
కిలో టమాట రూ.100
మిడ్జిల్ (జడ్చర్ల): మహబూబ్నగర్ జిల్లాలో టమాట రేటు అమాంతం పెరిగింది. మిడ్జిల్ మండల కేంద్రంలో గురువారం జరిగిన సంతలో కిలో టమాట వంద రూపాయలకు విక్రయించారు. గత వారం 20 రూపాయలకు కిలో ఉన్న టమాట ఒకేసారి వంద రూపాయలకు చేరుకుంది. పచ్చి మిర్చి 80 నుంచి 130 రూపాయలకు చేరడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు.