హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ నెల 16న తన మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకోనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కొత్త మంత్రులు రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేస్తారు.
కొత్త మంత్రులకు ఛాంబర్స్ కేటాయించడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఈరోజు సచివాలయంలో తనిఖీలు కూడా నిర్వహించారు. మంత్రులకు కేటాయించిన డీ బ్లాక్లోనే ఆయన ఛాంబర్లను పరిశీలించారు.
**
16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ
Published Sat, Dec 13 2014 4:44 PM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM
Advertisement
Advertisement