సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్ణణంలో దొంగలు శనివారం రాత్రి ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. కిష్టారం రోడ్డులో నివసించే ప్రసాద్ అనే వ్యక్తి కిన్లే వాటర్ ప్లాంట్లో రాత్రి షిఫ్ట్లో పనిచేస్తున్నాడు.
అతని ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తాళం పగులగొట్టి లోపలున్న బంగారు ఆభరణాలు, రూ.85వేల నగదు కలిపి మొత్తం రూ.4 లక్షల సొత్తును ఎత్తుకుపోయారు. దీనిపై ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రూ.4 లక్షల సొత్తు చోరీ
Published Sun, Feb 21 2016 9:38 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement