నల్లగొండ (హాలియా) : నల్లగొండ జిల్లా హాలియా మండలంలోని ఓ ఆలయంలో దొంగతనం జరిగింది. మండలంలోని నాయుడుపాలెం గ్రామంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో 3 తులాల బంగారం, 3 కేజీల వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారు జామున వెలుగు చూసింది. గ్రామస్తులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.