా, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కూడా తరలించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 42మంది చిన్నారులు ఉన్నారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ లైసెన్స్ రెన్యూవల్ చేయకుండానే డాక్టర్ సునీల్ కుమార్ ఆస్పత్రిని నడుపుతున్నట్లు గుర్తించారు. దీంతో 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు, ఆస్పత్రిని సీజ్ చేశారు. మరోవైపు వైద్యుడు సునీల్ కుమార్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అలాగే ఆస్పత్రి యాజమాన్యం వైఖరికి నిరసనగా, బాధితులను ఆదుకోవాలంటూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. ఇవాళ తెల్లవారుజామున సంఘటన జరిగినా ప్రభుత్వం ఇప్పటి వరకూ స్పందించకపోవడం దారుణమన్నారు. షైన్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, ఏబీవీపీ కార్యకర్తలు ఎల్బీ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: హైదరాబాద్లోని షైన్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం -
ఎల్బీ నగర్లో వరద.. మహిళను కాపాడిన యువకుడు
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, దిల్సుఖ్నగర్, ఎల్బీ నగర్, కోఠి, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, చింతల్, గాజులరామారం, బేగంపేటలలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి. రాణిగంజ్ వద్ద భారీ వృక్షం కూలడంతో.. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఎల్బీ నగర్లోని కాకతీయ కాలనీలో వరద నీటిలో ఓ మహిళ కొట్టుకుపోతుడంగా గమనించిన పవన్ అనే యువకుడు ఆమెను కాపాడాడు. వివరాల్లోకి వెళితే.. సాగర్రింగ్ రోడ్డు వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఎల్బీ నగర్ పోలీసులు జేసీబీ సాయంతో వరద నీటిని మళ్లించారు. ఆ నీరంతా కాకతీయ కాలనీలోకి చేరింది. ఇదే సమయంలో అటుగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది. ఇది గమనించిన పవన్ ఆ మహిళను కాపాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. -
ఎల్బీ నగర్లో వరద.. మహిళను కాపాడిన యువకుడు
-
ఎల్"బీపీ".. నగర్
ఎల్బీనగర్: ఎల్బీనగర్ జంక్షన్ జనసంద్రంగా మారుతోంది. ఓవైపు బస్సులు.. మరోవైపు ప్రయాణికులు.. ఇంకోవైపు ఇతర వాహనాలతో ఈ చౌరస్తా కిక్కిరిసిపోతోంది. దీంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలకు ప్రతిరోజు 800–900 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.ఇవికాకుండా మరో కార్లు, ఆటోలు, ఇతర వాహనాలతో ఈ ప్రాంతమంతా రద్దీగా మారుతోంది. రోజూ సుమారు 2లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణ బస్సులు 150, ఆంధ్రప్రదేశ్ బస్సులు 350, ప్రైవేట్ బస్సులు 400, కార్లు సహా ఇతర వాహనాలు వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ స్థాయిలో వాహనాలు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుండడంతోఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక వరుస సెలవులు వస్తే చాలు... ఇక్కడ నిల్చొనేందుకు కూడా చోటు దొరకడం లేదు. బస్సు ఆగేదెలా? ఈ చౌరస్తా నుంచి రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా... వాటిని నిలిపేందుకు స్థలం కరువైంది. అధికారులు ఎక్కడా బస్బేలు ఏర్పాటు చేయకపోవడంతో రోడ్లపైనే బస్సులను నిలపాల్సి వస్తోంది. ఇక ఇతర వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటోంది. మరోవైపు ఇక్కడ అండర్పాస్లు, ప్లైఓవర్ బ్రిడ్జీల నిర్మాణంతో రోడ్లు ఇరుకుగా మారాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బస్సుల కోసం ప్రయాణికులు రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. విస్తరణేదీ? ఎల్బీనగర్ నాలుగు రహదారులకు జంక్షన్. ఉప్పల్, బెంగళూర్ హైవే, సాగర్ రింగ్రోడ్డు, నగరానికి వెళ్లాలన్న ఈ చౌరస్తా దాటాల్సిందే. ఓవైపు రోడ్ల పనులు జరుగుతుండడం, మరోవైపు జంక్షన్ విస్తరించకపోవడంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అధికారులు కనీసం పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం కూడా ఇందుకు ఒక కారణం. అధికారులు ఇప్పటికైనా స్పందించి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, వాహనాలను రోడ్లపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. రోజూ గొడవలే.. ట్రాఫిక్ సమస్యతో ఈ రూట్లో రోజూ వాహనదారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకున్న వాహనదారులు ఒక్కోసారి ఫ్రస్టేషన్కు గురవుతున్నారు. ఆవేశకావేశాలకు లోనై ఇతర వాహనదారులతో ఘర్షణలకు సైతం దిగుతున్నారు. పక్కపక్కనుంచే వాహనాలు వెళ్లాల్సి రావడం, ఒక దానికి మరోటి వాహనం తగులుతుండడంతో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడ ఆగుతుందో? ఎల్బీనగర్ చౌరస్తా వద్ద బస్సులు ఎక్కడ ఆగేది తెలియడంల లేదు. బస్సు వచ్చిందంటే చాలు అది ఎక్కడికి పోతుందోనని ప్రయాణికులు ఉరుకులు పరుగులు తీయాల్సి వస్తోంది. బస్టాప్ అనేది లేకపోవడంతో ఇబ్బందిగా మారింది. – కుమార్, ప్రయాణికుడు రోజూ జంక్షన్ జామ్ ఇలా... బస్సులు 800-900 కార్లు, ఇతర వాహనాలు వేల సంఖ్యలో ప్రయాణికులు 2లక్షలు -
మానవత్వం చాటుకున్న సిఐ
-
ఎల్బీ నగర్లో దారుణం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్లో దారుణం చోటుచేసుకుంది. ఎల్బీనగర్లోని మన్సూరాబాద్లో ఆరేళ్ల చిన్నారి పాపపై ఓ కీచకుడు అఘాయత్యానికి ఒడిగట్టబోయాడు. ఎవరూలేని సమయంలో జానీ అనే 35 ఏళ్ల వ్యక్తి ఆరేళ్ల పాపపై అత్యాచారయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు పోలీసును ఆశ్రయించారు. జానీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడు జానీని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. -
ఏడేళ్లలో సరాసరి రోజుకో పిల్లర్ నిర్మాణం
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో తొలి దశలో తుది ఘట్టం ఆవిష్కృతమైంది. ఎల్బీనగర్ – మియాపూర్, జేబీఎస్ – ఎంజీబీఎస్, నాగోల్ – హైటెక్ సిటీ మార్గాల్లో (66 కి.మీ) చిట్టచివరి పిల్లర్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఈ అరుదైన ఘట్టానికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్) చిరునామాగా నిలిచింది. ఇక్కడి మెట్రో స్టేషన్ సమీపంలోనే తుది పిల్లర్ (నెంబర్ 2599)ను ఇటీవల ఏర్పాటు చేసినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అనేక సవాళ్లు, ప్రతిబంధకాలు, ఆస్తుల సేకరణసమస్యలు, న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని కారుచీకటిలోకాంతిపుంజంలా దూసుకొచ్చిన మెట్రో ప్రాజెక్టు నగరంలో ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం కొనసాగించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి పిల్లర్ను 2012 ఏప్రిల్ 19న ఉప్పల్ జెన్ప్యాక్ట్ (పిల్లర్ నెంబర్ 19) వద్ద ఏర్పాటు చేశారు. అప్పట్లో రాజకీయ అనిశ్చితి కారణంగా ఎలాంటి హడావుడి లేకుండా లాంఛనంగా ప్రారంభమైన ఈ ప్రక్రియ... ఇటీవల ఎంజీబీఎస్ వద్ద ఏర్పాటు చేసిన చివరి పిల్లర్తో పూర్తయింది. తొలి దశలో భాగంగా పాతనగరం ఎంజీబీఎస్ – ఫలక్నుమా (6 కి.మీ) మినహా అన్ని రూట్లలో పిల్లర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తవడంపై ఎన్వీఎస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెట్రో ప్రాజెక్టుల శకంలో ఏకంగా 66 కిలోమీటర్ల మార్గంలో అన్ని పిల్లర్లు ఏర్పాటు చేసిన ఎల్అండ్టీ సంస్థ ప్రపంచ రికార్డు సృష్టించిందన్నారు. మెట్రో తొలి పిల్లర్ ఏర్పాటైనప్పటి నుంచి లెక్కిస్తే సరాసరి ఏడేళ్లలో రోజుకో పిల్లర్ ఏర్పాటు చేయడం మెట్రో ప్రాజెక్టు ఆవిష్కరించిన సరికొత్త రికార్డని హెచ్ఎంఆర్ తెలిపింది. కాగా పాతనగరంలో ఎంజీబీఎస్–ఫలక్నుమా (6 కి.మీ) మార్గం మినహా మెట్రో తొలి దశ ప్రాజెక్టు త్వరలో పూర్తికానుందని పేర్కొంది. ఇక మెట్రో పిల్లర్లను ప్రధాన రహదారి మధ్యలో, అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి రావడంతో పలు చోట్ల విభిన్న ఆకృతుల్లో అమర్చారు. మెట్రో ప్రాజెక్టును సాకారం చేయడంలో హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి, ఎల్అండ్టీఎంఆర్హెచ్ఎల్ ఇంజినీరింగ్ హెడ్స్ ఎంపీ నాయుడు, శంకర్లింగం, కేఎం రావు, ఇతర ఇంజినీర్లు జియాఉద్దీన్, విష్ణువర్దన్రెడ్డి, రాజేశ్వర్, ఎ.బాలకృష్ణ తదితరులు విశేష కృషి చేశారు. సవాళ్లు, రికార్డులివీ... ♦ ప్రధాన రహదారులపై పిల్లర్ల ఏర్పాటుకు జాతీయ రహదారుల సంస్థ నుంచి అనుమతుల కోసం మూడేళ్లు, రక్షణ శాఖ అనుమతుల కోసం నాలుగేళ్లు, రైల్వే అనుమతులకు నాలుగేళ్ల సమయం పట్టింది. ♦ 3 వేల ఆస్తుల సేకరణకు 370 కేసులను ఎదుర్కొని విజయం సాధించారు. ♦ 380 చోట్ల 200 కి.మీ మార్గంలో హెచ్టీ, ఎల్టీ విద్యుత్ కేబుల్స్ను తరలించారు. 25 కి.మీ రూట్లో సీవరేజీ లైన్లు, వాటర్లైన్లు, 5 వేల విద్యుత్ స్తంభాలను తరలించారు. ♦ నిర్మాణ సమయంలో ఎదురైన అనేక ఆందోళనలను చర్చల ద్వారా పరిష్కరించారు. ♦ 2,100 భారీ వృక్షాలను ట్రాన్స్లొకేషన్ విధానంలో వేరే చోటుకు తరలించి వాటిని పరిరక్షించారు. మెట్రో కారిడార్లలో 6 లక్షల మొక్కలు నాటారు. ♦ మియాపూర్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి వీలుగా వంపు తిరిగిన ప్రధాన రహదారిని సరళ మార్గంలో సవరించారు. ♦ హైదర్నగర్, నిజాంపేట్ ప్రాంతాల్లోని దేవాలయాలకు వెళ్లేందుకు వీలుగా బైపాస్ దారులను ఏర్పాటు చేశారు. ♦ జేఎన్టీయూ ప్రాంతంలో దేవాలయాలను తరలించి వేరొక చోట నిర్మించారు. ♦ కేపీహెచ్బీ, మూసాపేట్ ప్రాంతాల్లో భారీ విగ్రహాలను వేరొక చోటుకు తరలించారు. ♦ ఐడీఎల్ దర్గా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు. ♦ ఐడీఎల్ చెరువు వద్ద మతపరమైన కట్టడాలను వేరొక చోటుకు తరలించారు. ♦ బాలానగర్లో సర్వీసు రహదారిని ఏర్పాటు చేశారు. ♦ మలక్పేట్, సికింద్రాబాద్, మెట్టుగూడ, బేగంపేట్ ప్రాంతాల్లో అనేక అడ్డంకులను అధిగమించారు. ♦ మూసాపేట్ ఆర్టీసీ డిపో వద్ద వరదనీటి కాల్వను డైవర్షన్ చేశారు. ♦ భరత్నగర్ వద్ద భారీ కూరగాయల మార్కెట్ను వేరొక చోటుకు తరలించారు. ♦ సుందర్నగర్కాలనీ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు. ♦ ఈఎస్ఐ ఆస్పత్రి, విజయలక్ష్మి థియేటర్ వద్ద సర్వీసు రహదారిని విస్తరించారు. ♦ ఎస్ఆర్నగర్ మక్బరా వద్ద 50 ఫీట్ల దారిని 140 అడుగులకు విస్తరించారు. ♦ అమీర్పేట్ కాజ్వేను భారీగా విస్తరించి ఇంటర్ఛేంజ్ మెట్రో స్టేషన్ నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. ♦ ఖైరతాబాద్ ఏడుగుళ్ల కూడలి వద్ద బైపాస్రోడ్డు ఏర్పాటుచేసి భారీ మెట్రో స్టేషన్ను నిర్మించారు. ♦ రవీంద్రభారతి జంక్షన్ నుంచి పోలీస్కంట్రోల్ రూమ్ మార్గంలో అమరవీరుల స్తూపం, అసెంబ్లీ గౌరవానికి భంగం వాటిల్లకుండా మెట్రో పిల్లర్లను ఏర్పాటు చేశారు. ♦ పబ్లిక్గార్డెన్ వద్ద నిజాం హయాంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ నాలాను దారిమళ్లించి పిల్లర్లు నిర్మించారు. ♦ ఎంజీబీఎస్ వద్ద దోభీఘాట్, ఆర్టీసీ వర్క్షాప్లను తరలించి భారీ ఇంటర్ఛేంజ్ స్టేషన్ను నిర్మించారు. ♦ సుల్తాన్బజార్, బడీచౌడీ వద్ద వ్యాపారులతో సానుకూలంగా చర్చలు జరిపి మెట్రో పిల్లర్లు ఏర్పాటు చేశారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ♦ గ్రీన్ల్యాండ్స్ జంక్షన్ నుంచి జూబ్లీ చెక్పోస్ట్ మార్గంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులను అధిగమించారు. ♦ ఒలిఫెంటా బ్రిడ్జీతో పాటు పలు రైల్వే బ్రిడ్జీల వద్ద అనేక ఇంజినీరింగ్ సవాళ్లను ఎదుర్కొని పిల్లర్లను ఏర్పాటు చేశారు. మెట్రో పిల్లర్లు ఇవీ.. రకం సంఖ్య సాధారణ పిల్లర్లు 1569 కాంటీలీవర్ 224 స్టేషన్ పిల్లర్లు 602 సుత్తె ఆకృతి 51 పోర్టల్ పిల్లర్లు 153 మొత్తం 2,599 -
మూణ్నెళ్లలో ముగించాలి
సాక్షి, సిటీబ్యూరో: ఎల్బీనగర్–బైరామల్గూడ మార్గంలో నిర్మిస్తున్న అండర్పాస్ పనులను మూడు నెలల్లో పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ ప్రాజెక్టు విభాగం ఇంజినీర్లను ఆదేశించారు. అండర్పాస్ పనులను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోనల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరెడ్డితో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అండర్పాస్ నిర్మాణంతో ఎల్బీనగర్ జంక్షన్లో దాదాపు 90శాతం ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎల్బీనగర్ జంక్షన్లో రూ.44.74 కోట్లతో ఎస్సార్డీపీ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 520 మీటర్ల పొడవుండే ఈ అండర్పాస్లో ఎల్బీనగర్ ఎడమ వైపు నిర్మాణంలో 17 రాఫ్ట్లు, 76 రిటైనింగ్ లిఫ్ట్లు, 111 ప్రీకాస్ట్ బాక్స్వాల్ సెగ్మెంట్లు, 49 బాక్స్ ప్రీ స్లాబ్ ప్లాంక్ల నిర్మాణం పూర్తయిందని వివరించారు. పనులు పూర్తయ్యేందుకు నాలుగు నెలలు పడుతుందని ఇంజినీర్లు కమిషనర్కు వివరించగా... పనుల్లో వేగం పెంచి మూడు నెలల్లోనే పూర్తి చేయా లని సూచించారు. ఎస్సార్డీపీ పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. జనరల్ ఫండ్ నుంచి ఇటీవల రూ.42 కోట్లు ఎస్సార్డీపీ బిల్లులకు చెల్లించినట్లు పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఎస్సార్డీపీ పనులకు ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటామని చెప్పారు. ‘డబుల్’ కాలనీల్లో బస్తీ దవాఖానాలు.. నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాలనీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే యోచన ఉందని కమిషనర్ తెలిపారు. వనస్థలిపురంలో రూ.28కోట్ల వ్యయంతో చేపట్టిన 324 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం దాదాపు 70శాతం పూర్తయిందని జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి కమిషనర్కు వివరించారు. డ్రైనేజీ, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టిన నాలాల పూడికతీత తొలిదశ పనులన్నింటినీ మే చివరి వరకు పూర్తి చేయాలన్నారు. లేని పక్షంలో ఇంజినీర్లపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ఇంజినీరింగ్ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ... నాలాల్లో పూడిక తీస్తున్న ప్రాంతాల్లో ఆయా పనుల సమాచారాన్ని తెలిపే బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. బోర్డులపై పనుల విలువ, పూర్తయ్యే తేదీ, ఇన్చార్జి అధికారి పేరు తదితర వివరాలు ఉండాలన్నారు. టెండర్లు దక్కించుకున్నప్పటికీ ఇప్పటి వరకు పీపీఎం రోడ్ల పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను రద్దు చేసి, మళ్లీ టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఇతర జోన్లతో పోలిస్తే ఎల్బీనగర్లో ఇంజినీరింగ్ పనులు పురోగతిలో ఉండడంపై అధికారులను అభినందించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి చీఫ్ ఇంజినీర్ అశ్విన్కుమార్, ఎస్ఈ శంకర్లాల్ తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలకు అలవాటు పడిన ఆమె..
నాగోలు: ఓఎల్ఎక్స్ ద్వారా సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న మహిళను ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేసి అమె నుంచి రూ. 3.40 లక్షల విలువైన సెల్పోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ డీఐ కృష్ణ మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అల్లారి భాను అరవింద చౌదరి నగరానికి వచ్చి సరూర్నగర్లో ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన ఆమె సులువుగా డబ్బులు సంపాదించేందుకు ఓఎల్ఎక్స్లో సెల్ ఫోన్లు విక్రయించేందుకు ప్రకటనలు ఇచ్చేవారిని సంప్రదించేది. వారిని తాను ఎంచుకున్న ప్రాంతానికి రప్పించి సెల్ఫోన్ ఇంట్లో వాళ్ల చూపిస్తానని వస్తానని చెప్పి పరారయ్యేది. ఇదే తరహాలో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, సైదాబద్లో ఒకరిని మోసం చేసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం నిందితురాలిని అరెస్టు చేసి అమె నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించారు. -
విధి నిర్వహణలోనే కుప్పకూలిన ఏఎస్సై
నాగోలు: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బి. అంజయ్య (56) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరంలోని ఫలక్నుమాకు చెందిన అంజయ్య 1989 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్. నగరంలోని పలు పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్సైగా పదోన్నతి పొందారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య ముగ్గరు కుమారులు, ఒక కూతురు ఉంది. విశ్రాంతి లేకుండా తరుచుగా బందోబస్తుకు వెళ్తున్నందున గత కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం సరిగా ఉండటంలేదు. సోమవారం మధ్యాహ్నం డ్యూటీ ముగించుకొని రెస్టురూమ్లో వెళ్లిన ఆయన ఒక్క సారిగా గుండెనొప్పితో కూలిపోయాడు. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఎల్బీనగర్ సీఐకి సమాచారం అందించి, పోలీస్ వాహనంలో కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఈ విషయన్ని తోటి సిబ్బంది అంజయ్య కుంటుంబ సభ్యులు తెలిజేశారు. విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్, ఎల్బీనగర్ ఏసీపీ పృథ్వీధర్రావు, ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి తదితరులు అక్కడికి వచ్చి అంజయ్య మృతదేహం వద్ద నివాళ్లు అర్పించారు. అంజయ్య మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
రోడ్డుపై మహిళ ప్రసవం
హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ రోడ్డుపై ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ సంఘటన శనివారం ఎల్బీనగర్లో చోటుచేసుకుంది. హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని తారామతి పేటకు చెందిన మేరమ్మ అనే మహిళను కాన్పు నిమిత్తం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి బంధువులు తీసుకువచ్చారు. పండుగ కావడంతో ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేరని ప్రసవం కోసం వచ్చిన మహిళను ఆసుపత్రి సిబ్బంది తిప్పిపంపారు. దీంతో మేరమ్మను ఆమె బంధువులు కోటి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో తీవ్రమైన నొప్పులు వచ్చాయి. కాసేపటికే ఎల్బీనగర్లో రోడ్డుపై ప్రసవించింది. అనంతరం అంబులెన్స్లో తల్లీ, పుట్టిన మగబిడ్డను ఆసుపత్రికి తరలించారు. అత్యవసర సమయంలో ఏరియా ఆసుపత్రిలో వైద్యులు లేకపోవడంపై బాధితురాలి బంధువులు తీవ్రంగా మండిపడ్డారు. -
వైద్యుల నిర్లక్ష్యం రోడ్డుపై మహిళ ప్రసవం
-
హైదరాబాద్ నగర సిగలో మణిహారం
సాక్షి, హైదరాబాద్ : నగరం నుంచి హయత్ నగర్, చౌటుప్పల్, విజయవాడ వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. ఎల్బీ నగర్లో నూతనంగా నిర్మించిన ఫ్లై ఓవర్ శుక్రవారం ప్రారంభమైంది. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ దానం కిషోర్లు ఫ్లై ఓవర్ను ప్రారంభించారు. ఎస్సార్డీపీ పథకంలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇది మూడవది. మొత్తం రూ. 42 కోట్లు ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఖర్చైంది. దీన్ని ప్రీకాస్ట్, పోస్ట్ టెన్షన్డ్ టెక్నాలజీతో నిర్మించారు. దీన్ని సంవత్సర కాలంలోనే పూర్తి చేసినప్పటికి ప్రారంభోత్సవం కోసం నెల పట్టింది. ఈ ఫ్లై ఓవర్తో ఇటువైపు వెళ్లేవారికి ట్రాఫిక్ ఇబ్బంది తగ్గి సమయం కలిసి రానుంది. విజయవాడ వైపు నుంచి నగరంలోకి వచ్చేవారి కోసం కుడివైపు ఫ్లై ఓవర్, రింగ్ రోడ్డ వద్ద అండర్ పాస్ల నిర్మాణం కూడా పూర్తయితే ఎల్బీ నగర్ జంక్షన్లో ట్రాఫిక్ జంఝాటం ఉండది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం కూడా తగ్గనుంది. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ (ఎడమవైపు) కథ ఇదీ.. పొడవు : 780 మీటర్లు వెడల్పు : 12 మీటర్లు స్టాండర్డ్ స్పాన్స్ : 270 మీ. ఆబ్లిగేటరీ స్పాన్ : 110 మీ. ర్యాంపుల పొడవు : 400 మీ. (హైదరాబాద్ వైపు 187 మీ., విజయవాడ వైపు 213 మీ.) క్యారేజ్ వే : 11 మీ. 3 లేన్లు, వన్వే ఎంఎస్ హ్యాండ్ రెయిలింగ్, ఎల్ఈడీ లైటింగ్, యాంటీ కార్పొనేట్ పెయింటింగ్స్ అంచనా వ్యయం : రూ. 42 కోట్లు సదుపాయాలిలా.. ఈ వంతెన అందుబాటులోకి వస్తే చౌరస్తాలో 90 శాతం ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుంది. మెట్రోరైలు రాకకు ముందు రద్దీ సమయంలో వెళ్లే వాహనాలు: 14,153 మెట్రో రైలు వచ్చాక రద్దీ సమయంలో వాహనాలు: 8,916 2034 నాటికి జంక్షన్లో రద్దీ సమయంలో గంటకు వెళ్లే వాహనాలు: 21,990 తగ్గనున్న ట్రాఫిక్ చిక్కులు ఈ ఫ్లై ఓవర్తో నగరం నుంచి హయత్నగర్, చౌటుప్పల్, విజయవాడల వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ ఇబ్బంది తగ్గి సమయం కలిసి వస్తుంది. విజయవాడ వైపు నుంచి నగరంలోకి వచ్చేవారి కోసం కుడివైపు ఫ్లై ఓవర్, రింగ్రోడ్ వద్ద అండర్పాస్ల నిర్మాణం కూడా పూర్తయితే ఎల్బీనగర్ జంక్షన్లో ట్రాఫిక్ జంఝాటం ఉండదు. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం, వాహన నిర్వహణ వ్యయం కూడా తగ్గుతాయి. వాయు, ధ్వని కాలుష్యం కూడా తగ్గుతాయి. రూ.448 కోట్లతో ప్యాకేజీ–2 ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్లతో చేపట్టిన ఎస్సార్డీపీ పనుల్లో ప్యాకేజీ–2లో భాగంగా ఎల్బీనగర్ పరిసరాల్లోని నాలుగు జంక్షన్ల వద్ద నిర్మించ తలపెట్టిన ఫ్లై ఓవర్లు, అండర్పాస్ల అంచనా వ్యయం మొత్తం రూ.448 కోట్లు. ప్రస్తుతం ప్రారంభోత్సవం జరుపుకుంటున్న ఫ్లై ఓవర్ను రూ.42 కోట్ల వ్యయంతో నిర్మించారు. -
రైళ్లు కిటకిట...ప్రయాణం కటకట
-
రెచ్చిపోతున్న ‘సంక్రాంతి’ దొంగలు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండగను పురస్కరించుకుని నగర జనం తమ సొంత గ్రామాల దారి పట్టారు. ఇప్పటికే రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో భాగ్యనగరం సగం ఖాళీ అయిపోయింది. ఇదే అదనుగా దొంగలు రెచ్చిపోతున్నారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేస్తున్నారు. పట్టపగలే దోపిడీలతో పోలీసులకు సవాలు విసురుతున్నారు. ఎల్బీ నగర్ జోన్లో నిన్నటిదాకా చైన్ స్నాచర్లు జనాన్ని హడలెత్తించారు. ఇపుడు పట్టపగలు సంక్రాంతి సీజన్ దొంగలు భయపెడుతున్నారు. వనస్థలిపురంలో మంగళవారం పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వరుసగా రెండు ఇండ్లలో చోరీ చేశారు. 30 తులాల బంగారం, 4 లక్షల నగదును అపహరించారు. హయత్నగర్లోని వినాయకనగర్లోని మరో ఇంట్లో కూడా దొంగలు ఆరు తులాల బంగారం చోరీ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సంక్రాంతి పండుగకు గ్రామాలకు వెళ్లే నగర ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని వారు కోరుతున్నారు. సంక్రాంతి పండుగకు దొంగతనాల నియంత్రణకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. గల్లీ గస్తీ, పెట్రోలింగ్ మొబైల్స్, సీసీఎస్ సిబ్బంది మానిటరింగ్, ప్రతిస్టేషన్లోని డిటెక్టివ్ విభాగం గస్తీ, ఎస్ఓటీ నిఘా.. ఇలా అన్ని విభాగాల వారు రాత్రి, పగటిపూట, ఉదయం సమయాల్లో ముమ్మరంగా తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులను గుర్తిస్తున్నారు. -
ఉరేసుకొని యువతి ఆత్మహత్య
సాక్షి, నాగోలు: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువతి ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎల్బీనగర్ సీఐ అశోక్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గుంటి జంగయ్యనగర్ కాలనీలో నివాసం ఉండే జ్యోతి జీహెచ్ఎంసీలో ఉద్యోగి. జ్యోతి భర్త ప్రేమ్దాస్ గతంలోనే చనిపోయాడు. కుమారుడు ప్రదీప్కుమార్, కుమారై లక్ష్మిప్రియాంక(19)లతో కలిసి ఉంటోంది. లక్ష్మి ప్రియాంక ప్రస్తుతం కొత్తపేటలోని శ్రీనేత్ర చికిత్సాలయంలో ఉద్యోగం చేస్తోంది. శనివారం ఉదయం యాథావిధిగా తల్లి ఉద్యోగానికి వెళ్లగా సోదరుడు ప్రదీప్కుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. మధ్యాహ్నం 12గంటల సమయంలో వరుసకు బాబాయ్ అయ్యే వ్యక్తి ఇంటికి వచ్చి డోర్ కొట్టగా తీయలేదు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా లక్ష్మిప్రియాంక ఉరేసుకొని కనిపించింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రదీప్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
కారు డ్రైవరే నిందితుడు..!!
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వృద్ధురాలి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఆమె ఒంటిపై ఉన్న నగల కోసమే హత్య జరిగినట్టు వెల్లడించారు. ఈ ఘటనలో కారు డ్రైవర్, అతని స్నేహితుడిని నిందితులుగా తేల్చారు. వివరాలు.. జయశ్రీ (65) అనే వృద్ధురాలు కారులో మార్కెట్కు వెళ్లింది. ఆమెను మార్కెట్లో దింపేసిన డ్రైవర్ శ్రీనివాస్ తన స్నేహితుడు నజీర్కు ఫోన్ చేసి రమ్మన్నాడు. జయశ్రీని చంపేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచుకోవాలని పథకం పన్నారు. జయశ్రీని ఎక్కించుకొని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా ఆమెను కారులోనే హత్య చేశారు. ముందుసీట్లో కూర్చున్న జయశ్రీపై వెనక కూర్చున్న నజీర్ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ఎన్టీఆర్ నగర్లోని చింతచెట్ల సమీపంలో పడేశారని పోలీసులు తెలిపారు. ఏసీపీ పృథ్వీదర్ రావు, సీఐ అశోక్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కేసును ఛేదించారు. -
తస్మాత్ జాగ్రత్త..! ఇలా వచ్చి అలా తెంచుకెళ్తారు
సాక్షినెట్వర్క్, హైదరాబాద్ : చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. బుధవారం సాయంత్రం ఎల్బీనగర్ జోన్లో వరుసగా చేసిన ఐదు చోరీలతో పోలీసులు అప్రమత్తమైనా గురువారం తెల్లవారుజామున కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన ముఠాగా భావిస్తున్న ఇద్దరు దొంగలు మరో నాలుగు గొలుసు దొంగతనాలు చేయడం నిఘా డొల్లతనాన్ని బయటపెడుతోంది. ఎల్బీనగర్ డీసీపీ సన్ప్రీత్సింగ్ రంగంలోకి దిగి అన్ని ఠాణాల ఎస్హెచ్ఓలను అప్రమత్తం చేసినా దొంగలను మాత్రం పట్టుకోలేకపోయారు. కేటీఎం బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు దాదాపు 15 గంటల వ్యవధిలో తొమ్మిది చైన్ స్నాచింగ్లు చేసి పోలీసులకు సవాల్ విసరడం చర్చనీయాంశమైంది. ఈ వరుస చోరీలతో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. వరుస చోరీలను సవాల్గా తీసుకున్న రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ప్రత్యేకంగా ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్లతో పాటు ప్రధాన చెక్పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. నంబర్ ప్లేట్ లేని బైక్పై ఇద్దరు వ్యక్తులు ఈ చోరీలకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితులున్న సీసీటీవీ ఫుటేజీలను ఇతర రాష్ట్రాల పోలీసులకు పంపించగా వారు ఉత్తరప్రదేశ్కు చెందిన ఇరానీ గ్యాంగ్లోని వ్యక్తులుగా గుర్తించారు. వీరు విమానాల్లో నగరానికి వచ్చి చోరీలకు తెగబడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శివార్లలోని అన్ని ప్రాంతాల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఈ ఇద్దరు చైన్ స్నాచర్ల కోసం వెతుకుతున్నారు. బుధవారం సాయంత్రం గంట వ్యవధిలో ఐదు చైన్స్నాచింగ్లు చేసిన ఈ ముఠా.. చివరగా అబ్దుల్లాపూర్మెట్ వద్ద కనిపించిందని, అక్కడే బస చేసి మళ్లీ గురువారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్లు చేసి ఉంటారన్న అనుమానిస్తున్నారు. వరుస చైన్ స్నాచింగ్లతో సైబరాబాద్ కమిషనరేట్లోని పోలీసులు కూడా అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. 15 గంటల్లో 32 తులాలు చోరీ వనస్థలిపురం, ఎల్బీనగర్, మీర్పేట, హయత్నగర్ ఠాణాల పరిధుల్లో గొలుసు దొంగలు ఐదు చోట్ల 19 తులాలకు పైగా బంగారు నగలు అపహరించుకపోయిన స్నాచర్లు గురువారం ఉదయం 7 నుంచి 7.40 లోపు చైతన్యపురి, వనస్థలిపురం, హయత్నగర్లో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. ఇందులో 13 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. బుధ, గురువారాల్లో మొత్తం 32 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. అబ్దుల్లాపూర్మెట్ నుంచి చైతన్యపురికి గురువారం ఉదయం 6.45 గంటలకు చేరుకున్న చైన్స్నాచర్లు టెలిఫోన్కాలనీ రోడ్ నెం.3లో ఉదయం 7 గంటలకు ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న ఈశ్వరి(40) మెడలోని ఐదు తులాల పుస్తెలతాడును తెంపబోతుండగా ప్రతిఘటించింది. దీంతో చేతికి వచ్చిన సగం గొలుసుతో స్నాచర్లు పరారయ్యారు. వెంటనే వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సహారారోడ్డులోని ఇందిరానగర్ కాలనీ వాసి ధనలక్ష్మి(46) ఉదయం మార్నింగ్ వాక్కు వెళ్లి వస్తుండగా ఎంఈ రెడ్డి ఫంక్షన్హాల్ వద్ద ఆమె మెడలోని నాలుగు తులాల పుస్తెల తాడును తెంచుకుని పారిపోయారు. లెక్చరర్స్ కాలనీలో బాదితురాలు లక్ష్మమ్మ, కుంట్లూర్ రోడ్డులో బాధితురాలు నిర్మల హయత్నగర్లో పది నిమిషాల వ్యవధిలో ఇద్దరు మహిళల మెడ లోనుంచి ఆరున్నర తులాల బంగారు గొలుసులను లాక్కుపోయారు. నల్లగొండకు చెందిన కుంభం లక్ష్మమ్మ(52) బందువుల ఇంట్లో పెళ్లి కోసమని వారం క్రితం హయత్నగర్లోని లెక్చరర్స్ కాలనీకి వచ్చింది. గురువారం పెళ్లి ఉదయం 7.30కి ఇంటి ముందు నిలబడగా నల్లటి బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయారు. అబ్దుల్లాపూర్మెట్కు చెందిన దోనూరు నిర్మల(37) కుంట్లూర్లో తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సులో హయత్నగర్ వరకు వచ్చి కుంట్లూర్ రోడ్డులోని ఎస్సార్ పెట్రోల్ బంకు సమీపంలో ఆటో కోసం నిలబడింది. వేగంగా బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నిర్మల మెడలోని 2.5 తులాల బంగారు గొలుసును తెంచుకుపోయారు. అయితే, లెక్చరర్స్ కాలనీలో లక్ష్మమ్మ చైన్ను లాక్కున్న దుండగులు పది నిమిషాల వ్యవధిలో కుంట్లూర్ రోడ్డు వైపు వెళ్లి నిర్మల గొలుసును లాక్కున్నట్టు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. విజయవాడ జాతీయ రహదారి వెంట చైన్స్నాచర్లు పారిపోయే అవకాశం ఉండడంతో పోలీసు బృందాలు తనిఖీలు చేపట్టాయి. రంగంలోకి యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్స్? చైన్ స్నాచింగ్ ముఠా ఒకప్పుడు నడుచుకుంటు వేళ్లే మహిళలనే టార్గెట్ చేసేవారు. అయితే, గత కొద్దికాలంగా జరుగుతున్న గొలుసు దొంగతనాలను చూస్తే, రోడ్డు పై నుంచి ఏకంగా ఇళ్లల్లోకే వచ్చేస్తున్నారు. స్నాచింగ్ సమయంలో మహిళలను తీవ్రంగా గాయపరుస్తున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే స్థితికి తీసుకొస్తున్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలను ఆటకట్టించేందుకు అప్పటి ఉమ్మడి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆలోచనలకు అనుగుణంగా ప్రత్యేక ‘యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్’ రంగంలోకి దిగింది. కానిస్టేబుల్గా విధి నిర్వహణలో సమర్థులైన 110 మందిని ఎంపిక చేసి ప్రత్యేక తర్పీదునిచ్చారు. ఒక్కో బృందంలో ఇద్దరేసి సభ్యులతో 55 టీమ్లను ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ సమకూర్చిన బైక్లతో సాధారణ పౌరుడిగా నగరంలో 24 గంటల పాటు పహారా కాయడమే వీరి విధి. మానసికంగా, శారీరకంగా వీరిని సంసిద్ధులను చేసేందుకు మోటివేనల్ క్లాసులు, షార్ట్ వెపన్ హ్యండిల్ చేయడం, బైక్లపై వేగంగా వెళ్లడంలో అనుభవజ్ఞులతో శిక్షణను ఇచ్చారు. ఈ జట్లు రంగంలోకి దిగినకొత్తలో కొంత మంది చైన్ స్నాచర్లను ప్రత్యక్షంగా పట్టుకొని దొంగల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాయి. ఆత్మరక్షణ కోసం ఎల్బీనగర్లో చైన్స్నాచర్లపైకి గాల్లోకి కాల్పులు జరిపిన ఉదంతం సంచలనం సృష్టించింది. ఈ టీమ్ల రాకతో అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ గ్యాంగ్లు ఇటువైపు చూడడమే మానేశాయి. అయితే సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లుగా విడిపోయాక యాంటీ చైన్ స్నాచింగ్ టీమ్ ప్రాధాన్యత తగ్గింది. ఈ బృందాలను రంగంలోకి దింపితే ఊహించని రీతిలో జరిగే చైన్ స్నాచింగ్లను నిలువరించే అవకాశం ఉందనే వాదన పోలీసు శాఖలోనే వినబడుతోంది. సిటీలోనూ అప్రమత్తం రాచకొండ కమిషనరేట్ పరిధిలో బుధవారం నుంచి జరుగుతున్న వరుస చైన్ స్నాచింగ్ల నేపథ్యంలో సిటీ పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. స్నాచర్ల కదలికలు, ఆచూకీ కనిపెట్టడానికి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రహదారుల వెంట తనిఖీలు ముమ్మరం చేశాం. స్నాచర్లు బస చేశారనే అనుమానంతో లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు చేస్తున్నాం. నగరం మొత్తం అలర్ట్ ప్రకటించాం. – అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ -
ఎల్బీనగర్లో వృద్ధురాలి దారుణ హత్య
-
టీఅర్ఎస్కు పరాభవం తప్పదు
-
అత్యంత రద్దీగల మెట్రోస్టేషన్ ఎల్బీ నగర్!
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీ నగర్-మియాపుర్ మార్గంలో అత్యంత రద్దీ సమయంలో ప్రతి 3.15నిమిషాలకు ఒక మెట్రోరైలును నడుపుతున్నామని, ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ప్రతినిత్యం అత్యధికంగా ప్రయాణిస్తున్నారని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో భవన్, హెచ్ఎమ్ఆర్ఎల్, ఎల్ అండ్ టి మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎన్వీయస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో కారిడార్ 1లోని ఎల్బీ నగర్-మియాపూర్ల నడుమ ప్రతిరోజు 21రైళ్లు, కారిడార్3లోని నాగోల్-అమీర్పేట్ల నడుమ 12రైళ్లు, మొత్తంగా 33 రైళ్లు నడుపుతున్నామని తెలిపారు. సాధారణ రద్దీ సమయంలో ప్రతి ఆరున్నర నిముషాలకొకసారి నడుపుతున్నట్లు,ఇతర సాధారణ సమయాల్లో ప్రతి ఎనిమిది నిమిషాలకొక మెట్రో రైలును నడుపుత్నుట్లు పేర్కొన్నారు. కారిడార్ 1లో 284 ట్రిప్పులు, కారిడార్ 3లో 266 ట్రిప్పులు మొత్తంగా 550 ట్రిప్పులతో ప్రయాణీకులను గమ్యస్థానానికి చేరుస్తున్నామని అన్నారు. కారిడార్ 1లో సగటున 1.25లక్షలు, కారిడార్ 3లో యాభై వేల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. మెట్రో సర్వీసులను ప్రజలు మరింత విరివిగా వినియోగించుకోవాలని కోరారు. -
పిల్లలను చంపి..తానూ అంతమొందించుకొని
హైదరాబాద్: తన భర్తతో నెలకొన్న స్పర్థల కారణంగా అతని వద్దకు వెళ్లేందుకు ఇష్టంలేని ఓ గృహిణి తన పిల్లలను అంతమొందించి తానూ ఆత్మహత్యకు పాల్పడింది.ఎల్బీనగర్ పొలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు జనగాం జిల్లా ధర్మసాగర్ మండలం, మల్లికుదుర్లకు చెందిన కుంట యాదగిరి, లక్ష్మీ భార్యాభర్తలు. వారు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి మన్సూరాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో నివాసం వుంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా పెద్ద కుమార్తె స్రవంతి(28)కి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పాయిగూడెంకు చెందిన కత్తుల రమేశ్కు ఇచ్చి 12ఏళ్ల కిందట వివాహం చేశారు. వీరికి సాయితేజ (10) సాత్విక (6) పిల్లలు.కాగా రమేశ్ మాససిక స్ధితి సరిగా లేనందున దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసిగిన స్రవంతి 5 ఏళ్ల కిందట ఇద్దరు పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. ఇక్కడే ఇళ్లలో పనిచేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటోంది. భర్త వద్దకు వెళ్లేందుకు ఇష్టం లేక.. కాగా దసరా అనంతరం తమ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించి స్రవంతిని అత్తారింటికి పంపే ఏర్పాట్లలో ఆమె తల్లిదండ్రులు ఉన్నారు. ఈ ప్రయత్నం స్రవంతికి ఇష్టం లేదు. దీంతో వారు శుక్రవారం పనులకు వెళ్లిన సమయంలో ఆమె కొంతసేపు బయట గడిపి తిరిగి 10 గంటలప్పుడు ఇంటికి చేరుకుంది. బయట నుంచి వస్తూ పురుగుల మందు వెంట తెచ్చుకుని చక్కెరతో కలిపి పిల్లలకు అన్నంతో తినిపించి తానూ తిన్నది. అనంతరం బాత్రూమ్ లోని హీటర్తో పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి, తాను కూడా షాక్ పెట్టుకుంది. ఈలోగా బయట నుంచి వచ్చిన తల్లి లక్ష్మి ఇంట్లో ఘటనను చూసి భయంతో చుట్టు ప్రక్కల వారికి తెలిపింది. వారు వచ్చేసరికి పిల్లలు చనిపోయివున్నారు. కొన ఊపిరితో ఉన్న స్రవంతిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఆమె 108 వాహనం లోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఉస్మానియాకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా స్రవంతి భర్త మానసిక స్థితి బాగోలేకపోవటం, శారీరక బాధలు పెడుతుండటంతోనే స్రవంతి అతని వద్దకు వెళ్లేందుకు నిరాకరించినట్లు స్థానికులు తెలిపారు. -
15 ఏళ్లుగా బతుకులు బందీ!
సాక్షి, మంగళగిరి: వారు చేయని నేరానికి గత 15 ఏళ్లుగా ఇనుప కంచె మధ్య బందీలయ్యారు. అందరి మధ్య ఉంటూనే ప్రభుత్వాధికారుల మధ్య సమన్వయలోపంతో నిర్బంధ జీవితం గడుపుతున్నారు. ఇంట్లోకి వెళ్లాలన్నా, బయటకు రావాలన్నా నానా అగచాట్లు పడాల్సిందే. ఇంట్లోకి సామాన్లు తీసుకెళ్లాలంటే అదో ప్రహసనమే. ఎవరైనా చనిపోతే వారి పాట్లు చెప్పనలవి కాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఇనుపకంచె ఒంటిపై చేసే గాయాలతో విలవిల్లాడాల్సిందే. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎల్బీ నగర్లో ఏపీఎస్పీ క్యాంపు రోడ్డును ఆనుకుని 1972లో సుమారు 50 కుటుంబాల వారు స్థిర నివాసాలు ఏర్పర్చుకుని ఉంటున్నారు. మున్సిపల్ అధికారులు క్యాంపు రోడ్డును సరిహద్దుగా పరిగణనలోకి తీసుకుని వీరికి ఇంటి నిర్మాణానికి అనుమతులిచ్చారు. అందరూ పక్కా భవనాలు నిర్మించుకున్నారు. ఇంతలో 2003లో ఏపీఎస్పీ బెటాలియన్ అధికారులు తీసుకున్న నిర్ణయం వారిని నిశ్చేష్టుల్ని చేసింది. క్యాంపు ఆవరణ చుట్టూ కంచె వేసిన అధికారులు క్యాంపు రోడ్ను ఆనుకుని వున్న ఇళ్లకు రోడ్డు మార్గం లేదంటూ వారి నివాసాల గేట్ల ముందు నుంచి కూడా కంచె వేసేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు కనీసం గేటు తెరిచే ఖాళీ లేకుండా కంచె వేయడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. సొంత నివాసాలు కావడంతో ఖాళీచేసి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు ఇంట్లో మనిషి చనిపోతే శవాన్ని తీసుకెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సిందే. తమకు దారి కల్పించమని కోరుతూ పదిహేనేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని వెంటనే కంచెను మార్పించి తమకు దారి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. గతంలో ఒకసారి అప్పటి తహసీల్దార్ శేషగిరిరావు, ఆర్డీవో నాగబాబు స్వయంగా సందర్శించి వారి కష్టాలు చూసి సర్వే నిర్వహించి వారికి దారి ఇవ్వాల్సిందేనని కలెక్టర్కు నివేదించినా ఉపయోగం లేకుండాపోయింది. చివరికి ఏడాది క్రితం ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేయగా, సర్వేయర్ను పంపి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. అయినా, ఇప్పటివరకు సర్వే నిర్వహించిన దాఖలాల్లేవు. మున్సిపల్, రెవెన్యూ, ఏపీఎస్పీ అధికారులు తక్షణం జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు. కంచె వేయడం దుర్మార్గం 2003లో ఏపీఎస్పీ అధికారులు రోడ్డు వదలకుండా కంచె వేయడం దుర్మార్గం. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలన్నా, రావాలన్నా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇనుప కంచె గీసుకుని గాయాలపాలవుతున్నాం. అధికారులు వెంటనే స్పందించి రోడ్డును మినహాయించి కంచె వేయాలి. – టి సుదర్శనరావు, రిటైర్డు ఏఎస్ఐ దారి కల్పించి కష్టాల నుంచి కాపాడాలి క్యాంపు రోడ్డు ఉందనే ఇళ్లు కట్టుకున్నాం. బిందెడు నీళ్లు ఇంట్లోకి తెచ్చుకునేందుకు ఎంతో కష్టపడాల్సి వస్తోంది. గోడకు కంచెకు మధ్యలో అడ్డం తిరిగి నడవాలంటే చాలా కష్టంగా ఉంది. ఇళ్లల్లోకి ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా పాట్లే. అధికారులు వెంటనే కల్పించుకుని ఈ కష్టాల నుంచి కాపాడాలి. – సీహెచ్ సువర్ణ, స్థానికురాలు -
ఎల్బీనగర్ అమీర్పేట మెటో మార్గానికి అంతాసిద్ధం
-
2030 నాటికి మెగాసిటీగా హైదరాబాద్
-
ఎల్బీనగర్లో ఫ్లై ఓవర్ను ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ చౌరస్తా వద్ద 49 కోట్లతో చేపట్టి నిర్మాణం పూర్తయిన ఫ్లై ఓవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, పార్లమెంట్ సభ్యులు చామకూర మల్లా రెడ్డి , ఎంఎల్ఏలు కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, కమీషనర్ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అత్యంత వేగంగా ఎల్బీనగర్ విస్తరణతో పాటు అభివృద్ధి సాగుతోందని పేర్కొన్నారు. 2030 వరకు హైదరాబాద్ మెగాసిటీగా అవతరిస్తుందని, దేశంలో మూడో స్థానంలో హైదరాబాద్ ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. హైదరాబాద్కు చాలా ఫ్లై ఓవర్లు అవసరం ఉందని, అందుకే 23వేల కోట్ల రూపాయలతో ప్రణాళికను సిద్ధం చేశామని తెలిపారు. జాతీయ రహదారులను కూడా అభివృద్ధి చేస్తున్నామని, ఎల్బీనగర్లో రూ.450కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఎన్ని రహదారులు విస్తరించిన ప్రూవేట్ వాహనాల రద్దీ తగ్గితేనే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందని తెలిపారు. అమీర్పేట్-ఎల్బీనగర్ మెట్రో లైన్ను ఆగస్టు 15న ప్రారంభించాలనుకున్నామని కానీ, కొన్ని అనుమతులు రానందుకే ఆలస్యమవుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఎల్బీనగర్లోని కామినేని ఫ్లై ఓవర్ ఎడమ వైపు ప్రారంభించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర మెట్రో సెఫ్టీ అథారిటీ పర్మిషన్ రానందుకే ఆలస్యమవుతోందని, సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభిస్తామని తెలిపారు. ‘హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లాలో రోడ్ల అభివృద్ధి 46 వేల కోట్లు తో సాగుతున్నాయి. రద్దీగా ఉన్న ప్రాంతంలో ఇబ్బందులు కలగకుండ బ్రిడ్జీల నిర్మాణాలు. మహిళలకు మంచినీటి ఇబ్బందులు రాకుండా 1960 కోటలతో పనులు చేపట్టాం. రంగారెడ్డి జిల్లాలో లక్ష మంది పేదలకు ఇళ్ళ పట్టాలు, మరో లక్షమంది కి డబుల్ బెడ్ రూంలను నిర్మిస్తున్నాం. హైదరాబాద్ - రంగారెడ్డి జిల్లా పరిసరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుంన్నామ’ని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ‘కెటిఆర్ హైదరాబాద్ను విశ్వ నగరంగా తీర్చి దిద్దుతున్నారు. వినూత్న ఆలోచనలు.. కొత్త దృక్పథంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వ అభివృద్ది పధకాలకు మా మద్దతు ఉంటుంద’ని ఎల్ బి నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అన్నారు. ‘కామినేని వద్ద 944 మీటర్ల ఫ్లై ఓవర్ ను నిర్మించాము. 16 నెలల్లో ఫ్లై ఓవర్ ను నిర్మించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నగరంలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నామ’ని కమిషనర్ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్బీ నగర్ సర్కిల్ కు మెట్రో స్టేషన్కు, లేదా కామినేని వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ కు అమరుడు శ్రీకాంతా చారి పేరు పెట్టాలని నిరసన కారులు ఆందోళన చేపట్టారు. -
సెప్టెంబర్ 1న ఎల్బీనగర్–అమీర్పేట్ మెట్రో రన్
సాక్షి, హైదరాబాద్: ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో మెట్రో ప్రారంభానికి ముహూర్తం కుదిరింది. సెప్టెంబర్ ఒకటి నుంచి మెట్రో వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ మార్గంలో అన్ని పనులు, పరీక్షలు పూర్తయ్యాయని.. ట్రయల్ రన్ ముమ్మరంగా సాగుతుందని చెప్పారు. వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించి కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (సీఎంఆర్ఎస్) ధ్రువీకరణ పొందేందుకు జూలై 31న ఆ సంస్థకు దరఖాస్తు సమర్పించామన్నారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెసర్ (ఐఎస్ఏ), హాల్క్రో (యూకే) సంస్థలు సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతను పరీక్షిస్తున్నాయని చెప్పారు. ఇండిపెండెంట్ సేఫ్టీ అసెస్మెంట్ సర్టిఫికెట్ అందిన తర్వాత సీఎంఆర్ఎస్ ప్రతినిధులు ఎల్బీనగర్–అమీర్పేట్ సెక్షన్ను పరిశీలించి భద్రతా ధ్రువీకరణ జారీ చేస్తారన్నారు. అన్ని స్టేషన్లకూ ఫీడర్ బస్సులు ఇప్పటివరకు 2.75 లక్షల మెట్రో స్మార్ట్ కార్డులు గ్రేటర్ సిటిజన్లు కొనుగోలు చేసినట్లు ఎల్అండ్టీ ప్రతినిధులు తెలిపారు. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని కాలనీలు, బస్తీలకు ఫీడర్ బస్సు సర్వీసులను ఆర్టీసీ సహకారంతో అందుబాటులో ఉంచామన్నారు. మియాపూర్, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి, అమీర్పేట్, బేగంపేట్, ప్రకాశ్నగర్, రసూల్పురా, ప్యారడైజ్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఎన్జీఆర్ఐ, ఉప్పల్, నాగోల్ తదితర 15 మెట్రో స్టేషన్లలో ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీని సాకారం చేసేందుకు అత్యాధునిక సైకిళ్లు, స్మార్ట్ బైకులు, పీఈడీఎల్, మెట్రో బైకులు, డ్రైవ్జీ వాహనాలు లభ్యమవుతున్నాయని చెప్పారు. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద సొంతంగా నడుపుకుని వెళ్లేందుకు వీలుగా జూమ్కార్ విద్యుత్ వాహనాలు.. మియాపూర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ల వద్ద జూమ్కార్ పెట్రోల్, డీజిల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. పలు మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్ సదుపాయమూ అందుబాటులో ఉందని చెప్పారు. ప్యారడైజ్ స్టేషన్ ఫుట్ఓవర్ బ్రిడ్జీని ప్రారంభించడం ద్వారా ప్యారడైజ్ సర్కిల్, పీజీ రోడ్, ఎంజీ రోడ్ తదితర ప్రాంతాలకు చేరుకోవడం సులభమవుతోందన్నారు. ప్రకాశ్నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఆర్మ్డీ ఎంట్రీ, ఎగ్జిట్ పూర్తికావడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తొలిగాయని చెప్పారు. -
త్యాగరాయనగర్లో బ్రహ్మోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: పచ్చటి పందిళ్లు, రంగుల రంగుల తోరణాలతో నాగోలు బండ్లగూడ త్యాగరాయ నగర్లోని శ్రీపద్మావతి, గోదాదేవి సమేత వెంకటేశ్వర ఆలయం ముస్తాబైంది. దేవస్థానంలో 21వ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 8న స్వామి కల్యాణం కన్నులపండువగా నిర్వహించనున్నారు. అదే రోజు చెన్నైకి చెందిన దాసాన సంగీత కళాక్షేత్రం ఆధ్వర్యంలో సంగీత కచేరీ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ప్రఖ్యాత వాయిద్య కళాకారులను ఘనంగా సన్మానించనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కెవి రమణాచారి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్తో పాటు పలువురు ప్రముఖులు గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. -
జూలై 26 లేదా 27న అమీర్పేట్ టు ఎల్బీనగర్
-
అమీర్పేట్ టు ఎల్బీనగర్..
సాక్షి, హైదరాబాద్ : అమీర్పేట్–ఎల్బీనగర్ మధ్య మెట్రో రైలు పరుగులు తీసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నెలాఖరులో(26 లేదా 27వ తేదీన) ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో మెట్రో రైలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఎల్బీనగర్–అమీర్పేట్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అవసరమైన సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్, ట్రాక్షన్ వ్యవస్థ ఏర్పాటు వంటి పనులన్నీ పూర్తయ్యాయి. ఈ రూట్లో రైళ్లకు 18 రకాల సామర్థ్య పరీక్షలను వరుసగా నిర్వహిస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో రైల్వే శాఖ పరిధిలోని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ధ్రువీకరణ సైతం అందనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ మార్గంలో మెట్రోను ప్రారంభించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్(హెచ్ఎంఆర్) సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రభుత్వ వర్గాలు కచ్చితమైన ప్రారంభ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ మార్గంలో నిత్యం సుమారు 75 వేల మంది రాకపోకలు సాగించే అవకాశాలున్నట్లు అంచనా. అక్టోబర్లో అమీర్పేట్ హైటెక్సిటీ మరోవైపు అమీర్పేట్–హైటెక్సిటీ(13 కి.మీ.) మార్గంలో అక్టోబర్లో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. సైబర్టవర్స్ వద్ద మెట్రో రివర్సల్ ట్రాక్కు రీడిజైన్ చేయనుండటంతో పనులు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. ఇక జేబీఎస్–ఎంజీబీఎస్(10 కి.మీ.) మార్గంలో వచ్చే ఏడాది మార్చిలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగించనున్నాయని చెప్పారు. ప్రస్తుతం నాగోల్–అమీర్పేట్–మియాపూర్(30 కి.మీ) మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా.. నిత్యం 75–80 వేల మంది ప్రయాణం చేస్తున్నారు. రెండోదశకు వడివడిగా అడుగులు.. మెట్రో రెండోదశ ప్రాజెక్టు(61.5 కి.మీ.) దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రెండోదశలో ప్రధానంగా ప్రస్తుత మూడు మెట్రో కారిడార్ల నుంచి శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని పెంచే అంశంపైనే ప్రధానంగా సర్కారు దృష్టి సారించింది. రెండోదశపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సమగ్ర అధ్యయనం జరిపి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. రాయదుర్గం బయోడైవర్సిటీ పార్కు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు (30 కి.మీ.)మార్గాన్ని తొలివిడతగా చేపట్టనున్నారు. ఎల్బీనగర్–నాగోల్(5.5 కి.మీ.), బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్(26 కి.మీ.) మార్గాల్లోనూ రెండో దశలో చేపట్టనున్నట్లు తెలిసింది. ఇందుకు సుమారు రూ.10 వేల కోట్లు అంచనా వ్యయంగా ప్రాథమికంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ(డీపీఆర్)లో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులు నిమగ్నమయ్యారు. ఆగస్టులో డీపీఆర్ సిద్ధంకానుంది. ఈ నివేదికతో రెండోదశ మెట్రో అలైన్మెంట్పై స్పష్టత రానుంది. మెట్రో తొలివిడత ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన విషయం విదితమే. రెండోవిడతకు మాత్రం 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా సమకూర్చడం, మరో 60 శాతం నిధులను జైకా వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణంగా సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. పాతనగరానికి మెట్రో కష్టమే.. ఎంజీబీఎస్–ఫలక్నుమా(5.5 కి.మీ.) మార్గంలో మెట్రోకు బాలారిష్టాలు తప్పడం లేదు. ఈ మార్గం లో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారుతోంది. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపు ఎలా జరుపుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థ సైతం ఇదే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది. -
ఎల్బీనగర్లో కార్డన్ సెర్చ్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ పీఎస్ పరిధిలో ఉన్న సాయినగర్లో శుక్రవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎల్బీనగర్ డీసీపీ ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులు తనిఖీలు జరిపారు. 14 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, అలాగే 25 బైక్లు, 70 మద్యం బాటిళ్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. -
భూ వివాదాలు కొలిక్కి తెస్తాం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీనగర్లోని భూ వివాదాలను కొలిక్కి తెస్తామని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. అసైన్డ్, వక్ఫ్, ఎండోమెంట్, ఎఫ్టీఎల్లకు సంబంధించిన భూ వివాదాల్లో పాలనాపర అంశాలను 15 రోజుల్లో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. 58, 59 జీవోల కింద గతంలో దరఖాస్తు చేసుకోని వారికి మరో సారి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు, కాలనీల ప్రజలతో సోమవారం ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ చర్చించారు. దాదాపు 20 కాలనీలు, బస్తీల భూముల వివాదాలను క్షుణ్నంగా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆర్డీవో స్థాయిలో రికార్డుల సవరణ చేయకపోవడంతో కొన్ని సమస్యలు తలెత్తాయని, ఆ రికార్డులను వెంటనే సవరించాలని ఆదేశించారు. చట్టాలను సవరించాల్సి వస్తే సంబంధిత తీర్మానాలను వచ్చే కేబినెట్ భేటీలో చర్చించి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో చట్ట సవరణ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వక్ఫ్ భూముల వివాదాలపై రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో త్వరలోనే సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులకు కేటాయించిన భూముల విక్రయాలకు సంబంధించి పదేళ్లకు పైగా ఉన్న నిర్మాణాలు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎన్వోసీల జారీకి చర్యలు చేపడతామన్నారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధి, కన్జర్వేషన్ జోన్లలో ఉన్న నిర్మాణాలపై జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు. దాదాపు 4 గంటల పాటు.. మన్సూరాబాద్ సర్వే నంబర్ 44, 45లలోని నిర్మాణాలను 2007 రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం క్రమబద్ధీకరించాలని ఆయా కాలనీల వాసులు కోరగా పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నాగోల్ సాయినగరంలోని 101, 102 సర్వేలలో ఉన్న 1,952 ఇళ్ల వివరాలను రికార్డుల్లో తప్పుగా పేర్కొన్నారని, 15 రోజుల్లోగా వాటిని సవరించాలని రంగారెడ్డి ఇన్చార్జి కలెక్టర్ ఎన్.వి.రెడ్డిని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు మేరకు ఎఫ్టీఎల్ కన్జర్వేషన్ జోన్ల జోలికి వెళ్లమన్నారు. గ్రీన్ పార్కు కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న 3,200 గజాల స్థలంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని కార్పొరేటర్ ఎం.శ్రీనివాసరావు కోరగా.. ఆ భూమి విషయంలో వివాదం లేకపోతే కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ మంత్రి మహమూద్ అలీ, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆర్.కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, సీసీఎల్ఏ రాజేశ్వర్ తివారీ, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ ఎన్.వి.రెడ్డి పాల్గొన్నారు. -
పూజలు చేస్తానని గృహిణిని నమ్మించి..
నాగోలు : కుమారుడి ఆరోగ్యం బాగుపడేందుకు పూజలు చేస్తానని గృహిణిని నమ్మించి ఓ మహిళ రూ.95 వేలు విలువైన బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మన్సూరాబాద్ వినాయక్నగర్లో ఉంటున్న దోమల జ్యోతి, యాదగిరి దంపతులకు కుమారుడు ఉన్నాడు. అతను గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మంగళవారం జ్యోతి కుమారుడితో సహా ఇంటి ముందు నిలుచుకుని ఉండగా అక్కడికి వచ్చిన గుర్తు తెలియని మహిళ ఆమెతో మా టలు కలిపింది. బాబు ఆరోగ్యం మెరుగు పడేందుకు పూజలు చేస్తానని చెప్పింది. తాను పూజలు చేసేంత వరకు బంగారు ఆ భరణాలను ఓ డబ్బాలో ఉంచాలని సూచించింది. దీంతో జ్యోతి తన మంగళసూత్రంతో పాటు బంగారు ఆభరణాలను బాక్సులో పె ట్టింది. అనంతరం ఆమె జ్యోతి దృష్టిని మళ్లించి బాక్సుతో సహా పరారైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నగరంలో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులు!
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని.. చీకట్లు అలుముకున్నాయి. దీంతో ఆకాశం మేఘావృతమై మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, కర్మన్ఘాట్, ముషీరాబాద్, నారాయణగూడ, ట్యాంకుబండ్, కోఠి, ఆబిడ్స్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, పెద్ద అంబర్పేటలో భారీ వర్షం కురుస్తోంది. దీనికితోడు పిడుగులు శబ్దాలు భీకరంగా వినిపిస్తుండటంతో భయాందోళనలో స్థానికులు ఉన్నారు. పాతబస్తీలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. -
నేను అందరికీ కోపం తెప్పిస్తున్నా..
నాగోలు: కుటుంబ సభ్యులు మందలించారని ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు జైపురికాలనీకి చెందిన భూపాల్రెడ్డి కుమార్తె సాయిప్రియ (18) గాయత్రి కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. పరీక్షలు ముగియడంతో ఖాళీగా ఉంటోంది. తరచూ వాట్సాప్లో తన సోదరితో చాటింగ్ చేస్తుండటంతో ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సాయిప్రియ గురువారం రాత్రి బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఆమె సుప్రజ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంటర్ పరీక్షలు సరిగా రాయలేకపోయాననే బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని తండ్రి భూపాల్రెడ్డి ఇచ్చి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని వద్ద లభించిన సూసైడ్నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘నేను అందరికీ కోపం తెప్పిస్తున్నాను... నేను ఎందుకు ఉన్నాననే బాధ... నేను చచ్చిపోతే పనైపోతుంది కదా... డాడీ సారీ... ఐ లవ్ మమ్మీ,డాడీ... ఇన్ని రోజులు ఎందుకు ఆగానంటే అందరూ ఇంటర్ పరీక్షలు అనే అనుకుంటారు.... నేను పరీక్షలన్నీ మంచిగా రాశాను... అందుకే పరీక్షలు ముగిసాక చచ్చిపోవాల ని డిసైడయ్యా... మా అన్న, అక్కకి హ్యాపీ నేను చచ్చిపోతే...’’ అంటూ అందులో పేర్కొంది. -
డివైడర్ను ఢీ కొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు